English | Telugu
విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్!
Updated : Jun 13, 2023
ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. 'సీతారామం' సినిమాలో సీతగా ఆమె అభినయానికి, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఆమెపై పడింది. ఇప్పటికే ఆమె 'నాని 30' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ పెట్ల రెండోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు ఇటీవల ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. విజయ్ కెరీర్ లో 13వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ పేరుని ఖరారు చేసినట్లు సమాచారం.
విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు విజయ్ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.