English | Telugu
కళ్లు చెదిరేలా 'ఆదిపురుష్' బుకింగ్స్!
Updated : Jun 13, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ సత్తా ఏంటో మరోసారి తెలిసే సమయం వచ్చింది. ఆయన శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టడం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తోంది.
ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటిదాకా మొదటిరోజే వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమాలు ఆరు ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2', 'సాహో', '2.0', 'పఠాన్' సినిమాలు మాత్రమే ఇప్పటిదాకా ఆ ఫీట్ సాధించాయి. ఇప్పటికే 'బాహుబలి-2', 'సాహో'తో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్.. ఇప్పుడు 'ఆదిపురుష్'తో మరోసారి ఆ ఫీట్ సాధించడం ఖాయమనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ప్రభాస్ కి ఉంది. కర్ణాటక సహా ఇతర సౌత్ రాష్ట్రాల్లోనూ ఆదిపురుష్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక నార్త్ లో భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కి అంచనాలకు మించిన రెస్పాన్స్ వస్తోంది. హిందీలో 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' స్థాయి ఓపెనింగ్స్ రాబట్టేలా ఉంది. ప్రభాస్ కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కన 'ఆదిపురుష్' మొదటిరోజు వంద కోట్ల గ్రాస్ రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు.