English | Telugu

మళ్ళీ చేతులు కలిపిన అల్లు అర్జున్, త్రివిక్రమ్!

టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా మూడూ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది. ఇక వీరు నాలుగో సినిమా కోసం కూడా చేతులు కలపబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో ఈ ఇద్దరు మళ్లీ కలిశారు అంటూ ఓటీటీ వేదిక ఆహా ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది.

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'గుంటూరు కారం' చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప-2' చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక తమ కలయికలో నాలుగో సినిమా కోసం బన్నీ-త్రివిక్రమ్ చేతులు కలిపే అవకాశముందని భావిస్తున్నారంతా. అయితే తాజాగా ఈ ఇద్దరు కలిసున్న ఫోటోని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆహా.. "కలిశారు మళ్ళీ 'ఇద్దరు'.. ఇక రికార్డులు వేట మొదలు" అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు "అతి పెద్ద 'మూవీ' పండుగ చేసుకుందామా?.. త్వరలోనే ఎంటర్టైన్మెంట్ 'సునామీ' కోసం సిద్ధంగా ఉండండి" అని తెలిపింది. ఆహా చేసిన ఈ ప్రకటన ఏంటో అర్థంగాక అందరూ తెగ ఆలోచిస్తున్నారు. గీతా ఆర్ట్స్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తే.. ఇది ఖచ్చితంగా మూవీ అని అందరూ ఫిక్స్ అయిపోయేవారు. కానీ ఆహా నుంచి ప్రకటన రావడంతో ఇది మూవీ కాదని అర్థమవుతోంది. మరి బన్నీ-త్రివిక్రమ్ చేతులు కలిపింది ఆహాలో ప్రసారమయ్యే ఏదైనా షో కోసమా? సిరీస్ కోసమా? లేక జస్ట్ యాడ్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.