'గుంటూరు కారం'లో హిట్ బ్యూటీ!
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా మొదట పూజ హెగ్డే, శ్రీలీల ను ఎంపిక చేశారు. అయితే ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో.. మొదట సెకండ్ హీరోయిన్ గా ఎంపికైన శ్రీలీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఇప్పుడు రెండో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.