English | Telugu

 ఆది సాయికుమార్ చేతుల మీదుగా జబర్దస్త్ శాంతి కుమార్ డైరెక్టర్ గా  నాతో నేను మూవీ సాంగ్ రిలీజ్

జబర్దస్త్ ..ఖతర్నాక్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. అలా ఎంతో మంది ఇప్పుడు  కమెడియన్స్ గా  రైటర్స్ గా  టెక్నీషియన్స్ గా స్థిరపడ్డారు.  సుధీర్ హీరోగా నిలబడ్డాడు, రాంప్రసాద్ రైటర్ గా, ఆది డైలాగ్ రైటర్ గా, వేణు డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ వంతు వచ్చింది. ఆయన డైరెక్టర్ గా మారి ఒక మూవీ తీయబోతున్నారు. మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శాంతి కుమార్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి నెమ్మదిగా టీంలీడర్ గా ఎదిగారు. ఐతే కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.