కిరణ్కు కరెంట్ షాకివ్వబోతున్న బాబు
రాష్ట్రం విద్యుత్ అవసరాలను తీర్చే ప్రాజెక్టులున్నా చేతకాని తనం ప్రదర్శిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తనకున్న పట్టును నిరూపించుకోవాల్సిన సమయంలో నిస్సహాయతగా కనిపిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్కుమార్షిండేలా రాష్ట్ర అవసరాన్ని నొక్కిచెప్పలేకపోవటమే ప్రభుత్వవైఫల్యమని ప్రతిపక్షాలు గుర్తించాయి. ఆల్రెడీ మహారాష్ట్రకు గ్యాస్ మళ్లించేందుకు అంగీకరించిన తరువాత రాష్ట్రప్రభుత్వం తమ ఇబ్బందిని చెప్పుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనముండక పోవచ్చని అవి ఓ అభిప్రాయానికి వచ్చాయి. ప్రత్యేకించి రాష్ట్రస్థాయిలో విద్యుత్తు సమస్య పరిష్కరించాలని ఏ పార్టీ ఉద్యమించినా మద్దతు ఇచ్చేందుకు యావత్తురాష్ట్రం సిద్ధంగా ఉంది. దీంతో దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. గతంలో విద్యుత్తు ఉద్యమం ద్వారానే కాంగ్రెస్పార్టీ అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ లోపాలను ఎత్తిచూపిన చరిత్ర టిడిపి గుర్తు చేసుకుంటోంది. ఆ పార్టీ అధిష్టానానికి ఇదే మంచి అవకాశమని రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి జిల్లానేతలు సూచిస్తున్నారు. దీంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విద్యుత్తు సమస్యపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతారని ఆ పార్టీశ్రేణులు చెబుతున్నాయి. ఇలానే సిపిఎం, సిపిఐ, వైకాపా కూడా ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
ఆంథ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 13,923మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదనవుతుంది. అదీ అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పని చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర డిమాండు 11,141 మెగావాట్లు. అంటే ఇంకా 2,782మెగావాట్ల విద్యుత్తు మిగిలిపోతుంది. థర్మల్ విద్యుత్తు సామర్థ్యం 6,167 మెగావాట్లు. ప్రస్తుత ఉత్పాదన 4,637మెగావాట్లు. ఇంకా థర్మల్ప్లాంటుల పరంగా 1.630మెగావాట్ల ఉత్పాదన కొరత ఏర్పడిరది. అలానే జలవిద్యుత్తు ఉత్పాదన సామర్థ్యం 3,936మెగావాట్లు. దీనిలో 217మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. అంటే లోటు 3,719మెగావాట్లు. గ్యాస్, డీజిల్, నాఫ్తాల్ ఉపయోగించి 3,073మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం 764 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఇంకా 2,109 మెగావాట్ల కొరత ఏర్పడిరది. ప్రస్తుతం రోజుకు 5,240మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. అంటే ఉత్పాదన సామర్థ్యంతో పోలిస్తే అది 47శాతం మాత్రమే. 2006`07లో గ్యాస్కు కొరత ఏర్పడిరది. విద్యుత్తుకేంద్రాలకు 1,293 ఎంఎంఎస్సిఎండి గ్యాస్ అవసరం. అయితే కేంద్రం రాష్ట్రానికి 4ఎంఎంఎస్సిఎండి గ్యాస్ సరఫరా చేస్తోంది. అవసరమైన గ్యాస్ అందిస్తాం పరిశ్రమలు పెట్టుకోవాలని కేంద్రం కోరటం వల్ల రాష్ట్రంలో గ్యాస్ ఆథారిత విద్యుత్తు ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేశారు. 2011`12లో గ్యాస్ సమస్యను తీరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని తుంగలోకి తొక్కింది. ఫలితంగా రోజుకు 16.67 ఎంఎంఎస్సిఎండి గ్యాస్ అవసరమవుతోంది.
డి`6 క్షేత్రం నుంచి 4.85ఎంఎంఎస్సిఎండి గ్యాస్ను కేంద్రం సరఫరా చేస్తోంది. ఇప్పుడు దీనిలో 2ఎంఎంఎస్సిఎండి గ్యాస్ మహారాష్ట్రకు తరలించినందున మిగిలిన గ్యాస్ను ఆంథ్రప్రదేశ్కు పంపిణీచేస్తుంది. అంటే 1.48ఎంఎంఎస్సిఎండి గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. దీని వల్ల 700మెగావాట్ల విద్యుత్తు కొరత తప్పదు.