బొత్సపై సుప్రీంకోర్టులో పిటిషన్
రాష్ట్రంలోని మద్యం మాఫియాలో బొత్స సత్యనారాయణ పాత్రపై విచారణ జరిపించాలంటూ గిరియాదవ్ అనే వ్యక్తి సప్రీం కోర్టులో పిటీషన్ వేసారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు 2010లో అతి తక్కువ ధరకు మద్యం దుకాణాలను కైవసం చేసుకున్నారని, వారి పాత్ర బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వం ఏసీబీ దర్వాప్తును బలహీన పర్చిందని, దీనిపై నిజాయితీగా వ్యవహరిస్తున్న ఏసీబీ డిజి భూపతి బాబును, అదనపు డిజి శ్రీనివాస్లను ప్రభుత్వం బదిలీ చేసిందని పిటీషనర్ పేర్కొన్నారు.
బొత్స తన జిల్లాలో 202 దుకాణాలకు గానూ 100 దుకాణాలను తన కంపెనీల్లో పనిచేసే పేద తెల్లకార్డు దారులవని, వారిపేరుతో మంత్రి లిక్కర్ షాపులను తెరిచారని, గిరి యాదవ్ తెలిపారు. 31 దుకాణాల్లో తమ కుటుంబానికి 27 శాతం పెట్టుబడులున్నట్లు ఆయన అంగీకరించిన విషయం కోర్టు ముందుంచారు. లిక్కర్ మాఫియా డాన్ నున్నా వెంకటరమణ, బాలరాజ్ గౌడ్ వెల్లడిరచిన వివరాల్లో ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మేల్యేలకు, ఒక ఎంపికి నెలకు 2కోట్ల మేర లంచాలు ఇచ్చామన్న విషయాన్ని గిరియాదవ్ పొందుపరచారు.
అంతేకాక, బొత్సపాత్ర బయటపడకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి,కేంద్రమంత్రి ఆజాద్కు రాసిన లేఖనుకూడా జతచేసారు. ఆవిధంగా ఏసీబి విచారణను ప్రభుత్వం నీరు కార్చినందున అత్యున్నత న్యాయస్ధానం ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని గిరియాదవ్ విజ్ఞప్తి చేశారు.