నలిగిపోతున్న ‘సామాన్యుడు ‘
పెరిగిపోయిన ధరలు, స్కూలు కాలేజీల ఫీజలు, నిత్యావసర ధరలు, గ్యాసు, పెట్రోలు, దీనితో ఎలా బ్రతకాలో తెలియని సామాన్యుడు. ఎంత తగ్గించుకున్నా బ్రతుకు పోరాటంలో ఓడిపోవడం మామూలైపోయింది. నీల్సన్ సర్వే ప్రకారం మార్కెట్లో కొనుగోళ్లు మధ్యతరగతి వారు బాగా తగ్గించేశారు. ఫ్యాషన్లు ఇంకా తగ్గించేశారు. ఇదివరలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అని చిన్న వయస్సులో పెద్ద ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యవతరం కూడా క్షణం క్షణం ఉద్యోగ భయంతోనే ఉన్నారు. ఉద్యోగ భద్రత లేని ఈ రోజుల్లో వారు కూడా షాపింగుల కోసం ఎగబడటం మానేసారని నీల్సన్ సర్వే చెబుతుంది. షాపింగ్లో 47 శాతం మంది ప్యాషన్స్, ఖర్చుల్లో పొదుపు 21 శాతం తగ్గించు కున్నారని చెబుతున్నారు.
గత రెండేళ్లుగా ఈ పొదుపు చర్యలు మరింత ఎక్కువయ్యాయని వారు తెలిపారు. ఎంత తగ్గించుకున్నా విద్య, వైద్యం ఖర్చులు విపరీతంగా పెరిగి ఖర్చులకు ఆదాయానికి ఏ మాత్రం కుదరటం లేదని మద్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ రాజకీయ పార్టీ మద్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తుంన్నారని వారు వాపోతున్నారు. మద్యతరగతి మనుష్యులు బ్రతికే మార్గాన్ని రాజకీయనాయకులు ప్రభోదిస్తే బావుంటుందని అనుకుంటున్నారు. లేదా ఇకనైన రాజకీయపార్టీలు, మేధావులు, రాష్ట్రంలో అత్యధికంగా ఉండే మద్యతరగతి ప్రజలకు ఉపయోగమైన ఆర్ధిక సంస్కరణలకు పూనుకోవాలని ఆశిస్తున్నారు.