రాష్ట్రపతి ఎన్నిక: పీఏ సంగ్మా నామినేషన్ దాఖలు
రాష్ట్రపతి అభ్యర్థిగా పీఏ సంగ్మా మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. సంగ్మా నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు నితన్ గడ్కారి, ఆపార్టీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ, సుష్మాస్వరాజ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అరుణ్ జైట్లీ, వసుంధరా రాజే, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, సుబ్రహ్మణ్యస్వామి తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఉదయం యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీకి 63 శాతం ఓటర్ల బలం ఉండగా, ప్రత్యర్థి పిఎ సంగ్మాకు 30 శాతం ఓట్ల బలం ఉంది. మిగతా ఏడు శాతం ఓట్లు గల పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. తృణమూల్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు, తదితర పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారనే విషయాన్ని తేల్చుకోలేదు.