మితిమీరిన ఆనంద‌మూ ప్ర‌మాద‌మే!

అనారోగ్యంతో మ‌ర‌ణించేవారి సంగ‌తి తెలుసు. ఏదో చెప్ప‌లేని బాధ‌తో క్షీణించి మ‌ర‌ణంచేవారుంటారు. ఒంట‌రిత‌నం మాన‌సిక ప్ర‌శాంత‌త‌లేక‌పోవ‌డం.. ఇవ‌న్నీ మ‌నిషి మ‌ర‌ణానికి దారితీస్తుంటాయి. చిత్ర‌మే మంటే అమితానందం కూడా ప్ర‌మాద‌మే అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. అదేమిటి.. జీవితంలో సంతోషంగా ఉండాల‌ని, ఎప్పుడూ ఆనందంగా జీవించాల‌ని అంటూంటారు క‌దా అంటే క‌రెక్టే.  కానీ హ‌ఠాత్ప‌రిణామాలతో వ‌చ్చే ఆనందం గుండె పోటుకి దారితీస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఆమ‌ధ్య ఒక సినిమాలో ఓ పెద్దామె న‌వ్వుతూ న‌వ్వుతూ గుండె ఆగి మ‌ర‌ణించ‌డం చూపించారు. న‌వ్వు ముఖంతోనే పార్ధివ దేహం క‌న‌ప‌డుతుంది! అది సినిమా సీన్‌లే అని అనుకోవ‌చ్చు.  కానీ అందుకు చాలా ఆస్కారం ఉందిట‌. అదేదో గొప్ప మ‌ర‌ణంగానూ భావించ‌న‌క్క‌ర్లేదు.  ఈ ఆధునిక కాలంలో అన్నీ చాలా ఆశ్చ‌ర్య‌క‌ర సంఘ‌ట‌న‌లే ఎక్కువ వింటున్నాం, చూస్తున్నాం. అబ్బాయి కి ఎన్న‌డూ లేనిది జీతం రెండింత‌లు పెర‌గ‌డం, విదేశీ చ‌దువు ఫ్రీగా లభించ‌డం, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విదేశాల్లో పెద్ద ఉద్యోగం రావ‌డం, లాట‌రీలో కోట్లు రావ‌డం వంటివి ఎంత ఆనందా న్నిచ్చే స‌మాచారాలో  అంత ప్ర‌మాద‌క‌రం కూడా! ఇలాంటి మ‌ర‌ణాల్ని త‌కోత్సుబో సిండ్రోమ్ అంటార‌ని జ్యూరిచ్ ఆస్ప‌త్రికి చెందిన స్విస్ శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు. దీన్నే ఇంకా తేలిక‌గా చెప్పాలంటే హార్ట్ బ్రోకెన్ సిండ్రోమ్ అంటారు.  అత్యంత ఆనంద‌క‌ర సంద‌ర్భాలు, సంఘ‌ట‌న‌లు ఒక్కోసారి మ‌నిషిని తెలీకుండా విప‌రీత‌మైన బ‌ల‌హీన త‌కు దారితీస్తాయి. ఇలాంటివి మ‌న‌మూ అపుడ‌పుడూ గ‌మ‌నిస్తుంటాం. ఇంట్లో ఏద‌యినా అత్యంత ఆనం దక‌ర సంఘ‌ట‌న జ‌రిగితే అంద‌రూ గ‌ట్టిగా న‌వ్వేసుకుంటూంటారు. అందులో ఒక్క‌రిద్ద‌రికి ఆ ఆనంద‌పు న‌వ్వు చాలా సేపు ఉంటుంది. అల‌స‌ట వ‌చ్చేస్తుంది. కుర్చీలో కూర్చుండిపోతారు. పొట్ట చెక్కల‌య్యేలా న‌వ్వావురా.. అంటారు హాస్యంగా అంద‌రూ.. కానీ అదే గుండె ఆగేందుకు దారి తీస్తుందిట‌.  అంటే ఆ స‌మ యంలో గుండె ఎడ‌మ క‌వాటం ఉండాల్సిన స్థితి మారుతుంది. దానితో  గుండెపోటు వ‌స్తుంది. అయితే ఇలాంటి కేసులు చాలా అరుదు.  అంటే గుండె కండ‌రాలు మెల్ల‌గా శ‌క్తి  కోల్పోతాయి.  గుండె జ‌బ్బులు వ‌చ్చే కేసుల్లో ఇలాంటిది  ఏ  ఒక్క‌టో  రెండో  ఉంటాయంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు, డాక్ట‌ర్లు.  అందు క‌నే ఎక్కువ‌గా ఆవేశ‌ప‌డ‌వ‌ద్ద‌ని, ఆగ్ర‌హానికి , అతి భ‌యానికి  గురికావ‌ద్ద‌ని, అతిగా  స్పందించ‌డం, లేని దాన్ని ఉంద‌ని ఊహించుకుని ఆందోళ‌న‌చెంద‌డం వంటివాటికి దూరంగా ఉండాల‌ని.. మామూలుగా డాక్ట ర్లు సూచిస్తుంటారు. అంటే మ‌నిషి మ‌ధ్య‌వ‌య‌సు దాటిన త‌ర్వాత కొంత ఉద్రేక ప‌రిస్థితుల‌కు దూరం గా ఉండాలి. స‌హ‌జంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో అలాంటి ప‌రిస్థితులు దాదాపు త‌ర‌చూ  వ‌స్తుంటాయి గ‌నుక  క‌డు జాగ్ర‌త్త‌గానే ఉండాలంటున్నారు గుండె నిపుణులు. జ్యూరిచ్  శాస్త్ర‌వేత్త‌లు  సుమారు  500 మంది రోగుల ఆరోగ్య‌ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ఈ  హాపీ సిండ్రోమ్‌ను క‌నుగొన్నారు. దీనికి సం బంధించిన విశ్లేష‌ణ‌తో కూడిన వ్యాసాన్ని యూరోపియ‌న్ హార్ట్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.  త‌కోత్సుబో  సిండ్రోమ్ అధిక‌శాతం మ‌హిళ‌ల్లోనే క‌న‌ప‌డుతోందని శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. శ్వాస తీసు కోవడం త‌గ్గడం, ఛాతీ నొప్పి వంటివి అతి సాధార‌ణ ల‌క్ష‌ణాలుగా పేర్కొన్నారు. 

గెలుపు ముర్ముదే.. ఓడింది సిన్హా కాదు!

అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించినట్లుగానే  రాష్ట్రపతి ఎనికల్లో, అధికార బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము ఘన విజయం సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీలో ముర్ముకు 6,76,803 ఓట్లు పోలయితే, ఆమె ప్రత్యర్ధి  ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 ఓట్లు లభించాయి. మొత్తం పోలైన ఓట్లలో ముర్ము 64 శాతం ఓట్లు సాధించారు. యశ్వంత్ సిన్హాకే 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో మూడు రోజుల్లో, జులై 25న  ద్రౌపతి ముర్ము భారత  15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.  నిజమే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్ధి విజయం సాధించడం విశేషమేమీ కాదు.  ఇంతవరకు ఒకే ఒక్క సందర్భంలో మినహా, మిగిలిన అన్ని సందర్భాలలో అధికార పార్టీ/ కూటమి అభ్యర్ధులే రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ  ఒక్క సందర్భం (1969) లో కూడా. అధికార కాంగ్రెస్ పార్టీలో చీలిక నేపధ్యంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీనే, కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్ధి నీలం సంజీవ రెడ్డికి వ్యతిరేకంగా వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దించారు. ఆత్మ ప్రభోదం నినాదంతో  ఆమె వీవీ గిరిని గెలిపించారు. అదొక ప్రత్యేక పరిస్థతి. ప్రత్యేక సందర్భం.  అయితే ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము గెలుపు కోణం కాకుండా ప్రతిపక్ష పార్టీల ‘ఉమ్మడి’ అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఓటమి కోణం నుంచి చూడవలసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి,రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ తొలి గంట కొట్టక ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికపై దృష్టిని కేంద్రీకరించాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశ భవిష్యత్ రాజకీయలకు, రాష్ట్రపతి ఎన్నికలు,టర్నింగ్ పాయింట్ , మేలి మలుపు అవుతుందని, మోడీ, షా జోడీ దూకుడుకు రాష్ట్రపతి  ఎన్నికల ఫలితాలతో బ్రేక్ పడుతుందని ఆశించారు.  అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దించితే, అధికార  ఎన్డీఎ కూటమికి గట్టి పోటీ ఇవ్వగలమని, తద్వారా, 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి పోరాటాన్నిముందుకు తీసుకు పోగలమనే ఆలోచన వెంబడి అడుగులు వేశారు. అందు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో శరద్ పవార్ మొదలు కేసీఆర్ వరకు  ప్రతిపక్ష పార్టీల పెద్దలంతా, పేరంటాలు చేశారు. పావులు కదిపారు. చర్చలు జరిపారు. అయితే, ఉమ్మడి అభ్యర్ధి  ఎంపిక దగ్గరే  తడబడి తప్పటడుగులు వేశారు అనుకోండి అది వేరే విషయం. చివరకు  ఏమి జరిగింది అనేది ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. యశ్వంత్ సిన్హాను బరిలో దించారు. అయిన ఫస్ట్ సీన్ లోనే సినిమా అర్థమై పోయింది.  ప్రతిపక్షాల ఐక్యత ఎండమావని మరో మారు తెలిపోయింది. ప్రతిపక్షాల పక్కా ఓట్లనుకున్న ఓట్లలో పది శాతం కంటే ఎక్కువ ఓట్లే అధికార కూటమి అభ్యర్ధికి పోలయ్యాయి.మొతం మీద ఓ 17 మంది ఎంపీలు ఓ వంద మందికి పైగా ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు చెబుతున్నారు. ముర్ముకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన జేఎంఎం, వైసీపీ, శివసేన ఇతర ఎన్డీయేతర పార్టీల ఓట్లు వీటికి అదనం.   సో.. ముర్ము గెలుపు యశ్వంత్ ఓటమి కాదు, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి పరాజయం. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలు  దేశ రాజకీయాలలో టర్నింగ్ పాయింట్ అవుతాయని పెట్టుకున్న ఆశలు నెరవేర లేదు, సరికదా ఓటి కుండ బొక్కలు బయట పడ్డాయి. అంతే కాదు ముర్ము తిరుగులేని విజయంతో కంగుతిన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక ముందు ముందు ప్రతిపక్ష పార్టీల ఐక్యత ఇంకెన్ని వంపులు, వంకర్లు పోతుందో చూడవలసిందేనని పరిశీలకులు అంటున్నారు. మరో వంక, వచ్చే రెండేళ్ల వ్యవధిలో జరిగే గుజరాత్‌, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో,  అదే విధంగా 2024 ఎన్నికల పైనా గిరిజన రాష్ట్రపతి ప్రభావం తప్పక ఉంటుందని అంటున్నారు. అలాగే రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలను కొట్టి వేయలేమని  అంటున్నారు.  అందుకే రాజకీయ విశ్లేషకులు  రాష్టపతి ఎన్నికల్లో ముర్ము గెలుపు, బీజేపీ దీర్ఘకాల వ్యూహంలో మరో గెలుపు, మరో మలుపు అంటున్నారు. బీజేపీకి బ్రాహ్మణ, బనియా పార్టీ అనే ముద్ర ఉన్నా, ఉత్తారాది పార్టీ అనే ముద్ర ఉన్నా, ఇంకా  చాలా చాలా గీతలు, గళ్ళు ఉన్న బీజేపీ,  ఒక్కొక గీతను  దాటుకుంటూ వస్తోంది. చివరకు ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం  చేస్తోంది. అన్ని వర్గాలను కలుపుకు పోతోందని పరిశీలకులు అంటున్నారు.  ప్రస్తుత పార్లమెంట్ లో ఎస్సీ,ఎస్టీ  ఎంపీలు 131 ఉంటే అందులో బీజేపీ ఎంపీలు  77 మంది ఉన్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమంటే, 2014లో కంటే 2019 బీజేపీకి 21 ఎంపీ సీట్లు ఎక్కువచ్చాయి ( 282 నుంచి 303) ..ఈ  21 మంది  ఎంపీలలో 10 మంది  ఎస్సీ, ఎస్టీ ఎంపీలున్నారు. ఇప్పడు ముర్ము ఎన్నిక తర్వాత ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ ఇంకా విస్తరించే అవకాశం ఉంటుందని, ఆ  ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి ఎన్నికల వ్యూహం బెడిసి కొట్టిందని,  భవిష్యత్;లోనూ ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా బీజేపీని  ఎదుర్కోవడం అయ్యే పని కాదని అంటున్నారు.

16 అడుగుల చేప‌.. మూఢ‌న‌మ్మ‌కాల‌కు కేంద్రం!

ఒక రోజు బామ్మ‌గారు మ‌న‌వ‌డిని తీసుకుని కంచికి బ‌య‌లుదేరింది. ఎందుక‌ని అడిగితే మొన్న మా వాడి బుజంమీద బ‌ల్లిప‌డింది, అక్క‌డ బంగారుబ‌ల్లిని తాకించాలిగ‌దా.. అందుకు అన్న‌ది. అంత‌కు రెండ్రో జుల ముందు ఎదురింటి పిల్లకి పిల్లి ఎదుర‌యింద‌ని ప‌రుగున వెళ్లి గ‌ది త‌లుపులేసుకుని రోజంతా బ‌య‌టికి రాలేదు.. రాతి యుగం నుంచి రాకెట్లు దాటి కంప్యూట‌ర్ కాలంలోకి వ‌చ్చాం. ప్ర‌పంచ‌మంతా ఆ చిన్న ముండే చూపుతుందేవిట్రా అంటారు తాత‌గారు.. కానీ శ‌కునాల పిచ్చి మాత్రం త‌రాలు మారుతు న్నా పోవ‌డం లేదు. ఇక్క‌డే కాదు చిలీ వంటి దేశాల్లోనూ ఇదే భ‌యం ప‌ట్టుకుపీడిస్తోంది! చిలీలో ఓ మ‌త్స్య‌కారుడు అలా చేప‌ల కోసం స‌ముద్రంలోకి వెళ్లాడు. ఎప్పుడూ లేనిది హ‌ఠాత్తుగా అత‌న్నే లోప‌లికి లాగేసింది ఏదో జంతువు. అత‌ను ఎలాగో మ‌ళ్లీ ప‌డ‌వ ఎక్కి దాన్ని మాత్రం ఒడ్డు మీద‌కి లాక్కొచ్చా డు. తీరా చూస్తే అది ఏకంగా 16 అడుగుల పాములాంటి  చేప‌. ఇలాంటిది అక్క‌డి వారు ఎన్న‌డూ చూడ లేద‌ట‌. అంతే ఇదేదో ద‌య్యం అనుకున్నారు, ఇదేదో కొంప‌ముంచేందుకే  వీడికి దొరికింద‌ని  తిట్టుకున్నా రు. ఒక గ‌డ్డం ముస‌లాయ‌న వ‌చ్చి ఇది నిజంగానే అప‌శ‌కునం.. జాగ్ర‌త్త  అని వాళ్ల  భ‌యాన్ని రెండింత లు చేసి వెళ్లారు. ఇంత‌కీ ఆ పేద్ద‌ది.. ఓర్ ఫిష్. ఇది చేప‌లానే క‌నిపించే చేప‌గాని నీటి జంతువు. దాని ఒడ్డూ పొడుగూ తేల్చ‌డానికి ఏకంగా రాళ్లెత్తే క్రేన్ ని ప‌ట్టుకొచ్చారు.  ఈ అతిపెద్ద చేపని కింగ్ ఆఫ్ హెరింగ్స్ అని పిలుస్తున్నారు. నీటి అట్ట‌డుగున  జీవించే ఈ చేప‌ చుట్టూ కూడా ఒక కథ‌ను అల్లి చెబుతున్నారు ఇక్క‌డి వారు. ఇలాంటివి గ‌తంలో జ‌పాన్‌లో క‌నిపించాయి.  ఆ త‌ర్వాత‌నే ఫుక‌షిమా అనే భ‌యాన‌క తుపాను జ‌పాన్‌ను ముంచెత్తింది. ఇపుడు  అదే  భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. అయితే కొంద‌రు నాస్తికులు మాత్రం పెద్ద జీవ‌మే క‌నిపించినంత మాత్రాన చూసి ఆనం దించాలి. భ‌యంలేక‌పోతే పెంచుకోవాలి గాని ఇలాంటి పిచ్చి, అర్ధ‌ర‌హిత మూఢ‌న‌మ్మ‌కాల‌తో భ‌య‌పెట్ట వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. పోనీ అలా అనుకున్నా, ఇపుడు ఉన్న‌ప‌ళాన ఎక్క‌డ‌క‌ని ప్ర‌జ‌లంతా  నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలి? అయినా, ఓర్ ఫిష్ అనేది నీటికి అట్ట‌డుగున ప‌డి ఉంటుంది. దానికి  లోకంలో జ‌రిగే దానికి ఏమ‌న్నా సంబంధం ఉంటుందా? అనీ చిలీలో కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. టెటానిక్ ప్లేట్స్ క‌ద‌లిక‌ల వ‌ల్ల ఇలాంటివి పైకి వ‌స్తుంటాయే త‌ప్ప అదేమి అప‌శ‌కునం, అతి ప్ర‌మాద హేతుకం కాద‌ని అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఎన్న‌యినా, ఎవ‌రైనా చెప్ప‌నీయండి.. మూఢ‌న‌మ్మ‌కం క‌లిగితే దాన్ని ఎవ్వ‌రూ మ‌నసు లోంచి తీసేయ‌లేరు. 

జ‌గ‌న్  ప‌క్క‌లో  బ‌ల్లెం!

రాజా, మీ ఆజ్ఞ శిరోధార్యం, మీకోసం రాజ్యంకోసం మ‌ర‌ణాన్న‌యినా లెక్క‌జేయ‌ను.. అంటాడు స‌త్య నారా య‌ణ ఓ పాత సినిమాలో. కానీ రాజు స‌త్య‌నారాయ‌ణ వెన‌కే వేగుల్ని పెట్టి న‌మ్మ‌కం కోల్పోయేలా చేసుకుంటాడు. దాదాపు అదే సీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జ‌రుగుతోంది. జ‌గ‌న్ పార్ల‌మెంటుకి పంపిన‌ ఎం.పీ ర‌ఘురామ కృష్ణం రాజు ఆయ‌న్నే నిల‌దీస్తున్నారు. మ‌నోడు మ‌నోడు అనుకుంటే న‌చ్చ‌ట్లే ద‌న్న దిట‌ వెన‌క‌టికి  ఒకామె. అదుగో అలా త‌యారైంది జ‌గ‌న్‌, ర‌ఘురామ‌ల మైత్రి. ఒకే పార్టీ అయినా న‌మ్మ‌కం పోయిన త‌ర్వా త అధినేత‌యినా పార్టీ కార్య‌క‌ర్త‌యినా ఎం.పీ గారికి తిట్ట‌డానికి పెద్ద అడ్డేమిటి. జ‌గ‌న్ పాల‌నా విధానం, ఆయన మంత్రివ‌ర్గ నిర్ణ‌యాలు ఏమాత్రం ఆయ‌న‌కు రుచించ‌డం లేదు. త‌ప్పుల త‌డ‌క పాల‌న‌తో ప్ర‌జల‌ను మ‌భ్య‌పెట్ట‌డం త‌ప్ప జ‌గ‌న్ వాస్త‌వంగా ప్ర‌జాభిమానాన్ని చూర‌గొనే స్థాయిలో పాల‌న సాగించ‌డం లేద న్న‌ది ర‌ఘుమా అభిప్రాయం..కాదు.. గ‌ట్టి న‌మ్మ‌కం. అందుకే ఆయ‌న  వైసీపీ అధిష్టానా నికి కొరకరాని కొయ్య గా మిగిలారు. జ‌గ‌న్ ప్ర‌తీ మాట‌ని, అడుగునీ విమ‌ర్శిస్తూ అయోమ‌యానికి గురిచేస్తు న్నారు ఎం.పీ. ర‌ఘురామ  అధిష్టాన పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీ సభ్యుడైనా.. రాష్ట్ర ప్రభుత్వ విధానా లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వేదిక ఏదైనా ఆయన నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.  ఇదే జ‌గ‌న్‌కు బొత్తిగా మింగుడుప‌డ‌ని సంగ‌తి. మ‌నోడ నుకుంటే ఇలా తీవ్రంగా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డ‌మేమిట‌ని లోలోప‌ల జ‌గ‌న్ తెగ బాధ‌ప‌డు తున్నా రు. ప్రభుత్వ వైఫ ల్యాలను తప్పుపడుతున్నారు. గణాంకాలతో  కడిగి పారేస్తున్నారు. సొంత పార్టీ ఎంపీని కట్టడి చేయ లేని స్థితిలో వైసీపీ ఉంది. ఆయనపై  వేటు వేయడానికి  చేయని  ప్రయత్నమంటూలేదు. కానీ వీలు పడడం లేదు. పోనీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన మరింత  రెచ్చిపోతారని  భావిస్తోంది.  వ‌దిలేస్తే కాసేపాగి మ‌ళ్లీ ఇంటికి వ‌చ్చే చిన్న‌పిల్లాడుకాదు ర‌ఘురామ‌. ఆయ‌న  బీజేపీ గూటికి చేరి మరిన్ని ఇబ్బందులు పెడతారని  వైసీపీ భయం. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం నుంచి ఎంపీగా గెలి చిన ఆయన తొలినాళ్ల‌లో  అధిష్టానంతో సఖ్యత గానే నడిచారు. కానీ తరువాత విభేదాలు పొడచూపాయి. పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. తనపై భౌతిక దాడిచేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయిం చారు. మొత్తానికి అయితే రఘు రామరాజు అంటేనే ఇప్పుడు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం వ్యాఖ్యాలు చేస్తారో తెలియక సతమతమవుతున్నారు.  తాజాగా లోక్ సభలో ఆయన ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని వైసీ పీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పెద్ద గలాటానే చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఛీ మీ ముఖం చూసి మాట్లాడలేనంటూ ఆయన చేతిని ముఖానికి అడ్డంగా పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇది లోక్ సభలో పెద్ద చర్చకే దారితీసింది.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రఘురాజు మాట్లాడారు. ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా అప్పలు చేస్తోందని.. కనీస నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ ఆదాయంపై అప్పులు చేయడం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. కార్పొరేషన్ల పేరిట ఎడాపెడా అప్పులు చేస్తోందన్నారు.  తాజాగా ఏపీ బేవరేజెస్ తరుపున అప్పులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఖాజానాకు రావా ల్సి న ఆదాయాన్ని ఏపీ బేవరేజెస్ లోకి మళ్లించి…అదో ఆదాయ వనరుగా చూపించి అప్పులు చేస్తు న్నార ని ఆరోపించారు. అవసరమైతే తన దగ్గర ఆధారాలున్నాయని కూడా చెప్పారు. దీనిపై వైసీపీ ఎంపీలు మార్గని భరత్, వంగ గీతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామతో వాదనకు దిగారు. దీనికి రఘురామ కూడా దీటుగా స్పందించారు. సిట్ డౌన్ అంటూ హెచ్చరించారు. అసలు మమ్మల్ని కూర్చోవడానికి మీరె వరు అంటూ ఆ ఇద్దరు ఎంపీలు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ స్పం దించారు. తనను చూసి చెప్పాలని సూచించారు. దీంతో వైసీపీ ఎంపీలు అభ్యంతరాలు చెబుతున్నా. .రఘురామ మాత్రం తన ముఖానికి చేతిని అడ్డంగా పెట్టుకొని తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. అయితే మొత్తానికి లోక్ సభ వేదికగా వైసీపీ ఎంపీల మధ్య జరిగిన రచ్చ మాత్రం తోటి సభ్యలుకు వినోదం పంచింది.

ఇంతకీ పవన్, బీజేపీల బంధం బలమైనదేనా?

పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో బీజేపీ మైత్రి లవ్ అండ్ హేట్ చందంగా కొనసాగుతోంది. ప్రసిద్ధ కథా రచయత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర కథ యావజ్జీవం హోష్యామీలో నిత్యం గొడవపడుతూ కలిసి జీవించే దంపతుల్లా జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల మధ్యా మైత్రి రంగులు మార్చుకుంటోంది. తగవులు పడుతోంది.. కలిసి సాగుదాం అంటోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను అంగీకరించాలని బీజేపీతో మైత్రికి జనసేనాని షరతు పెడితే.. మా పార్టీ ఎవరినీ భుజాన మోయదని బీజేపీ బెట్టు చేస్తున్నది. ప్రధాని నరేంద్రమోడీ హాజరైన భీమవరం సభకు జనసేనానిని నువ్వు రావద్దుసుమా అని నోటితో చెబుతూ సభకు రావాలంటూ ఓ ఆహ్వానం పడేసింది బీజేపీ.. అలిగిన జనసేనాని ఆ సభకు దూరంగా ఉండిపోయారు.  ఆ తరువాత మేం ఆహ్వానించాం మీరే రాలేదంటూ బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కితే.. వద్దామనే అనుకున్నా, కానీ స్థానిక ఎంపీని ఆహ్వానించకుండా నన్న ఆహ్వానించడం, నేను రావడం మర్యాద కాదని దూరంగా ఉన్నానని జనసేనాని వివరణ ఇచ్చారు. సరే అది ముగిసిన కథ.. ఇప్పుడు మళ్లీ ఈ ఆహ్వానం కథే మరో చోట మరోలా ఆరంభమైంది.  ఆ కథేమిటంటే  పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు శుక్రవారం (జులై 23) కేంద్రం పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ప్రొటో కాల్ ప్రకారం పవన్ ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఉప రాష్ట్రపతి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు మాత్రమే ఆహ్వానితుల జాబితాలో ఉంటారు. అయినా కూడా పెద్ద మనసు చేసుకుని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు జనసేనాని పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించి తప్పని సరిగా రావాలని కోరారు. దీనిని బట్టి పవన్ ను బీజేపీ దూరం పెట్టే ప్రశక్తే లేదనీ, వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలూ కలిసే పోటీ చేస్తాయని విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే తనకు ఆహ్వానం వచ్చిందని ధృవీకరించిన పవన్ కల్యాణ్ ఆ ఆహ్వానాన్ని అనివార్య కారణాల వల్ల మన్నించలేకపోతున్నానని చెప్పేశారు. ఆరోగ్యం బాలేదనీ, అందుకే వెళ్లడం లేదనీ చెబుతూ, పనిలో పనిగా రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో క్రియాశీలంగా వ్యవహరించారనీ, పదవికి వన్నెతెచ్చారని ప్రశంసించేశారు. అయితే ఇంతకీ మోడీ స్వయంగా ఆహ్వానించినా పవన్ ఎందుకు స్పందించడం లేదు అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి బీజేపీ, జనసేన మధ్య మూడేళ్లుగా మైత్రి కొనసాగుతున్నా.. ఈ మూడేళ్లలో కేవలం ఒక్కటంటే ఒక్క సారి మాత్రమే పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు. ఈ మధ్య కాలంలో పలు మార్లు మోడీతో భేటీ అవకాశం కలిగినా, స్వయంగా మోడీయే పిలిచినా పవన్ కల్యాణ్ ఆయనను కలిసే యత్నం చేయలేదు.   విశాఖ స్టీలు ప్లాంట్ ఇష్యూలో పవన్ నేరుగా హోం మంత్రి అమిత్ షానే కలిశారు. స్టీల్ ప్లాంట్ స్థితిగతులపై చర్చించారు. పలు సందర్భాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిశారు. కానీ ఇంతవరకూ ప్రధాని మోదీని మాత్రం కలవలేదు.  ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తులు చిగురిస్తున్నట్టు వస్తున్న వార్తల వేళ.. పవన్ రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు గైర్హాజర్ కావాలని తీసుకున్న నిర్ణయం పలు సందేహాలకు తావిస్తున్నది. ఒక వైపు బీజేపీ  2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని   గంటా పథంగా చెబుతూ వస్తోంది. అయితే పవన్ మాత్రం మరో ఉద్దేశంలో ఉన్నట్లు తన మాటలు, చేతల ద్వారా స్పష్ఠంగానే తెలియజేస్తున్నారు.   గత రెండు సార్లు తాను తగ్గానని.. ఇక   తనకు ఈసారి అవకాశాన్ని వదిలేయాలని ఆయన సూటిగా కాకపోయినా పరోక్షంగానైనా బీజేపీకి తెలియజేశారు. అదే సమయంలో తెలుగుదేశానికి అన్యాపదేశంగా అదే సూచన చేశారు. దీంతో జనసేనతో పొత్తు అన్న విషయంలో తెలుగుదేశం ఆచి తూచి అడుగేస్తోంది. పొత్తు ఉంటుందని కానీ ఉండదని కానీ చెప్పడం లేదు. అయినా  మహానాడు తరువాత ఆ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపించింది. పవన్ ప్రస్తావనే లేకుండా తన పని తాను చేసుకుని పోతోంది.  బీజేపీ కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన సందర్భంగా పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని జనసేన శ్రేణుల నుంచి డిమాండ్ ను పట్టించకోకపోవడం అటుంచి, ఆయన పర్యటన మొత్తంలో కనీసం జనసేన పేరును కానీ, పవన్ కల్యాణ్ ఊసు కానీ రానీయ లేదు.  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీ పునరాలోచనలో పడి జనసేనకు అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే జనసేనానికి ఆహ్వానాలు, తెలుగుదేశం పార్టీతో వేదిక పంచుకోవడాలు అని పరిశీలకులు అంటున్నారు. 

ఆపన్నులను ఆదుకోవడంలో బాబు తగ్గేదేలే!

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు   మాస్టర్ ప్లానే వేశారు. జగన్ రెడ్డి సర్కార్, వైసీపీ నేతలు చేస్తున్న పనికిమాలిన పనులన్నింటినీ వరుసపెట్టి ఏకేస్తున్న చంద్రబాబు ప్రతి సందర్భాన్నీ టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా సరే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయం సాధించిపెట్టడం ద్వారా అసెంబ్లీలో  తాను చేసిన శపథాన్ని నెరవేర్చుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. తన సతీమణిని వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా విమర్శించినప్పుడు ఆవేదనతో మళ్లీ సీఎంగానే ఈ సభలో అడుగుపెడతా అంటూ బయటికి వచ్చేశారు.  భారీ వర్షాలు, వరదలతో భారీగా నష్టపోయిన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించి, బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి పరామర్శించి, టీడీపీ తరఫున భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితులకు తక్షణమే సాయం చేసి, అండగా ఉండాల్సిన సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లోనే వెళ్లిపోయారని విమర్శించారు. అలా గాల్లో వస్తే.. బాధితుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు స్వయంగా వరదనీటిలో పడవలపైన, బురద నిండిన గ్రామాల్లో కూడా పర్యటించారు. కష్టాల్లో ఉన్న తమను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబును చూసి గోదావరి జిల్లాల ప్రజల్లో చెప్పలేనంత సంతోషం వ్యక్తం అయింది. ఆయనకు నీరాజనాలు పట్టి మరీ స్వాగతం పలికారు. వరద బాధితులకు పక్కరాష్ట్రం తెలంగాణలో పది వేలు పరిహారం ఇస్తే.. ఏపీలో కేవలం రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ ఇస్తున్న రెండు వేల రూపాయలు వరదలో మునిగిపోయిన ఇళ్లలోని బురద తొలగించుకోడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టడం తథ్యం అని, బాధితులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ రెడ్డి పాలన సరిగా లేదు కాబట్టే పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలిసిపోతామంటూ తీర్మానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వరదనీరు నిండి ఉన్న లంక గ్రామాల్లో చంద్రబాబు నాయుడు సాహసం చేసి మరీ బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై, పలువురు నేతలు వరదనీటిలో పడిపోయారు. ఇలాంటి ప్రమాదాలకు కూడా ఏమాత్రం వెనుదిరగకుండా చంద్రబాబు తన పరామర్శ యాత్రను కొనసాగించారు. బాధితుల పక్షాన నిలిచారు. వైసీపీ ప్రభుత్వం పెంచేసిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, పన్నులపై ‘బాదుడే.. బాదుడు’ పేరిట ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఏడు పదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు విసుగు, విరామం, అలసట లేకుండా జిల్లాల యాత్రలు చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి దాష్టీకాలు, వైసీపీ నేతల దుర్మార్గాలపై ఎప్పకటికప్పుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన గోదావరి జిల్లాల పర్యటనకు సంబంధించి రెండు విషయాలు చెప్పాల్సి ఉంది. సాధారణంగా వరదలు, భారీ వర్షాలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయ నేతలు బాధితులను ఒక చోట చేర్చి పరామర్శించడం, తోచినంత సాయం చేస్తుంటారు. కానీ చంద్రబాబు మాత్రం వరదలో చిక్కుకున్న మారుమూల గ్రామాలకు కూడా స్వయంగా వెళ్లడం, రోజంతా బాధితుల సమస్యలు వింటూ.. వారితో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో ఎంతో ఓపికతో వ్యవహరించారు. రోజంతా విరామం లేకుండా బాధితుల పక్షాన నిలిచేందుకు చంద్రబాబు ఎంతో చొరవ చూపించారు. ఆయన ఓపిక, స్టామినాను చూసిన వరద బాధితులు కూడా అవాక్కయ్యారు. వరద బాధితులను గాలికి వదిలేసి, గాల్లో వచ్చిన జగన్ గాల్లోనే చూసి వెళ్లిపోతే.. చంద్రబాబు మాత్రం సమస్య మూలాల్లోకి వెళ్లి, బాధిత జనం కోసం జనం మధ్యకే వెళ్లి, వారికి అండగా నిలబడతామని భరోసా ఇవ్వడం విశేషం. ఏదేమైనా తాను చేసిన శపథం ప్రకారం చంద్రబాబు నాయుడు సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టే సూచనలో ఏపీలో సర్వత్రా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈయ‌న మామూలోడు కాదు

మామూలు వాటికి విరుద్దం ఏద‌యినా వింతే. ఎడంచేత్తో రాస్తూంటే వింత‌గా చూస్తారు. అదెలా వ‌చ్చిందా అని. వెన‌క్కి న‌డుస్తుంటే, కాస్తంత పిచ్చ‌నే అనుకుంటారు. రెండుచేతుల‌తో రాస్తుంటే  క‌న్నార్ప‌కుండా చూస్తారు. ఇది వింత‌ల్లో వింత అని.  ఇక్క‌డో పెద్ద మ‌నిషి రెండు చేతుల‌తోనూ ఒకేవిధంగా అద్భుతంగా బొమ్మ‌లు వేస్తున్నాడు. ఇదో ఊహించ లేని నైపుణ్యం. పూర్వం ఒక ప్ర‌పంచ ప్ర‌ముఖ ఆర్టిస్టు ఒక చ‌ర్చి లోప‌లి భాగంలో చాలా పెద్ద పెయింటింగ్ వేశాడ‌ట‌. దానికి  ఆయ‌న‌కు సంవ‌త్స‌ర కాలం ప‌ట్టింద‌ని చ‌రిత్ర‌. తిండి, నిద్రాహారాలు మానేసి వేసిన  ఆ పెయింటింగ్ ప్ర‌పంచ చిత్ర‌క‌ళా చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ‌మైన‌దిగా నిలిచిపోయింది.  ఈ విచిత్ర చిత్ర‌కారుడు ఎవ‌రన్న‌ది స‌మాచారం లేదు. కానీ ఆయ‌న క్లాస్ బ్లాక్ బోర్డు మీద వేస్తున్నాడు గ‌నుక స్కూలు టీచ‌ర్ అయి ఉండ‌వ‌చ్చు. కానీ రెండు చేతుల‌తో ఒకే విధంగా శివాజీ బొమ్మ‌ని గీయ‌డం, అస‌లే బొమ్మ‌నైనా అంత బాగా గీయ‌డం అనేది చిన్న‌విష‌యం మాత్రం కాదు. అది స్వ‌త‌హాగా ఉండే క‌ళా నైపుణ్యం తాలూకు చిన్న ప్ర‌ద‌ర్శ‌న‌. కానీ ఆయ‌న్ను ఆ స్కూలు వారు స‌త్క‌రించాలి. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను గొప్ప‌క‌ళాకారునిగా గుర్తించాలి. ఇలాంటివారే ఆయా ప్రాంతాల్లో మంచి ఆర్టిస్టుల‌ను త‌యారు చేయ‌గ‌ల‌రు.  ఆయ‌న బొమ్మ వేయ‌డం చూసిన ఒక అభిమాని వీడియో తీసి అంద‌రూ ఆయ‌న గురించి తెలుసుకునేట్టు చేశారు. ఈ ఆర్టిస్ట్ ఎవ‌రో గాని, వెన‌క్కి తిర‌గ‌కుండానే అంత మంచి బొమ్మ‌వేశారు. నిజంగా సూప‌ర్ అని వీడియో ప్రేక్ష‌కులంగా మ‌న‌స్పూర్తిగా మెచ్చుకుంటున్నారు.

వెంక‌టేశా.. నీ  కొండ‌మీదా హ‌త్యాకాండ‌!

 తిరుమ‌ల తిరుప‌తి  అన‌గానే  భ‌క్తి పార‌వ‌శ్యంలో మునుగుతారు జ‌నం. ప్ర‌తీ ఏడూ వెంక‌న్న‌ను ద‌ర్శ‌నా నికి వెళ్లకుంటే తోచ‌ని జ‌నాలున్నారు. అక్క‌డంతా భ‌క్తి, సామ‌ర‌స్య భావ‌న త‌ప్ప మ‌రోటి ఎన్న‌డూలేదు.  తిరు మ‌ల అంటేనే సామాజిక సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కి ప్ర‌తీక‌. ఎంతో క‌ట్టుదిట్ట‌మైన ర‌క్ష‌ణ‌వ్య‌వ‌స్థ‌నే గ‌మ‌ని స్తుంటాం. పిల్ల‌లు త‌ప్పిపోయినా  త‌మ‌వ‌ద్ద‌కు చేర్చ‌గ‌ల పోలీసు వ్య‌వ‌స్థ ఉంది.  అలాంటి వెంక‌న్న స‌న్నిధిలో ఏకంగా హ‌త్య జ‌ర‌గ‌డం యావ‌త్ తెలుగు లోకాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తిరుమ కొండపై హత్య జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమల కొండపై ఓ భక్తుడి హత్య కలకలం రేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం దగ్గర వ్యక్తి మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు. తిరుమలలో హత్య తో ఒక్కసారిగా కలకలంరేగింది. ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా బండ రాయితో మోది హత్య చేశారు. అయితే ఈ దారుణానికి చిన్నపాటి గొడవ కారణమని తిరుమల వన్ టౌన్‌ పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఆరణి జిల్లాకు చెందిన కె.శరవణన్‌, వేలూరుకు చెందిన భాస్కర్‌ ఇద్దరూ తిరుమలలో చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. అయితే రాత్రిళ్లు అక్కడే పడుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్థానిక మ్యూజియానికి ఎదురుగా వయోవృద్ధుల టిక్కెట్ల పంపిణీ కేంద్రం దగ్గర భాస్కర్‌ వచ్చి పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత శరవణన్‌ అక్కడికి వచ్చి తన చోటులో ఎందుకు పడుకున్నావంటూ గొడవపడ్డాడు. బలవంతంగా భాస్కర్‌ను అక్కడి నుంచి పంపించాడు. దీంతో కోపం పెంచుకున్న భాస్కర్‌ శరవణన్‌పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సిమెంట్‌ రాయిని తీసుకొచ్చి నిద్రపోతున్న శరవణన్‌ తలపై మోదాడు. తీవ్ర గాయాలైన అతడు చనిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది.. తర్వాత హత్య ఉదంతం బయటపడింది.. మృతదేహం కనిపించింది. అనంతరం సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అర్థ రాత్రి ఘటన జరిగినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. అయితే తిరుమలలో హత్య జరగడం హాట్ టాపిక్ అయ్యింది. తిరుమలలో ఎవరైనా నివాసం ఉండాలంటే స్థానికులకైతే ఆధార్‌కార్డు, పని చేసేందుకు వచ్చేవారికైతే గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. కానీ కరోనా ఆంక్షలు తొలగించడంతో.. భక్తులను టీటీడీ అనుమతిస్తుండటంతో పనిచేసేందుకు వస్తున్న వారు కొందరు గుర్తింపు కార్డులు లేకుండా తిరుమల వస్తున్నారు. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి, హత్యకు పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేటు హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

శాస్త్రి, హోమీబాబా మ‌ర‌ణాల గుట్టు విప్పిన  క్రౌలీ

బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించే ఓ పెద్ద హెచ్చ‌రిక‌.  ఇంట్లో మొద‌టి సంతా నానిదే పై చేయి. ప్ర‌పంచ‌రాజ‌కీయాల్లో పెద్ద‌న్న అమెరికాదే పెద్ద‌రికం. అమెరికా కా అంటే కా, కీ అంటే కీ. వీటిలో ఎవ‌రు ఏది కాద‌న్నా త్వ‌ర‌లో మూడింద‌నేది కూడా అమెరికానే నిర్ణ‌యించి మ‌రీ చెబుతుంది. అమె రికా వ్య‌వ‌హారాల‌కు ప్ర‌మాద‌క‌రం అని తోచిన ప్ర‌తీ శ‌క్తిని అణ‌చివేయ‌డం వారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. అన్ని రంగాల్లోనూ అమెరికా నిజంగానే అంత క్రూరంగానూ వ్య‌వ‌హ‌రిస్తుంది. త‌న మాటే చెల్లుబాటు చేసు కోగ‌ల దిట్ట‌.  భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్ భాభా,   భార‌త మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హదూర్శాస్త్రిది అస‌హ‌జ‌మ‌ర‌ణ‌మ‌ని వారు మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచీ అనుమానాలు ఉన్నాయి. కానీ వారివి  స‌హ‌జ‌మ‌ర‌ణాలేన‌ని అమెరికా ముద్ర వేసిన త‌ర్వాత ఏ దేశాధ్య‌క్షుడు, మ‌న దేశంలో ఏ నాయ‌కుడూ ఇక నోరెత్త‌లేదు. కానీ ఇటీవ‌ల మాజీ సిఐఏ అధికారి క్రౌలీ  రాసిన పుస్త‌కం అస‌లు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టింది. చాలాకాలం భార‌తప్ర‌భుత్వం వారిద్ద‌రి మ‌ర‌ణాల గురించిన అస‌లు స‌మాచారం తెలుసుకోను తీవ్ర య త్నాలే చేసింది. కానీ ఒక్క ముక్క‌కూడా భార‌త్‌కు తెలియ‌లేదు. పోనీ పెద్ద‌న్న అమెరికానే తెలియ‌నీయ లేద‌న్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్యపోన‌క్క‌ర్లేదు. తెగించిన‌వారు దేనిక‌యినా సిద్ధ‌ప‌డ‌తార‌న్న నానుడి అమెరికాకి స‌రిగ్గా అతికిన‌ట్టు స‌రిపోతుంది. అమెరికా ప్ర‌పంచ రాజ‌కీయాల్లో త‌మ పూర్ణ ఆధిప‌త్యాన్ని కొన‌సాగించ‌డా నికి తానే బాస్ అనిపించుకోవ‌డానికి ఎంత‌టి హ‌డావుడ‌యినా, భ‌యాన్న‌యినా ప్ర‌చారం చేస్తుంది.  అయితే అబ‌ద్ధాలు ఆట్టే కాలం నిల‌వ‌వు. స‌త్యాన్ని ఏదీ నిలువ‌రించ‌లేద‌ని వేదాంతులు చెప్పే మాట  నిజంగానే నిజం. ఇటీవ‌ల భారత మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయంలో సంచ లన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆయనది అనుమానాస్పద మృతి కాదని అగ్రరాజ్యం అమెరికానే పథకం ప్రకారం చేసిన హత్య అని వెల్లడైంది. శాస్త్రితో పాటు భారత అణుశాస్త్ర పితా మహుడు హోమి జహంగీర్ భాభాను అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ హత్య చేసింది. ఈ విషయాలను సీఐఏ  మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ తన పుస్తకంలో వెల్లడించారు. శాస్త్రి, భాభా మరణించినప్పుడు  క్రౌలీ సీఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రి, భాభా నేతృత్వంలో అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్న భారత్‌.. తమ శత్రు దేశం రష్యాతో అంటకాగడం అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి.. వారి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని తన పుస్తకంలో వివరించారు. భారతీయులు ఎంతో తెలిలైనవారని, వాళ్లు  ప్రపం చంలో గొప్ప శక్తిగా ఎదగబోతున్నారనే విషయాన్ని తాము కోరుకోలేదని చెప్పారు.  1966 జనవరి 11న పాకిస్థాన్  అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్  రాజధానిలో తాష్కెంట్‌ ఒప్పందంపై శాస్త్రి  సంతకం చేశారు. అదే రోజు  అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మరణిం చడం వెనక సీఐఏ హస్తం ఉందని క్రౌలీ పేర్కొన్నారు. హోమీ భాభా ఎయిర్ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా హతమార్చినట్టు క్రౌలీ తెలిపారు. చాలా కష్టపడి ఆ విమానంలోకి పేలుడు పదా ర్థాలు పంపామన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని తొలుత వియన్నా గగనతలంలో పేల్చే ద్దామ నుకు న్నామని చెప్పారు. కానీ, విస్పోటనం తర్వాత విమానం ముక్కలుముక్కలు కావడానికి ఎత్తైన పర్వత ప్రాంతంలో కూలిపోయేలా చేశామని తెలిపారు.

కాంగ్రెస్ ముక్త భారత్.. బీజేపీ లక్ష్యానికి తెలంగాణ అడ్డు

కాంగ్రెస్ ముక్త భారత్ బీజేపీ గత ఎనిమిదేళ్లుగా చెబుతున్న మాట.. చేస్తున్న నినాదం. ఇందు కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతోంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు సడలేలా ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ ను బలహీన పరిస్తే.. జాతీయ స్థాయిలో తమకు పోటీ యే ఉండదన్నది బీజేపీ బావన.   కాంగ్రెస్ మినహాయిస్తే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న  పార్టీ, తమకు పోటీగా నిలిచే పార్టీ మరొకటుందన్నది కమలనాథుల నిశ్చితాభిప్రాయం. అందుకే  కాంగ్రెస్ ను బలహీనపరుస్తే   తమకు తమకు  తిరుగుండదనే భావనలో బిజెపి నాయకత్వం ఉంది. అందుకు ఆ పార్టీ  ఇటీవల పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలే తార్కాణం.  కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాషాయదళం వ్యూహరచన చే స్తోంది. ఆ వ్యూహాలను అమలు చేస్తున్నది.   అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు,  మద్దతుతో  ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాగానీ, ఆ పార్టీని వెంటాడుతూనే ఉందనేది కూడా పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోయేందుకు ప్రాంతీయ పార్టీలు ఆసక్తిని కనబర్చకుండా బిజెపి కొత్త కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఆ వ్యూహాల అమలులో  ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ ను దాదాపు నామమాత్రావశిష్టానికి తీసుకు వచ్చేసిందని పరిశీలకులు అంటున్నారు. అక్కడితో ఆగకుండా ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. అయితే ఈ వ్యూహాలు దక్షిణాదిలో అంతగా ఫలించడం లేదు. అందులోనూ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలను ఎదురొడ్డి నిలిచి రోజు రోజుకూ బలోపేతమౌతోందన్నది ఆ పార్టీ శ్రేణులే చెబుతున్న మాట. దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ బలహీన పడినా లేదా పడినట్లు కనిపిస్తున్నా మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్న అంచనాతో బీజేపీ ఆ అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతోనే బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.  ఇప్పటికే కర్ణాటకలో తన రాజకీయ చతురతతో కాంగ్రెస్ బీజేపీ సర్కార్ ను ఏర్పాటు చేసింది.  అనంతరం పశ్చిమ ప్రాంతాన     తమిళనాడులో బలోపేతానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. బీజీపీ లక్ష్యమైన కాంగ్రెస్ కు అక్కడ ఏ మంత పట్టు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు కేరళలో కూడా బీజేపీ పట్టు సాధించలేకపోయినా.. అక్కడ కాంగ్రెస్ ఏ మంత బలంగా లేదు. అందుకని ఆ రాష్ట్రం కూడా బీజేపీకి పెద్ద ప్రాధాన్యత రాష్ట్రంగా అనుకోవడం లేదు. ఇక మిగిలినవి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ. ఏపీ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే. అయినా అక్కడ జనసేనానితో మైత్రి ద్వారా కొద్దో గొప్పో బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవు కనుక బీజేపీ అక్కడ ఇప్పటికిప్పుడు బలోపేతం కాలేకపోయినా ఫరవాలేదన్న భావనతలో ఉందని అంటున్నారు. ఇక మిగిలింది తెలంగాణ. ఈ రాష్ట్రం విషయంలోనే బీజేపీ ఒకింత ఆందోళనతో ఉంది. అక్కడ పార్టీ బలోపేతమైదన్న సూచనలు ఉన్నా తాజా సర్వేల ప్రకారం అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు దీటుగా, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందన్న విషయం వెల్లడైంది. ఇదే బీజేపీని ఆందోళనకు గురి చేస్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యానికి తెలంగాణ అడ్డుగా నిలుస్తుందన్న భావనతతో ఉన్న కమల నాథులు అందుకే తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. 

కిష‌న్ రెడ్డి.. అబ‌ద్ధాలాడ‌ట‌మైనా నేర్చుకో!

పిల్ల‌లు చాక్లెట్ల కోసం అబ‌ద్దాలాడ‌తారు, సినిమాకి వెళ్ల‌డానికి కుర్రాళ్లు అబ‌ద్దాలాడ‌తారు, మ‌రి కేంద్ర మంత్రి బిజెపి నాయ‌కుడు కిష‌న్ రెడ్డి అబ‌ద్దాలాడ‌ట‌మే యావ‌త్ తెలంగాణాను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అస‌లే తెలంగాణా ప్ర‌జ‌లు భారీవ‌ర్షాలు, వ‌ర‌ద‌ల్లో క‌ష్టాల్లో ప‌డి ఉంటే  కేంద్రం జాతీయ విపత్తు సహాయ నిధులు (ఎన్‌డీఆర్ఎఫ్‌) ఇచ్చిందంటూ  కిష‌న్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ  తెలంగాణా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్డీఆర్‌ఎ్‌ఫకు, ఎస్డీఆర్ ఎఎఫ్‌(రాష్ట్ర విపత్తు సహాయ నిధి)కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నా రని ఎద్దేవా చేశారు. గతంలో హైదరాబాద్‌లో వరదలతోపాటు ప్రస్తుతం నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఇవ్వాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తే కిషన్‌రెడ్డి అబద్ధాలు వల్లె వేస్తున్నారని విమర్శించారు.  ఈనెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో చేసిన ప్రకటనను ఒకసారి చదువుకోవాలని కిషన్‌రెడ్డికి హితవు పలికారు. రాజ్యాంగంలోని 280వ అధికరణ ప్రకారం ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా రాష్ట్రాలకు ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులను కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంటుందన్న విషయా న్ని కిషన్‌రెడ్డి అర్థం చేసుకోవాలి. 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎన్డీ ఆర్‌ఎఫ్‌ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదంటూ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ చేసిన ప్రకటన తప్పా? లేక.. కిషన్‌ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తప్పా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తన సహచర మంత్రి పార్లమెంట్‌ సాక్షిగా చేసిన ప్రకటనను కిషన్‌రెడ్డి ఓ సారి పూర్తిగా చదవాలని, ఆ తర్వాతే సమాధానం చెప్పాలని సూచించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చే ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులను అడిగే దైర్యం లేకనే కిషన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. సొంత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అంబాండాలు వేసిన కిషన్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తుఫాన్‌ వల్ల గుజరాత్‌లో 2021లో వరదలు వస్తే.. ప్రధాని మోదీ ఆగమేఘాల మీద సర్వే నిర్వహించి ఎన్డీఆర్‌ఎఫ్‌ ద్వారా వెయ్యి కోట్ల అదనపు సహాయాన్ని అడ్వాన్స్‌ రూపంలో విడుదల చేశారని కేటీఆర్‌ గుర్తుచేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోఉన్న బిహార్‌కు రూ.3,250 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.4,530 కోట్లు, కర్ణాటకకు రూ.6,490 కోట్లు, గుజరాత్‌కు వెయ్యి కోట్లు కలిపి.. ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద మొత్తం రూ.15,270  కోట్లిచ్చిన కేంద్రానికి.. తెలంగాణకు నిధులు ఇచ్చేం దుకు ఎందుకు చేతులు రావడం లేదని కేటీఆర్‌ నిలదీశారు. అయా రాష్ట్రాల మాదిరిగానే మన రాష్ట్రానికి కూడా ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద ఇచ్చిన అదనపు నిధులెన్నో దమ్ముంటే కిషన్‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

కేశినేనీ.. నీ రూటు ఏ గూటికి?

విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని సొంత పార్టీ  తెలుగుదేశంపైన  కొంతకాలంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మరోసారి టీడీపీపై తన ట్విట్టర్ పేజీలో సంచలన వ్యాఖ్యలు పోస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో నాని మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారమే లేపాయి. తాజాగా సోషల్ మీడియాలో కూడా సొంత పార్టీ నేతలపై కేశినేని నాని నిప్పులు చెరుగుతూ పోస్టులు పెట్టారు.  వారి తీరు చూస్తుంటే తనకు ‘యదార్థవాది.. లోక విరోధి’ సామెతను గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. తనను కొన్ని రోజులు  బీజేపీలోకి.. మరి కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. చెప్పింది అర్థం చేసుకుని.. పార్టీని పటిష్ట పరుచుకుని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది’ అంటూ పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. కేశినేని నాని టీడీపీకి దూరమయ్యే క్రమంలోనే ఇలాంటి పోస్టులు పెడుతున్నారనే విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కేశినేని నానికి విజయవాడ టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, మరో నేత నాగుల్ మీరాతో  తీవ్ర విభేదాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. కేశినేని నాని తన బస్సుల వ్యాపారం విషయంలో అప్పటి రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ఫైర్ అయ్యారు. అనంతరం నాని తన బస్సుల వ్యాపారం వదిలిపెట్టారు . కేశినేని నాటి 2019లో మరోసారి ఎంపీగా గెలిచిన తర్వాతే విజయవాడ నగర టీడీపీలో ముసలం మొదలైందంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ విభేదాలు మరింతగా ముదిరిపోయాయంటున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే విషయంలో బుద్దా, నాగుల్ మీరా- కేశినేని నాని మధ్య వివాదం రేగింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేత పేరు ప్రచారంలోకి వచ్చింది. అందుకు బుద్దా, నాగుల్ మీరా వర్గాలు ససేమిరా అన్నాయి. దీంతో కేశినేనికి వారిపై ఆగ్రహం వచ్చిందని చెబుతారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేశినేని నాని గతంలోనే ప్రకటించారు. నాని సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న తీరుతో.. పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం వైపు టీడీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో నాని సోదరుడు కేశినేని చిన్నికి వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా నిలబెడుతుందని అంటున్నారు. ఆ అక్కసుతోనే నాని తన సోదరుడిపైన పోలీసులకు, లోక్ సభ కార్యదర్శికి ఫిర్యాదు చేశారంటున్నారు. తన ఎంపీ స్టిక్కరును కారుకు అంటించుకుని ఒక అజ్ఞాత వ్యక్తి తిరుగుతున్నాడంటూ కేశినేని నాని పోలీసులకు, లోక్ సభ కార్యదర్శికి కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు.. నాని సొంత తమ్ముడు కేశినేని చిన్ని. టీడీపీ వ్యవహారాల్లో చిన్ని చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ పార్టీకి దూరం జరిగే యత్నాల్లో నాని ఉన్నారని, అందుకే చిన్నిపైన, ఆయన సతీమణి పైన ఫిర్యాదులు చేశారంటున్నారు. నిజానికి కేశినేని నానికి బీజేపీ ముఖ్య నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన వైసీపీ నాయకులతో చనువుగా ఉంటున్నారట. ఈ ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతోంది. ఈ క్రమంలోనే నాని పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే.. ఆయనకు ఢిల్లీ పెద్దల భరోసా ఏమైనా ఉందా? లేక ఫ్యాన్ పార్టీ ప్రోద్బలం ఉందా? అనే సందేహాలు పలువురిలో వస్తున్నాయి. కేశినేని నాని ఇలా ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనే అంశంపై టీడీపీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. నాని ఇంతలా బరితెగించి మాట్లాడడం వెనుక ఎవరి హస్తం ఉంది? వైసీపీ నేతల ప్రోద్బలం ఉందా? లేక కమలం పార్టీ వెన్నుదన్ను ఏదైనా నానికి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడప్పుడూ టీడీపీ నేతలు పరోక్షంగా చెబుతున్నట్లు కేశినేని నాని వైసీపీలో చేరతారా? లేదా భారతీయ జనతాపార్టీ తీర్థం తీసుకుంటారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి.

ఐటీ ర్యాంకింగ్ ల్లో అధ:పాతాళానికి

ఒకప్పుడు ఐటీ అంటే ఏపీ నంబర్ వన్ అనుకునేది ప్రపంచం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు హయాంలో ఐటీ పరుగులు తీసింది. బెంగళూరు చెన్నైలను మించి ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేయడం కోసం ఐటీ పరిశ్రమలు పోటీలు పడేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో బెంగళూరు దిగదుడుపే అన్నట్లుగా ఏపీ పరిస్థితి ఉండేది. ఐటీ ర్యాంకింగ్స్ లో ఏపీ మేటిగా ఉండేది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఐటీ విషయంలో ఏపీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ లో దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు వేసిన పునాదిని అలంబనగా చేసుకున్న తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. స్టార్టప్స్  ఎకోసిస్టం విషయంలో తాజా ర్యాంగింక్సలో ఏపీ పరిస్థితి ఇది. ఇదొక్కటే కాదు.. ఏ రంగం తీసుకున్నా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పైపైకి వెడుతుంటే.. ఏపీ మాత్రం కిందకి దిగజారిపోతోంది. తాజాగా విడుదల చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కూడా   గతంలో ఉన్న మెరుగైన స్థానాన్ని ఏపీ కోల్పోయింది. సృజనాత్మకత, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, హ్యూమన్ ఇండెక్స్  ఆంశాల ఆధారంగా ఎంపిక చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.  అన్ని రంగాల  సగటును పరిగణనలోకి తీసుకుంటే ఉత్తమ పనితీరు కనబర్చి  ‘బెస్ట్ పర్‌ఫార్మర్ స్టేట్’గా తెలంగాణకు మొదటి స్థానంలో నిలిస్తే.. ఆంధ్రప్రదేశ్  ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.  గత ఏడాది నాలుగో స్థానంలో ఉన్న ఏపీ మూడు స్థానాలు దిగజారిపోయింది.   పలు అంశాలపై నీతి ఆయోగ్, కాంపెటెటివ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తగా 2021 సంవత్సరానికి చేసిన అధ్యయనంలో  ఈ వివరాలు వెల్లడించింది

ఓర్నాయ‌నో ఇదేం స‌ర‌దా..!

మ‌మ్ముమ్ముద్దంటే చేదా.. అంటూ పాత సినిమాలో నాగేశ్వ‌ర్రావు ఓ పిల్ల‌ని అడిగిన ప్ర‌శ్న‌తో అప్ప‌టి మ‌హి ళా లోకం అమాంతం ఆగ్ర‌హించింది. త‌మ న‌వ‌లా కథా నాయ‌కుడు ఇలాంటి వేషాలేయ‌డ మేమి ట‌ని. ఆ త‌ర్వాత చిరు ఏకంగా ముద్దులే పెట్టేయ‌డం కుర్రాళ్ల‌ని వీలైనంత రెచ్చ‌గొట్ట‌డం సాధార‌ణ‌మైంది. వెర‌సి ముద్దు అనేది అదేమంత ప్ర‌మాద‌క‌రం, అస‌హ్యించుకుని త‌ల‌తిప్పేసుకునే విష‌యం కాద‌ని ఇప్ప‌టి యువ‌త ప్ర‌క‌ట‌న‌. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ క‌ర్ణాట‌క మంగ‌ళూరులో ఒక క‌ళాశాల విద్యార్ధుల వీడియో హ‌డావుడి.  కాస్తంత మ‌ర్యాద‌స్తుల్లానే ఉన్నార‌ని ఒక అపార్ట్‌మెంట్ వారు కాలేజీ పిల్ల‌ల్ని అనుమ‌తించారు. కానీ వారి స‌ర‌దాలు, ఆట‌ల మ‌ధ్య‌లో ఏకంగా లిప్‌లాకింగ్ పోటీలు పెట్టుకోవ‌డం సీరియ‌స్ విష‌య‌మైంది. కుర్రాళ్ల‌కి, అమ్మాయిల‌కి బ‌హు స‌ర‌దా స‌మాచార‌మే కావ‌చ్చు. కానీ దాని ప‌ర్య‌వసానం ఆలోచించారా?    తెలుసునా అన్న‌దే అనుమానం. ఎందుకంటే ఆ పిల్ల‌ల త‌ల్లిదండ్రులు దీన్ని గురించి పోలీసుల‌కీ ఫిర్యాదు చేయ లేద‌ట‌! కాలేజీ పిల్ల‌లు గాఢ‌ప‌రిష్వంగంలో ముద్దు మాయ‌లో ప‌డిపోయారు. చుట్టూ కొంద‌రు చేరి కేక‌లు వేస్తూ, ఈల‌లు వేస్తూ గోల చేస్తున్నారు. వారిలో ఒక‌డు ఇంత‌కంటే గొప్ప చిత్రం ఉండ‌ద‌నుకున్నాడు. అంతే ఆ సీన్‌ని వీడియో తీసి జ‌నాల్లోకి వ‌దిలేడు. అది వైర‌ల్ అయి ఆ ముద్దుల జంట లోక‌ప్ర‌సిద్ధ‌మైంది.  అది ముద్దుల పోటీ  అని పోలీసులు తెలప‌డ‌మే చిత్రం. అయినా యువ‌త ఈ విధంగా వికృతంగా ఆనందం చేసుకోవ‌డం నేరం కాకుండా పోతుందా?  ఈ వీడియో తీసిన యువకుడిని  అదుపులోకి  తీసుకున్న పోలీ సులు  ప్రశ్నిస్తున్నారు.  అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని, ఆరు నెలల క్రితం నాటిదని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశి కుమార్ తెలిపారు. వారంరోజుల క్రితం ఈ వీడియోను యువకుడు వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం వారిని హెచ్చ రించి కాలేజీ నుంచి తొలగించింది.   అయితే, ఈ ముద్దుల కాంపిటిషన్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, కాలేజీ యాజమాన్యం  కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్ తెలిపారు. కిస్సింగ్ కాంపిటిషన్ సందర్భంగా విద్యార్థులు ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జ‌గ‌న్... వీళ్లా మీ నాయ‌కులు..!

ఏమండి బాగున్నారా? .. చ‌దువుకున్న‌వారు, మ‌ర్యాద తెలిసిన‌వారి సాధార‌ణ ప‌ల‌క‌రింపు.  అంకుల్ పింకీ ఉందా.. ఏడో త‌ర‌గ‌తి పిల్లాడు అడిగే తీరు, ఆంటీ సుజీ కాలేజీకి వ‌స్తుందా.. ఇంట‌ర్ విద్యార్ధిని  అడిగే ప్ర‌శ్న‌.. మాన‌వ స‌మాజంలో కాస్తంత స్పృహ ఉన్న‌వారంతా ఇలానే ప్ర‌శ్నిస్తారు, ప‌ల‌క‌రిస్తారు. కానీ అస‌లు మాన‌వ స‌మాజంలో లేన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ, ఇత‌రుల‌ను దారుణంగా తిట్ల పురాణంతో అసభ్యంగా మాట్లా డేవారినీ ఇప్పుడు చూడాల్సి వ‌స్తోంది, వినాల్సివ‌స్తోంది. చిత్ర‌మేమంటే అలాంటివారిని రాజ‌కీ యా ల్లోకి  కండువా క‌ప్పి మ‌రీ ఆహ్వానించి ప్రోత్సహించడం జ‌రుగుతోంది. అందుకు వైసీపీ పార్టీ యే ఉదాహరణ. మ‌నిషి అన్న వాడు ఎవ్వ‌రూ బొత్తిగా విన‌కూడ‌ని, అస్స‌లు అంగీక‌రించ‌ని ప‌ద‌ జాలంతో ప్రత్యర్థి పార్టీ  నేతల మీద విరుచుకుప‌డే వారిని ఏరి కోరి పార్టీలోకి తీసుకుంటున్న ఘ‌న‌త జగన్ సారథ్యంలోని వైసీపీకే ద‌క్కుతుంది.   నోటి దూల ఎక్కువ ఉన్నవారంతా  ఆ పార్టీ వారిలో ఉన్నారా అనిపించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వారినా ప్ర‌జా నాయ కులుగా చ‌లామ‌ణీ అయ్యేందుకు అవ‌కాశం ఇస్తున్నామ‌న్న భ‌యాందోళ‌న‌లు ప్ర‌జ‌ల‌ వంత‌యింది.  తాజాగా రోజా రాణి అనే వైసీపీ నాయ‌కురాలు తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్య‌క్షురాలు అనిత  మీద విరుచు కు ప‌డ్డారు. ఏకంగా బూతుల పురాణంతో  ప్ర‌సంగమంతా సాగింది. విమ‌ర్శించ‌డానికి, బూతులు తిట్టడానికి  వ్య‌త్యాసం తెలీకుండా, నోటికి వ‌చ్చిన బాషా  చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా స‌ద‌రు వైసీ పీ నాయ‌కురాలు తన తీరును తన సంస్కారాన్ని జనం ముందు బయటపెట్టుకున్నారు.    ఏక‌వ‌చ‌నంతో సంబోధించడం,  బూతుల‌తో రెచ్చిపోవడమే మీడియా సమావేశం సాక్షిగా  ప్ర‌సంగం అంతా సాగింది. విప‌క్షాల మీద దూకుడుగా విమ‌ర్శ‌లు చేయాలంటే ఇంత దారుణ‌మైన‌, ద‌రిద్ర‌మైన భాష‌ను  ఉప‌యో గించాల‌ని ఆమెకు ఎవ‌రు స్క్రిప్ట్ రాసిచ్చారోగాని వారికి క‌నీసం మ‌నిషి ల‌క్ష‌ణాలు ఉంట‌య‌న‌డం క‌ష్టం.  త‌మ నాయ‌కుల మీద‌, వారి ప‌రిపాల‌నా చాతుర్యం మీదా అపార భ‌క్తి ఉండ‌వ‌చ్చు. అలాగ‌ని విప‌క్షాల‌ను అప‌హాస్యం చేయ‌డానికి, వారి ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డానికి ఒక ప‌ద్ధ‌తి పాడూ ఉండాల‌న్న ఇంగిత జ్ఞానం లేని మ‌నుషుల‌ను నాయ‌కులుగా త‌యారుచేయ‌డంలో వైసీపీ దే  సిద్ధ హ‌స్తం అనాలేమో. రాజ‌కీ యాలు, ప‌థ‌కాలు లేదా మ‌రో అంశాల గురించి  విప‌క్షాల విమ‌ర్శ‌ల మీద త‌మ అభిప్రాయాలు, లేదా ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఒక ప‌ద్ధ‌తి అంటూ ఉంటుంది. అది రాజ‌కీయాలు తెలిసిన‌వారికి,  ఇత‌రుల‌ను గౌర‌వించాల‌న్న జ్ఞానం ఉన్న‌వారికే తెలుస్తుంది. కానీ తాజాగా వైసీపీలో మ‌రో అజ్ఞాని, తిట్ల పురాణంలో ఆరితేరిన ఒక మ‌హా నాయ‌కురాలిని చూడాల్సి వ‌స్తోంది. మొన్న‌టి దాకా అనీల్ కుమార్ యాద‌వ్‌, కొడాలి నాని భాషా చాతుర్యం విని   సిగ్గుతో, అసహ్యంతో  టీవీలు క‌ట్టేసిన జ‌నం ఇపుడు రోజా రాణి అనే   వైసీపీ నాయ‌కురాలి భాష వింటే  రాష్ట్రంలో మ‌హిళ‌లు టీవీలు ప‌గ‌ల‌గొట్టేస్తారేమో. అసలు ఇలాంటి వారికి పార్టీ కండువా కప్పి, పార్టీ ఆఫీస్ లో ప్రెస్‌మీట్ పెట్టంచిన పార్టీ జనానికి ఏ సంకేతాలిస్తోంది.  సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీనికాని, ప్రభుత్వాన్ని కానీ, ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శించినా నోటీసులు, కేసులు అంటూ హడావుడి చేసే పోలీసు వ్యవస్థకు  ఇలా వ్యక్తిగత  విమర్శలు, అసభ్య పదజాలంతో కించపరుస్తూ వ్యక్తిత్వ హననం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనే చేవ ఉందా ?   అస‌లు ఇలాంటి నాయ‌కుల‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటున్నార‌న్న‌దే రాజ‌కీయ ప‌రిశీల‌కుల ప్ర‌శ్న‌. దీనికి స‌ద‌రు పార్టీ అధినేత జగన్ స‌మాధానం చెప్పాలి.  సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి ప‌రిస్థితికి రాజ‌కీయాల‌ను తీసికెళుతున్న‌వారికి ప్ర‌జ‌ల హృద‌యాల్లో స్థానం ఎలా ఉంటుంది?    

కాళేశ్వరంకు జాతీయ హోదా అర్హత లేదు.. తేల్చేసిన కేంద్రం

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల్లోని డొల్ల తనం ఇటీవలి వరదలు బయట పెట్టేశాయి. కాళేశ్వరం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నానా తంటాలూ పడుతూ పోలవరం ప్రాజెక్టు ను తెరపైకి తీసుకువచ్చి సెంటిమెంట్ తో కొడదామన్న కేసీఆర్ ప్రయత్నాలకు అనుకోని విధంగా ఎదురు దెబ్బ తగిలింది. లోక్ సభ సాక్షిగా కేంద్రం కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గాలిని పూర్తిగా తీసేసింది. లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకుకేంద్ర జలశక్తి శాఖ మంత్రి తుడు ఇచ్చిన జవాబుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రశక్తే లేదని తేటతెల్లమైపోయింది. ఆయన ఇచ్చిన జవాబుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపుగా ఏ అనుమతులూ లేవనీ తేలిపోయింది. కేవలం రీ డిజైనింగ్ తో ప్రాజెక్టు నిర్మించేశారనీ, ఆ ప్రాజెక్టు పెట్టుబడులకు కేంద్రం నుంచి క్లియరెన్స్ లేదనీ మంత్రి పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఒక విధంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అని తేల్చేశారని చెప్పవచ్చు. ఇంత కాలంగా రాష్ట్రంలో విపక్షాలు అటువంటి విమర్శలే చేస్తున్నారు. కేంద్ర మంత్రి లోక్ సభ సాక్షిగా ఇచ్చిన లిఖిత పూర్వక హామీతో కాళేశ్వరంకు జాతీయ హోదా అన్నది అసలు పరిగణనలోనే లేదని తేటతెల్లమైపోయింది. మామూలు పరిస్థితుల్లో అయితే తెరాస కేంద్ర మంత్రి సమాధానంపై మిన్నూ మన్నూ ఏకమయ్యేలా తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం అంటూ విమర్శల నిప్పులు చెరిగేసేది.. కానీ ఇప్పుడు తెరాస డిఫెన్స్ లో ఉంది. కేంద్ర మంత్రి లేఖను అవకాశంగా తీసుకుని కేంద్రంపై విమర్శలతో చెలరేగడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉంది. ఇటీవలి వరదలకు కాళేశ్వరం ముంపునకు గురి కావడమే కాకుండా పంప్ హౌస్ లు, మోటార్లు నీట మునిగి పనికి రాకుండా పోయాయి. అవి ఎప్పటికి పునరుద్ధరింబడతాయో  తెలియదు. అసలు అవి మళ్లీ పని చేస్తాయా అన్న ప్రశ్నకు ఇరిగేషన్ అధికారులే సరైన సమాధానం ఇవ్వలేక నీళ్లు నములుతున్నారు. వాటికి మరమ్మతులు చేయడం అయ్యే పని కాదని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. వాటికి మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుందని మరి కొందరు అంటున్నారు. నీటి పారుదల శాఖ అధికారులైతే మరో ఆరు నెలల వరకూ   కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మర్చిపోవడమే మంచిదన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో సరైన అనుమతులు లేకుండానే, రీడిజైనింగ్ అంటూ కాళేశ్వరంనిర్మించేశారనీ, దానికి జాతీయ హోదా ఇచ్చే అవకాశమే లేదనీ కేంద్రం స్పష్టం చేసేసింది. దీంతో ఇప్పటి వరకూ పోలవరంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ కు కేంద్రం మరింత పదునైన అస్త్రం అందించినట్లైంది.  కాళేశ్వరం ప్రాజెక్టుకు   జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్‌ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాశారని  చెప్పారని, అయితే  ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఆ అనుమతులు   ఉంటే కాళేశ్వరాన్ని హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ పరిశీలించాలని, హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే  అవకాశం ఉంటుందని  కేంద్రమంత్రి పేర్కొన్నారు. కానీ ఇవేమీ లేకుండా కేసీఆర్ రీ డిజైనింగ్ చేసి ప్రాజెక్ట్ నిర్మించారని ఆయన చెప్పకనే చెప్పారు. ఇంకా చెప్పాలంటే నేరుగా అనకుండానే  కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టని తేల్చేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు తెరాసపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెరాసపై విమర్శల దాడిని మరింత పెంచుతారనడంలో సందేహం లేదు.

విక్రమ సింఘే కూడా గొటబాయలాగే..!

శ్రీలంక సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతోందా? ఆ దేశంలో రాజకీయ శూన్యం నెలకొని ఉందా? ప్రజాకాంక్ష ఏమిటన్నది ఆ దేశ నేతలకు తెలియడం లేదా? అర్ధం కావడం లేదా? అసలు విఫల నేత, అసమర్థ నేతగా ప్రజల దృష్టిలో పలుచన అయిన విక్రమ సంఘే వినా మరో నేతే అధ్యక్షపదవికి దొరకపోవడం ఏమిటి? అందుకే ఆ దేశంలో నిరసనలు చల్లారడం లేదు.   ఎమర్జెన్సీని సైతం  లెక్క చేయడం లేదు. దేశాధ్యక్షుడిగా విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన గంటలలోనే ఆ దేశంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దేశ ప్రధానిగా  రాజీనామా చేసిన సమయంలో విక్రమ సింఘే ఎంత బేలగా మాట్లాడారో.. మళ్లీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి అధికార పగ్గాలు అందుకున్నాక ఆయన స్వరంలో వాడి పెరిగింది. ప్రజలను బెదరించడానికి, హెచ్చరించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన మాటలకు అనుగుణంగానే.. ఆయన దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఆ దేశ భద్రతా బలగాలు జనంపై విరుచుకుపడ్డాయి. నిరసన కారులు అధ్యక్ష భవనం వద్ద నిరసన కారులు ఏర్పాటు చేసిన టెంటులను తొలగించాయి. నిరసన కారులపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. పలువురు నిరసన కారులు గాయపడ్డారు.  క్షతగాత్రులలో మీడియా ప్రతినిథులు కూడా ఉన్నారు. దీంతో మళ్లీ దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి యుతంగా నిరసన చేస్తున్న వారిపై పాశవికంగా దాడి చేయడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశం విడిచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ లానే తాజా అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘె కూడా అణచివేతతో అధికారాన్ని చెలాయించాలని ప్రయత్నిస్తున్నారని జనం దుమ్మెత్తి పోత్తున్నారు. అణచివేతకు, నిర్బంధానికి తలొగ్గేదే లే అంటు లంక జనం కదం తొక్కుతున్నారు. కొత్త అధ్యక్షుడు విక్రమ సింఘేను తాము ఆమోదించలేమనీ, ఆయన రాజీనామా చేసే వరకూ వెనకడుగు వేసే ప్రశక్తే లేదని నిరసనకారులు స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ గూటికి తెరాస కారు ?.. రేవంత్’కు ఏది దారి ..

అనుకున్నదే జరిగింది ... కాంగ్రెస్, తెరాస పెళ్లి పీటలు ఎక్కేశాయి.. ఇక మూడు ముళ్ళు పడడం మాత్రమే మిగిలింది. నిజానికి, ఇలాంటి పరిణయ ఘడియలు ఆనివార్యమనే విషయాన్ని తెలుగు వన్ ఎప్పటి నుంచో చెపుతూనే వుంది. అయితే, ఇంత వరకూ అసెంబ్లీ ఎన్నికలకు ముందా, తర్వాత అనే విషయంలోనే కొంత సందిగ్దత మిగిలుంది. ఇక ఇప్పుడు ఆ కాస్త సందేహం కూడా తీరిపోయింది. అవును పెళ్ళితో సంబంధం లేకుండా వాళ్ళిద్దరూ.. ఒకటయ్యారు. సహజీవనానికి  సిద్ధమయ్యారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబందించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం (జూన్ 21)  విచారణ జరిపింది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ, కాంగ్రెస్  పార్టీ చేస్తున్న ఆందోళనకు అనూహ్యంగా, తెరాస మద్దతు తెలిపింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్  గా మారింది. కాంగ్రెస్, తెరాస ఒక్కటైన నేపధ్యంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి, ఏ మలుపు తిరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. వివరాలలోకి వెళితే ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలకు పిలుపు నిచ్చింది. కాంగ్రెస్ పిలుపు ఇచ్చిందే. తడవుగా, తెరాస నాయకులు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ పంచన వాలిపోయారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు సహకరించాలని కోరుతూ విపక్షాలకు విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ పార్టమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్ సభలో తెరాస పక్ష నేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అవును, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే, ఆ పార్టీలన్నీ మొదటి నుంచి కాంగ్రెస్ పక్షానే ఉన్నాయి. కాంగ్రెస్ తో కలిసే ఉన్నాయి. కొత్తగా పీటలెక్కింది, తెరాస ఒక్కటే. అంతే కాదు, ఈ సందర్భంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనపై తెరాస టీఆర్ఎస్ తరఫున కే కేశవరావు సంతకం చేశారు. నిజానికి ఇది ఒక్కసారి వచ్చిన మార్పు కాదు. కాంగ్రెస్ పార్టీ పంచన చేరేందుకు తెరాస  చాలా కాలంగా పావులు కదుపుతూనే వుంది. ఒకప్పుడు ఛీ. ఛీ అన్న హస్తం చేయి అందుకునేందుకు, అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలోనూ తెరాస కన్ను గీటుతూనే  ఉంది. అస్సాం ముఖ్యమంత్రి  సోనియా గాంధీని ఏదో అన్నారని, కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసినప్పుడే  కేసీఆర్ కాంగ్రెస్ కోరస్ ట్రూప్ లో చేరారు. అలాగే ఇంకేదో సందర్భంలో రాహుల్ గాంధీకి కేసీఆర్ జై కొట్టారు. ఇక అక్కడి నుంచి, అవకాశం చిక్కిన ప్రతిసందర్భంలోనూ హస్తానికి దగ్గరగా జరుగుతూనే ఉన్నారు. రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికలను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ కు చేరువయ్యేందుకు, ఢిల్లీలో కేటీఆర్, హైదరాబాద్ లో కేసీఆర్ ఎన్నెన్ని విన్యాసాలు చేశారో, అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు, జాతీయ రాజకీయాల ముసుగులో కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష కూటమిలో తెరాస అధికారికంగా చేరింది.  సో . సహజంగానే రాష్ట్ర రాజకీయాలపై,  రాజకీయ సమీకరణాలపై ఇది ప్రభావం ప్రభావం చూపుతుంది. నిజానికి, కాంగ్రెస్, తెరాస చేతులు కలపడం కాంగ్రెస్ సీనియర్లు చాలా వరకు స్వాగతిస్తున్నారని అంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చేదుకు ఏ బొంత పురుగును అయినా ముద్దాడేందుకు, డిసైడ్ అయిపోయిన తెరాస నాయత్వం కూడా ఎంత సుముఖంగా, ఎంతలా తహతహ లాడుతోందో వేరే చెప్పనక్కరలేదు. అయితే, ఎటొచ్చి  ఏదో ఆశించి తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్  పై ఒంటికాలుపై లేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అయితే కాంగ్రెస్ ఆదిస్థానం తెరాసతో పొత్తు/ చెలిమి / లోపాయి కారి అండర్స్టాండింగ్ దేనికి ఒకే అన్నా, రేవంత్ రెడ్డి కూడా చేయగలిగింది ఏమీ ఉండదని  పార్టీ పెద్దలు అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ దూకుడుకు బ్రేకులు వేసినా ఆశ్చర్య పోనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, చివరకు ఏమవుతుంది?

ఆదివాసీల‌ను ప‌ట్టించుకోరా.. షర్మిల‌

మ‌నుషుల్లో మాన‌వ‌త్వం న‌శించింది. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల జ‌నాలు త‌ప్ప ఆదివాసీల‌ను ప‌ట్టించుకోని నాయకులు త‌యార‌య్యారు. ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా ఆదివాసీల విష‌యానికి వ‌చ్చేస‌రికి  నీర‌స ప‌డుతుండ‌డం ఎప్ప‌టినుంచో జ‌రుగుతోంది. మంచిర్చాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం కోయ‌పోచ‌గూడ ఆదివాసీల‌కు తాత్కాలిక నివాసాల‌ను ఈ నెల ఎనిమిదో తేదీన అట‌వీ ఆధికారులు తొల‌గించి మ‌హిళ‌ల‌ను ఏడ్చుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇంత క్రూరంగా ఎలా ప్ర‌వ‌ర్తించార‌ని ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించిన వై ఎ స్సా ర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.  దండేపల్లి మండలం కోయపోచగూడ ఆదివాసీ మహిళలను ఆమె పరామర్శించారు. ఆదివాసీల సమస్య లను తెలుసుకున్నారు. భూముల కోసం 52 కుటుంబాలు పోరాడుతున్నాయని, ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు.  కేసీఆర్‌ పాలనలో ఆడవారికి కనీస రక్షణ కూడా లేదని ఆవే దన చెం దారు. పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీ మహిళలను బట్టలూడదీసి కొడతారా? ఇంత‌కంటే నీచ సంస్కృతి ఏమ‌న్నా ఉంటుందా అని ఆమె ప్ర‌శ్నించార పోడు భూముల్లో పట్టాల కోసం ఆదివాసీల తరపున పోరాడతానని చెప్పారు. అనంతరం  ఆమె మంచి ర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలో వర్షాల కారణంగా ఇల్లు మునిగి, ఆస్తినష్టం జరగడంతో ఆత్మహత్య చేసుకున్న సిద్ద జమున కుటుంబాన్ని పరామ ర్శించారు. నీట మునిగిన కాలనీల్లో పర్యటిం చారు. కేసీఆర్‌ వైఫల్యం వల్లనే వరదలు ముంచెత్తా యని విమర్శించారు.   ముంపు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు సరిపోవని, కనీసం రూ.25 వేల చొప్పున చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున వైఎస్సార్ టీపీ తరపున అందజేస్తామని హామీ ఇచ్చారు.   బాధితులకు సాయమేదీ? వరద బాధితులను ఆదుకోవటం లో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో  వరద తాకిడికి గురైన ఇందిరమ్మ కాలనీని సందర్శిం చారు. బాధితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు.