అంగారక గ్రహం  భవిష్యత్తును భూమి  తప్పించుకుంది

దాదాపు 1,800 మైళ్ల భూగర్భంలో, భూమి తాలూకు బాహ్య కోర్లో ద్రవ ఇనుము కదులుతుంది, ఇది మన గ్రహాన్ని రక్షించే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇది కనిపించనప్పటికీ, సూర్యుడి నుండి వచ్చే సౌరగాలులు, ఇతర హానికరమైన రేడి యేషన్ నుండి మనల్ని రక్షిస్తుంది కాబట్టి గ్రహం మీద జీవం ఉనికికి ఇది చాలా ముఖ్యమైనది. సుమారు 565 మిలియన్ సంవత్సరాల క్రితం, ఈ  అయస్కాంత క్షేత్ర శక్తి నేడు దాని శక్తిలో ప‌దో శాతానికి పడిపోయింది. ఏది ఏమైనప్పటికీ, భూమిపై బహుళ సెల్యులార్ జీవితం కేంబ్రియన్ పేలుడుకు ముందు అది మళ్లీ ఎగిసింది. ఈ ఫీల్డ్ రీబూట్ చేయడానికి కారణం ఏమిటో శాస్త్రవేత్తలకు నిజంగా తెలియదు. అయితే, రోచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన స‌రికొత్త‌ అధ్యయ నంలో ఈ రీబూట్ కేవలం పది లక్షల సంవత్సరాలలో జరిగిందని  భూమి ఘన అంతర్గత కోర్  ఏర్పడిన సమయం లోనే సంభవించిందని వెల్లడించింది, దీని వెనుక కారణం దీని కోర్ ప్రధానమైనది కావచ్చు. అధ్యయనం అంతర్గత కోర్ గతంలోని వివిధ కీలక తేదీలను చూపిస్తుంది, దాని వయస్సు మరింత ఖచ్చి తమైన అంచనాతో సహా. ఈ అధ్యయనం మన గ్రహం చరిత్ర, భ‌విష్యత్తు పరిణామం క్లూలను అందిం చింది. ఈ బంజరు గెలాక్సీలో ఈ రోజు మన నివాసంగా మనకు తెలి సిన ఈ ఆవాసంగా ఎలా మారింది. రాక్ అనోర్థోసైట్ నుండి ఫెల్డ్‌స్పార్ స్ఫటికాలను విశ్లేషించడానికి పరిశోధకులు సీఓ2 లేజర్ ప్రయోగశాల సూపర్ కండక్టింగ్ క్వాంటమ్‌ ఇంటర్‌ఫరెన్స్ పరికరం మాగ్నెటోమీటర్‌ను ఉపయోగించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ స్ఫటి కాలలో చిన్న అయస్కాంత సూదులు ఉంటాయి, అవి ఖచ్చితమైన అయస్కాంత రికార్డర్లు. పురాతన స్ఫటికాలలో లాక్ చేయ బడిన అయస్కాంతత్వాన్ని పరిశీలిస్తే, పరిశోధకులు అంతర్గత కోర్ చరిత్రలో రెండు ముఖ్య మైన తేదీలను కనుగొన్నారు. సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితం, అయస్కాంత క్షేత్రం దాదాపు 15 మిలియన్ సంవత్సరాల ముందు పతనం తర్వాత చాలా త్వరగా పునరుద్ధరించడం ప్రారంభించింది. కరిగిన బాహ్య కోర్ని రీబూట్ చేసి, అయస్కాంత క్షేత్ర బలాన్ని పునరుద్ధ రించే ఘన అంతర్గత కోర్ ఏర్పడటానికి పరిశోధకులు ఈ వేగ వంతమైన మార్పును ఆపాదించారు. మేము అంతర్గత కోర్ వయస్సును మరింత ఖచ్చితంగా నిర్బంధించి నందున, ప్రస్తుత అంతర్గత కోర్ వాస్తవానికి రెండు భాగాలతో కూడి ఉందనే వాస్తవాన్ని మేము అన్వేషించగలమని. భూమి ఉపరితలంపై ప్లేట్ టెక్టోనిక్ కదలికలు పరోక్షంగా లోపలి కోర్ని ప్రభావితం చేశా య‌నీ పరిశో ధకులు వివరించారు.  అంగారక గ్రహానికి ఒకప్పుడు అయస్కాంత క్షేత్రం ఉందని పరిశోధకులు కూడా విశ్వసిస్తున్నారు, అయిన ప్పటికీ, క్షేత్రం క్షీణిం చింది, సౌర గాలికి ,  సముద్రాలు లేకుండా ఉపరితలానికి హాని కలిగిస్తుంది. అయస్కాంత క్షేత్రం లేకపోవటం వలన భూమిని అంగారక గ్రహంగా మార్చవచ్చో లేదో అస్పష్టంగా ఉన్నప్ప టికీ, భూమి ఒక టన్ను నీటిని కోల్పోయే అవకాశం ఉందని, ఫలితంగా గ్రహం చాలా పొడిగా మరింత బంజ రుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అయస్కాంత కవచం చాలా ముఖ్యమై నదనీ,  దానిని కొనసాగించ డానికి యంత్రాంగాలు తప్పనిసరిగా ఉంచబడాలని వారు హైలైట్ చేస్తారు,  ఈ పరిశోధన మొత్తం జీవిత కాలంలో అయస్కాంత క్షేత్రాన్ని కొనసాగించే అంతర్గత కోర్ వంటిదాన్ని కలిగి ఉండవలసిన అవసరాన్ని నిజంగా హైలైట్ చేస్తుంది.

ఇది ముమ్మాటికీ బీజేపీ కుట్రే .. కాంగ్రెస్‌

ఒక‌రిని అవ‌మాన‌ప‌ర్చ‌డానికి పెద్ద‌గా వ్యూహాలేమీ ప‌న్న‌క్క‌ర్లేదు, ఒక‌రి అధికారం దెబ్బ‌తీయ‌డానికి అవ‌స‌రం. ఒక‌రిని అధికార పీఠం నుంచి దించ‌డానికి అనేక కుట్ర‌లు, కుతంత్రాలు చేయ‌వ‌ల‌సివ‌స్తుంది. ఇది ప్ర‌స్తుత రాజ‌కీయ నీతి. ఇదే బీజేపీ అనుస‌రిస్తోంద‌న్న అభిప్రాయాలే దేశ‌మంతా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీయేత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుతంత్రా ల‌తోనే ఆ ప్ర‌భుత్వం ప‌రువు బ‌జారుకీడ్చి ఆన‌క ప‌నికి రాద‌ని గోడ‌మీద రాయించి ఎన్నిక‌లు పెట్టించి అధికారంలోకి రావాల‌న్న చెత్త ఆలోచ‌న బీజేపీవారి సొంత‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు నోట్ల క‌ట్టలతో దొరికిపోయార‌న్న‌ది కూడా అటువంటి కుట్ర‌లో భాగ‌మేన‌ని జార్ఖండ్ కాంగ్రెస్ నాయ‌కులు న‌మ్ముతు న్నారు. కాగా, జార్ఖండ్లోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.  గిరిజనులకు బహుమతులు కొనడానికి వెళ్ళారని ఓ ఎమ్మెల్యేల సోదరుడు చెప్తున్నారు. ఈ మొత్తం సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది.  టీఎంసీఈ ఎమ్మెల్యేలకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత శశి పంజా డిమాండ్ చేశారు. జార్ఖండ్ లోని జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం బేరసారాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతు న్న సమ యంలో ఈ నగదు పట్టుబడిందని టీఎంసీ ఓ ట్వీట్‌లో పేర్కొంది.  పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు జార్ఖండ్ ఎమ్మెల్యేలు - ఇర్ఫాన్ అన్సారీ (జమ్‌‌‌తారా), రాజేశ్ కచ్చప్ (ఖిజ్రి), నామన్ బిక్సల్ కొంగరి ( కొలెబిర) - ప్రయాణిస్తున్న కారులో భారీగా నగదు ఉందని సమాచారం అందింది. వెంట నే అప్రమత్తమైన పోలీసులు హౌరా జిల్లాలోని 16వ నెంబరు  జాతీయ రహదారిపై రాణిహటి వద్ద తనిఖీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున నగదు కనిపించడంతో, ఆ నగదును స్వాధీనం చేసుకుని, ముగ్గుర్నీ అరెస్టు చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంతో  ఆ పార్టీ ఘాటుగా స్పందించింది. జార్ఖండ్‌లోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వా న్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రభుత్వాలను కూల్చేందుకు అస్సాం ప్రధాన కార్యక్షేత్రంగా మారిం దనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 15 రోజులపాటు నాటకీయ పరిణామాల తర్వాత మహారాష్ట్ర  ప్రభుత్వం కూలి పోయిందన్నారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. మహా రాష్ట్రలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శివసేన, ఎన్‌సీపీ నేతలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చివరికి శివసేనలో చీలిక వచ్చి, ఏక్‌నాథ్ షిండే  నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి డబ్బుతో పట్టు బడిన ఎమ్మెల్యేల విషయంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు మాట్లాడటం సమంజసం కాదన్నారు. కానీ దేశంలో పరిస్థితిని చూసి నపుడు, పట్టుబడిన ఈ ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని బాగా వివరించగలరని చెప్పారు. అయితే ఈ సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. తమ పార్టీ అధిష్ఠానానికి ఓ నివేదికను సమర్పిస్తామని చెప్పారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్ట బోమని తెలిపారు. జార్ఖండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కే మీడియాతో మాట్లాడుతూ, తమది కాని ప్రభుత్వాన్ని అస్థిర పరచడం బీజేపీ స్వభావమని ఆరోపించారు. అదే ప్రయత్నం ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా జరుగు తోందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికే ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చిందన్నారు.  గిరిజనులకు బహుమతు లిచ్చేందుకే ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ సోదరుడు ఇమ్రాన్ మాట్లాడుతూ, తన సోదరుడిని అక్రమంగా ఇరికించేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి సంవత్సరం గిరిజనులకు బహుమతులు ఇస్తూ ఉంటా మని, అదే విధంగా ఈ సంవత్సరం కూడా కోల్‌కతా బడా బజార్‌కు వెళ్ళారని చెప్పారు. బడా బజార్‌లో చీరలు కొని, గిరిజనులకు పంపిణీ చేయడం తన సోదరునికి అలవాటని చెప్పారు. వీరివద్ద పట్టుబడిన సొమ్ము రూ.కోట్లలో ఏమీ లేదన్నారు. తాను ఉదయం నుంచి వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.

ప్ర‌కృతి ఒడిలో పాఠాలు నేర్పిన త‌ల్లి  

ఏ ఫ‌ర్ ఆపిల్‌, బి ఫ‌ర్ బుక్‌, రెండు రెళ్లు నాలుగు.. ఇదే అనాదిగా త‌ర‌త‌రాలుగా దేశ‌మంతా పాఠ‌శాల‌లు పిల్ల‌ల‌కు విద్యాభ్యాస ఆరంభ ప్ర‌క్రియ‌. ఎన్ని అనుకున్నా, ఎంత చ‌ర్చించినా ఈ విద్యావిధానం మార‌లేదు. మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చాలామంది విజ్ఞ‌లు, విద్యాశాస్త్ర‌వేత్త‌లు, పండితులూ మొత్తుకుంటున్నా ఈ బ్ర‌హ్మ‌సూత్రాన్ని దాటి ఏ గ్రామం కూడా గీత దాట‌డం లేదు. ఇటీ వ‌లి కాలంలో ఈ అత్యాధునిక కాలంలో ర‌వ్వంత మార్పుకి అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఇప్పుడిప్పుడే ప్లే స్కూల్స్ పేరిట  కొత్తద‌ నాన్ని ప్ర‌వేశ‌పెట్టి పిల్ల‌ల్ని, త‌ల్లిదండ్రుల్ని ఉత్సాహ‌ప‌రుస్తున్నాయి కొన్ని కార్పోరేట్ పాఠశాల‌లు.  కానీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కి చెందిన అంకీష్ అనే మ‌హిళ చాలా కొత్త‌గా ఆలోచించింది. త‌న పిల్ల‌వాడికి క్లాస్‌రూమ్, ఆన్ లైన్ క్లాసులు కాకుండా స‌హ‌జ‌సిద్ధ విద్యా విధానాన్ని.. అంటూ పూర్వం రుషుల బోధ‌నా విధానంలోకి ఆలోచ‌న చేసింది.  అంకీష్ కి త‌న ఏడేళ్ల పిల్ల‌వాడు ప్రాంష్ అలా ఆన్ లైన్ క్లాసుల‌తో ఇబ్బంది ప‌డ‌టం బొత్తిగా న‌చ్చ‌లేదు. వాడికి అస‌లు ప్రకృతి చెప్పే పాఠాలు, స‌హ‌జ‌సిద్ధంగా లోకాన్ని తెలుసుకోవ‌డం అంటే పుస్త‌కాల్లో కాకుండా వాస్త‌వంగా చూపాల‌ని, తెలిసేలా చేయాల‌ని సంక‌ల్పించారు. అంతే వెంటే స్కూలు నుంచీ బ‌య‌టికి తీసుకువ‌చ్చేశారు. వాడికి చుట్ట‌ప‌క్క‌ల ప్ర‌దేశాలు చూప‌డం, చెట్లు ఎలా పెరుగుతాయి, ఎండ వేడిమి, గాలి, ప‌క్షుల కిల‌కిలారావం, ఏర్లు పార‌డం, పొంగ‌డం, జంతువుల గురించి అన్నీ స్వ‌యంగా చూపు తూ వాటిని వివ‌రిస్తూ వాడిని పెంచ‌డం మీద ఎంతో దృష్టిపెట్టారామె.  త‌ర‌గ‌తి గ‌దిలో ఉండ‌డం కాకుండా బ‌య‌ట తిర‌గాల‌ని, దేశ‌మంతా తిరిగి అనేక ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తున్నారు, వారి జీవ‌న శైలి గురించి పిల్ల‌డికి  తెలియాల‌ని  ఆ త‌ల్లి భావించింది. బంధువులు, స్నేహితులూ ఇదేం పిచ్చి అన్నారు. కానీ ఆమె చిర్న‌వ్వుతోనే స‌మాధానం చెప్పిందే  కానీ వారితో వాదించ‌లేదు. పైగా 2020లో లాక్‌డౌన్ స‌మ‌యం ఆమెకు బాగా క‌లిసి వ‌చ్చింది. చాలామంది పిల్ల‌లు చ‌దువుకి దూర‌మ‌యినా త‌న పిల్ల‌వాడిని మాత్రం ఈ కొత్త‌మార్గంలోకి న‌డిపింది. క‌రోనా కార‌ణంగా ఆఫీసుకు వెళ్ల‌లేక పిల్లాడిని చూసుకోవాల‌ని ఐటి ఉద్యోగాన్ని ఆమె 2020లో వ‌దిలేశారు.  2021 ఏప్రిల్‌లో పిల్ల‌వాడికి నాలుగేళ్ల  వ‌య‌సులోనే ఆమె త‌న పిల్లాడిలో ప్ర‌కృతి ప‌ట్ల ఆక‌ర్ష‌ణ‌ను గుర్తించారు.   అలా పెద్ద‌వుతున్న కొద్దీ ఆ ఆస‌క్తి కూడా రెండింత‌ల‌యింది.  ప్ర‌యాణాల‌కు వీల‌యిన స‌మ‌యంలో  హిమాచ‌ల్ ప్ర‌దేశ్  లో అనేక ప్రాంతాలు తిప్పార‌ట‌. తండ్రి క్యాంప్‌ల‌కు వెళ్లిన‌పుడు ఆయ‌న కూడా త‌న‌తో పిల్ల‌వాడిని తీసికెళ్లేవార‌ట‌.  అలా  రోడ్డు ప్ర‌యాణ‌మే ఎక్కువ‌గా చేయ‌డంతో అనేక ర‌కాల మ‌ను షులు, వారి తీరుతెన్నులు, వ్య‌వ‌హార‌శైలి, జంతువులు, చెట్లూ చేమా చెరువులు, కాల‌వ‌లు, రాళ్ల గుట్ట‌లు, కొండ‌లు, ప‌ర్వ‌తాల గురించి ఆమె వాడికి చూపించ‌డ‌మే కాకుండా వివ‌రిస్తూ ఎంతో జ్ఞానాన్నిపంచింది. అలా అన్నింటిని చూసి తెలుసుకోవ‌డంతో ఆ పిల్ల‌వాడు ఇప్పుడు అన్నీ ఎంతో బాగా గుర్తు పెట్టుకు న్నాడు. ఎన్నోవాటి గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నాడ‌ట‌.  అనేక ప్రాంతాల్లో క‌లిసిన వాళ్ల‌ను, వారు పెట్టిన ప‌దా ర్ధాల రుచులు ఎంతో ఇష్ట‌ప‌డ్డాడు. చిన్న‌ వ‌య‌సులోనే స్పిటీ, ల‌డ‌క్ వంటి అత్యంత చ‌లి ప్రాంతాల్లో తిరిగాడ‌ని , అక్క‌డ మ‌ట్టి ఇళ్ల నిర్మాణం చూశాడ‌ని, వాటిలో రెండు రోజులు తండ్రితో పాటు ఉన్నాడ‌ని ఆ త‌ల్లి ఎంతో గ‌ర్వంగా చెప్పుకుంటారు. త‌ల్లి దండ్రుల‌తో మ‌హారాష్ట్రా కోంక‌ణ్ తీర ప్రాంతంలో, అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యాణాల‌లో 1600 కిలోమీట‌ర్లు  తిరి గాడు. ఎన్నో తెలుసు కున్నాడు. 

130 ఏళ్ల  మొస‌లికి  స్మార‌క‌చిహ్నం!  

నిమ్మీ, మిన్నీ, బ‌బ్లూ అని ఇంట్లోవారంతా ప్రేమ‌గా పిల్ల‌ల్ని అలా పిలుచుకుంటారు. అలానే ప్రేమ‌గా పెద్ద‌యినా పిలుస్తుంటారు. అలాగే పెంచుకున్న జంతువుల‌నీ విచిత్ర‌మైన పేర్లు పెట్టి పెంచుకుంటారు. ఛ‌త్తీస్‌గ‌డ్‌కి చెందిన బ‌స‌వ‌న‌న్ త‌న స్నేహితుడ‌యిన మొస‌లికి గంగారామ్ అని పేరెట్టుకున్నాడు. 130ఏళ్ల గంగారామ్ చ‌నిపోతే ఏకంగా స్మార‌కచిహ్నం కూడా నిర్మించాడు. అది స్నేహం విలువ‌! ఛ‌త్తీస్‌గ‌ఢ్ బెమెతర జిల్లాలోని బావా మొహతారా గ్రామానికి చెందిన బసవన్ తోటి పిల్ల‌ల‌తో క‌లిసి చెరువులో ఈత‌కొడుతూ ఆడుతూండేవాడు. అక్క‌డ కాస్తంత దూరంలో వాళ్ల పెద్ద‌వాళ్లు బ‌ట్ట‌లూ ఉతుకుతుంటారు. ఈత‌కొట్టే చెరువులో మ‌ధ్య‌లో నాలుగయిదు చిన్న మొస‌ళ్లుండేవి. కానీ వాటికి ఎలాంటి ఇబ్బందీ క‌ల‌గ‌కుండా పిల్ల‌లు ఆడుతూండేవారు. హ‌ఠాత్తుగా ఒక‌రోజు వాటిలో ఒక మొస‌లి కూడా వారితో ఆట‌కి దిగింది. అన్ని మొస‌ళ్లు ప్ర‌మాద‌కారి కాదు, మ‌నుషుల‌తో స్నేహంగానూ ఉంటాయ న్న‌ది అది అలా నిరూపించింద‌న్న‌మాట‌! ఆ గ్రామం చెరువులో ఉండే ఈ స్నేహితుడికి గంగారామ్ అని పేరు పెట్టుకున్నారు పిల్ల‌లంతా. 2019లో త‌న 139ఏట గంగారామ్ మ‌ర‌ణించింది. దాన్ని ఆ గ్రామ‌స్తులు అలా వ‌దిలేయ‌లేదు. త‌మ బంధువుని కోల్పోయినం త‌గా బాధ‌ప‌డి, ప్రాణంలేని ఆ జీవిని అలా ఒడ్డుకి తీసుకువ‌చ్చి ఒక మంచిచోటు చూసి దానికి స్మార‌క చిహ్నం  ఏర్పాటు చేశారు. దాని అంతిమ‌సంస్కారానికి ఏకంగా 500 మంది వ‌చ్చార‌ట‌. ఆ రోజు ఎవ్వ‌రూ ఇంట వంట చేయ‌కుండా దిగులుగా ఉండిపోయారు ఒక మంచి మిత్రుడిని కోల్పోయామ‌న్న బాధ‌తో గ‌డిపారు.  ఇక్క‌డ చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో దాదాపు ప్ర‌తీ గ్రామంలోని చెరువులోనూ ఇలాంటి మొస‌ళ్లు చాలా క‌న‌ప‌డ‌తాయ‌ని నేచ‌ర్ క‌న్జ‌ర్వె న్సీ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌వారు తెలిపారు. జ‌న‌సంద్రం ఎక్కువ‌గా ఉండే గ్రామాల్లో ఇలా మొస‌ళ్లు ఉండ‌డం సాధార‌ణంగా భ‌యాన క‌మే. అయిన‌ప్ప‌టికీ చాలామ‌టుకు వారెవ్వ‌రూ వాట జోటికి వెళ్ల‌రు గ‌నుక అవి వారి జోలికి వెళ్ల‌వు అని నిపుణుల మాట‌. అవి ఉన్న పెద్ద పెద్ద చెరువుల్లోనే గ్రామ‌స్తులు త‌మ ప‌శువుల‌ను శుభ్రం చేయ‌డం,  దుస్తులు ఉత‌క‌డం వంటి ప‌నులు చేస్తూంటారు. కానీ మొస‌ళ్లు త‌మ పిల్ల‌ల‌తోనూ చెరువు గ‌ట్టున ఎండ‌కి సేద తీరుతుండ‌డం కూడా గ్రామీణులు చూసి ఆనందిస్తుంటారు. అంతా ఒకే గ్రామంలో ఉన్నాంగ‌నుక అంతా స్నేహితుల‌మే అన్న భావ‌న వాటిలోనూ ఉంటుందా.. ఏమో! 

చ‌ద‌రంగం నృత్యం..అద్భుత క‌ళావిన్యాసం

చ‌ద‌రంగం మైండ్ గేమ్‌. ఎంతో తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శించాలి. ఎదుటివారి ఆలోచ‌న‌లక అడ్డుక‌ట్ట‌వేయ‌గ‌ల‌గాలి. ముందే యుద్ధానికి స‌న్న‌ద్ధం కావ‌డం వంటిది. యుద్ధ తంత్ర‌మంతా ఇక్క‌డే ఆరంభ‌మ‌వుతుంద‌ని పూర్వం రాజుల కాలం నుంచీ ఉన్న‌దే. పాచి క‌లు, గ‌వ్వ‌లాట‌, వైకుంఠ‌పాళీ,.. ఇవ‌న్నీ దాటిన గొప్ప యుద్ధ‌తంత్రాన్ని ప్ర‌ద‌ర్శించేది చెస్‌. ఆధునిక కాలంలో జాతీయ అంత‌ర్జా తీయ పోటీలు నిర్వ‌హిస్తున్నారు. మాస్ట‌ర్, గ్రాండ్ మాస్ట‌ర్ టైటిల్స్‌తో విజేత‌ల‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. భార‌త్ సంప్ర‌దా య బ‌ద్ధ‌మైన ఆట తీరు నుంచి అత్యంతాధునిక ఆట‌లోనూ వ‌న్నె త‌గ్గ‌ని క్రీడాసామ‌ర్ధ్యం ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. అందుకో ఉదాహ‌ ర‌ణ విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌, ఇప్ప‌టి హంపీ. ఇదంతా ఆట‌ను చూడ‌డం, ప్లేయ‌ర్ల‌ను ప్ర‌శంసించ‌డంతో ఆనందం పంచుకుం టున్నాం. కానీ 44వ చెస్ ఒలింపియాడ్‌కి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కొత్త త‌ర‌హాలో చ‌ద‌రంగం అద్బుతాన్ని ప్ర‌ద‌ర్మ‌న చేయించి అంద‌రి మ‌న‌ సులూ దోచింది. అద్భుత కొరియోగ్ర‌ఫీతో చద‌రంగ నృత్య ప్ర‌ద‌ర్శ‌న! ఇది ఊహించ‌ని అద్భుత‌మ‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తు న్నారు. బోర్డు మీద ఆట‌ను ఆడ‌టం, చూడ‌డం కంటే ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చే ఆనందం మ‌రో అద్భుత‌మ‌ని దేశ‌మంతా వేనోళ్ల ప్ర‌శంసి స్తోంది. ఇది నిజానికి చూసి తీరాల్సిన‌దే.  తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో వివిధ జిల్లాలు ఆటను జరుపుకోవడానికి, ప్రోత్సహించడానికి మార్గా లను రూపొందించాయి. వాటిలో పుదుక్కోట్టై జిల్లా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుం ది. కొరియోగ్రఫీలో క్లాసికల్, జానపద, మార్షల్ఆర్ట్ అంశాలను మిళితం చేసి, వివిధ చదరంగం పిక్క‌లు ప్రాణం పోసుకోవడం, చదరంగం బోర్డ్‌పై యుద్ధంలో పాల్గొంటున్నట్లు చూపుతుంది. పుదుక్కోట్టై కలెక్టర్ కవిత రాము నృత్య దర్శకత్వం వహించిన ఈ నృత్య ప్రదర్శన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది, అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంది. పనితీరును మెచ్చుకున్న వారిలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ వీడియోను షేర్ చేస్తూ, అద్భుతం. కొరియోగ్రఫీ చేసాను, శ్రీమతి కవిత రాము, కలెక్టర్ పుదుక్కోట్టై ద్వారా తెలిసింది. చదరంగం పావులు మన ఊహల్లో సజీవంగా ఉండేలా చేస్తుంది. అలాగే, ఇది ప్రామాణికతను కలిగి ఉంది, ఈ గేమ్ భారతదేశంలో కనుగొనబడింది. బ్రావో! అని ప్ర‌శంసించారు. ఇటీవ‌ల‌  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రదర్శన క్లిప్‌ను వరుస ట్వీట్లలో వివరాలతో పాటు పంచుకున్నారు. రెండు ట్వీట్లలో, స్టాలిన్ ఇలా వివరించారు, “జిల్లా పరిపాలనని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాయి. ఈ అందమైన వీడియో పుదుక్కోట్టై జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందించబడింది, దీనిలో క్లాసికల్, ఫోక్, మాల్ యుథం , సిలంబం కళా కారు లు అద్భుతంగా మనల్ని సృజనాత్మక ఫాంటసీ ప్రపంచానికి తీసుకువెళ్లారు, ప్రత్యక్ష చెస్ పాత్రలుగా మార్చారు, ఆట సారాం శాన్ని దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారు.

 క్రోయేషియా వెళ్లి  తేళ్ల‌తో తిరిగివ‌చ్చింది!

ఎవ‌ర‌యినా వేస‌వి సెల‌వ‌ల‌కో, పోనీ స‌ర‌దా ట్రిప్ అని వేరే దేశాలకో, వేరే ప్రాంతాల‌కో వెళుతూంటారు. అక్క‌డ కొంత కాలం గ‌డిపిన త‌ర్వాత తిరిగి వ‌చ్చేప్పుడు అక్క‌డ న‌చ్చిన‌వి ఏదో ఒక వ‌స్తువు, దుస్తులో ఏదో ఒక‌టి కొని తెచ్చుకోవ‌డం ప‌రిపాటి. అవి చిర‌కాల జ్ఞ‌ప‌కాల‌నిస్తాయి. కానీ ఆస్ట్రేలియా నుంచి క్రోయేషియా వెళ్లిన ఒక మ‌హిళ అక్క‌డంతా తిరిగి ఇల్లు చేరింది. తీరా వ‌చ్చాక సూట్‌కేసు తెరిచి చూడ‌బోతే ఏకంగా ఒక తేలు కుటుంబ‌మే క‌నిపించి భ‌య‌ప‌డిపోయింది. అందులో ఒక‌టీ రెండు కాదు ఏకంగా త‌ల్లితో పాటు ప‌ద్దెనిమిది చిన్న తేళ్లున్నాయి! పైగా అన్నీ బ‌తికే ఉన్నాయి. ఇదెలా సాధ్య‌మ‌న్న‌ది ఆమెకీ అర్ధంకావ‌డం లేదు. అస‌లు అందులోకి ఎప్పుడు, ఎలా వ‌చ్చాయ‌న్న‌ది తెలీక ఖంగారుప‌డుతోంది. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ఏ చిన్న‌దో ముద్దాడి తే ఆసీస్ మ‌హిళ ప్రాణం పోయేదే.  క్రోయేషియాకి చెందిన ఆ తేళ్లు అరాక్నిడా జాతి తేళ్ల‌ని నిపుణులు తేల్చారు. అవి చిన్న‌విగా ఉన్నా కుడితే మాత్రం మ‌నుషుల ప్రాణాలు పోవ‌డం ఖాయం. ఈ జాతి తేళ్లు రెండువేల ర‌కాలు ఉన్నాయి. కానీ వీటిలో సుమారు 40 శాతం మేరకే విషపూరిత‌మని అన్నారు. అయితే క్రోయేషియాలో సాధార‌ణంగా క‌నిపించే తేళ్ల‌లో చాలామ‌టుకు ప్ర‌మాద‌క‌రం కాదుట‌. కానీ మంట‌, దుర‌ద‌, నొప్పి ఉంటుంద‌ని నిపుణుల మాట‌.  కాగా ఈ తేళ్ల‌ను ప్ర‌స్తుతం జాగ్ర‌త్త ప‌రిచామ‌ని, త్వ‌ర‌లో క్రోయేషియాకి తిరిగి పంప‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఇక‌నుంచీ విదేశాల‌కు, ముఖ్యంగా క్రోయేషియా ట్రిప్ వెళ్లిన‌వారంతా సూట్‌కేసులు జ‌ర జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. అందులోంచి ఏ బుజ్జి తేలో  హాలో అంటే..!

స్వీయ స‌ర్వేతో టీఆర్ ఎస్‌కు తంటాలు!

నువ్వెంత బ‌ల‌వంతుడివో తెలుసుకోవాలంటే ముందుగా నీ శ‌తృవు ఎవ‌రో తెలియాలి.. అనేది ఓ సామెత‌. అవును రాజుగారి స‌త్తా తెలిసేది సామంతులు చెప్ప‌క్క‌ర్లేదు, ఆయ‌న్ను ఎదిరించ‌గ‌ల ప‌క్క దేశం వారిని క‌దిలిస్తే చెబుతారు. ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కులు, పార్టీల‌కు మాత్రం స‌ర్వే చేయించుకునే స‌త్తా ఒక‌టి వ‌చ్చేసింది. రాష్ట్రంలో, దేశంలో త‌మ స‌త్తాను తామే తెలుసుకో గ‌ల్గుతున్నారు. ఎవ‌రికి వారికి స‌ర్వే బృందాల‌ను జ‌నంలోకి పంపించి కాయితాలు నింపించి మ‌రీ తెలుసుకుంటున్నారు మ‌నం, మ‌న‌వాడు ఏపాటి గ‌ట్టివాడ‌నే సంగ‌తి. అస‌లీమ‌ధ్య కాలంలో స‌ర్వేల‌కే మంచి డిమాండ్ ఉంది. పీకే అనే వ్య‌క్తి త‌న టీమ్‌తో క‌లిసి దేశ‌మంతా ఎవ‌రికి కావ‌ల‌సివ‌స్తే వారికి స‌ర్వే చేసేస్తుండ‌డంతో దీని మీద అన్ని పార్టీల‌కూ ఆస‌క్తి రెండింత‌ల‌ యింది. ఆ మ‌ధ్య హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణాలో ఆ టీమ్ శ‌ర‌వేగంతో ప‌నిచేసింది. అంత‌కంటే ముందే టీఆర్ ఎస్ ప‌ని తీరు మీద గ్రౌండ్ రిపోర్టు ఒక‌టి త‌యారు చేయ‌డం జ‌రిగింది. అన్న‌ట్టు ఇపుడు టీఆర్ ఎస్‌కు కొత్తగా ఐ పాక్ అనేదానితో ఒప్పందం అయింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక‌ల ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు విజ‌యావ‌కాశాలు అంత‌గా లేవు.  ఎప్పుడూ విజ‌యాన్నే ఆకాంక్షించే కేసీఆర్, కేటీఆర్‌కి ఈ నివేదిక మింగుడుప‌డ‌టం లేదు. నాయ‌కుడిని మెప్పించ‌డానికి మంత్రులే స్వ‌యంగా స‌ర్వేలు చేపట్ట‌డం ఆరంభ‌మ‌యింది. అంటే ఎవ‌రి జిల్లాలో వారు. అప్పుడు చాలా క్లియ‌ర్‌క‌ట్ రిపోర్టు వ‌స్తుంద‌న్న‌ది టీఆర్ ఎస్ ఆశ‌. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాలపై మంత్రి ఎర‌బెల్లి ద‌యాక‌ర్ స‌ర్వేలు చేయిస్తే స్టేషన్‌ఘనపూర్, పరకాల, మహబూబాబాద్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందట! కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు రిపోర్టులు తేల్చాయట. అటు ఖ‌మ్మంలోని ప‌దింట ఆరుచోట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని తేలింది.  రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సర్వే చేయించారట. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కుత్భూల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సానుకూలత లేదని తేలిందట. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంటుందట. వనపర్తి, నారాయణపేట్‌, మహ బూబ్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రెండోసారి గెలిచిన పరిస్థితి లేదని తేలింది. మొత్తానికి దేవ‌ర వారిని మెప్పించ‌డానికి మంత్రులు, ఎమ్మెల్యేలు చేయించుకున్న స్వీయ స‌ర్వేలు అస‌లు వారి ప‌రిస్థితే అయోమ‌ యంగా ఉంద‌న్న సంతి వారికే స్ప‌ష్ట‌మ‌యి దిగులుతో ఊర‌కున్న‌ట్టు విశ్లేష‌కుల మాట‌. అస‌లు స‌ర్వే అనేది ప్ర‌జ‌ల మ‌న‌సును ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేవి. అంతేకాని నేత‌ల మ‌న‌సులో, సీఎంగారికి ఏం కావాలో చెప్పేవి స‌ర్వేలు ఎందుక వుతాయి. అంచేత  కేసీఆర్ అండ్ టీమ్ కి  ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల ప‌ట్ల సంపూర్ణ అవ‌గాహ‌న వ‌చ్చి ఉంటుం ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

గేమ్స్ లో కొన‌సాగుతున్న భార‌త్ హ‌వా

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బోణీ కొట్టింది. చాను రెండవ స్నాచ్ ప్రయత్నంలో 88కిలోల లిఫ్ట్‌తో తన కొత్త వ్యక్తిగత అత్యుత్తమమైన గేమ్స్‌ రికార్డును నెలకొల్పింది. మన దేశానికి తొలి మెడల్ ను మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించిపెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు.ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్‌.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్‌ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచి పోయాడు. కాగా, గురురాజా పూజారి, కెనడాకు చెందిన యూరి సిమర్డ్ మధ్య జరిగిన పోరులో గురురాజా క్లీన్ అండ్‌ జెర్క్ లో తన మూడవ ప్రయత్నంలో 151కిలోలు ఎత్తి, పురుషుల 61కిలోల ఫైనల్‌లో మొత్తం 269కిలోలతో పూర్తి చేయడంతో  గురు రాజకు కాంస్య పతకం కైవ‌సం చేసుకున్నాడు. ఘనాతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యం సాధించి 5-0తో విజయం సాధించింది. అలాగే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇండియన్ బాక్సర్ శివ థాపా 63 కేజీల విభాగంలో పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌‌ను 5-0తో విజయం సాధించారు. మహిళల టీటీ జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది. మిక్స్‌డ్ టీం గ్రూప్-ఎ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 3-0తో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, మిక్స్‌డ్ డబుల్స్ జట్టు తమ మ్యాచ్‌లను గెలిచి ఇండియాను 2-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు. పురుషుల మారథాన్ రేసులో భారత ఆటగాడు నితేంద్ర సింగ్ రావత్ 12వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల రావత్ 2 గంటల 19 నిమిషాల 22 సెకన్లలో ఉగాండాకు చెందిన విక్టర్ కిప్లాంగట్ (2:10:55)పై గెలిచాడు. కాగా స్క్వాష్ పోటీల్లో భారత క్రీడాకారిణి జోషన చినప్ప 11-8, 11-9, 12-10తో బార్బడోస్‌కు చెందిన మీగన్ బెస్ట్‌పై గెలుపొందిం ది. సౌరవ్ ఘోసల్ 11-4, 11-4, 11-6తో శ్రీలంకకు చెందిన షామిల్ వకీల్‌పై విజయం సాధించాడు. ఇక సైక్లింగ్ మహిళల స్ప్రింట్ క్వాలిఫైయర్‌లో భారతదేశానికి చెందిన మయూరి , పాల్ వరుసగా 20వ ,  23వ స్థానాల్లో నిలిచారు. 1/8 ఫైనల్స్‌కు అర్హత సాధించిన టాప్ 16లో పూర్తి చేయడంలో విఫలమయ్యారు.

మధ్య నిషేధమా .. ఛీ ఛీ ఆ మాటే అనలేదు!

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ... అవును, ఇచ్చిన మాట ఇవ్వలేదని, చెప్పిన మాట చెప్పలేదని, బుకాయించి బతికే వాళ్ళును చూసే కావచ్చును, సుమతీ శతకకారుడు, ఈ మాట చెప్పి ఉంటారు. నిజమే, రాజకీయాల్లో మరీ అంతగా మాట మీద నిలబడే వారు ఎవరూ ఉండకపోవచ్చును,కానీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన  మంత్రివర్గ సహచరులు మాత్రం నవ్విపోదురు గాక నాకేటి.. సిగ్గు అన్నట్ల్గు, మాట తప్పం అంటూనే  తప్పుతున్నారు. ఇలా అన్నది అనలేదని, చెప్పిన మాట చెప్పలేదని తప్పించుకు తిరుగువారు, బహుశా, ఇంకెక్కడా, ఇంకే రాష్ట్రంలోనూ ఉండరేమో. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం విధిస్తామని చెప్పడమే కాదు, గుజరాత్, బీహర్ రాష్ట్రాలతో పోలిక కూడా తెచ్చారు. మధ్యనిషేధం అమలులో ఉన్న గుజరాత్ ఆర్థిక వృద్దిలో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని, ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని అప్పటి తెలుగు దేశం ప్రభుత్వానికి  సుద్దులు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం విచ్చల విడిగా మద్యం అమ్మిస్తోందని ఆరోపించారు. టీడీపీ  ప్రభుత్వానికి బుద్దుంటే సంపూర్ణ మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం  మధ్య నిషేధం తెచ్చినా తేకున్నా, తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మధ్య నిషేధం తీసుకోస్తామని, ‘ఘట్టి’ గా చెపుతున్నాని, మీడియా సాక్షిగా చెప్పారు. ఎన్నికల ప్రణాళికలోనూ అంచెల వారీగా మధ్య  నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  కానీ, ఇప్పడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రి, గుడివాడ అమర్నాథ్ మద్యనిషేధం చేస్తామని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. తాము మద్యనిషేధం చేస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పామని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా అని ఉంటే చూపించాలని సవాల్ చేశారు.మద్యం పాలసీ పై గందరగోళం నెలకొన్న నెలకొన్న నేపధ్యంలో మంత్రులు నాలుక మడతేస్తున్నారని, అంటున్నారు.  నిజానికి. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మద్యం రాబడినే హామీగా పెట్టి ఒకేసారి రూ.8,300 కోట్ల రుణం తెచ్చి.. మందు బాబుల్ని పాతికేళ్ల పాటు తాకట్టుపెట్టేసింది. మద్యనిషేధమనే మాటకు నిలువునా తూట్లు పొడిచింది.ప్రభుత్వ ఆదాయాన్ని ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ ఆదాయాన్ని ఎస్క్రో చేసి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్న విషయంపై నాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. మరో వంక కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితితో సంబంధం లేకుండా బయట నుంచి కార్పొరేషన్‌ పేరుతో అప్పు తీసుకోవడంపైనా అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. అందుకే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ వాదనతో తెర ముందుకు వచ్చారు. అయితే ఇలా తప్పించుకు తిరగడం, ఇచ్చిన మాట ఇవ్వలేదని, చెప్పిన మాట చెప్పలేదని బుకాయించడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త కాదు. గతంలో అప్పటి పౌరసరఫారాల శాఖ మంత్రి కొడాలి నాని, సన్న  బియ్యం విషయంలో ఇలాగే, మాటతప్పారు. సన్న బియ్యం ఇస్తామని చెప్పడమే కాదు అందుకోసంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ రెడ్డి బొమ్మతో సంచులు కూడా సిద్దం చేశారు. ఆ తర్వాత, సన్నబియ్యం ఇస్తామని మీ అమ్మ మొగుడు చెప్పాడా ?అంటూ కొడాలి నానీ తమ భాషలో దబాయించారు. ఇప్పుడు మద్యనిషేధం విషయంలో గుడివాడ కూడా అదే చెపుతున్నారు. కానీ, ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అవ్వోచ్చు కానీ, మరీ  ఇంత తక్కువ అయితే కాదు. అదీ గాక ఇది సోషల్ మీడియా యుగం .. తప్పించుకు తిరగడం కుదిరే వ్యవహారం కాదు.

తెరాసకు మరో ఉద్యమ నేత గుడ్‌బై !

ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట సమితి (తెరాస)లో ఉద్యమ నాయకులకు, విలువ లేదు. ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో స్థానం లేదు. గౌరవం అసలే లేదు. ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు కనీసపాటి గుర్తింపు లేదు. ఉద్యమ కాలంలోనే ఆలే నరేంద్ర మొదలు ఎందరో ఉద్యమ నేతలను సాగనంపారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసేఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉద్యమ వాసనలున్న ఏ ఒక్కరినీ వదలకుండా ఉద్వాసన పలికారనే ఆరోపణలున్నాయి. ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో కేసీఆర్కు కుడి భుజంగా ఉన్న జేఏసీ చైర్మన్ కోదండరామ్ మొదలు పార్టీ నిర్మాణంలో, ఉద్యమంలో, ప్రభుత్వంలో కీలక భూమికను పోషించిన ఈటల రాజేందర్ వరకు ఎంతో మంది ఉద్యమ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు పంపించారనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఉద్యమ ద్రోహులుగా ముద్ర వేసుకున్న తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి వంటి వారికి  మంత్రి వర్గంలో స్థానం కలిపించారనే విమర్శలు ఉన్నాయి. నిజానికి కేసీఆర్, 2014లోనే ఇక తెరాస ఉద్యమ పార్టీ కాదని ప్రకటించారు. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు.  అయినా, తెరాసలో ఒకరో ఇద్దరో ఉద్యమ నాయకులు మిగిలున్నారు. అలాంటి వారిలో, . తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి ఉన్న సీనియర్ నేత, కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఒకరు. ఇప్పుడు ఆయన కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు  రాజయ్య యాదవ్ ప్రకటించారు. తెరాసతో 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు. నిజానికి, రాజయ్య యాదవ్ తెరాసలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదు. పార్టీ నాయకత్వం ఆయన్ని మరిచే పోయింది. కానీ, ఉద్యమం చివరి అంకంలో కేసీఆర్ తో కలి నిరాహార దీక్ష చేసిన ఆరుగురు నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంతి కేసీఆర్, చావునోట్లో తలపెట్టిన సమయంలో కన్నెబోయిన యాదవ్ ఆయన వెంటే  ఉన్నారు.  అయితే ఇప్పడు ఆయన తాను మోస పోయానని, కేసేఆర్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇలా ఎన్నో ఆశలు కల్పించి చివరకు, మొండి చేయి చూపించారని అన్నారు. పదవులు ఇవ్వకపోతే ఇవ్వక పోయారు, పార్టీలో పలకరించే వారే కరువయ్యారని అవేదన వ్యక్త పరిచారు. పార్టీలో ఆత్మగౌరవం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు రాజయ్య.  తెరాస ఆవిర్భావ క్షణం నుంచి ఒక కార్యకర్తగా సుదీర్ఘ కాలం పనిచేశాను. కానీ పార్టీలో ఆత్మగౌరవం లేదు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. మెదక్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి..మాట తప్పారు. రాజ్యసభకు పంపుతామన్నారు,  మళ్ళీ  మాట  తప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. దానికీ పంపించలేదు. ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఆత్మ గౌరవం లేదు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు తెరాసలో చోటు లేకుండాపోయింది. టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులకు బాధ తప్ప.. భవిష్యత్ లేదు. తలెత్తుకోవాలని బతకాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నా. నా బాటలోనే మరికొందరు నేతలు కూడా టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారు  అని కన్నబోయిన రాజయ్య యాదవ్ పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమ తొలినాళ్ల నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నాయకుడిగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆరుగురు సీనియర్ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య కూడా ఉన్నారు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టయ్యారు.  ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు ఉన్నారు. అలాంటి సీనియర్ నేత పార్టీ వదిలి పోవడం, అంటే, ఉద్యమానికి, తెరాసకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోవడమే అంటున్నారు. ఆయన పార్టీని వదిలి పోవడం ఒకెత్తు అయితే  టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులకు బాధ తప్ప.. భవిష్యత్ లేదు, అంటూ చేసిన వ్యాఖ్య పార్టీలో కలకలం సృష్టిస్తోంది.ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు కానీ, బీజేపీలోకి వెళ్లే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఆయన ఏ పార్టీలోకి వెళతారు అనేది ఎలా ఉన్నా, రాజయ్య యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పడం సంక్షోభంలో చిక్కుకున్న తెరాసకు గట్టి ఎదురు దెబ్బని పార్టీ నేతలు అంటున్నారు

కేసీఆర్‌ను ఓడించ‌డమే జీవిత ల‌క్ష్యం ..ఈటెల‌

క‌ట్టెలు అమ్మిన చోట‌నే పూలు అమ్మాల‌ని అంటారు. అవ‌మాన‌ప‌డిన చోట‌నే అధికారం చెలాయిం చాల‌ని అంటారు రాజ‌కీయ‌నాయ‌కులు. తెలంగాణాలో అస‌లు కేసీఆర్‌కు రాజ‌కీయ‌భ‌విత లేకుండా చేయ‌డ‌మే త‌న‌ జీవిత ల‌క్ష్య‌మ‌ని బీజేపీ నేత ఈటెల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు.  కేసీఆర్‌ను రాజ‌కీయంగా ఓడించ‌క పోతే త‌న జ‌న్మ‌కు అర్ధ‌మేలేద‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోంద‌ని అన్నారు.  ఈటెల  మీడ‌యాతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌, గ‌జ్వేల్ ఎక్క‌డ‌యినా స‌రే తాను కేసీఆర్‌ను ఓడించ‌ గ‌ల న‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్లా తెలంగాణా ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పో యార‌ని ఆయ‌న అన్నారు.  తెలంగాణాలో ఎలాగ‌యినా అధికార పీఠం ఎక్కాల‌న్న ఆతృత బీజేపీ వ‌ర్గాల్లో ఉంది.  దీనికి తోడు అంత‌ర్గ‌త స‌ర్వేలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా త‌మ‌పార్టీ త‌ప్ప‌కుండా ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా బీజేపీ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి.  త్వ‌ర‌లో తెలంగాణా 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య టించి పార్టీని ప‌టిష్టంచేస్తాన‌ని  బీజేపీ నేత ఈటెల అన్నారు.  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలూ ఉన్నందున డిసెంబరులోపు ప్రతి గ్రామంలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. కేసీఆర్‌ వ్యతిరేక ఓటును బీజేపీ వైపు తిప్పుకొనేందుకు కమల దళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏపీలో జగన్‌ నేతృత్వంలోని వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు ఏర్పరచుకోవడంపై సీమాంధ్రకు చెందిన అనేక మంది తెలంగాణలో బీజేపీని వ్యతిరేకించవచ్చునని, అలా జరగకుండా చూసుకునేందుకు పలువురు సీమాంధ్ర ప్రముఖులతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది

ఏపీలో ముందస్తు ఖాయమేనా?

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వేళాయిన సూచనలే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు, అధినాయకుల తీరును గమనిస్తే ముందస్తు ఎన్నికలు ఖాయమన్న భావనే కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.  బాదుడే.. బాదుడుతో టీడీపీ నేతల కార్యక్రమాలు, జిల్లాల పర్యటలో చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు ఉపక్రమిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. వైసీపీ అధినేత సీఎం పర్యటనలు, జనం నాడిని కనిపెట్టేందుకు ఆయన సర్వేలు చేయించుకుంటున్న తీరు, వైసీపీ జిల్లాల సమన్వయకర్తలు, నేతలతో భేటీలు నిర్వహిస్తున్న వైనం. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులను గ్రామాలకు తరుముతున్న తీరు, మధ్యలో అప్పుడప్పుడూ నేనున్నానంటూ ప్రజల మధ్యకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికార- విపక్షాల మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న మాటల యుద్ధాలు.. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు ముందస్తు సంకేతాలుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీటన్నింటికీ తోడు తాజాగా ఏపీలో సంభవించిన భారీ వర్షాలు, ఆపైన గ్రామాలకు గ్రామాలను ముంచెత్తిన వరదలు.. వరద బాధితులకు మేం ఇంత చేశాం.. అంత చేశామని చెప్పుకుంటున్న అధికారపక్షం.. అంతలేదు.. అసలు బాధితులకు సాయమే లేదు.. వారిని ప్రభుత్వం తరఫున పట్టించుకున్న నాథుడే లేడంటూ తూర్పారపడుతున్న టీడీపీ అధినేత సహా ఆ పార్టీ నాయకులు. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు ఆయా పార్టీల సన్నాహాలుగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఏపీలో ముందస్తు రాజకీయ సునామీ వచ్చిందా? అన్నట్లు అధికార, ప్రతిపక్ష నేతలిద్దరి నోటా ఒకే సారి ఎన్నికల మాట వినిపించడం విశేషం. అంటే రోగి కోరుకున్నదే వైద్యుడు చేశాడన్నట్లు.. ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షం తాను రెఢీ అంటూ కాలుదువ్వుతుంటే.. మేం తక్కువ తిన్నానా? అనే ధోరణిలో వైసీపీ కూడా విపక్షానికి సవాళ్లు విసురుతోంది. చంద్రబాబు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కాపులను అమ్మేస్తున్నారంటూ జగన్ వ్యాఖ్యానించడం రాజీకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. అంటే.. కాపు సామాజికవర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నాయనేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. జగన్ వ్యాఖ్యతో ఏపీ రాజకీయం ఒక్కసారిగి హీటెక్కిపోయింది. తానేమన్నా తక్కువా అంటూ.. చంద్రబాబు కూడా ‘ఏపీలో ఫ్యాన్ ను నిలిపేయాలం టూ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. ఇరు పార్టీల అధినేత నుంచీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు నిర్ణీత సమయంలో వచ్చినా.. ముందుగానే వచ్చినా.. తమకు ఎవరు కావాలో తేల్చుకోవాల్సిన సమయం మాత్రం ఏపీ ఓటర్లకు వచ్చిందనడంలో సందేహం లేదు.  ప్రజాధనాన్ని తినేవాళ్లు కావాలో.. ప్రజాధనాన్ని ప్రజలకే పంచేవాళ్లు కావాలో.. తేల్చుకోండి  అని ప్రజలకు సీఎం జగన్ పిలుపునివ్వడం కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు సన్నాహక సూచనగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లలు కూడా అచ్చంగా ఎన్నికల సమయంలో చెప్పిన తీరునే గుర్తుచేస్తున్నాయంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫ్యాన్ ఆగిపోయిన విధంగానే.. ఎన్నికల్లో ఆ ఫ్యాన్ ను తిరగనివ్వకుండా చేయాలని పిలుపునివ్వడం గమనార్హం. అటు జగన్.. ఇటు చంద్రబాబు ఇద్దిరి నోటా వాడి వేడి గా  ఒకేసారి వ్యాఖ్యలు రావడాన్ని ముందస్తు ఎన్నికలకు సంకేతంగానే భావిస్తున్నారు. ఒక పక్కన జగన్ తన పాలనను చంద్రబాబు పాలనతో పోల్చి చెప్పుకుంటున్నారు. ప్రకృతి విలయాలు వచ్చిన సందర్భంలో తాను జీఓ9 తెచ్చి బాధితులకు పెద్ద ఎత్తున నిధులు అందించేలా చేసిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు కూడా తమ ఇద్దరి పాలనా విధానాలను పోల్చి చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నిర్వాసితులకు పరిహారం విషయంలో కేంద్రం డబ్బులివ్వడం లేదని బాధితుల ముందు జగన్ చెప్పుకుంటే.. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావో తేల్చుకుంటామంటూ చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల వారిని జగన్ గాలికి వదిలేశారని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ మండలాలన్నీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు ఎన్నికల హామీగా బాధితులకు చెప్పడం విశేషం. వరద పీడిత కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందుగానే పర్యటించారు. కష్టాల్లో ఉన్న బాధితులకు మనో ధైర్యం ఇచ్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక జగన్ వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసి వెళ్లారు. పనిలో పనిగా.. వచ్చే ఎన్నికల్లో .. అవి సాధారణంగా వచ్చేవైనా.. ముందుగా జరిగేవైనా.. వైసీపీకి 175 స్థానాలూ గెలుచుకుంటుందని, అలా గెలిచేలా చేయాలంటూ తమ పార్టీ నేతలను జగన్ పురమాయిస్తున్నారు. మరో పక్కన ప్రజల నాడి ఏ రకంగా ఉందో తెలుసుకునేందుకు రకరకాల సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఆ సర్వేల ఇస్తున్న నివేదికల సారాంశంతో ఏయే నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలత ఉందో.. ఎక్కడ ప్రతికూలత ఉందో జగన్ అంచనా వేసుకుంటున్నారు. ప్రతికూలత ఉన్న చోట్ల తమ పార్టీ నేతలకు టార్గెట్లు పెట్టి మరీ జనంలోకి తరుముతున్నారు. అనుభవ రాహిత్యంతో ఏపీని ఇబ్బందుల్లోకి, అభివృద్ధి లేకుండా దశాబ్దాల వెనక్కి నెట్టేసిన ప్రస్తుత ప్రభుత్వం పట్ల జనంలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం అంటున్నారు. ఇదే వ్యతిరేకత మరింత పెరిగిపోతే మొదలుకే మోసం వస్తుందనే భయం పట్టుకున్న జగన్ మరింతగా డ్యామేజ్ కాక ముందే ముందస్తు ఎన్నికలను ఎంచుకుంటారనే అంచనాకు విశ్లేషకులు వస్తున్నారు. ఈ అన్నింటినీ బేరీజు వేసుకుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు తథ్యం అనే అంచనాలే సర్వత్రా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు ఎవరిని వరించినా.. ఏపీని ఇప్పటి నుంచే ఎన్నికల ఫీవర్ పట్టుకుందంటున్నారు.

 స్వ‌చ్ఛంద సంస్థ‌లు సాయం చేయాలి .. చంద్ర‌బాబు

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో రాష్ట్రంలో అపార న‌ష్టం క‌లిగింది. ఎటు చూసినా నీరే అన్నంత‌గా  ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు క‌నిపించాయి. రైతాంగమ‌యితే తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఉభ‌య‌గోదావ‌రిజిల్లాల్లో గోదావ‌రి ఉదృ తికి పంట‌న‌ష్టం తీవ్ర‌స్థాయికి చేరింది. ప్ర‌జ‌ల ఇన్నాళ్ల క‌ష్టం నీటిపాల‌యింద‌ని దిగులు ప‌డుతు న్నారు. బాధితులను సమాజం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలు ఆదుకోవాలని పిలుపుని చ్చారు. ఇప్ప టికే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచీ సాయం కొనసాగుతోందన్నారు. దాతలు వారి పేరుతో గానీ, త‌మ సంస్థ‌ల‌ నుంచి గానీ సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.  ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి ఆశించినంత భ‌రోసా ల‌భించ‌డం లేద‌ని వాపోతున్నారు. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు, వాక‌బుల‌తోనే కాలం వెళ్ల‌బుచ్చుతున్నారు. కాగా విప‌క్ష నేత చంద్ర‌బాబు స్వ‌యంగా వ‌ర‌ద బాధితుల‌ను క‌లిసి వారి క‌ష్ట‌న‌ష్టాల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛంద సంస్థ‌లు, రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.  ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నా రు. మీడియాతో మాట్లాడుతూ , దశాబద్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్ట లతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. నిత్యావసరాలు లేక ప్రజలు దుర్భర స్థితిలో ఉన్నారని అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.

సోనియా వర్సెస్ స్మృతి ముదురుతున్న వివాదం

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, గాంధీ ఫ్యామిలీల మధ్య వైరం గురించి కొత్తగా చెప్పుకోవలసిన  అవసరం లేదు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ లోని అమేథి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ పై  పోటీ చేశారు. అప్పటి నుంచి గాంధీ ఫ్యామిలీ స్మృతి ఇరానీ, మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. 2014లో స్మృతి ఇరానీ ఓడిపోయినా, 2019లో రాహుల్ గాంధీని సొంత నియోజక వర్గంలో ఓడించి విజయం సాధించారు.  ఇక అప్పటి నుంచి స్మృతి ఇరానీ  సోనియా, రాహుల్ గాంధీ పై విమర్శల జోరు మరింతగా పెంచారు. ఏ చిన్న అవకాశం చిక్కినా వదలకుండా దాడి చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ అధీర రంజన్ చౌదరి చేసిన వివాదస్పద వ్యాఖ్యల విషయంగా, లోక్ సభలో స్మృతి ఇరానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని టార్గెట్ చేశారు. సోనియా క్షమాపణ చెప్పాలని చాలా గట్టిగా డిమాండ్ చేశారు.  ఇదే సమయంలో స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్ర‌మంగా బార్ నిర్వ‌హిస్తోంద‌ని కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఇందుకు సంబధించి కాంగ్రెస్ కమ్యూనికేషన్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి  జైరాం ర‌మేశ్‌, కాంగ్రెస్ సీనియర్ నేత ప‌వ‌న్ ఖేరా,పార్టీ అధికార ప్రతినిధి నెత్తా డిసౌజా చేసిన ట్వీట్స్ పై స్మృతి ఇరానీ భగ్గుమన్నారు. కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు నిరాధారమైనవని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు.  కాగా, శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్‌ నేతలకు భారీ షాకిచ్చింది. జైరాం ర‌మేశ్‌, ప‌వ‌న్ ఖేరా, నెత్తా డిసౌజాల‌కు నోటీసులు జారీ చేసింది. ప‌రువున‌ష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేత‌లు ఆగ‌స్టు 18వ తేదీన కోర్టు ముందు హాజ‌రుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే, గోవాలో బార్‌ సంబంధించి చేసిన ట్వీట్లను 24 గంట‌ల్లోగా డిలీట్ చేయాల‌ని కోర్టు తెలిపింది.  ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. జైరాం రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామ‌ని కౌంటర్‌ ఇచ్చారు. అసలు వాస్తవాలను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.

ఉక్రెయిన్ విద్యార్ధులకు అడియాస‌

ఈ సంవత్సరం ప్రారంభంలో ఉక్రెయిన్‌లో యుద్ధం వాతావ‌ర‌ణం వ‌ల్ల అక్క‌డ ఉండ‌లేక  స్వ‌దేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనిశ్చిత భవిష్యత్తును చూస్తున్న వేలాది మంది భారతీయులకు గణనీయమైన ఎదురుదెబ్బ తగిలింది, వారి కోర్సు మధ్యలో, ఏదైనా విదేశీ వైద్య సంస్థల నుండి భారతీయ వైద్య కళా శాలలకు విద్యార్థుల వైద్య సదుపాయాలు లేదా బదిలీకి ఎటువంటి నిబంధన లేదని  ప్రభుత్వం తెలి పింది.  ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956, నేషనల్ మెడికల్ కమీషన్ యాక్ట్, 2019, అలాగే ఏదైనా విదేశీ వైద్య విద్యాసంస్థ‌ల నుండి వైద్య విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలలకు వసతి కల్పించడానికి లేదా బదిలీ చేయడానికి నిబంధనలలో అలాంటి నిబంధనలు లేవు" అని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఇటీవ‌ల రాజ్యసభకు లిఖితపూర్వక  సమాధానం ఇచ్చారు. ఏదైనా భారతీయ వైద్య సంస్థ లేదా విశ్వవిద్యాలయంలో విదేశీ వైద్య విద్యార్థులను బదిలీ చేయడానికి లేదా వసతి కల్పించడానికి ఎన్ ఎం సి అనుమతించలేదని కూడా ఆమె చెప్పారు. దాదాపు 20వేల‌ మంది భారతీయ విద్యార్థులు,  ఎక్కువ మంది వైద్య కోర్సులు చదువుతున్నారు, రష్యా దాడి తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చారు. యుద్ధం ఏ సమయంలో నైనా ముగిసే సూచనలు కనిపించకపోవడంతో, తిరిగి వచ్చిన విద్యార్థులు ఎప్పుడు తిరిగి వెళ్లగలరో తెలియదు. చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు రాష్ట్రాలు కూడా ఉక్రెయిన్ తిరిగి వచ్చిన వారికి భారతీయ వైద్య కళాశాలల్లో వసతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమ‌ధ్య‌ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవి ష్యత్తును సురక్షితంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఉక్రెయిన్‌లోని  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఈ వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌లోని తమ కళాశాలలకు తిరిగి రావడం ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చు , శత్రుత్వాల విరమణ తర్వాత కూడా అనిశ్చితి తక్షణమే ప్రబలంగా ఉంటుంద‌ని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, ఈ విద్యార్థులను భారతదేశంలో లేదా విదేశాలలో తగిన విశ్వవిద్యా లయాలలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మా రాష్ట్రం పదేపదే మిమ్మల్ని కోరుతోం ద‌ని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన‌ విద్యార్థుల బృందం ఢిల్లీలో ఐదు రోజుల నిరాహార దీక్షను ఒకే సారి చర్యగా భారతీయ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి డిమాండ్ చేసింది. భారతీయ వైద్య విద్యార్థులను తత్సమాన విద్యాసంవత్సరంలో వలస వెళ్లేందుకు మార్గదర్శకాలను రూపొందిం చాలని కోరుతూ విద్యా ర్థుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తెరాసలో ఉప ఎన్నికల భయం

మలివిడత తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట సమితి (తెరాస) తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడంటే అప్పుడు రాజీనామాలు చేశారు, పుష్కర కాలానికి పైగా సాగిన తెలంగాణ ఉప ఎన్నికలకు పోవడం ఒక నిరంతర క్రతువుగా, ఉద్యమంలో భాగంగా, జరిగిపోయింది. పుష్కర కాలానికి పైగా తెరాస సారధ్యంలో సాగిన ఉద్యమానికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు,సెంటిమెంట్ ను సజీంగా ఉంచేందుకు, తెరాస అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు, ఉప ఎన్నికలను ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు.  నిజానికి  మాలి విడద తెలంగాణ ఉద్యమం కేసీఆర్  రాజీనామాతోనే పురుడు పోసుకుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్యే (సిద్ధిపేట), అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే కేసీఆర్, తెరాస జెండా ఎగరేశారు. సిద్ధిపేట ఉప ఎన్నికతోనే తెరాస రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక ఆ తర్వాత, గెలుపు ఓటములు ఎలా ఉన్నా, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నిసార్లు రాజీనామాలు చేశారో ఎన్నిసార్లు ఉపఎన్నికలకు వెళ్ళారో చెప్పలేము. అదొక చరిత్ర.  అయితే, ఇప్పడు అదే తెరాస ఉప ఎన్నికలు అంటే భయపడుతోందా? అప్పుదు ఉద్యమ నేతగా ప‌లుమార్లు తన‌తో పాటు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఉప ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతున్నారా? అంటే, అందరి నుంచి అవుననే సమధానమే వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపఎన్నికలకు వెళితే ఫ‌లితం ఏ మాత్రం అటూ ఇటు అయినా,  అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే భ‌యం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేత‌ల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత కేసీఆర్ ఉప ఎన్నికలంటే భయపడుతున్నారని, సన్నిహిత వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది.   మరో వంక, దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల విజయంతో తెలంగాణపై ఆశలు పెంచుకున్న బీజేపీ, ఉప ఎన్నికలకు ఉత్సాహం చూపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో   తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసేందుకు సర్వ శక్తులు వడ్డుతున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికలలోగా, తెరాస, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుని, ఉప ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తి గా ఎదుగేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.  నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరేందుకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయి పోయారు. మునుగోడు నియోజక వర్గంలో రాజగోపాల రెడ్డికి, పార్టీ (కాంగెస్) పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ  మంచి పట్టుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి స్థానికంగా అంతపట్టులేకున్నా, ఇతరత్రా అంగబలం, అర్థ బలం అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అన్నిటినీ మించి, రాజగోపాల రెడ్డి అన్నట్లుగా తెరాసను గద్దె దించాలనే పట్టుదల వుంది.  మరోవంక, వరసగా రెండు తెరాస సిట్టింగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ, మునుగోడును  గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఉప ఎన్నిక‌లు అధికార తెరాసకు క‌లిసి రావ‌డం లేదు. అందుకే మునుగోడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ భయపడుతోందని, అలాగే, హుజూర్ నగర్ సిటింగ్ స్థానంతో పాటు, కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డి పోటీ చేసిన నాగార్జున సాగర్ స్థానం ఉపేన్నికలోనూ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఉప ఎన్నికకు అంత సుముఖంగా లేదని అంటున్నారు. ఉపఎన్నికల్లో ఓడి పొతే, అది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బవుతుందిని ఆపార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే,  కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.   అదలా ఉంటే. మునుగోడు ఉపఎన్నికలో, టీఆర్ఎస్ ఓడితే రాష్ట్రంలో అధికార మార్పిడికి కౌంట్‌డౌట్ మొదలైనట్లేనని, పరిశీలకులు అంటున్నారు.  మరో వంక బీజేపీ, మునుగోడుతో పాటుగా,మరో రెండు మూడు నియోజక వరగాలపై కన్నేసిందని, విశ్వసనీయంగా తెలుస్తోంది. నియోజకవర్గం పై పట్టున్న ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్, తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని రాజీనామాచేయించి,జనవరిలో మూడు లేదా నాలుగుస్థానాలకు  ఒకేసారి ఉపఎన్నికలు జరిగేలా బెజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదే నిజమైతే, ఇప్పటికే వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు రానున్న రోజులో మరింత వేడెక్కే ప్రమాదముంది, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాతావ‌ర‌ణంలో మార్పు.. ప‌క్షుల‌కు క‌ష్టాలు

వాతావరణ మార్పు అనేక వృక్ష, జంతుజాలాల‌ ​​జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతోంది - ఉష్ణోగ్రత లలో మార్పు, కాలుష్యం పెరుగుదల లేదా సహజ ఆవాసాలలో మార్పు, వాటి ప్రభావాలను కొనసాగిం చడానికి లేదా చనిపోయేలా బలవంతం చేస్తుంది. వాతావరణ మార్పువల్ల సముద్ర పక్షులు తమ రోజువారీ ఆహారం కోసం చేపలను పట్టుకోవడం కష్టతరం చేస్తోందని ఒక అధ్యయనం వెల్లడిం చింది. ఐర్లాండ్ తీరంలో ఉన్న లిటిల్ సాల్టీ అనే చిన్న ద్వీపం నుండి నలుపు , తెలుపు మాంక్స్ షీర్  అనే ప‌క్షులు  నీటిలోకి దూకే నమూనాలను పరిశోధకులు చూశారు. ఈ నమూనాలను బాగా అర్థం చేసుకోవ డానికి పరిశోధకులు ఈ పక్షుల ఈకలకు చిన్న ట్రాకర్లను జోడించారు. వారు బహిరంగంగా అందు బాటులో ఉన్న డేటాబేస్‌లను ఉపయోగించి ఐదువేల‌ కంటే ఎక్కువ డైవ్ లను రికార్డ్ చేశారు, అలాగే బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాబేస్‌ల ద్వారా వాతావరణ సమాచారం, సముద్ర పరిస్థితులపై డేటాతో పాటు. సూర్యరశ్మి మరింత నీటి అడుగున చొచ్చుకుపోయేటప్పుడు పక్షులు పావురంలా అవుతా యని పరిశోధ కులు కనుగొన్నారు, మేత కోసం డైవింగ్ సామర్థ్యానికి దృశ్యమానత కీలకమని సూచి స్తుంది. మన గ్రహం సాధారణం కంటే వేడెక్కడంతో, సముద్రపు నీరు ఈ వెచ్చదనానికి ప్రతిస్పంది స్తుంది,  తద్వారా మేఘా వృతమవుతుంది. పక్షులు లోతుగా డైవ్  చేయవలసి వస్తుంది. తద్వారా వారి ప్రాణాలను  పణంగా పెట్ట డం వల్ల  ఇది మరింత సవాలుగా ఉంది. స్కూల్ ఆఫ్ బయోలాజికల్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఎర్త్ సైన్సెస్‌లోని సముద్ర పర్యావరణ శాస్త్రవేత్త  యుసిసిలో అధ్య‌యనం  ప్రధాన రచయిత జామీ డార్బీ ఇలా వివరించారు, "గ్రహం మహాసముద్రాల రసాయన, భౌతిక లక్షణాలు అసహజ రేటుతో మారుతున్నాయి. సముద్ర జీవులకు సవాళ్లు. వాతావరణ మార్పు యొక్క ఒక పర్యవసానంగా మన మహాసముద్రాలలోని పెద్ద ప్రాంతాలు మేఘావృత మవుతున్నా యి. పక్షులు లోతులో మేత కోసం తగినంత సూర్యకాంతి అవసరమని మా పరిశోధనలు సమ ర్ధించాయి. ఈ అధ్యయనం ఒక నిర్దిష్ట సముద్రపు పక్షులను పరిశీలించింది. ఫలితాలు ఇతర జంతువులకు కూడా విస్తరించవచ్చు.మానవ కార్యకలాపాలు సాగరాన్ని మసకబారేలా చేయడం వలన చాలా మంది దృష్టి-ఆధారిత మాంసాహారులు ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నారు.

కాంగ్రెస్‌కు ఇక మునుగోడు క‌ష్టం!

అలిగిన‌వారు క‌లుస్తారా? అవ‌మానాలు భ‌రించ‌క బ‌య‌ట‌ప‌డిన‌వారు స్నేహాన్ని ఆశిస్తారా?  అవ‌కాశం వెక్కి రిస్తే ఉండ‌గ‌ల్గుతారా? మ‌న‌వాడ‌నుకుంటే అస‌హాయంగా వ‌దిలేస్తే ఉండాల‌నుకుంటారా?  ఎంతైనా ఒక ఊరోళ్లం అన్నా.. అల‌క‌మాని జ‌ర ఆలోచించ‌వే.. అంటే భ‌విష్య‌త్తు మారిపోతుందా, గ‌త గాయాలు మాను తాయా.. ఎంతైనా మ‌న‌సు గాయం.. దానికి వేరే సేద‌తీరే పాటే కావాలి. మునుగోడు ఎమ్మెల్యే రాజ‌ గోపాల్ రెడ్డికి న‌చ్చిన పాట‌తో వేరే వారు కూనిరాగం అందుకున్నారు. ఇక ఇంట ఎలా ఉంటారు? అమా య‌క‌త్వం కాబోతేనీ? అయినా బ‌తిమిలాడుకుందామ‌న్న కాంగ్రెస్‌వారి చివ‌రి య‌త్న‌మూ విఫ‌ల‌ మ‌యింది.  మునుగోడు ఎమ్మెల్యే  తెలంగాణా కాంగ్రెస్‌లో త‌న‌కు స‌ము చిత స్థానం ల‌భిస్తుంద‌న్న ఆశ‌లు  ఫ‌లించ లేదు, ఇక పార్టీలో ఉండి ప్ర‌యోజ‌నం లేద‌న్న అభిప్రాయానికి వ‌చ్చారాయ‌న‌. అన్న‌లా క‌నీసం పార్టీ వారికి స్టార్ క్యాంపెన‌ర్ కూడా కాదు. ఇక గూటిలో ఉండే కంటే రెక్క‌లల్లార్చి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే మేల‌ను కున్నారు. బీజేపీ వారు ఇలాంటివారికోస‌మే వేల క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. బీజేపీ వారితో స‌మావేశ‌ మ‌య్యార‌ని ఇక అందులో క‌ల‌వ‌డ‌మే మిగిలింద‌ని రాజ్‌గోపాల్ విష‌యంలో ప్ర‌చారాలు ముమ్మ‌రం అయ్యాయి. అంతెం దుకు ఆయ‌నే స్వ‌యంగా చూచాయిగా అలాంటి మాటే చెప్పారు.  వాస్త‌వానికి మునుగోడు ఉన్న న‌ల‌గొండ జిల్లా కాంగ్రెస్‌కి పెట్ట‌ని కోట‌. కానీ మునుగోడు ఉప ఎన్నిక‌కు వెళితే రాజ‌గోపాల్‌రెడ్డి లేకుంటే కాంగ్రెస్ అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయి. ఎలాగో ఆయ‌న త‌మ పార్టీనే ఇష్ట‌ప‌డుతు న్నారు గ‌నుక త‌మ అభ్య‌ర్ధిగా నిల‌బెట్టి మంచి ఫ‌లితం సాధించాల‌ని బీజేపీవారి ఆలోచ‌న‌. న‌ల్ల‌గొండ జిల్లా లో కాంగ్రెస్ ప‌రువు ప్ర‌తిష్ట‌లు దెబ్బ‌తింటాయ‌నే ఆలోచ‌న‌తోనే మునుగోడు ఎమ్మెల్యే గ‌డ్డం ప‌ట్టుకుని బ‌తి మిలాడుకునేందుకు పార్టీ సీనియ‌ర్లు సిద్ధ‌ప‌డ్డారు.  కాంగ్రెస్‌కు ఇది మైన‌స్‌గా మారితే  ఇటు  టిఆర్ ఎస్కు ప్ల‌స్ పాయింటే అవుతుంది. మునుగోడులో ఆయ‌న బీజేపీ అభ్య‌ర్ధిగా ఉన్న‌ప్ప‌టికీ టీఆర్ఎస్ తెలంగాణా వాదంతో బీజేపీ అబ్య‌ర్ధిగా రాజ‌గోపాల్‌ను ఓడించ‌డానికి గ‌ట్టి అభ్య‌ర్ధినే పెట్టి గెల‌వాల‌న్న వ్యూహం సిద్ధప‌ర‌చుకునే ఉంటారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ వారికి రాజ‌గోపాల్‌తో చివ‌రిగా క‌లిసి నిర్ణ‌యం మార్చు కునేలా చేయ‌డం అత్యంత అవ‌స‌ర‌మైంది.    దుర‌దృష్ట‌వ‌శాత్తూ రాజగోపాల్ రెడ్డి తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలమయ్యాయి. ఏఐసీసీ దూతలుగా రాజగోపాల్‌తో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి  భేటీ అయ్యారు. కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటగా ఢిల్లీ రావాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే ఉత్తమ్ విజ్ఞప్తిని  రాజగోపాల్రెడ్డి తోసిపుచ్చారు. గ‌ట్టి నిర్ణ‌యం తీసేసుకున్నాక ఇక వెనుదిరిగే ఛాన్స్ ఆయ‌న పార్టీవారికి ఇవ్వ‌లేదు. కాగా, మునుగోడులో ఉపఎన్నిక ఖాయమని... కేసీఆర్  పై ధర్మయుద్ధం చేస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 

జ‌గ‌న్‌వి అన్నీ డొల్ల‌మాట‌లే.. క‌న్నా

భువినుండీ దివికి దిగిరారా నే పిలిస్తే.. అంటాడు గ్రంథాల్లో ఓ క‌వి. ఆయ‌న పిలిస్తే నిజంగా వ‌స్తారో రారో గాని ఆ ప‌ద్యాలు విని, చ‌ద‌వి పాఠ‌క లోకం బాగా ఆనందించింది. కానీ ఇప్ప‌టి ఈ ఆధునిక కాలంలోనూ తాను కోరింది అమాంతం దేవ‌త‌లు ఇచ్చేస్తారంటే అదేమ‌న్నా ఎన్టీవోడి సినిమాలో సీనా! కాదుగ‌దా అన్నారు తెలుగు ప్ర‌జ‌లు. ఇక్క‌డే జ‌గ‌న్ స‌ర్కార్  డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డిందని విశ్లేష‌కుల మాట‌. రాజ‌ధాని గురించి జ‌గ‌న్ చెప్పిన‌వ‌న్నీ డొల్ల‌మాట‌లే న‌ని బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు.   అధి కారంలోకి వ‌చ్చేముందు చేసిన భారీ పాద‌యాత్ర‌లో ఆవేశంలో ఎన్నో అన్నారు, మ‌రెన్నో హామీలి చ్చారు. కానీ పీఠం ఎక్కాక కేంద్రంతో చెలిమి మాట అటుంచితే అస‌లు అమ‌రావ‌తి సంగ‌తి మీద అనేక చ‌ర్చ‌లు, ఉప‌చ‌ర్చ‌ల‌కూ ఆయ‌నే వీలు క‌ల్పించారు. మూడు రాజ‌ధానులంటూ మ‌రో విప‌రీత ట‌ర్నింగ్ ఇచ్చారు. అందుకే నేల విడిచి సాముచేయ‌రాద‌ని అంటారు పెద్ద‌లు. అదే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేశార‌ని బీజేపీ నేత రాష్ట్ర మాజీ అధ్య‌క్షులు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ మండిప‌డ్డారు. కేవ‌లం క‌బుర్ల‌తో కాలం వెళ్ల‌బుచ్చుతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.  క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఎర్ర‌బాలెం నుంచి ఆరంభ‌మ‌య‌న మ‌నం.. మ‌న అమరావ‌తి యాత్ర అనే బీజేపీ కార్య్ర‌క‌మంలో పాల్గొన్నారు.  మీడియాతో మాట్లాడుతూ, జ‌గ‌న్ అధికారంకోసం ప్ర‌జ‌ల్ని వేడుకుని, అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత హామీల‌న్నీ మ‌ర్చిపోయార‌న్నారు. అమ‌రావ‌తిలో ఏమీ లేదంటూనే జ‌గ‌న్  మూడు రాజ‌ధానుల‌నే మాట తెర‌మీద‌కు తెచ్చి మోసం చేశార‌న్నారు.  విశాఖలో ప్రైవేట్ ఆస్తులను కబ్జా చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్ప‌టికైనా రాజ‌ధాని విష‌యంలో క‌ట్టుబ‌డి రెండేళ్ల‌లో రాజ‌ధాని ప‌నులు పూర్తిచేయాల‌ని క‌న్నా డిమాండ్ చేశారు.