కేసీఆర్ అంటే జాతీయ నేతలు పరుగో పరుగు!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలపై ఎంతగా మక్కువ పెంచుకున్నారో అంత కంటే ఎక్కువగా జాతీయ స్థాయి రాజకీయ నేతలు ఆయన పట్ల అంతగా అయిష్టత ప్రదర్శిస్తున్నారు. తరచూ జాతీయ రాజకీయ నేతలతో భేటీ అయ్యేందుకు ఆయన హస్తిన పర్యటనలకు వెళుతున్నా ఆయనను కలిసేందుకు మాత్రం పెద్దగా ఎవరూ మక్కువ చూపడం లేదు. రాష్ట్ర పతి ఎన్నికల సందర్బంగా చివరి వరకూ తటస్థంగా ఉండి చివరి నిముషంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే కాకుండా ఆయన తరఫున ప్రచారం విషయంలోనూ అందరి కంటే తానే ఎక్కువ అన్నట్లుగా కేసీఆర్ తెలంగాణలో యశ్వంత్ సిన్హా కటౌట్లు పెట్టడం దగ్గర నుంచి భారీ ర్యాలీ వరకూ చేయాల్సింది, చేయగలిగింది అంతా చేశారు. సరే రాష్ట్ర పతి ఎన్నిక అయిపోయింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి పరాజయం పాలయ్యారు అది వేరే విషయం. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాలు మార్గరెట్ ఆల్వాను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాయి. ఆమె జయాపజయాల సంగతి ఎలా ఉన్నా.. మద్దతు కోరే విషయంలో కూడా తెరాస అధినేతను విపక్షాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. నాలుగు రోజుల పాటు హస్తినలో మకాం వేసి మరీ తన జాతీయ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకోవాలని ప్రయత్నించినా కేసీఆర్ ను కలిసేందుకు ఎవరూ సుముఖత చూపలేదు. పెద్దగా పట్టించుకోనవసరం లేని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మాత్రమే కేసీఆర్ తో బేటీ అయ్యారు. తెరాస ఆ భేటీనే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.  ఆయన కాకుండా ఇతర పార్టీల నేతలెవరూ కేసీఆర్ తో భేటీ అయిన  ధాఖలాలు లేవు. హస్తినలోనే ఉన్న కేసీఆర్ ను ఉప రాష్ట్రపతి ఎన్నికలో మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వమని కోరడానికైనా ఎవరైనా కలుస్తారని భావించిన టీఆర్ ఎస్ నాయుకులు అందుకు కూడా ఎవరూ రాకపోవడంతో డిజప్పాయింటయ్యారు. టీఆర్ఎస్ అధినేత రెండు మెట్లు దిగి మరీ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ఆందోళనలు చేపట్టినా, విపక్షాలతో రాసుకుపూసుకు తిరగడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఆఖరికి  ఆర్జేడీ కూడా కేసీఆర్ తో బేటీకి సుముఖంగా లేదని తేలిపోయింది.  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కేసీఆర్ ను లైట్ తీసుకుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం  సానుకూలంగా సాగడంలేదు.   దీనికి తోడు యాంటి సెంటిమెంట్ కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల ఎంట్రీకి ప్రతిబంధకంగా తయారైంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నారు. అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందనీ అంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా కాలం కలిసి రాకపోతే.. అన్నట్లు ఉంది. జాతీయ రాజకీయాలంటూ ఆయన ఎంత హడావుడి చేసినా పెద్దగా మద్దతు రావడం లేదన్నది పక్కన పెడితే.. ఆయనతో రాజకీయంగా సన్నిహితంగా వచ్చిన వారందరికీ ఏదో రూపంలో  ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ (పీకే) నుంచి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వరకూ అందరూ ఏదో విధంగా ఇబ్బందులు పడ్డవారే. సినిమా పరిశ్రమ తరువాత సెంటిమెంట్లను ఎక్కవగా నమ్మేది రాజకీయ రంగంలోనే అంటుంటారు. అంతెందుకు స్వయంగా తెరాసయే సెంటిమెంట్ అస్త్రాన్నే రాజకీయ సోపానంగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత మరో సారి తెరాసను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి సెంటిమెంటునే ఆశ్రయిస్తున్నారు. అటువంటి కేసీఆర్ కు ఇప్పుడు జాతీయ రాజకీయ అరంగేట్రం వద్దకు వచ్చే సరికి అన్నీ యాంటీ సెంటిమెంట్ ఉదంతాలే ఎదురౌతున్నాయి. గత రెండు ఎన్నికలనూ టీఆర్ఎస్ సొంత బలంతో ఎదుర్కొని తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయానికి వ్యూహరచన, పథకాల రూపకల్పన దగ్గర నుంచి ప్రచార సారథ్యం వరకూ అన్ని కేసీఆర్ తన భుజస్కంధాలపై మోశారు. ఒంటి చేత్తో పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గట్టెక్కించడానికి ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను ఆశ్రయించారు. పీకే కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పలు మార్లు కేసీఆర్ తో ప్రగతి భవన్ లోభేటీ అయ్యారు. అక్కడే మకాం వేసి మరీ చర్చలు జరిపారు. అక్కడి వరకూ బానే ఉంది. ఆ తరువాతే వ్యూహకర్తకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. పీకే రాజకీయ ఆకాంక్షలకు గండి పడింది. ఏదో ఓపార్టీ పంచన చేరి రాజకీయంగా చక్రం తిప్పుదామనుకున్నా ఆయన చేరదీసే వారూ, దగ్గరకు రానిచ్చే వారే కరవయ్యారు. తెలుగు రాష్ట్రాలు తప్ప ఎన్నికల వ్యూహాల కోసం పీకే వైపు చూసే వారే కరవయ్యారు. ఏ పార్టీ దరికి చేరనీయకపోవడంతో అని వార్యంగా సొంత రాష్ట్రానికి వెళ్లి అక్కడ ప్రాంతీయ పార్టీ ప్రకటన చేసి.. అక్కడకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది.  ఆ తరువాత వంతు రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్. రాకేశ్ టికాయత్ పరిస్థితి కూడా కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే అగమ్యగోచరంగా మారిపోయింది. మోడీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన బ్రహ్మాండమైన ఆందోళనకు నాయకత్వం వహించిన టీకాయత్.. ఆ ఆందోళనకు మోడీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి మరీ ఆ చట్టాలను ఉపసంహరించుకునేలా చేశారు. ఆ తరువాత కూడా ఆయన రైతు నాయకుడిగా తిరుగులేని ఆధిపత్యాన్నే అనుభవించారు. హైదరాబాద్ వచ్చి మరీ రైతు సభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల నిప్పులు చెరిగారు. అక్కడి వరకూ ఆయనకు  తిరుగేలేని పరిస్థితి ఎదురైంది. ఆ తరువాతే ఆయన సీఎం కేసీఆర్ తో హస్తినలో వేదిక పంచుకున్నారు. అక్కడ నుంచీ ఆయన కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ తో జత కట్టిన తరువాతే ఆయనకు అంత వరకూ సహచరులుగా ఉన్న రైతు నాయకులే ఆయనపై తిరుగుబాటు చేశారు. రాజకీయ పార్టీలతో, రాజకీయ నేతలతో అంటకాగుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయనపై దాడికి సైతం దిగారు. దీంతో ఇప్పుడు ఆయన వెంట రైతులు లేని పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆయనే కేసీఆర్ వెంట తిరుగుతున్న పరిస్థితి. దేశంలో రైతుల పరిస్థితి, కేంద్రానికి వ్యతిరేకంగా వారికి మరోసారి ఉద్యమ కార్యోన్ముఖులను చేయడం తదితర అంశాలపై ఇటీవల ఆయన కేసీఆర్ ప్రగతి భవన్ లో రెండు రోజులు బస చేసి మరీ ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పుడు తికాయత్ కు కేసీఆర్ వెంట నడవడం వినా మరో మార్గం కనిపించడం లేదా అని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు.  ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా కేసీఆర్ బీజేపీయేతర కూటమి, జాతీయ స్థాయిలో మరో పార్టీ ప్రతిపాదనలకు ఇసుమంతైనా స్పందించని సమయంలో కేసీఆర్ తో కలిసి అడుగు వేయడానికి ముందుకు వచ్చారు హేమంత్ సొరేన్. హైదరాబాద్ వచ్చి మరీ కేసీఆర్ తో రెండు రోజులు మంతనాలు జరిపారు. పనిలో పనిగా తన సన్నిహిత బంధువు వైద్యం కోసం కూడా కేసీఆర్ సలహాను, సహాయాన్ని అందుకున్నారు. రాజకీయంగా కేసీఆర్ తో కలిసి అడుగులు వేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. అంత వరకూ బానే ఉంది. ఆ తరువాతే పరిస్థితి ఆయనకు ప్రతి కూలంగా మారింది.  మైనింగ్ లీజు, అలాగే ఒక ప్లాట్ ఆయ‌న భార్య‌పేరున రిజిష్ట‌ర్ చేయించుకున్నార‌న్న అవినీతి ఆరోపణలపై ఆయన నివాసం, ఆయన సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు జ‌రిగాయి. ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి సోరేన్ స‌న్నిహితుడు, సాహిబంజ్ ఎమ్మెల్యే పంక‌జ్ మిశ్రా సంబంధించిన నివాసాల‌పై దాడులు నిర్వహించింది. అలాగూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇళ్లల్లో సైతం ఈడీ దాడులు నిర్వహించింది. మొత్తం18 ప్రదేశాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా హేమంత్ సొరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ అయిన తరువాత జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కేసీఆర్ తో రాజకీయంగా ఎలాంటి సాన్నిహిత్యమైనా తమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్న ఆందోళన రాజకీయ నాయకులలో వ్యక్తం అవుతోంది. కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే ఒకరి తరువాత ఒకరుగా ఇబ్బందుల్లో పడటం కాకతాళీయమే అయినా సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ రంగంలో ఇది కేసీఆర్ ను ఏకాకిగా మార్చే అవకాశాలే మిక్కిలిగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల

అంతా బాగుందని చెప్పుకుంటేన్న తెలంగాణ బీజేపీలో సంక్షోభం ముందురు తోంది. పార్టీ టాప్ నేతల అభినందనలు అందుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండికి రాష్ట్రంలో మాత్రం గట్టి పోటీ ఎదురౌతోంది. అసమ్మతి అంతకంతకూ ముదురుతోంది. ఈటల రూపంలో బండికి సవాల్ ఎదురౌతున్నది. తనకు తిరుగే లేదని బావిస్తున్న బండి సంయయ్ కు ఆటల రూపంలో బలమైన సవాల్ ఎదురౌతున్నది. ఈటల వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తూ రాష్ట్ర పార్టీలో బండి సంజయ్ కు దీటుగా నిలుస్తున్నారు. కేసీఆర్ కు రాష్ట్రంలో దీటైన నాయకుడు తానేనని  చాటుకునే దిశగా ఈటల పావులు కదుపుతున్నారు. ఈటల రాజేందర్ నేరుగా టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే సవాల్ విసురుతూ, బీజేపీ అనుమతిస్తే గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడిస్తానని ప్రకటించారు. ఇది ఒక రకంగా ఒకే దేబ్బకు రెండు పిట్టలను గురి పెట్టినట్లుగా అయ్యింది. ఈటల లక్ష్యం కూడా అదే నని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ తో పోటీకి సై అంటూ సవాల్ విసరడం ద్వారా రాష్ట్ర బీజేపీలో బండికి పెను సవాల్ విసిరారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును గజ్వేల్ కే పరిమితం చేసేలా చెక్ పెట్టారు. వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన గజ్వేల్ లో ఈ సారి కేసీఆర్ కు ఈటల రూపంలో గట్టి సవాల్ ఎదురు కాక తప్పదన్న భావనను ప్రజలలో కల్పించడం ద్వారా బీజేపీలో ఈటల ఒక్క సారిగా స్టార్ నాయకుడిగా ఎదిగిపోయారని పరిశీలకులు అంటున్నారు. గజ్వేల్ లో కేసీఆర్ కు తానే ప్రత్యర్థినని ఈటల స్వయంగా ప్రకటించుకోవడం, ఆ టెంపోను అలాగే కొనసాగేలా వరుస సవాళ్లతో రెచ్చిపోవడంతో ఇంత కాలం బండి చుట్టూ తిరిగిన బీజేపీ శ్రేణులు ఇప్పుడు ఈటల వైపు ఆసక్తిగా చూసేలా చేసుకున్నారు. ఇది బండిని డిఫెన్స్ లో పడేసి తప్పులో అడుగు వేయించిందని కూడా అంటున్నారు. అందుకే ఈటల గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించడాన్ని బండి ఖండించారంటున్నారు. బీజేపీలో ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకోవడం కూడదని, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకోవాలని బండి అనడం ద్వారా ఈటల తనకు పోటీ అని తాను భావిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది. అంతే కాకుండా ఈటల దూకుడును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని పార్టీ శ్రేణులే బండి విషయంలో అనుకుంటున్నారు, బీజేపీలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకుంటే కుదరదు అని చెప్పడం ద్వారా బండి ఈటలను టార్గెట్ చేసి రాష్ట్ర బీజేపీలో ఆధిపత్య పోరు ఉందని చాటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  . పార్టీలో ప్రాధాన్యం దక్కపోవడంతో ఈటల అసంతృప్తితో ఉన్నారని తెలిసి ఇటీవల హైకమాండ్ఆయనను పిలిచి మాట్లాడటమే కాకుండా చేరికల కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చింది. అయితే పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఉండటంతో చేరికల కమిటీ పని ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కు అన్నట్లుగా తయారైంది. ఈటల ద్వారా చేరితే బండి వల్ల ఇబ్బందులు ఎదురౌతాయనీ, బండి సమక్షంలో పార్టీ తీర్ఘం పుచ్చుకుంటే చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల ఆగ్రహానికి గురి కావలసి ఉంటుందని బీజేపీలో చేరుదామని భావిస్తున్న వారు ఊగిసలాటలో పడ్డారు. మొత్తం మీద చేరికలు టీఆర్ఎస్ నుంచే అధికంగా ఉంటాయని భావిస్తున్న తరుణంలో చేరే వారందరూ ఈటల ద్వారా చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సుదీర్ఘ కాలం ఆ పార్టీలో ఉన్న ఈటలకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలందరితో సత్సంబధాలు ఉన్నాయి. ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా వారితో ఉంది. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన కారణంగా ఏర్పడి బాండింగ్ అది.  ఈ నేపథ్యంలోనే బండికి చేరికల కమిటీ బాధ్యతలు హైకమాండ్ అప్పగించడంతో బండి ఉలిక్కిపడ్డారని అంటున్నారు. అందుకే గజ్వేల్ విషయంలో ఈటల కేసీఆర్ ను సవాల్ చేయడాన్ని పరోక్షంగానైనా ఖండించి పార్టీలో గ్రూపులు ఉన్నాయన్న విషయాన్ని చాటారని పరిశీలకులు భావిస్తున్నారు.

విచిత్ర ద‌ర‌ఖాస్తు!

ఎవ‌రన్నా ఉద్యోగం కావాల‌ని వారి గురించిన వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర అనుభ‌వాన్ని వివ‌రిస్తూ ద‌ర‌ఖాస్తు చేసు కుంటారు. కొత్త‌వార‌యితే తాము చేయ‌గ‌ల పనిని వివ‌రిస్తూ ద‌ర‌ఖాస్తు చేసుకుంటారు. త‌మ యిష్టాయిష్టా ల‌ను అనుసరించి త‌మ‌కు న‌చ్చిన వృత్తికి సంబంధించిన సంస్థ‌ల‌కు వెళుతూంటారు. కానీ ఒక‌త‌ను చాలా చిత్ర‌మైన ద‌ర‌ఖాస్తు తో ఒక సంస్థ అధికారుల‌ను ఖంగారెత్తించాడు. త‌న పేరు దాని త‌ర్వాత అత‌ను చేయ‌గ‌ల ప‌నుల జాబితాను రాశాడు. అంత‌కుముందు ఒక గిడ్డంగిలో ప‌నిచేసేవాడు. త‌న‌కు  పెద్ద బ్యాగ్‌ల‌కు బోల్ట్‌లు బిగించ‌డం, పెద్ద పెద్ద మేజా బ‌ల్ల‌లు త‌యారు చేయ గ‌ల‌న‌ని అన్నాడు. కొన్నిచోట్ల చాలామందితో క‌లిసి ప‌నిచేశాడ‌ట. అంటే పెద్ద పెద్ద చ‌క్క పెట్టెలు ఎత్త‌డం, లోడ్ ఎత్త‌డం వంటివి తెలుసున‌ని పేర్కొన్నాడు. అలాంటి ప‌నులు వాస్త‌వానికి తాత్కాలికంగా చేస్తూ వ‌చ్చాడు. క్ర‌మేపీ త‌న ప‌నిత‌నం చూసి ప‌ర్మ‌నెంట్ చేశార‌ట ఆ సంస్థ‌వారు.  గిడ్డంగిలో ప‌నిత‌నం తెలుసుకున్న త‌ర్వాత మ‌రోసారి త‌న అనుభ‌వాన్ని తెలియ‌జేస్తూ మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే అక్క‌డికి అప్పుడ‌ప్పుడూ వెళ్లివ‌స్తూండాలన్నాడు. అందుకు స‌మ‌యం కావాల న్నాడు. త‌న ఇత‌ర ప్ర‌త్యేక‌త‌ల‌ను గురించి చెబుతూ ఇళ్ల‌కి పై క‌ప్పులు వేయ‌డం తెలుసున‌న్నాడు. పాత క‌ప్పు తీసేసి బ్ర‌హ్మాండంగా కొత్త‌ది వేయ‌గ‌ల‌న‌ని వివ‌రించాడు. త‌న ప‌నిత‌నం చూసి చాలామంది ముగ్ధుల‌య్యార‌ట‌. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లున్న త‌న‌ను త‌క్కువ‌వాడిగా ఇంట‌ర్వ్యూలో చూడ‌వ‌ద్ద‌న్నాడు. పైగా త‌న‌లాంటి స‌ర్వ విద్యలూ తెలిసివాడు దొర‌క‌డం బ‌హు దుర్ల‌భ‌మ‌ని చెప్పాడు. పైగా కొన్ని సంద‌ర్భాల్లో ఇద్ద‌రు చేసే ప‌నిని ఒక్క‌డినే చేయ‌గ‌ల‌న‌న్న ధీమా వ్య‌క్తం చేశాడు. మీరు తీసుకునేవారంతా సుకుమారంగా ఉండ‌వ‌చ్చేమో గాని ప‌ని విష‌యంలో, ఎలాంటి ప‌ని అయినా అయ్యేంత‌వ‌ర‌కూ దృష్టి మ‌ర‌ల్చ‌న‌ని హామీ ఇచ్చాడు.  ఇంత‌టి చాలా విస్ప‌ష్ట‌మైన‌, హాస్యోక్తితోనూ కూడుకున్న ద‌ర‌ఖాస్తు చూసిన‌పుడు ఎవ‌రికైనా వీడెవ‌డో గ‌ట్టి వాడే అనిపిస్తుంది. స‌రిగ్గా స‌ద‌రు కంపెనీవారూ అనుకున్నారు.. అంతే మారు మాట్లాడ‌నీవ‌కుండా సంస్థ‌లోకి ఆహ్వానించారు. అట్టుంట‌ది మ‌న‌తో . అనుకున్నాడేమో ఆ ఉద్యోగి!

ఎన్టీఆర్ ఓ విశ్వ‌విద్యాల‌యం..జ‌య‌సుధ‌

తెలుగు సినిమా అన‌గానే తెలుగువారంతా ఆరాధ్యంగా త‌ల‌చుకునే పేరు నంద‌మూరి తార‌క రామారావు. తెలుగువారు అత్యంత ప్రియుడు ఎన్టీఓడు. తెర‌మీద ఆయ‌న్ను చూడ‌కుండా ఉండ‌నివారుండ‌ర‌న‌డం అతిశ‌యోక్తి కాదు. న‌ట‌నాప‌రంగా, వ్య‌క్తిగానూ ఆయ‌న ప్ర‌త్యేక‌త ఇత‌రుల‌లో అంత‌గా క‌న‌ప‌డ‌దు. ఆయ‌నో ప్ర‌త్యేక‌మైన మ‌నిషి అంటారు అభిమానులు, కాదు భ‌గ‌వ‌త్ స్వ‌రూ పుడు అంటారు సినీ వీరాభిమానులు. అవును దేవ‌తారూపాల‌ను తెర‌మీద ప్ర‌ద‌ర్శించి వారు ప్ర‌త్య‌క్ష‌మ‌యితే ఇలానే ఉంటారేమో న‌న్నంత స‌మ్మోహ‌నం చేసిన న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్‌. సినీ, రాజ‌కీయ‌రంగాల్లో స‌మాంత‌రంగా విశ్వ‌ఖ్యాతి గాంచిన‌వారు ఎన్టీఆర్‌.  సినీ న‌టునిగా, జాతీయ రాజ‌కీయాల్లో చెప్పుకోద‌గ్గ రాజ‌కీయ నాయ‌కునిగా అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నివ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం చేస్తూ, తెలుగువారి కీర్తిని ఇనుమ‌డింప‌చేశారు. ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వా ల‌న్న డిమాండ్ మాత్రం ఇప్ప‌టికీ ఉంది. కేంద్రం ఈ విష‌యంలో జాప్యం చేస్తోంద‌ని అభిమానుల ఆగ్ర‌హానికి అర్ధం ఉంద‌ని విశ్లేష కులు అంటున్నారు.  ఆయ‌న్ను చూసి ఎన్నో విష‌యాలు ముఖ్యంగా క్ర‌మ‌శిక్ష‌ణ‌, పెద్ద‌ల‌ను గౌర‌వించ‌డం, తెలుగును గౌర‌వించ‌డం అనేది ఎంద‌రో  రాజ‌కీయ‌నాయ‌కులు, అన్ని రంగాల్లో ప‌నిచేసేవారిదీ ఇదే మాట‌. అంటూంటారు. అది ఎంతో స‌త్య‌మ‌ని అన్నారు సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ‌. ఆయ‌న్ను విశ్వ‌విద్యాల‌యంతో పోల్చారామె. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ శతాబ్ది ఉత్సవాల్లో  జయ సుధకు ఎన్టీఆర్‌ శతాబ్ది పురస్కారం ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో నటించడం నటీనటులకు అదృష్టమని, ఎంత గొప్ప స్థాయికి చేరినా ప్రతి ఒక్కరినీ గారు అని సంబోధించడం ఆయన విజ్ఞతకు నిదర్శన మని చెప్పారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, ఎన్టీఆర్‌ తనయుడు నంద మూరి మోహనకృష్ణ, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు

పింగ‌ళికి భార‌త ర‌త్న.. కుటుంబం అభ్య‌ర్ధ‌న‌

దేశంలో మోదీ నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కార్‌కి తోచిన‌వ‌న్నీ అమ‌లు చేయా ల‌న్న ఆకాంక్ష మ‌రీ ఎక్కువ‌వుతోంది. దేశ‌భ‌క్తి కేవ‌లం బీజేపీవారికే స్వంతం అన్న భావ‌న‌లో క‌మ‌ల‌నాథులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యో ధుల‌న్నా, జాతీయ ప‌తాకం అన్నా దేశంలో ప్ర‌తీ పౌరుడికీ గౌర‌వాభిమానాలు ఉంటాయి. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి గుంటూరులోని కేఎల్‌ డీమ్డ్‌ యూని వర్సిటిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్ర‌సంగిస్తూ ఆగ‌స్టు 13 నుంచి 15 వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ ఇళ్ల‌పై త్రివ‌ర్ణ‌ప‌తాకాన్ని ఎగుర‌వేయాల‌ని శెల‌విచ్చారు. ఈ భ‌క్తి ప్ర‌ప‌త్తులు ప‌తాకాన్ని రూపొందించిన పింగ‌ళి వెంక‌య్య‌కి భార‌త ర‌త్న వ‌చ్చేట్టు చేయ‌డంలో ప్ర‌ద‌ర్శించాల‌ని గుంటూరువాసుల అభిప్రాయం. కేవ‌లం ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌ను క‌లిసి వారిని ఢిల్లీకి ఆహ్వానించేకంటే  ఆయ‌న 146 జ‌యంతి సంద‌ర్భంగానూ భార‌త ర‌త్న విష‌యంలో ఒక ప్ర‌క‌ట‌న చేస్తే బాగుంటుందనేది విశ్లేష కుల మాట‌.  ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలో పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు. పింగళి కుటుంబసభ్యులను ఆహ్వానించామని, ప్రధాని మోదీ వారిని సత్కరిస్తారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పింగళి స్మారకార్థం పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేస్తారని అన్నారు. ఈ సంద ర్భంగా పింగళి మనుమరాలు సుశీలను కిషన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. పింగళికి భారతరత్న ప్రకటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.  ఇదిలా ఉండ‌గా, రోడ్ల పరిస్థితిపై గ్రామస్థులు మంత్రికి ఫిర్యాదు చేశారు. భట్లపెనుమర్రులో మౌలిక వసతుల కల్పనకు, తారు రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆర్డీవో విజయ్‌కుమార్‌ను కిషన్‌రెడ్డి ఆదేశించారు. రోడ్డునిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోతే ప్రధానితో మాట్లాడి తామే చేపడతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అంతకుముందు జాతీయ జెండాచేతపట్టి గ్రామస్థులతో పెద్దఎత్తున ఊరేగింపుగా వెళ్లి పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు.

బాక్సింగ్ క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో జ‌రీన్‌,  హాకీలో ఘ‌నాపై ఘ‌న‌విజ‌యం

బ‌ర్మింగ్‌హామ్‌లో జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్‌గేమ్స్‌లో భార‌త్ జోరు కొన‌సాగుతోంది. నిఖత్‌ జరీన్‌ మహిళల 50 కిలోల విభాగం లో క్వార్టర్‌ఫైనల్ చేరింది. రౌండ్‌ -16లో మొజాంబిక్‌ బాక్సర్‌ హెలెనా ఇస్మాయెల్‌ బగావోను నాకౌట్‌ చేసింది. నిఖత్‌ పదునైన పంచ్ లకు బదులివ్వడంలో ప్రత్యర్థి విఫలమవడంతో రెఫరీ బౌట్‌ను ఆపేసి జ‌రీన్‌ను విజేతగా ప్రకటించాడు. కాగా, పురుషుల 63.5 కిలోల విభాగంలో శివ థాపా 1-4తో రీస్‌ లించ్‌ (స్కాట్లాండ్‌) చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్  క్వార్టర్స్‌లో భారత్‌ 3-0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. మిక్స్‌డ్‌లో అశ్విని/సుమిత్‌ జోడీ, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ ప్రత్యర్థులను ఓడిండంతో భార‌త్ సెమీస్ చేరుకుంది. ఇదే జోరు హాకీలోనూ భారత జట్లు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. మహిళల పూల్‌-ఎలో భారత్‌ 3-1తో వేల్స్‌పై గెలిచింది. వందనా కటారి యా రెండు, గుర్జీత్‌ కౌర్‌ ఓ గోల్‌ చేశారు. భారత మహిళలకిది వరుసగా రెండో గెలుపు. మరోవైపు పురుషుల జట్టు 11-0తో ఘనా ను చిత్తు చిత్తుగా ఓడించింది.  ఇక టేబుల్‌ టెన్నిస్‌లో పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో శరత్‌ కమల్‌ సారథ్యంలోని భారత జట్టు సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో 3-0తో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఇక మనికా బాత్రా నేతృత్వంలోని మహిళల బృందం క్వార్టర్స్‌లో 2-3తో మలేసియా చేతిలో ఓడిపో యింది.  అలాగే, లాన్‌బౌల్‌లో పురుషుల పెయిర్స్‌ విభాగంలో భారత జోడీ దినేశ్‌ కుమార్‌/సునీల్‌ జోడీ 18-15తో ఇంగ్లండ్ జంట‌ను ఓడించి క్వార్టర్స్‌ చేరింది.   జోష్న, సౌరవ్‌మహిళల స్క్వాష్‌ సింగిల్స్‌లో జోష్న చినప్ప 3-1తో కేట్లిన్‌ వాట్స్‌ (న్యూజి లాండ్‌)పై, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్‌ ఘోశాల్‌ 3-0తో డేవిడ్‌ (కెనడా)పై గెలిచి  స్క్వాష్ క్వార్టర్‌ఫైనల్ చేరుకున్నారు. స్విమ్మింగ్‌ 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో శ్రీహరి నటరాజ్‌ సెమీ్‌సకు అర్హత సాధించాడు. కాగా, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో శ్రీహరి ఏడోస్థానంలో నిలిచాడు. అయితే జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్స్‌ జిమ్నాస్టిక్స్‌లో భారత అథ్లెట్లు విఫలమయ్యారు. పురుషుల ఆల్‌ రౌండ్‌ ఫైనల్స్‌లో యోగేశ్వర్‌ సింగ్‌ 15వ స్థానానికి, మహిళల ఆల్‌రౌండ్‌ ఫైనల్స్‌లో రుతుజ నటరాజ్‌ 17వ స్థానానికి పరిమితమై నిరాశపరిచారు. అలాగే సైక్లింగ్‌మిపురుషుల సైక్లింగ్‌ స్ర్పింట్‌ ఈవెంట్‌లో రొనాల్డో లైటోన్‌జామ్‌ ప్రీక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా సైక్లిస్ట్‌ మాథ్యూ గ్లాట్జెర్‌ చేతిలో ఓడాడు.

పాక్ పై భార‌త్ సునాయాస విజ‌యం

భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న‌తో కామెన్‌వెల్త్ గేమ్స్ లో పాకిస్తాన్‌పై  గెలిచింది.  వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను నిర్వాహ‌కులు 18 ఓవ‌ర్ల‌కే కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాట్ చేసిన పాక్ జ‌ట్టు 18 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 99 ప‌రుగులే చేయ గ‌లిగింది. వంద ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని టీమ్ ఇండియా సునాయాసంగా  కేవ‌లం 11.4 ఓవ‌ర్ల‌లోనే అధిగ‌మించింది. స్మృతీ మంధ‌న మెరుపువేగంతో భారీ షాట్లు కొట్టి అజేయ అర్ధ‌సెంచ‌రీ బాద‌డం చూడ‌ముచ్చ‌ట‌గా సాగింది.  జూలై 29న ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓడిపోగా, అదే రోజు బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్  పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి. తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓడిన‌ప్ప‌టికీ ఈ మ్యాచ్‌ను మాత్రం చాలా ప‌ట్టుద‌ల‌తో గొప్ప ఆట‌తీరును ప్ర‌దర్శించి భార‌త్ జ‌ట్టు విజ‌యం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో  టాస్ గెలిచి మొద‌ట బ్యాట్ చేసిన పాక్‌కు కెప్టెన్ మ‌రూఫ్(17), ఓపెన‌ర్ మునీబా (32) ఎంతో బాగా ఆడారు. కానీ ఆ త‌ర్వాత భార‌త్ బౌల‌ర్ల ధాటికి ఎవ‌రూ నిల‌వ‌లేకపోయారు. మేఘ‌నా సింగ్‌, స్నేహ‌రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. దీనికి తోడు ముగ్గురు బ్యాట‌ర్లు ర‌న్ఔట్ కావ‌డం పాక్‌ను దెబ్బ‌తీసింది. కేవ‌లం 100 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ ఓపెన‌ర్లు ష‌ఫాలీవ‌ర్మ‌(16), స్మృతీ మంధ‌నా(65 నాటౌట్‌) సూప‌ర్ బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్ 5.5 ఓవ‌ర్ల‌లోనే తొలి వికెట్‌కు 61 ప‌రుగులు చేసింది. మూడ‌వ బ్యాట‌ర్‌గా వ‌చ్చిన స‌బ్బినేని మేఘ‌న 16 బంతుల్లో 14 ప‌రుగులు చేసింది.   

జెరిమీకి స్వర్ణం, బిందియాకి ర‌జ‌తం

కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకాలపంట పండిస్తోంది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లల్‌రిన్నుంగా 67 కేజీల విభాగంలో స్వర్ణం సాధించి భారత్‌కు రెండో స్వర్ణం అందించాడు. మొత్తంగా ఇది ఐదో పతకం. మొత్తంగా 300 కేజీలు ఎత్తిన జెరెమీ సరికొత్త రికార్డు లిఖించాడు. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు రాగా తాజాగా మరో మెడల్ కూడా ఇదే ఈవెంట్‌లో వచ్చింది. 55 కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి దేవీ  సిల్వర్ గెలిచింది. స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116కిలోలతో మొత్తం 202 కేజీల బరువు ఎత్తిన బింద్యారాణి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసు కుంది. దీంతో భారత్ పతకాల సంఖ్యల 4కి చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. 

ఇక ఈ వేలం దేనికి?

నిత్యం భ‌జ‌న‌చేసే అస‌మ‌దీయుల‌కే వీర‌తాళ్లు వేయాలంటాడు ఓ సినిమా లో సన్న‌గా పొడ‌వుగా ఉండే మాంత్రి కుడు. త‌మ‌నే మ‌న‌సులో పెట్టుకుని ఎల్ల‌వేళా, ప్ర‌తీరోజు దేవుడిలా భావిం చేవారికే అన్ని ఏర్పాట్లూ చూడాలి. లేక‌పోతే ప‌ని అయిపోతుంది. అనాది గా రాజ‌కీ యా ల్లో వ‌స్తున్న స‌దాచా రం ఇదే. త‌న‌ వారికి విస్త‌ర్ల‌లో వ‌డ్డించ‌ డం తెలియ‌ని వ‌రెవ‌రు? ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి అలా కొన‌ సాగాలంటే మ‌నోళ్ల‌నుకున్న‌వారిని సం తృప్తి ప‌ర‌చాలి గ‌దా..అదే జ‌రిగింది ఏపీలో బార్ల ఈ వేలం. దాదాపు అన్ని బార్లు వైసీపీ నేత‌ల అనుచ‌రుల‌కే ద‌క్కింద‌ని బ‌హిరంగంగానే చెప్పుకుంటున్నార‌ని స‌మాచారం. ఈ-వేలంలో రెండురోజు అంతా ముంద‌స్తు రాజీల మార్గాన్నే అనుస‌రించార‌ని అందుకు ఎమ్మెల్యేల బెదిరింపుల‌తోనే అన్నీ సాగాయ‌ని, ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మద్యం వ్యాపారులు సిండికేట్‌లుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ-వేలం లో ధర పెరగకుండా వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకున్నారు. కోస్తాలోని 6 జిల్లాల్లో 500 బార్లకు ఈ-వేలం వేశారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, అమలాపురంలో ఒక అవ‌గాహ‌న ప్ర‌కారం జ‌రిగింద‌ని చెబుతున్నా రు. ప్రకాశం జిల్లా దర్శిలో మద్యం షాపు రూ.1.47 కోట్లు పలికింది. ఇదే జిల్లాలోని అద్దంకిలో రూ.1.37 కోట్లకు టెండర్ పాడా రు. మార్కా పురంలో రూ.1.17 కోట్లు, చీమకుర్తిలో రూ.1.7 కోట్లకు వేలం పాడారు. వైసీపీ ఎమ్మెల్యేల బెదిరింపులతో వ్యాపా రులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు ఆదాయం తగ్గింది. ప్రధాన నగరాల్లో వైసీపీ నేతల అనుచరులకే బార్ల టెండర్లు ఇచ్చారు. సాధ్యంకాని ప్రాంతాల్లో భాగస్వామ్యం ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం.

చైనీస్ సాంకేతికతపై భారత్ కొర‌డా

భారతీయులు టిక్‌టాక్‌ లేకుండా జీవించడం నేర్చుకున్నారు, అయితే గ్జియామీ, రీల్మ్‌ వంటి బ్రాండ్‌లను నిషేధించడం కష్టం. చైనీస్ స్మార్ట్‌ఫోన్ యాప్‌ల తర్వాత, భారతదేశం ఇప్పుడు దాని ఆన్-అండ్-ఆఫ్ ప్రత్యర్థి, పొరుగువారి నుండి ఫోన్ తయారీ దారులపై కొరడా ఝులిపిస్తోంది. గత కొన్నినెలల్లో, కనీసం ముగ్గురు ప్రధాన చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఆర్థిక చట్టాలను అమలుచేసే బాధ్యత కలిగిన భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి విచారణలను ఎదుర్కొన్నారు. ఏప్రిల్‌ లో, బీజింగ్‌కు చెందిన గ్జియామీ గ్రూప్‌కు చెందిన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన గ్జియామీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఈడీ 695 మిలి యన్ డాల‌ర్లు స్వాధీనం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో, చైనాకు చెందిన బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమా న్యంలోని వీఓ ఇండియాకు చెందిన 58 మిలియన్ డార్ల‌కు పైగా ఉన్న 119 బ్యాంక్ ఖాతాలను ఈడీ స్వాధీనంచేసుకుంది. కొన్నిరోజుల తర్వాత, ఈడీ వివో కి చెందిప‌ సంస్థ ఒప్పోపై  551 మిలియన్ డాల‌ర్ల ప‌న్ను ఎగవేతపై ఆరోపణలు చేసింది. ఆర్థిక నేరాల-పోరాట అధికారులు పదే పదే వేధింపులకు గురికావడంతో, గ్జియామీ దీర్ఘకాల భారతదేశ అధిపతి మను కుమార్ జైన్ దుబాయ్‌కి మకాం మార్చారు. ప్రశ్నించే సమయంలో అధికారులు శారీరక హింస బలవంతం చేశారని కంపెనీ ఆరోపిం చింది. విచారణ ముమ్మరం కావడంతో వీఓ ఇండియాకు చెందిన ఇద్దరు చైనీస్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఇండియా నుంచి నేపాల్ మీదుగా చైనాకు పారిపోయినట్లు సమాచారం. గ్జియామీ భాగమైన ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, ఆర్థిక మంత్రికి లేఖ రాసింది, మేధో సంపత్తిపై రాయ ల్టీ చెల్లింపులు కోసం గ్జియామీపై ఇటీవలి చర్య రాయల్టీ ఎలా ఉంటుందనే దానిపై పరిశోధకులకు అవగాహన లేకపోవడం వల్లనే ఉత్పన్నమైందని హైలైట్ చేస్తూ ఆర్థిక మంత్రికి లేఖ రాసింది. చెల్లింపులు స్మార్ట్‌ఫోన్‌లకు పని చేస్తాయి. రెండు దేశాల సరిహద్దు వివాదాల మధ్య భారతదేశం 59 చైనీస్ యాప్‌లను ఆకస్మికంగా నిషేధించిన రెండేళ్ల తర్వాత ఈ అణిచివేత జరిగింది. అప్పటి నుండి, డేటా భద్రతకు సంబంధించిన రగింగ్ ఆందోళనల కారణంగా భారతదేశం 350 యాప్‌లకు పైగా నిషే ధాన్ని పొడిగించింది. 2020లో నిషేధించబడిన టిక్‌టాక్‌, షీన్‌ లేకుండా భారతీయులు జీవించడం నేర్చుకున్నప్పటికీ, చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లపై  దేశం ఆధార పడటం పూర్తిగా భిన్నమైన కథ. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల భారీ విస్తరణలో సరసమైన చైనీస్ మోడల్‌లు కీలక పాత్ర పోషించాయి, ఇది ఇప్పుడు పరికరాలకు రెండవ అతిపెద్ద మార్కెట్. చైనీస్ బ్రాండ్లు గ్జియామీ, రీల్మ్‌, వీవో, ఆప్పో కలిసి భారత్‌లో విక్రయ‌మ‌వుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో 60% పైగా ఉన్నాయని మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది. భారతదేశం లో విక్రయించబడుతున్న ఐదు అత్యంత జనాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ మోడల్‌లలో నాలుగు రియల్ మీకి చెందినవి, ఇది కూడా బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లను విస్తృతంగా స్వీకరించడం ఇ-కామర్స్, ఫిన్‌టెక్, టాప్ మీడియా వంటి రంగాల వృద్ధికి సహాయపడింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు - వారి సరసమైన ధర, ఫీచర్-ప్యాక్డ్ మోడల్ లతో వారి భారతీయ ప్రత్యర్థులను చాలా మంది వ్యాపారం నుండి బయటకు నెట్టారు. వినియోగదారులకు అందించడమే కాకుండా, ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లు భారతదేశంలో ఉపాధి అవకాశాలను సృష్టించా యి. ఉదాహరణకు, గ్జియామీ భారతదేశంలోని దాని బహుళ కార్యాలయాలు, కర్మాగారాలు, సేవా కేంద్రాలు, స్టోర్‌లలో 50వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. "వినియోగదారు, వాణిజ్య దృక్కోణం నుండి చైనీస్ బ్రాండ్‌లపై ఆధారపడటం కూడా చాలా ఎక్కువగా ఉంది మరియు ఉద్యోగాలు, వాణిజ్యం, ఇతర విషయాల పరంగా ప్రభుత్వం ప్రస్తుతం శూన్యతను సృష్టించడాన్ని చూడ లేమని అసోసియేట్ వైస్ నవకేందర్ సింగ్ ఐడిసి ఇండియాలో డేటా,అనలిటిక్స్ మీడియాతో అన్నారు. చైనీస్ కంపెనీలపై కఠినంగా వ్యవహరించే ఆప్టిక్స్ లాభదాయకంగా ఉన్నప్పటికీ, తరచుగా దాడులుచేయడం వ్యాపార వాతావర ణాన్ని దెబ్బతీ స్తుంది, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రానిక్స్ తయారీదారులను భారత్‌ చురుకుగా కోరుతున్న సమయంలో.

టీఆర్ ఎస్ ప‌ని అయిపోయింది..బండిసంజ‌య్‌

ఆధిప‌త్యంలోకి రావడానికి అనేక ఎత్తుగ‌డ‌లు.. బీజేపీ వారిది మాత్రం ద‌బాయింపు వ్య‌వ‌హారం. తాము త‌ప్ప‌కుండా అధికారం లోకి వ‌చ్చేస్తున్నాం ఇక మూటామూల్లూ స‌ర్దుకోండ‌ని విప‌క్షాలనుద్దేశించి ప్ర‌సంగాలు చేయ‌డం ప‌రిపాటి అయింది. అందు లోనూ ఇది స‌ర్వేల కాలం. ఎవ‌రికి వారు వారికి త‌గ్గ‌ట్టు స‌ర్వేలు చేయించుకోవ‌డం, లేదా చేయ‌డం చాలా సుల‌భ‌ సాధ్యంగా అయిపోతోం ది. తందానా అంటే తాన‌తందానా లా త‌యారయ్యాయి స‌ర్వే సంస్థ‌లు కూడా. ఇప్పుడు బీజేపీ వారి ప్ర‌భంజ‌నానికి తిరుగులేద‌ని స‌ర్వేల సంస్థ‌ల‌తో చెప్పించుకోవ‌డం, ప్ర‌చారం చేయించుకోవ‌డంతో పాటు బీజేపీ యేత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అదే నినాదాలు చేయించ‌డం మామూలే. ఇప్ప‌డు తెలంగాణా బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ కూడా అదే స్వ‌రం వినిపిస్తున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యానికి టీఆర్ ఎస్ ఉండ‌ద‌ని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ, అస‌లు పార్టీ నిల బ‌డ‌ట‌మే క‌ష్ట‌మ న్నపుడు ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే చ‌ర్చ‌కే అవ‌కాశం లేద‌న్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయమని, ఎంఐఎం సీటు కూడా తాము కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌ ఇప్పుడు చెల్లని రూపాయ‌ని, ఆయన బొమ్మతో గెలవడం కష్టమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జంకు తున్నారన్నారు. అందుకే ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్‌ మళ్లీ మాట్లాడటం లేదని చెప్పారు.  మునుగోడుకు ఉప ఎన్నిక రావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారని, ఉద్యోగులకు వేతనాల ఆల స్యం, వరదలు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి ఉప ఎన్నికపై మరలుతుందని ఆయన నమ్మకమేమో అని వ్యాఖ్యానించారు. ఇక, ఉపఎన్నిక జరగవద్దని కాంగ్రెస్‌ కోరుకుం టోందన్నారు. ప్రజల అభీష్టం మేరకే బీజేపీ ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొ న్నారు. క్యాసినో వ్యవహారం బయటపడగానే టీఆర్‌ఎస్‌ నాయకులు భయపడు తున్నారన్నార‌ని, చీకటి దందాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా టీఆర్‌ఎస్‌ మారిందని ఆరోపించారు.  కాగా, ఈటెల రాజేందర్ మాత్రం గ‌జ్వేల్ టికెట్ గ్యారంటీ అని అక్క‌డినుంచే పోటీచేస్తాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. పైగా సీఎంను ద‌మ్ముంటే అక్క‌డి నుంచి పోటీచేయాల‌ని స‌వాలు కూడా విసురుతున్నారు. మ‌రోవంక బండి సంజ‌య్ మాత్రం ఈటెల టిక్కెట్ విష‌యం పార్టీ అధిష్టానం నిర్ణ‌యిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి పార్టీలోకి తీసుకున్న‌పుడు పెట్టుకున్న న‌మ్మ‌కం ఈటెల మీద ఇపుడు స‌న్న‌గిల్లిందా లేక ఆయ‌న్ను క‌రివేపాకులా ఉప‌యోగించుకుంటున్నారా అని విశ్లేష‌కుల అనుమానం.     కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంచి వ్యక్తి అని సంజయ్‌ కితాబిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ఆయనకు ఎప్పటినుంచో నమ్మకం ఉందని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భేటీ అంశాన్ని మీడియా సంజయ్‌ దృష్టికి తీసుకువెళ్లగా, బహుశా ఉత్తమ్‌ కూడా బీజేపీలోకి వస్తారేమో అని సరదాగా వ్యాఖ్యానించారు.  ఇదిలా ఉండ‌గా, హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోనూ చ‌క్రం తిప్పుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.  మలక్‌పేట, కార్వాన్‌, చాంద్రాయణ గుట్ట, గోషామహల్‌లో మాకు మంచి పట్టుంది గ‌నుక ఎంపీ స్థానం ఎందుకు గెలువం? యూపీలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ఆజంగఢ్‌నే బీజేపీ గెలుచుకున్నప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కాదు? మజ్లి్‌స్‌ను వ‌ద్ద‌ని  బీజేపీయే కావాలని ముస్లింలు కోరు కుంటున్నారు. మాకు షెల్టర్‌ జోన్‌లుగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధిని నక్సల్స్‌ అడ్డుకునేవారు. ఇప్పుడు పాతబస్తీలో అభివృద్ధిని మజ్లిస్‌ అడ్డుకుంటోంది అని సంజయ్‌ ఆరోపించారు.

అంగారక గ్రహం  భవిష్యత్తును భూమి  తప్పించుకుంది

దాదాపు 1,800 మైళ్ల భూగర్భంలో, భూమి తాలూకు బాహ్య కోర్లో ద్రవ ఇనుము కదులుతుంది, ఇది మన గ్రహాన్ని రక్షించే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇది కనిపించనప్పటికీ, సూర్యుడి నుండి వచ్చే సౌరగాలులు, ఇతర హానికరమైన రేడి యేషన్ నుండి మనల్ని రక్షిస్తుంది కాబట్టి గ్రహం మీద జీవం ఉనికికి ఇది చాలా ముఖ్యమైనది. సుమారు 565 మిలియన్ సంవత్సరాల క్రితం, ఈ  అయస్కాంత క్షేత్ర శక్తి నేడు దాని శక్తిలో ప‌దో శాతానికి పడిపోయింది. ఏది ఏమైనప్పటికీ, భూమిపై బహుళ సెల్యులార్ జీవితం కేంబ్రియన్ పేలుడుకు ముందు అది మళ్లీ ఎగిసింది. ఈ ఫీల్డ్ రీబూట్ చేయడానికి కారణం ఏమిటో శాస్త్రవేత్తలకు నిజంగా తెలియదు. అయితే, రోచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన స‌రికొత్త‌ అధ్యయ నంలో ఈ రీబూట్ కేవలం పది లక్షల సంవత్సరాలలో జరిగిందని  భూమి ఘన అంతర్గత కోర్  ఏర్పడిన సమయం లోనే సంభవించిందని వెల్లడించింది, దీని వెనుక కారణం దీని కోర్ ప్రధానమైనది కావచ్చు. అధ్యయనం అంతర్గత కోర్ గతంలోని వివిధ కీలక తేదీలను చూపిస్తుంది, దాని వయస్సు మరింత ఖచ్చి తమైన అంచనాతో సహా. ఈ అధ్యయనం మన గ్రహం చరిత్ర, భ‌విష్యత్తు పరిణామం క్లూలను అందిం చింది. ఈ బంజరు గెలాక్సీలో ఈ రోజు మన నివాసంగా మనకు తెలి సిన ఈ ఆవాసంగా ఎలా మారింది. రాక్ అనోర్థోసైట్ నుండి ఫెల్డ్‌స్పార్ స్ఫటికాలను విశ్లేషించడానికి పరిశోధకులు సీఓ2 లేజర్ ప్రయోగశాల సూపర్ కండక్టింగ్ క్వాంటమ్‌ ఇంటర్‌ఫరెన్స్ పరికరం మాగ్నెటోమీటర్‌ను ఉపయోగించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ స్ఫటి కాలలో చిన్న అయస్కాంత సూదులు ఉంటాయి, అవి ఖచ్చితమైన అయస్కాంత రికార్డర్లు. పురాతన స్ఫటికాలలో లాక్ చేయ బడిన అయస్కాంతత్వాన్ని పరిశీలిస్తే, పరిశోధకులు అంతర్గత కోర్ చరిత్రలో రెండు ముఖ్య మైన తేదీలను కనుగొన్నారు. సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితం, అయస్కాంత క్షేత్రం దాదాపు 15 మిలియన్ సంవత్సరాల ముందు పతనం తర్వాత చాలా త్వరగా పునరుద్ధరించడం ప్రారంభించింది. కరిగిన బాహ్య కోర్ని రీబూట్ చేసి, అయస్కాంత క్షేత్ర బలాన్ని పునరుద్ధ రించే ఘన అంతర్గత కోర్ ఏర్పడటానికి పరిశోధకులు ఈ వేగ వంతమైన మార్పును ఆపాదించారు. మేము అంతర్గత కోర్ వయస్సును మరింత ఖచ్చితంగా నిర్బంధించి నందున, ప్రస్తుత అంతర్గత కోర్ వాస్తవానికి రెండు భాగాలతో కూడి ఉందనే వాస్తవాన్ని మేము అన్వేషించగలమని. భూమి ఉపరితలంపై ప్లేట్ టెక్టోనిక్ కదలికలు పరోక్షంగా లోపలి కోర్ని ప్రభావితం చేశా య‌నీ పరిశో ధకులు వివరించారు.  అంగారక గ్రహానికి ఒకప్పుడు అయస్కాంత క్షేత్రం ఉందని పరిశోధకులు కూడా విశ్వసిస్తున్నారు, అయిన ప్పటికీ, క్షేత్రం క్షీణిం చింది, సౌర గాలికి ,  సముద్రాలు లేకుండా ఉపరితలానికి హాని కలిగిస్తుంది. అయస్కాంత క్షేత్రం లేకపోవటం వలన భూమిని అంగారక గ్రహంగా మార్చవచ్చో లేదో అస్పష్టంగా ఉన్నప్ప టికీ, భూమి ఒక టన్ను నీటిని కోల్పోయే అవకాశం ఉందని, ఫలితంగా గ్రహం చాలా పొడిగా మరింత బంజ రుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అయస్కాంత కవచం చాలా ముఖ్యమై నదనీ,  దానిని కొనసాగించ డానికి యంత్రాంగాలు తప్పనిసరిగా ఉంచబడాలని వారు హైలైట్ చేస్తారు,  ఈ పరిశోధన మొత్తం జీవిత కాలంలో అయస్కాంత క్షేత్రాన్ని కొనసాగించే అంతర్గత కోర్ వంటిదాన్ని కలిగి ఉండవలసిన అవసరాన్ని నిజంగా హైలైట్ చేస్తుంది.

ఇది ముమ్మాటికీ బీజేపీ కుట్రే .. కాంగ్రెస్‌

ఒక‌రిని అవ‌మాన‌ప‌ర్చ‌డానికి పెద్ద‌గా వ్యూహాలేమీ ప‌న్న‌క్క‌ర్లేదు, ఒక‌రి అధికారం దెబ్బ‌తీయ‌డానికి అవ‌స‌రం. ఒక‌రిని అధికార పీఠం నుంచి దించ‌డానికి అనేక కుట్ర‌లు, కుతంత్రాలు చేయ‌వ‌ల‌సివ‌స్తుంది. ఇది ప్ర‌స్తుత రాజ‌కీయ నీతి. ఇదే బీజేపీ అనుస‌రిస్తోంద‌న్న అభిప్రాయాలే దేశ‌మంతా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీయేత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుతంత్రా ల‌తోనే ఆ ప్ర‌భుత్వం ప‌రువు బ‌జారుకీడ్చి ఆన‌క ప‌నికి రాద‌ని గోడ‌మీద రాయించి ఎన్నిక‌లు పెట్టించి అధికారంలోకి రావాల‌న్న చెత్త ఆలోచ‌న బీజేపీవారి సొంత‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు నోట్ల క‌ట్టలతో దొరికిపోయార‌న్న‌ది కూడా అటువంటి కుట్ర‌లో భాగ‌మేన‌ని జార్ఖండ్ కాంగ్రెస్ నాయ‌కులు న‌మ్ముతు న్నారు. కాగా, జార్ఖండ్లోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.  గిరిజనులకు బహుమతులు కొనడానికి వెళ్ళారని ఓ ఎమ్మెల్యేల సోదరుడు చెప్తున్నారు. ఈ మొత్తం సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది.  టీఎంసీఈ ఎమ్మెల్యేలకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత శశి పంజా డిమాండ్ చేశారు. జార్ఖండ్ లోని జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం బేరసారాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతు న్న సమ యంలో ఈ నగదు పట్టుబడిందని టీఎంసీ ఓ ట్వీట్‌లో పేర్కొంది.  పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు జార్ఖండ్ ఎమ్మెల్యేలు - ఇర్ఫాన్ అన్సారీ (జమ్‌‌‌తారా), రాజేశ్ కచ్చప్ (ఖిజ్రి), నామన్ బిక్సల్ కొంగరి ( కొలెబిర) - ప్రయాణిస్తున్న కారులో భారీగా నగదు ఉందని సమాచారం అందింది. వెంట నే అప్రమత్తమైన పోలీసులు హౌరా జిల్లాలోని 16వ నెంబరు  జాతీయ రహదారిపై రాణిహటి వద్ద తనిఖీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున నగదు కనిపించడంతో, ఆ నగదును స్వాధీనం చేసుకుని, ముగ్గుర్నీ అరెస్టు చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంతో  ఆ పార్టీ ఘాటుగా స్పందించింది. జార్ఖండ్‌లోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వా న్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రభుత్వాలను కూల్చేందుకు అస్సాం ప్రధాన కార్యక్షేత్రంగా మారిం దనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 15 రోజులపాటు నాటకీయ పరిణామాల తర్వాత మహారాష్ట్ర  ప్రభుత్వం కూలి పోయిందన్నారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. మహా రాష్ట్రలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శివసేన, ఎన్‌సీపీ నేతలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చివరికి శివసేనలో చీలిక వచ్చి, ఏక్‌నాథ్ షిండే  నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి డబ్బుతో పట్టు బడిన ఎమ్మెల్యేల విషయంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు మాట్లాడటం సమంజసం కాదన్నారు. కానీ దేశంలో పరిస్థితిని చూసి నపుడు, పట్టుబడిన ఈ ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని బాగా వివరించగలరని చెప్పారు. అయితే ఈ సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. తమ పార్టీ అధిష్ఠానానికి ఓ నివేదికను సమర్పిస్తామని చెప్పారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్ట బోమని తెలిపారు. జార్ఖండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కే మీడియాతో మాట్లాడుతూ, తమది కాని ప్రభుత్వాన్ని అస్థిర పరచడం బీజేపీ స్వభావమని ఆరోపించారు. అదే ప్రయత్నం ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా జరుగు తోందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికే ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చిందన్నారు.  గిరిజనులకు బహుమతు లిచ్చేందుకే ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ సోదరుడు ఇమ్రాన్ మాట్లాడుతూ, తన సోదరుడిని అక్రమంగా ఇరికించేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి సంవత్సరం గిరిజనులకు బహుమతులు ఇస్తూ ఉంటా మని, అదే విధంగా ఈ సంవత్సరం కూడా కోల్‌కతా బడా బజార్‌కు వెళ్ళారని చెప్పారు. బడా బజార్‌లో చీరలు కొని, గిరిజనులకు పంపిణీ చేయడం తన సోదరునికి అలవాటని చెప్పారు. వీరివద్ద పట్టుబడిన సొమ్ము రూ.కోట్లలో ఏమీ లేదన్నారు. తాను ఉదయం నుంచి వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.

ప్ర‌కృతి ఒడిలో పాఠాలు నేర్పిన త‌ల్లి  

ఏ ఫ‌ర్ ఆపిల్‌, బి ఫ‌ర్ బుక్‌, రెండు రెళ్లు నాలుగు.. ఇదే అనాదిగా త‌ర‌త‌రాలుగా దేశ‌మంతా పాఠ‌శాల‌లు పిల్ల‌ల‌కు విద్యాభ్యాస ఆరంభ ప్ర‌క్రియ‌. ఎన్ని అనుకున్నా, ఎంత చ‌ర్చించినా ఈ విద్యావిధానం మార‌లేదు. మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చాలామంది విజ్ఞ‌లు, విద్యాశాస్త్ర‌వేత్త‌లు, పండితులూ మొత్తుకుంటున్నా ఈ బ్ర‌హ్మ‌సూత్రాన్ని దాటి ఏ గ్రామం కూడా గీత దాట‌డం లేదు. ఇటీ వ‌లి కాలంలో ఈ అత్యాధునిక కాలంలో ర‌వ్వంత మార్పుకి అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఇప్పుడిప్పుడే ప్లే స్కూల్స్ పేరిట  కొత్తద‌ నాన్ని ప్ర‌వేశ‌పెట్టి పిల్ల‌ల్ని, త‌ల్లిదండ్రుల్ని ఉత్సాహ‌ప‌రుస్తున్నాయి కొన్ని కార్పోరేట్ పాఠశాల‌లు.  కానీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కి చెందిన అంకీష్ అనే మ‌హిళ చాలా కొత్త‌గా ఆలోచించింది. త‌న పిల్ల‌వాడికి క్లాస్‌రూమ్, ఆన్ లైన్ క్లాసులు కాకుండా స‌హ‌జ‌సిద్ధ విద్యా విధానాన్ని.. అంటూ పూర్వం రుషుల బోధ‌నా విధానంలోకి ఆలోచ‌న చేసింది.  అంకీష్ కి త‌న ఏడేళ్ల పిల్ల‌వాడు ప్రాంష్ అలా ఆన్ లైన్ క్లాసుల‌తో ఇబ్బంది ప‌డ‌టం బొత్తిగా న‌చ్చ‌లేదు. వాడికి అస‌లు ప్రకృతి చెప్పే పాఠాలు, స‌హ‌జ‌సిద్ధంగా లోకాన్ని తెలుసుకోవ‌డం అంటే పుస్త‌కాల్లో కాకుండా వాస్త‌వంగా చూపాల‌ని, తెలిసేలా చేయాల‌ని సంక‌ల్పించారు. అంతే వెంటే స్కూలు నుంచీ బ‌య‌టికి తీసుకువ‌చ్చేశారు. వాడికి చుట్ట‌ప‌క్క‌ల ప్ర‌దేశాలు చూప‌డం, చెట్లు ఎలా పెరుగుతాయి, ఎండ వేడిమి, గాలి, ప‌క్షుల కిల‌కిలారావం, ఏర్లు పార‌డం, పొంగ‌డం, జంతువుల గురించి అన్నీ స్వ‌యంగా చూపు తూ వాటిని వివ‌రిస్తూ వాడిని పెంచ‌డం మీద ఎంతో దృష్టిపెట్టారామె.  త‌ర‌గ‌తి గ‌దిలో ఉండ‌డం కాకుండా బ‌య‌ట తిర‌గాల‌ని, దేశ‌మంతా తిరిగి అనేక ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తున్నారు, వారి జీవ‌న శైలి గురించి పిల్ల‌డికి  తెలియాల‌ని  ఆ త‌ల్లి భావించింది. బంధువులు, స్నేహితులూ ఇదేం పిచ్చి అన్నారు. కానీ ఆమె చిర్న‌వ్వుతోనే స‌మాధానం చెప్పిందే  కానీ వారితో వాదించ‌లేదు. పైగా 2020లో లాక్‌డౌన్ స‌మ‌యం ఆమెకు బాగా క‌లిసి వ‌చ్చింది. చాలామంది పిల్ల‌లు చ‌దువుకి దూర‌మ‌యినా త‌న పిల్ల‌వాడిని మాత్రం ఈ కొత్త‌మార్గంలోకి న‌డిపింది. క‌రోనా కార‌ణంగా ఆఫీసుకు వెళ్ల‌లేక పిల్లాడిని చూసుకోవాల‌ని ఐటి ఉద్యోగాన్ని ఆమె 2020లో వ‌దిలేశారు.  2021 ఏప్రిల్‌లో పిల్ల‌వాడికి నాలుగేళ్ల  వ‌య‌సులోనే ఆమె త‌న పిల్లాడిలో ప్ర‌కృతి ప‌ట్ల ఆక‌ర్ష‌ణ‌ను గుర్తించారు.   అలా పెద్ద‌వుతున్న కొద్దీ ఆ ఆస‌క్తి కూడా రెండింత‌ల‌యింది.  ప్ర‌యాణాల‌కు వీల‌యిన స‌మ‌యంలో  హిమాచ‌ల్ ప్ర‌దేశ్  లో అనేక ప్రాంతాలు తిప్పార‌ట‌. తండ్రి క్యాంప్‌ల‌కు వెళ్లిన‌పుడు ఆయ‌న కూడా త‌న‌తో పిల్ల‌వాడిని తీసికెళ్లేవార‌ట‌.  అలా  రోడ్డు ప్ర‌యాణ‌మే ఎక్కువ‌గా చేయ‌డంతో అనేక ర‌కాల మ‌ను షులు, వారి తీరుతెన్నులు, వ్య‌వ‌హార‌శైలి, జంతువులు, చెట్లూ చేమా చెరువులు, కాల‌వ‌లు, రాళ్ల గుట్ట‌లు, కొండ‌లు, ప‌ర్వ‌తాల గురించి ఆమె వాడికి చూపించ‌డ‌మే కాకుండా వివ‌రిస్తూ ఎంతో జ్ఞానాన్నిపంచింది. అలా అన్నింటిని చూసి తెలుసుకోవ‌డంతో ఆ పిల్ల‌వాడు ఇప్పుడు అన్నీ ఎంతో బాగా గుర్తు పెట్టుకు న్నాడు. ఎన్నోవాటి గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నాడ‌ట‌.  అనేక ప్రాంతాల్లో క‌లిసిన వాళ్ల‌ను, వారు పెట్టిన ప‌దా ర్ధాల రుచులు ఎంతో ఇష్ట‌ప‌డ్డాడు. చిన్న‌ వ‌య‌సులోనే స్పిటీ, ల‌డ‌క్ వంటి అత్యంత చ‌లి ప్రాంతాల్లో తిరిగాడ‌ని , అక్క‌డ మ‌ట్టి ఇళ్ల నిర్మాణం చూశాడ‌ని, వాటిలో రెండు రోజులు తండ్రితో పాటు ఉన్నాడ‌ని ఆ త‌ల్లి ఎంతో గ‌ర్వంగా చెప్పుకుంటారు. త‌ల్లి దండ్రుల‌తో మ‌హారాష్ట్రా కోంక‌ణ్ తీర ప్రాంతంలో, అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యాణాల‌లో 1600 కిలోమీట‌ర్లు  తిరి గాడు. ఎన్నో తెలుసు కున్నాడు. 

130 ఏళ్ల  మొస‌లికి  స్మార‌క‌చిహ్నం!  

నిమ్మీ, మిన్నీ, బ‌బ్లూ అని ఇంట్లోవారంతా ప్రేమ‌గా పిల్ల‌ల్ని అలా పిలుచుకుంటారు. అలానే ప్రేమ‌గా పెద్ద‌యినా పిలుస్తుంటారు. అలాగే పెంచుకున్న జంతువుల‌నీ విచిత్ర‌మైన పేర్లు పెట్టి పెంచుకుంటారు. ఛ‌త్తీస్‌గ‌డ్‌కి చెందిన బ‌స‌వ‌న‌న్ త‌న స్నేహితుడ‌యిన మొస‌లికి గంగారామ్ అని పేరెట్టుకున్నాడు. 130ఏళ్ల గంగారామ్ చ‌నిపోతే ఏకంగా స్మార‌కచిహ్నం కూడా నిర్మించాడు. అది స్నేహం విలువ‌! ఛ‌త్తీస్‌గ‌ఢ్ బెమెతర జిల్లాలోని బావా మొహతారా గ్రామానికి చెందిన బసవన్ తోటి పిల్ల‌ల‌తో క‌లిసి చెరువులో ఈత‌కొడుతూ ఆడుతూండేవాడు. అక్క‌డ కాస్తంత దూరంలో వాళ్ల పెద్ద‌వాళ్లు బ‌ట్ట‌లూ ఉతుకుతుంటారు. ఈత‌కొట్టే చెరువులో మ‌ధ్య‌లో నాలుగయిదు చిన్న మొస‌ళ్లుండేవి. కానీ వాటికి ఎలాంటి ఇబ్బందీ క‌ల‌గ‌కుండా పిల్ల‌లు ఆడుతూండేవారు. హ‌ఠాత్తుగా ఒక‌రోజు వాటిలో ఒక మొస‌లి కూడా వారితో ఆట‌కి దిగింది. అన్ని మొస‌ళ్లు ప్ర‌మాద‌కారి కాదు, మ‌నుషుల‌తో స్నేహంగానూ ఉంటాయ న్న‌ది అది అలా నిరూపించింద‌న్న‌మాట‌! ఆ గ్రామం చెరువులో ఉండే ఈ స్నేహితుడికి గంగారామ్ అని పేరు పెట్టుకున్నారు పిల్ల‌లంతా. 2019లో త‌న 139ఏట గంగారామ్ మ‌ర‌ణించింది. దాన్ని ఆ గ్రామ‌స్తులు అలా వ‌దిలేయ‌లేదు. త‌మ బంధువుని కోల్పోయినం త‌గా బాధ‌ప‌డి, ప్రాణంలేని ఆ జీవిని అలా ఒడ్డుకి తీసుకువ‌చ్చి ఒక మంచిచోటు చూసి దానికి స్మార‌క చిహ్నం  ఏర్పాటు చేశారు. దాని అంతిమ‌సంస్కారానికి ఏకంగా 500 మంది వ‌చ్చార‌ట‌. ఆ రోజు ఎవ్వ‌రూ ఇంట వంట చేయ‌కుండా దిగులుగా ఉండిపోయారు ఒక మంచి మిత్రుడిని కోల్పోయామ‌న్న బాధ‌తో గ‌డిపారు.  ఇక్క‌డ చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో దాదాపు ప్ర‌తీ గ్రామంలోని చెరువులోనూ ఇలాంటి మొస‌ళ్లు చాలా క‌న‌ప‌డ‌తాయ‌ని నేచ‌ర్ క‌న్జ‌ర్వె న్సీ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌వారు తెలిపారు. జ‌న‌సంద్రం ఎక్కువ‌గా ఉండే గ్రామాల్లో ఇలా మొస‌ళ్లు ఉండ‌డం సాధార‌ణంగా భ‌యాన క‌మే. అయిన‌ప్ప‌టికీ చాలామ‌టుకు వారెవ్వ‌రూ వాట జోటికి వెళ్ల‌రు గ‌నుక అవి వారి జోలికి వెళ్ల‌వు అని నిపుణుల మాట‌. అవి ఉన్న పెద్ద పెద్ద చెరువుల్లోనే గ్రామ‌స్తులు త‌మ ప‌శువుల‌ను శుభ్రం చేయ‌డం,  దుస్తులు ఉత‌క‌డం వంటి ప‌నులు చేస్తూంటారు. కానీ మొస‌ళ్లు త‌మ పిల్ల‌ల‌తోనూ చెరువు గ‌ట్టున ఎండ‌కి సేద తీరుతుండ‌డం కూడా గ్రామీణులు చూసి ఆనందిస్తుంటారు. అంతా ఒకే గ్రామంలో ఉన్నాంగ‌నుక అంతా స్నేహితుల‌మే అన్న భావ‌న వాటిలోనూ ఉంటుందా.. ఏమో! 

చ‌ద‌రంగం నృత్యం..అద్భుత క‌ళావిన్యాసం

చ‌ద‌రంగం మైండ్ గేమ్‌. ఎంతో తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శించాలి. ఎదుటివారి ఆలోచ‌న‌లక అడ్డుక‌ట్ట‌వేయ‌గ‌ల‌గాలి. ముందే యుద్ధానికి స‌న్న‌ద్ధం కావ‌డం వంటిది. యుద్ధ తంత్ర‌మంతా ఇక్క‌డే ఆరంభ‌మ‌వుతుంద‌ని పూర్వం రాజుల కాలం నుంచీ ఉన్న‌దే. పాచి క‌లు, గ‌వ్వ‌లాట‌, వైకుంఠ‌పాళీ,.. ఇవ‌న్నీ దాటిన గొప్ప యుద్ధ‌తంత్రాన్ని ప్ర‌ద‌ర్శించేది చెస్‌. ఆధునిక కాలంలో జాతీయ అంత‌ర్జా తీయ పోటీలు నిర్వ‌హిస్తున్నారు. మాస్ట‌ర్, గ్రాండ్ మాస్ట‌ర్ టైటిల్స్‌తో విజేత‌ల‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. భార‌త్ సంప్ర‌దా య బ‌ద్ధ‌మైన ఆట తీరు నుంచి అత్యంతాధునిక ఆట‌లోనూ వ‌న్నె త‌గ్గ‌ని క్రీడాసామ‌ర్ధ్యం ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. అందుకో ఉదాహ‌ ర‌ణ విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌, ఇప్ప‌టి హంపీ. ఇదంతా ఆట‌ను చూడ‌డం, ప్లేయ‌ర్ల‌ను ప్ర‌శంసించ‌డంతో ఆనందం పంచుకుం టున్నాం. కానీ 44వ చెస్ ఒలింపియాడ్‌కి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కొత్త త‌ర‌హాలో చ‌ద‌రంగం అద్బుతాన్ని ప్ర‌ద‌ర్మ‌న చేయించి అంద‌రి మ‌న‌ సులూ దోచింది. అద్భుత కొరియోగ్ర‌ఫీతో చద‌రంగ నృత్య ప్ర‌ద‌ర్శ‌న! ఇది ఊహించ‌ని అద్భుత‌మ‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తు న్నారు. బోర్డు మీద ఆట‌ను ఆడ‌టం, చూడ‌డం కంటే ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చే ఆనందం మ‌రో అద్భుత‌మ‌ని దేశ‌మంతా వేనోళ్ల ప్ర‌శంసి స్తోంది. ఇది నిజానికి చూసి తీరాల్సిన‌దే.  తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో వివిధ జిల్లాలు ఆటను జరుపుకోవడానికి, ప్రోత్సహించడానికి మార్గా లను రూపొందించాయి. వాటిలో పుదుక్కోట్టై జిల్లా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుం ది. కొరియోగ్రఫీలో క్లాసికల్, జానపద, మార్షల్ఆర్ట్ అంశాలను మిళితం చేసి, వివిధ చదరంగం పిక్క‌లు ప్రాణం పోసుకోవడం, చదరంగం బోర్డ్‌పై యుద్ధంలో పాల్గొంటున్నట్లు చూపుతుంది. పుదుక్కోట్టై కలెక్టర్ కవిత రాము నృత్య దర్శకత్వం వహించిన ఈ నృత్య ప్రదర్శన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది, అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంది. పనితీరును మెచ్చుకున్న వారిలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ వీడియోను షేర్ చేస్తూ, అద్భుతం. కొరియోగ్రఫీ చేసాను, శ్రీమతి కవిత రాము, కలెక్టర్ పుదుక్కోట్టై ద్వారా తెలిసింది. చదరంగం పావులు మన ఊహల్లో సజీవంగా ఉండేలా చేస్తుంది. అలాగే, ఇది ప్రామాణికతను కలిగి ఉంది, ఈ గేమ్ భారతదేశంలో కనుగొనబడింది. బ్రావో! అని ప్ర‌శంసించారు. ఇటీవ‌ల‌  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రదర్శన క్లిప్‌ను వరుస ట్వీట్లలో వివరాలతో పాటు పంచుకున్నారు. రెండు ట్వీట్లలో, స్టాలిన్ ఇలా వివరించారు, “జిల్లా పరిపాలనని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాయి. ఈ అందమైన వీడియో పుదుక్కోట్టై జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందించబడింది, దీనిలో క్లాసికల్, ఫోక్, మాల్ యుథం , సిలంబం కళా కారు లు అద్భుతంగా మనల్ని సృజనాత్మక ఫాంటసీ ప్రపంచానికి తీసుకువెళ్లారు, ప్రత్యక్ష చెస్ పాత్రలుగా మార్చారు, ఆట సారాం శాన్ని దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారు.

 క్రోయేషియా వెళ్లి  తేళ్ల‌తో తిరిగివ‌చ్చింది!

ఎవ‌ర‌యినా వేస‌వి సెల‌వ‌ల‌కో, పోనీ స‌ర‌దా ట్రిప్ అని వేరే దేశాలకో, వేరే ప్రాంతాల‌కో వెళుతూంటారు. అక్క‌డ కొంత కాలం గ‌డిపిన త‌ర్వాత తిరిగి వ‌చ్చేప్పుడు అక్క‌డ న‌చ్చిన‌వి ఏదో ఒక వ‌స్తువు, దుస్తులో ఏదో ఒక‌టి కొని తెచ్చుకోవ‌డం ప‌రిపాటి. అవి చిర‌కాల జ్ఞ‌ప‌కాల‌నిస్తాయి. కానీ ఆస్ట్రేలియా నుంచి క్రోయేషియా వెళ్లిన ఒక మ‌హిళ అక్క‌డంతా తిరిగి ఇల్లు చేరింది. తీరా వ‌చ్చాక సూట్‌కేసు తెరిచి చూడ‌బోతే ఏకంగా ఒక తేలు కుటుంబ‌మే క‌నిపించి భ‌య‌ప‌డిపోయింది. అందులో ఒక‌టీ రెండు కాదు ఏకంగా త‌ల్లితో పాటు ప‌ద్దెనిమిది చిన్న తేళ్లున్నాయి! పైగా అన్నీ బ‌తికే ఉన్నాయి. ఇదెలా సాధ్య‌మ‌న్న‌ది ఆమెకీ అర్ధంకావ‌డం లేదు. అస‌లు అందులోకి ఎప్పుడు, ఎలా వ‌చ్చాయ‌న్న‌ది తెలీక ఖంగారుప‌డుతోంది. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ఏ చిన్న‌దో ముద్దాడి తే ఆసీస్ మ‌హిళ ప్రాణం పోయేదే.  క్రోయేషియాకి చెందిన ఆ తేళ్లు అరాక్నిడా జాతి తేళ్ల‌ని నిపుణులు తేల్చారు. అవి చిన్న‌విగా ఉన్నా కుడితే మాత్రం మ‌నుషుల ప్రాణాలు పోవ‌డం ఖాయం. ఈ జాతి తేళ్లు రెండువేల ర‌కాలు ఉన్నాయి. కానీ వీటిలో సుమారు 40 శాతం మేరకే విషపూరిత‌మని అన్నారు. అయితే క్రోయేషియాలో సాధార‌ణంగా క‌నిపించే తేళ్ల‌లో చాలామ‌టుకు ప్ర‌మాద‌క‌రం కాదుట‌. కానీ మంట‌, దుర‌ద‌, నొప్పి ఉంటుంద‌ని నిపుణుల మాట‌.  కాగా ఈ తేళ్ల‌ను ప్ర‌స్తుతం జాగ్ర‌త్త ప‌రిచామ‌ని, త్వ‌ర‌లో క్రోయేషియాకి తిరిగి పంప‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఇక‌నుంచీ విదేశాల‌కు, ముఖ్యంగా క్రోయేషియా ట్రిప్ వెళ్లిన‌వారంతా సూట్‌కేసులు జ‌ర జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. అందులోంచి ఏ బుజ్జి తేలో  హాలో అంటే..!

స్వీయ స‌ర్వేతో టీఆర్ ఎస్‌కు తంటాలు!

నువ్వెంత బ‌ల‌వంతుడివో తెలుసుకోవాలంటే ముందుగా నీ శ‌తృవు ఎవ‌రో తెలియాలి.. అనేది ఓ సామెత‌. అవును రాజుగారి స‌త్తా తెలిసేది సామంతులు చెప్ప‌క్క‌ర్లేదు, ఆయ‌న్ను ఎదిరించ‌గ‌ల ప‌క్క దేశం వారిని క‌దిలిస్తే చెబుతారు. ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కులు, పార్టీల‌కు మాత్రం స‌ర్వే చేయించుకునే స‌త్తా ఒక‌టి వ‌చ్చేసింది. రాష్ట్రంలో, దేశంలో త‌మ స‌త్తాను తామే తెలుసుకో గ‌ల్గుతున్నారు. ఎవ‌రికి వారికి స‌ర్వే బృందాల‌ను జ‌నంలోకి పంపించి కాయితాలు నింపించి మ‌రీ తెలుసుకుంటున్నారు మ‌నం, మ‌న‌వాడు ఏపాటి గ‌ట్టివాడ‌నే సంగ‌తి. అస‌లీమ‌ధ్య కాలంలో స‌ర్వేల‌కే మంచి డిమాండ్ ఉంది. పీకే అనే వ్య‌క్తి త‌న టీమ్‌తో క‌లిసి దేశ‌మంతా ఎవ‌రికి కావ‌ల‌సివ‌స్తే వారికి స‌ర్వే చేసేస్తుండ‌డంతో దీని మీద అన్ని పార్టీల‌కూ ఆస‌క్తి రెండింత‌ల‌ యింది. ఆ మ‌ధ్య హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణాలో ఆ టీమ్ శ‌ర‌వేగంతో ప‌నిచేసింది. అంత‌కంటే ముందే టీఆర్ ఎస్ ప‌ని తీరు మీద గ్రౌండ్ రిపోర్టు ఒక‌టి త‌యారు చేయ‌డం జ‌రిగింది. అన్న‌ట్టు ఇపుడు టీఆర్ ఎస్‌కు కొత్తగా ఐ పాక్ అనేదానితో ఒప్పందం అయింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక‌ల ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు విజ‌యావ‌కాశాలు అంత‌గా లేవు.  ఎప్పుడూ విజ‌యాన్నే ఆకాంక్షించే కేసీఆర్, కేటీఆర్‌కి ఈ నివేదిక మింగుడుప‌డ‌టం లేదు. నాయ‌కుడిని మెప్పించ‌డానికి మంత్రులే స్వ‌యంగా స‌ర్వేలు చేపట్ట‌డం ఆరంభ‌మ‌యింది. అంటే ఎవ‌రి జిల్లాలో వారు. అప్పుడు చాలా క్లియ‌ర్‌క‌ట్ రిపోర్టు వ‌స్తుంద‌న్న‌ది టీఆర్ ఎస్ ఆశ‌. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాలపై మంత్రి ఎర‌బెల్లి ద‌యాక‌ర్ స‌ర్వేలు చేయిస్తే స్టేషన్‌ఘనపూర్, పరకాల, మహబూబాబాద్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందట! కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు రిపోర్టులు తేల్చాయట. అటు ఖ‌మ్మంలోని ప‌దింట ఆరుచోట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని తేలింది.  రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సర్వే చేయించారట. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కుత్భూల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సానుకూలత లేదని తేలిందట. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంటుందట. వనపర్తి, నారాయణపేట్‌, మహ బూబ్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రెండోసారి గెలిచిన పరిస్థితి లేదని తేలింది. మొత్తానికి దేవ‌ర వారిని మెప్పించ‌డానికి మంత్రులు, ఎమ్మెల్యేలు చేయించుకున్న స్వీయ స‌ర్వేలు అస‌లు వారి ప‌రిస్థితే అయోమ‌ యంగా ఉంద‌న్న సంతి వారికే స్ప‌ష్ట‌మ‌యి దిగులుతో ఊర‌కున్న‌ట్టు విశ్లేష‌కుల మాట‌. అస‌లు స‌ర్వే అనేది ప్ర‌జ‌ల మ‌న‌సును ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేవి. అంతేకాని నేత‌ల మ‌న‌సులో, సీఎంగారికి ఏం కావాలో చెప్పేవి స‌ర్వేలు ఎందుక వుతాయి. అంచేత  కేసీఆర్ అండ్ టీమ్ కి  ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల ప‌ట్ల సంపూర్ణ అవ‌గాహ‌న వ‌చ్చి ఉంటుం ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

గేమ్స్ లో కొన‌సాగుతున్న భార‌త్ హ‌వా

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బోణీ కొట్టింది. చాను రెండవ స్నాచ్ ప్రయత్నంలో 88కిలోల లిఫ్ట్‌తో తన కొత్త వ్యక్తిగత అత్యుత్తమమైన గేమ్స్‌ రికార్డును నెలకొల్పింది. మన దేశానికి తొలి మెడల్ ను మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించిపెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు.ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్‌.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్‌ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచి పోయాడు. కాగా, గురురాజా పూజారి, కెనడాకు చెందిన యూరి సిమర్డ్ మధ్య జరిగిన పోరులో గురురాజా క్లీన్ అండ్‌ జెర్క్ లో తన మూడవ ప్రయత్నంలో 151కిలోలు ఎత్తి, పురుషుల 61కిలోల ఫైనల్‌లో మొత్తం 269కిలోలతో పూర్తి చేయడంతో  గురు రాజకు కాంస్య పతకం కైవ‌సం చేసుకున్నాడు. ఘనాతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యం సాధించి 5-0తో విజయం సాధించింది. అలాగే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇండియన్ బాక్సర్ శివ థాపా 63 కేజీల విభాగంలో పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌‌ను 5-0తో విజయం సాధించారు. మహిళల టీటీ జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది. మిక్స్‌డ్ టీం గ్రూప్-ఎ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 3-0తో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, మిక్స్‌డ్ డబుల్స్ జట్టు తమ మ్యాచ్‌లను గెలిచి ఇండియాను 2-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు. పురుషుల మారథాన్ రేసులో భారత ఆటగాడు నితేంద్ర సింగ్ రావత్ 12వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల రావత్ 2 గంటల 19 నిమిషాల 22 సెకన్లలో ఉగాండాకు చెందిన విక్టర్ కిప్లాంగట్ (2:10:55)పై గెలిచాడు. కాగా స్క్వాష్ పోటీల్లో భారత క్రీడాకారిణి జోషన చినప్ప 11-8, 11-9, 12-10తో బార్బడోస్‌కు చెందిన మీగన్ బెస్ట్‌పై గెలుపొందిం ది. సౌరవ్ ఘోసల్ 11-4, 11-4, 11-6తో శ్రీలంకకు చెందిన షామిల్ వకీల్‌పై విజయం సాధించాడు. ఇక సైక్లింగ్ మహిళల స్ప్రింట్ క్వాలిఫైయర్‌లో భారతదేశానికి చెందిన మయూరి , పాల్ వరుసగా 20వ ,  23వ స్థానాల్లో నిలిచారు. 1/8 ఫైనల్స్‌కు అర్హత సాధించిన టాప్ 16లో పూర్తి చేయడంలో విఫలమయ్యారు.