దిల్లీలో కుల్దీప్ జోరు..ద‌క్షిణాఫ్రికా ఘోర‌ప‌రాజ‌యం  

డీకాక్‌, మార్క్‌ర‌మ్‌, హెండ్రిక్స్, మ‌లాన్వంటి హేమాహేమీ లం తా ఆఖ‌రికి క్లాసెన్‌తో స‌హా పేక‌ ల్లా ప‌డిపోయారంటే క్రికెట్ అభి మానులు అస్స‌లు న‌మ్మ‌డం లేదు. అంత‌టి ద‌క్షిణాఫ్రికా జ‌ట్టూ కేవ‌లం 99 ప‌రుగుల‌కే డ‌గౌట్‌కి చేరిందంటే గిల్లుకుని అవును నిజ‌మే నంటున్నారు. భార‌త్ బౌల‌ర్లు ముఖ్యంగా స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ చాలాకాలం త‌ర్వాత స్పిన్ తంత్రం అద్బు తంగా ప్ర‌యోగించడంతో ద‌క్షిణా ఫ్రికా 27.1 ఓవ‌ర్ల‌లోనే 99 ప‌రుగుల‌కే చుట్టేసుకుపోయింది. భార‌త్ వంద ప‌రుగుల ల‌క్ష్యాన్ని 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పో యి సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కుల్దీప్ యాద‌వ్‌, ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ హైద‌రాబాదీ స్టార్ భార‌త్ పేస‌ర్ సిరాజ్ గెలు చుకున్నాడు.  భార‌త్ టాస్ గెలిచి బ‌వుమా జ‌ట్టుకు బ్యాటింగ్ అవ‌కాశం ఇచ్చింది. మ‌లాన్‌, డీకాక్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండో ఓవ‌ర్లోనే డీకాక్ వెనుదిరిగాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ బంతిని స‌రిగా అర్ధంచేసుకోలేక వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. అలా మొద‌లైన మేడ కూల‌డం ఊహించ‌ని విధంగా ప్రేక్ష‌కుల‌ను ఆనందం, ఆశ్చ‌ర్య‌భ‌రితం చేసింది. ఎందుకంటే 5ఓవ‌ర్ల‌కు 15 ప‌రుగులు, 10 ఓవ‌ర్ల‌కు 3 వికెట్లు కోల్పోయి 26 ప‌రుగులే చేసింది. ఇది నిజ‌మా క‌లా అనుకున్నారంతా. మ‌ర్క్‌ర‌మ్‌, క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. ఇక రెచ్చి పోతార‌నే ప్రేక్ష‌కులు అనుకున్నారు. ఎక్క‌డా, మ‌న బౌల‌ర్లు క‌ద‌ల‌నిస్తేగా. మార్క్‌ర‌మ్‌ను షాబాజ్ అవుట్ చేసే స‌మ‌యా నికి అత‌గాడు కేవ‌లం 9 ప‌రుగులే చేశాడు. ద‌క్షిణాఫ్రికా అలా కుంటుతూ 50 ప‌రుగులు చేరుకునేస‌రికి 4 వికెట్లు కోల్పోయింది. అసలు ఒక్క ఫోర్ చూద్దా మ‌న్నా అప్ప‌టికి 50 బంతుల‌యిపోయా! క్లాసెన్ కాస్తంత చేతులు ఝాడించి ప‌రు గులు తీయ‌నారం భిం చాడు. 19వ ఓవ‌ర్‌కి డేవిడ్ మిల్ల‌ర్ పెవిలియ‌న్ దారి ప‌ట్టి మ‌రింత కొంప‌ముంచాడు. అలా 20 ఓవ‌ర్ల‌కు 6 వికెట్లు కోల్పోయి 73 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. భార‌త్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ తిప్పేయ‌డం ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ ర్ల‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కూ త‌ప్ప కుండా గుర్తుంటుంది. వీడెవ‌డ్రా బాబూ.. అనుకునే ఉంటారు! అలా బౌల‌ర్ల ధాటికి లొంగిపోయిన ద‌క్షిణాఫ్రికా 27.1 ఓబ‌ర్ల‌లో 99 ప‌రుగులు చేసింది. స్టార్ బౌల‌ర్ కుల్దీప్ త‌న కోటా 4.1 ఓవ‌ర్ల‌లో 4.32 ఎకానమీతో 4 వికెట్లు తీసుకున్నాడు. కాగా సిరాజ్‌, ఆవేష్, సుంద‌ర్ కీల‌క స‌మ‌యాల్లో రెండేసి వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యానికి త‌మ వంతు పాత్ర వ‌హించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో క్లాసెన్ అత్య‌ధికంగా 42 బంతుల్లో 34 ప‌రుగులు, మ‌లాన్ 27 బంతు ల్లో 15 ప‌రుగులు చేశారంటే వారి ప‌రిస్థితి అర్ధ‌మ‌వుతుంది. న‌వ్వుకుంటూ డ‌గౌట్ కి వెళ్లిన భార‌త్ 100 ప‌రుగుల ల‌క్ష్యంతో రంగంలోకి దిగారు. కెప్టెన్ ధ‌వ‌న్‌, శుభ‌మ‌న్ గిల్ ఇన్నింగ్స్ ఆరం భించారు. భార‌త్ మొదటి 5 ఓవ‌ర్ల‌కే వికెట్ న‌స్టపోకుండా 35 ప‌రుగులు చేశారు. గిల్ 20 బంతుల్లో 24 రుగులు చేశాడు. ఆరో ఓవ‌ర్లో ధవ‌న్ ర‌నౌట్ అయ్యాడు. అత‌ను  కేవ‌లం 8 ప‌రుగులే చేశౄడు. భార‌త్ ప‌దో ఓవ‌ర్‌కి 1 వికెట్ న‌స్ట‌పోయి 53 ప‌రుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో ఇర‌గ‌దీసిన ఇషాన్ కేవ‌లం 18 బంతుల్లో 10 ప‌రుగులే చేసి వెనుదిరిగి అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచాడు. చిన్న స్కోర్ అయినా ఇలా అవుట‌వ‌డం ప్రేక్ష‌కులు కొంత ఆగ్ర‌హానికీ గుర‌య్యారు. ల‌క్నో మ్యాచ్ హీరో శ్రేయ‌స్ అయ్య‌ర్ గిల్ తో క‌లిసి వీర‌బాదుడు ఆరంభించాడు. దాంతో 15 ఓవ‌ర్ల‌కు భార‌త్ 77 ప‌ర‌గుల‌కు చేరుకుంది. 16వ ఓవ‌ర్‌కు 85, 18.2కి 97 రుగులు చేసింది. ఇక్క‌డే గిల్ పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. అప్ప‌టిదాకా అద్భుతంగా ఆడి 49 ప‌రుగుల చేశాడు. త‌ర్వాత శాంస‌న్‌, శ్రేయాస్ లు  ఇన్నింగ్స్ మ్యాచ్ ముగించేశారు. శ్రేయ‌స్ 23 బంతుల్లో 28 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. దీంతో భార‌త్ సిరీస్ గెలిచి న‌ట్ట యింది. ఈ ఘ‌న విజ‌యంతో భార‌త్ బౌల‌ర్లు సెల‌క్ట‌ర్ల‌ను బాగా ఆక‌ట్టుకున్నారు. 

కొడాలి నాని హత్యకు కుట్ర..ట ?

ఆగండాగండి. తొందరపడకండి. హెడ్లైన్ చూసి, మాజీ మంత్రి కొడాలి నాని హత్యకు కుట్ర జరుగుతోందని, ఎవరో అలాంటి కుట్ర ఏదో చేస్తున్నారనినే నిర్ణయానికి వచ్చేయకండి. నిజానికి, ఆయన మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఒక విధమైన డిప్రెషన్ లోకి  వెళ్ళారో ఏమో మనకు తేలియదు కానీ  ఆ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయిన,  పశువుల కొష్టంలో మాజీ మంత్రి పడక సీన్ దృశ్యాలు చుసిన వారు మాత్రం ఆయన  డిప్రెషన్ లోకి వెళ్లారనే నిర్ణయానికే వచ్చారు. సరే, ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళారో లేక ఇంకేదైనా పనిలో బిజీ అయిపోయారో ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడ అంతగా కనిపించ లేదు. వినిపించడం లేదు.  నిజానికి మాజీ మంత్రి కొడాలి నాని మాత్రమే కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ లో పని చేసిన మాజీ మంత్రులు చాలా వరకు సైలెంటై పోయారు. ఇప్పటికే, మూట కట్టుకున్న పాప, పుణ్యాలు చాలనుకున్నారో జనంలోకి వెళ్లి ‘దీవెనలు’ అందుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ, చాలా వరకు పార్టీ కార్యకలాపాలకు కూడా మాజీలు  దూరంగానే ఉంటున్నారని అంటున్నారు.  అయితే, ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, గడపగడపకు కార్యక్రమం విషయంలో అశ్రద్ధ వహిస్తే, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని  గట్టిగా హెచ్చరిక చేయడంతో మాజీ మంత్రులు మెల్ల మెల్లగా కదులుతున్నారు. నిజానికి గడపగడపకు వెళ్ళినా ఇంటింటికి వెళ్లి మనిషి మనిషికి వంగి వంగి దండాలు పెట్టినా  జనం వైసీపీకి మరో అవకాశం లేదని, ముఖం మీదనే చెప్పేస్తున్నారనుకోండి అది వేరే విషయం. నిజానికి, ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరికీ ఆ నిజం తెలిసి పోయింది. అయితే, ముఖ్యమంత్రి ముచ్చట ఎందుకు కాదనాలని, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మొక్కుబడిగా ‘లెక్క’ కోసం గడప గడపకు వెళ్లి వస్తున్నారు.  అదే క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని కూడా కొద్ది రోజులుగా నియోజక వర్గంలో ఇంటింటికి వెళ్లి దండాలు పెడుతున్నారు. పనిలో పనిగా నోటికి పని చెబుతున్నారు. తనదైన స్టైల్లో తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీడియాను తమ వైపు తిప్పుకునేందుకు  జగన్ రెడ్డిని కాసింత ప్రసన్నం చేసుకునేందుకు, జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని తెలుగు దేశం పార్టీలో చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీలో నెంబర్ టూ గా ఎదిగి పార్టీ కోసం పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్ ను కాదని సిన్మాల్లో జీగా ఉన్న జూనియర్ ఎన్టీఅర్ పార్టీ పగ్గాలు చేపట్ట్టాలని తెలుగు దేశం పార్టీ నేతలు కోరుకుంటున్నారని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. నిజానికి, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ రియాక్ట్ అయిన తీరుతో ఆయన తెలుగు దేశం పార్టీకి మరింతగా దూరమయ్యారనే అభిప్రాయమే అందిరిలో వుంది. అలాంటిది  జూనియర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నాయకులే కోరుకుంటున్నారంటే, అంతకు మించిన అభూత కల్పన,  దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉండదని, కొడాలి అనుచరులే అంటున్నారు. ఇదే క్రమంలో కొడాలి నానీ, తాను చంద్రబాబు నాయుడు కుట్రలపై నిజాలు చెబుతుండడంతో.. తనను హత్య చేయించే ప్రయాత్నాలు చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని ఎవరూ నమ్మని.. ఎవరిదాకానో ఎందుకు  కనీసం ఆయన అంతరాత్ర్మ అయినా నమ్మని పచ్చి అబద్ధాన్ని చెప్పుకొచ్చారు. అయినా తాను దేనికీ భయపడేది లేదని ముక్తాయింపు నిచ్చారు, అయితే, హత్యలు చేసిది ఎవరో, చేయించేది ఎవరో... ఆదరికీ తెలిసిన విషయమే. అయితే, రాజకీయంగా ఇప్పటికే  అయిపోయిన  నాని, ఈ విధంగా సానుభూతి సంపాదించాలని అనుకుంటునట్లున్నారు.. అదీ కొడాలి నాని హత్యకు కుట్ర ? హెడ్డింగ్ వెనక ఉన్న కథ.

బోర్ కొట్టు..మందు తాగు!

అదేదో సినిమాలో భారీ ఆయిల్ పైపులు అండ‌ర్‌గ్రౌండ్‌లో అమ‌ర్చి విల‌న్ తాలూకు పేద్ధ ఆయిల్ ట్యాంక్ నుంచి అమాంతం రెండు మూడు రోజుల్లో ఆయిల్ అంతా లాగేస్తారు. అప్ప‌టివ‌ర‌కూ పేద్ద ఆయిల్ ట్యాంక్ ని పెద్ద మేడ‌లో కిటికీలోంచి చూసుకుంటూ విల‌న్ తెగ ఆనందిస్తుంటాడు. కానీ ఓ మ‌ధ్యాన్నం అంతా అయిపోయి ఒక్క ఫోన్ కాల్ కోట్ల ఆస్తిని తుడిచేస్తుంది. ఇంత కాకున్నా ఆ మొద‌టి భాగం మాత్రం వాస్త వంగా ఒక గుడుంబా కింగ్ ప‌క్కా జిరాక్స్ చేశాడు మ‌రో విధంగా.. లాభం చేకూరేలా! అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఒక గ్రామంలో నీర‌సంగా ఒక వ్య‌క్తి బోరు ద‌గ్గ‌ర‌కి వెళ్లాడు. పంపు కొట్ట‌గానే నీళ్లు వ‌చ్చాయి. అవి మంచినీళ్ల నుకుని నోట్లో పోసుకోగానే ఏదో తేడా అనిపించింది. రెండురోజుల క్రితం తాగిన సారా గుర్తొచ్చింది. అనుమానించి మ‌ళ్లీ కొంచి బ‌లంగా బోర్ కొట్టి చిన్న గ్లాసు నింపుకుని మ‌రీ తాగి అదే.. అని తెగ ఆనంద‌ప‌డుతూ అరుస్తూ తాగి తూలి ప‌డ్డాడు.  కొంత‌మంది అటుగా వెళుతూ ప‌డిపోయిన ఈ వ్య‌క్తి ని చూసి ఈడ గూడ మందుకొట్టి  ప‌డ్డాడ్రా  అనుకుని ద‌గ్గ‌రి కెళ్లారు. పంపుకొట్టి నీళ్లు అనుకుని అదే గ్లాసుడు అత‌ని మీద పోశారు. ఠ‌క్కున లేచి నోరెళ్ల‌బెట్టి మ‌రీ తాగాడు. ఏందిరా అయ్యా.. అంటే.. మందు.. మందురా బాబు.. మందు! అంటూ అరిచి  గోల చేశాడు.  వ‌చ్చినవాళ్లు ఆశ్చ‌ర్యంగా, కాస్తంత ఖంగారుగానూ అత‌నికేసి చూశారు. మావా ఇందులోనే  ఏదో మ‌త్తు ఉంది అంటూ ఓ కుర్రాడు. ప‌డిపోయిన ఆ వ్య‌క్తిని అవ‌త‌ల‌కి తీసికెళ్లి కూచోబెట్టాడు. అప్పుడు ఆ పంపు ర‌హస్యం చెప్పాడు. బోర్ నీల్ల‌నుకునేర్రా..అది మందు! అని అన్నాడు. ఆ కుర్రాడికి గీత వినిపించి నంత యింది. ప‌రుగున వ‌చ్చి అత‌నూ బోర్ కొట్టాడు.. అవును అత‌ను చెప్పింది క‌రెష్టే..మావా.. అన్నాడు రెండు గుక్క‌లు తాగి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఒక గ్రామంలో సీన్ ఇది. అక్క‌డ అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా చేసేవారు, లోకంలో ఎవ్వరూ ప్ర‌ద‌ర్శించ‌లేని తెలివి తేట‌లు ప్ర‌ద‌ర్శించి, జ‌నానికి మ‌ద్యం పోస్తూ డ‌బ్బు వీల‌యినంత గ‌ణిస్తున్నారు. అందులో భాగ‌మే ఈ బోర్ పంపు ఆలోచ‌న‌. ఇంత‌కీ విష‌య‌మేమంటే.. కొంద‌రు అక్ర‌మ‌మ‌ద్యం అమ్మే వాళ్లు పెద్ద పెద్ద మ‌ద్యం డ్ర‌మ్ములు భూమిలో పాతిపెట్టారు. పైన బోర్‌కి వాటిని క‌నెక్ట్ చేశారు. అంతే జ‌నానికి, పోలీసుల‌కి అనుమానం లేకుండా సాగుతూ వ‌చ్చింది. కానీ దొంగ‌ప‌ని ఎన్నాళ్లు సాగుతుంది?  తాగి తూలిన‌వారే ర‌గ‌స్యం బ‌య‌ట‌పెట్టేశారు!

ముగిసిన ములాయం అంత్య‌క్రియ‌లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇటావా జిల్లా సైఫాయి గ్రామంలో రాజ‌కీయ నాయ కులు, కుటుంబ‌స‌భ్యుల న‌డుమ  ప్ర‌భు త్వ లాంఛనాల‌తో  స‌మాజ్‌వాది పార్టీ అధినేత‌, మాజీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిములాయం సింగ్ యాద‌వ్‌ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ములాయం పార్ధివ దేహానికి ఆయ‌న కుమారుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాద‌వ్ చితిపెట్టారు. అంత‌కు ముందు, ఆయ‌న స్వ‌గ్రామం సైఫాయికి తీసుకు రాగానే పార్టీ నాయ‌కులు, పార్టీ అభిమానులు అనేక‌మంది నేతాజీ అమ‌ర్‌హై అంటూ మిన్నంటే నినాదా లు చేశారు. ములాయం (82) గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతూ సోమ‌వారం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న కుమార్తె  క‌విత‌, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌లురాష్ట్రాల నాయ‌కులు సైఫాయికి త‌ర‌లివెళ్లి ములాయం కు ఘ‌న నివాళులు అర్పించారు.  ములాయం పార్ధివ దేహాన్నిఉద‌యం ప‌దింటి నుంచే భారీ ప్ర‌ద‌ర్శ‌న‌తో మేలా గ్రౌండ్ ప్రాంగ‌ణానికి మ‌ధ్యాన్నం ఒంటిగంట స‌మ‌యానికి తీసుకువ‌చ్చారు.  సైఫాయి గ్రామ‌మంతా నేతాజీ అమ‌ర్ హై నినాదాల‌తో మిన్నంటింది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ములాయం అభిమానులు చివ‌రి చూపు కోసం వాహ‌నాల్లో పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాద‌వ్‌, ములాయం సోదరుడు శివ‌పాల్ యాద‌వ్ ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు ములాయం శ‌వ‌పేటిక‌తో ఉన్న ట్ర‌క్‌లో మేలా గ్రౌండ్‌కి చేరుకున్నారు. వేలాది మంది అభిమానులు  భారీ నినాదాల‌తో త‌మ ప్రియ‌త‌మ నాయకు నికి అశృనివాళి  అర్పించారు. సైఫాయి మేలా గ్రౌండ్ ద‌హ‌న వేదిక వ‌ద్ద‌కు చంద్ర‌బాబు, బీజేపీ నేత రీటా బ‌హుగుణా జోషీ త‌దిత‌ర నేత‌లు వ‌చ్చారు. 

పార్టీ పేరు మారితే.. భవిత మారుతుందా?

ఎవరి నమ్మకాలు వారివి. చేతులకు దారాలు కట్టుకుంటే పరీక్షల్లో పాసవుతామని పిల్లలు నమ్ముతారు. పిల్లలే కాదు పెద్దలు కూడా నమ్ముతారు. అలాగే, పేరు మారిస్తే కలిసొస్తుందని నమ్మే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎవరిదాకానో  ఎందుకు కర్ణాటక మాజీ  ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, యడ్యూరప్ప తమ పేరును యడ్యూరప్ప( Yeddyurappa) నుంచి  యెడియూరప్ప(Yediyurappa)గా మార్చుకున్నారు. అలాగే, న్యూమరాలజీ మీద నమ్మకమున్న మరి కొందరు నాయకులు, సినిమా ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా పేరును, పేరులోని అక్షరాలను అటూ ఇటుగా మార్చుకుని, తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న సందర్భాలు లేక పోలేదు. అయితే అందులో ఎంత మంది అదృష్ట గీతాలు మారాయో మాత్రం మనకు తేలియదు. అయితే ఇప్పుడు వ్యక్తులే కాదు. రాజకీయ పార్టీలు కూడా పేరు మార్చుకుంటే ఫలితం ఉంటుదనే ఆలోచనలు చేస్తున్నాయి. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస) గా మార్చారు. అయితే, తెరాస కలిసిరాని పేరా ? అంటే కానే కాదు. గతంలోనూ  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా ప్రయత్నాలే జరిగాయి. చెన్నా రెడ్డి మొదలు ఇంద్రా రెడ్డి వరకు పార్టీలు పెట్టారు, ఉద్యమాలు నడిపారు. కానీ సక్సెస్ కాలేక పోయారు. నిజానికి, ఈ అనుభవంతోనే కేసీఆర్ తెరాస స్థాపించినప్పుడు చాలామంది  ‘ఎంతమందిని చూడలేదు, ఈయనా అంతే’ అంటూ పెదవి విరిచారు. తెరాస కూడా పుబ్బలో పుట్టి మఖలో మాయమై పోవడం ఖాయమనే అనుకున్నారు. కానీ  ఏమి జరిగిందో అందరికి తెలిసిందే. తెరాస జెండా నీడనే  తెలంగాణ ప్రజల  60 ఏళ్ల కల నిజమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతే  కాదు, తెరాస జెండా నీడనే కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు ఇలా అయన కుటుంబంలోని ముఖ్యులు పదవులు పొందారు. బంధు, మిత్రుల వ్యాపారాలు వృద్ధి చెందాయి. ఎవరు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించారో లెక్కలు లేవు కానీ, తెరాస జెండా నీడన చాలామంది  అపర కుబేరులయ్యారని అంటారు. వ్యక్తుల విషయం ఎలా ఉన్నా  తెరాసకు దేశంలో ఏ పార్టీకీ లేనంత ఆస్తులు కూడా బెట్టారు. ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్ కొనే స్థాయికి పార్టీ ఎదిగింది. అయినా, జాతీయ రాజకీయాలలో జెండా ఎగరేసే లక్ష్యంతో తెరాస పేరును భారాసగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిలోంచి తెలంగాణని చెరిపేసి, దేశమంతా ఆమోదించే విధంగా ‘భారత’ పదాన్ని చేర్చారు. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారో,  దేశ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారో, చివరకు ఈ పేరు మార్పు ఎలాంటి ఫలితం ఇస్తుందో .. చూడవలసి వుంది.  అదలా ఉంటే వందేళ్ళు నిండిన భారత జాతీయ కాంగ్రెస్  పేరును మార్చే ఆలోచన ఒకటి ఈ మధ్య కాలంలో తెర మీదకు  వచ్చింది. కాంగ్రస్ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న కేరళ ఎంపీ శశి థ‌రూర్  భారత జాతీయ కాంగ్రెస్ పేరును యువ భార‌త్ కాంగ్రెస్ అంటూ మారిస్తే ఎలా ఉంటుంద‌నే చర్చను తెర మీదకు తెచ్చారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్రకు యువత నుంచి  వస్తున్న స్పందన నేపధ్యంగా ఆయన ఈ ప్రతిపాదన చేశారు. సరే, ఆయన ఈ సమయంలో ఇలాంటి ప్రతిపాదన ఎందుకు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ యువ ఓటర్లు  (నాయకులను) ఆకట్టుకునేందుకే ఆయన, ఈప్రతిపాదన చేశారా? లేక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చిన నేపధ్యంలో, కాంగ్రెస్ ఐడియాలజీ పునాదిగా,యువతకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనతో  థ‌రూర్ ఉన్నారా? అందుకే ఆయన తమ అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు వినిపించేలా గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారా, అంటే, ‘ఎస్’ ఆర్ ‘నో ‘అనే సమాధానం అయితే రావడం లేదు.అయితే, అదెలా ఉన్నా కాంగ్రెస్ పేరు మార్పు చర్చకు అయితే థ‌రూర్ తెర తీశారు. అయితే పేరు మారితే పార్టీ భవిత మారుతుందా? అంటే, ఏమో ... న్యూమరాలజీ , సంఖ్యా శాస్త్రం ఏమి చెపుతుందో ..చూడాలి.

మునుగోడు ఫలితంపైనే టీఆర్ఎస్ సిట్టింగ్ ల భవిష్యత్!?

మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ఏకంగా యుద్ధ వ్యూహమే రచించేశారు. చతురంగ బలాలను ముగుగోడులో మోహరించేశారు. మునుగోడులో విజయమో, వీరస్వర్గమో అన్నంత లెవెల్ లో ఆయన వ్యూహాలు, ప్రణాళికలూ రచిస్తున్నారు. ఫుట్ బాల్, బ్యాస్కట్ బాల్ వంటి ఆటల్లో మేన్ టు మేన్ అని ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు ప్రతి రెండు వేల మంది ఒటర్లకూ ఓ ఇన్ చార్జ్ ని నియమించడం ద్వారా కేసీఆర్ ఆ క్రీడా స్ట్రాటజీని వాడుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది.   మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం ఈ ఉప ఎన్నిక విజయాన్ని జీవన్మరణ సమస్యగా పరిగణిస్తున్నారు. మునుగోడు  ఉప ఎన్నిక  విజయంతోనే జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేయాలని ఆయన భావిస్తున్నారు. అంటే  మునుగోడు ఉపన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చును.   మునుగోడు ఉప ఎన్నికను తెరాస జాతీయ రాజకీయ ప్రస్థానానికి లాంచింగ్ ప్యాడ్ గా భావిస్తున్నారు. అందుకే.. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ మునుగోడుకు తోలారు. నియోజక వర్గాన్ని సాధ్యమైనన్ని ముక్కలు చేసి, ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క నేతను ఇంచార్జిగా నియమించారు. ఉపఎన్నిక పోలింగ్ వరకు ఇంటి ముఖం చూడకుండా, మునుగోడులోనే మకాం వేయాలని ఆదేశించారు. తాను కూడా 2500 ఓట్లున్న చిన్న గ్రామానికి ఇంచార్జిగా వెళుతున్నారు.  అలాగే ఈ విజయమే తెలంగాణలో టీఆర్ఎస్ కు ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకునే మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడులో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీ శ్రేణులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి ఒక చిన్న గ్రామం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా  నియమించారు. అలాగే మునిసిపాలిటీలలో ప్రతి రెండు వార్డులకు ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా పెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇంత వరకూ ఎమ్మెల్యేలకే పరిమితమైన క్యాంపు రాజకీయాలను ఇప్పుడు కేసీఆర్ ఓటర్ల వరకూ తీసుకువచ్చేశారు. దాదాపు ప్రతి రెండు వేల మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జ్ గా చేసి ఓటర్ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. మునుగోడులో తెరాసకు విజయం సాధించి పెట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించేశారు. వారికి వారికి కేటాయించిన గ్రామాలు, వార్డులలో తెరాసకు పోలైన ఓట్ల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వారికి పార్టీ టికెట్ అన్న కండీషన్ పెట్టారని టీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి. 

సంజూకి చేజారిన వ‌ర‌ల్డ్‌క‌ప్ అవ‌కాశం

ఎంత బాగా ఆడినా, ఎంత‌గా ప్ర‌శంస‌లు పొందినా కొంద‌రికి దురదృష్టం వెన్నాడుతూనే ఉంటుంది. చాలా కాలం నుంచి భార‌త్ జ‌ట్టులో కీల‌క‌పాత్ర‌వ‌హించి జ‌ట్టు విజ‌యాల్లో పాలుపంచుకోవాల‌నుకున్న స్టార్ బ్యాట్స్ మ‌న్‌లు ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టుకి ఎంపిక కాకుండా జ‌ట్టుకు దూరం కావ‌డం జ‌రుగుతూనే ఉంది. అం దుకు పెద్ద ఉదాహ‌ర‌న వివిఎస్ ల‌క్ష్మ‌ణ్‌. ఇపుడు సంజూ శాంస‌న్‌. సంజూ 2022  ప్ర‌పంచ‌క‌ప్ కి చివ‌రి నిమి షంలో అవ‌కాశం కోల్పోయాడు.  సంజూ ఇటీవ‌ల ఎంతో అద్భుతంగా రాణిస్తున్న బ్యాట‌ర్ల‌లో ఒక‌డు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డుతు న్న వ‌న్డే సిరీస్ మొద‌టి మ్యాచ్‌లో 63 బంతుల్లో 86 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అత‌ని ఇన్నిం గ్స్ సెల‌క్ట‌ర్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప్రేక్ష‌కులు, తోటి ప్లేయ‌ర్లు అత‌న్ని వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో ఉండా ల‌ని కోరు కున్నారు. కానీ అత‌నికి దినేష్ కార్తిక్‌, రిష‌బ్ పంత్ గ‌ట్టిపోటీనే ఇచ్చారు. రాంచీలో జ‌రిగిన రెండో మ్యాచ్ లో కూడా 36 బంతుల్లో 30 ప‌రుగులు చేయ‌డంలో జ‌ట్టు కీల‌క‌ద‌శ‌లో ఇన్నింగ్స్‌ను నిల‌బెట్ట డంలో న‌మ్మ‌ద‌గ్గ బ్యాట‌ర్‌గా ఆక‌ట్టుకున్నాడు. శ్రేయ‌స్ అద్బుత సెంచ‌రీ చేయ‌డంతో సిరీస్ బెస్ట్‌ ప్లేయ‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ, సంజూ శాంస‌న్ ఎంతో మంచి ప్లేయ‌ర్‌గా అంద‌రి మ‌న్న‌న‌లు అందు కున్నాడు.  ద‌క్షిణాఫ్రికా, భార‌త్ వ‌న్డే సిరీస్‌లో సంజూ త‌న స్థాయిని ప్ర‌ద‌ర్శించ‌డానికి, సెల‌క్ట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి కాయ క‌ష్టం చేశాడు. కానీ అదృష్టం వ‌రించ‌లేదు. అత‌ని స్థానంలో రిష‌బ్ పంత్‌, దినేష్ కార్తీక్‌ల‌కు అవ కాశం ఇచ్చారు. అయితే, బ్యాటింగ్ లైన్లో 5వ స్థానంలో చెప్పుకోద‌గ్గ బ్యాట‌ర్‌గా సెల‌క్ట‌ర్లు గుర్తిం చారు. అయితే, దినేష్ కార్తీక్ కూడా లేట్‌గా గొప్ప గుర్తింపు పొందిన ప్లేయ‌ర్‌గానే గుర్తింపు పొంది జాతీయ‌ జ‌ట్టు లోకి రావ‌డం గ‌మ‌నార్హం.

స‌ర‌దాప‌డింది..స‌ర‌దా తీరుస్తోంది!

కుక్క‌పిల్ల‌ని పెంచుకోవ‌డం అంద‌రికీ స‌ర‌దానే. ప‌క్కింటివారింట్లో చూసి తాను కుక్క‌పిల్ల‌ని పెంచుకోవా ల‌ని మారాం చేస్తుంది మిన్నీ. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ విదేశీ కుక్క‌పిల్ల కావాలంటే మాత్రం కొం చెం ఆలోచించాలి. ఎందుకంటే కుక్క‌పిల్ల‌ల్లో అనేక‌జాతుల‌వి ఉంటాయి. అన్నీ ఎంతో ముచ్చ‌ట‌గా ఉం డ‌వు. కొన్ని చాలా భ‌య‌పెడుతూంటాయి కూడా. సూ యూ ఇలానే కుక్క‌పిల్ల‌ని తెచ్చుకుని ఇపుడు భ‌య ప‌డుతోంది! బంతి విసిరి తీసుకుర‌మ్మ‌ని అన‌గానే చెవులు, తోక ఆడించుకుంటూ ప‌రుగున వెళ్లి తేవ‌డంలో పిల్ల‌కి, కుక్కపిల్ల‌కి స్నేహం కుదురుతుంది. కానీ అలా కాకుండా కుక్కే ఇదెక్క‌డి గోల సుఖంగా ఉండ‌నీయ‌దీ పిల్ల అనుకుంటే?! స‌రిగ్గా అదే జ‌రిగింది సూ యూ కి. చైనా యున్నాన్ ప్రావెన్స్‌కి చెందిన ఈ అమ్మాయి కుక్క పిల్ల‌ను పెంచుకోవాల‌నే అనుకుంది. మంచి జాతి కుక్క‌పిల్ల‌యితే బావుంటుంద‌ని ఎవ‌రో చెప్పారు. అంతే త‌న ఊళ్లో కుక్క‌పిల్ల‌ల్ని, ప‌క్క ఊరివాళ్ల‌వీ ప‌ట్టించుకోలేదు. తెలిసిన‌వారు త‌మ యింట్లో రెండు న్నాయి ఒక‌టిస్తా మ‌న్నా లైట్ తీసుకుంది.  ఆమె త‌ల్లిదండ్రులూ పిల్ల గోల భ‌రించ‌లేక ప్ర‌త్యేకించి టిబెట‌న్ మాస్టిఫ్ జాతి కుక్క‌ని  తెచ్చారు.  దాన్ని చూడ‌గానే కుక్కా సింహ‌మా  అన్న‌ట్టుంది. పిల్ల , ఇంట్లో వారూ ఆశ్చర్య‌పోయారు. దీన్ని స‌ర‌దాగా ఆడిం చ‌డం కంటే  దాన్ని రోజూ చూడ్డానికే భ‌య‌ప‌డుతున్నారు. సింహానికి ఉన్నంత జుత్తు ఉంది. చూడ్డానికి ఏమాత్రం కుక్క‌ ల‌క్ష‌ణాలే లేవు. పైగా భారీ ఆకారంగా ఉండ‌డంతో అది ప్ర‌త్యేకించి హాల్లోనో, గ‌దిలోనో, తోట‌లోనో కొంత ప్లేస్ ఆక్ర‌మించుకుని కూచునే ఉంటుంది. ప‌డుకున్న‌ట్టే క‌న‌ప‌డుతుంది కానీ అన్నీ గ‌మ‌నిస్తూంటుంది. బంతి కాదు.. రాయి విసిరినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక దాన్ని తెచ్చుకుని ప్ర‌యోజ‌న‌మేమిటనుకున్నారంతా.  వాస్త‌వానికి టిబెట‌న్ మాస్టిఫ్ జాతి కుక్క‌లు మామూలుగా ఇంట్లో పెంప‌కానికి పెద్ద‌గా ప‌నికిరావు. వాటిని స‌ర‌దాగా ఆడించ‌డం, దానితో ఆట‌లాడ‌టం చాలా క‌ష్ట‌మ‌న్నారు దాన్ని గురించి తెలిసిన‌వారు. పైగా దాని వ్య‌వ‌హారం అంతా వింత‌గా ఉంది. ఎక్కువ‌గా బ‌య‌టికి రావ‌డానికి బ‌య‌ట ఆడించ‌డానికి అది యిష్ట ప‌డ‌దు. వీటిలో మ‌గ కుక్క‌లు  83 సెం.మీ పొడ‌వు పెరుగుతాయి. చిన్న కుక్క‌పిల్ల‌యినా చూడ్డానికి పెద్ద కుక్క‌లా క‌న‌ప‌డ‌తాయి, లొంగ‌దీసుకోవ‌డమూ క‌ష్ట‌మే. చుట్టుప‌క్క‌ల‌వారి కుక్క‌ల‌తో స్నేహంగా ఉండేట్టు య‌జ‌మానే నానా తంటాలు ప‌డి  స్నేహంగా ఉండేట్టు అల‌వాటు చేయాలి. మ‌రి  సు యూ ఏం చేస్తుందో?!

వైసీపీ రాజీ డ్రామాలతో రగులుతున్న రాజకీయం

నిజానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదు. ఒక వేళ ఎవరైనా అలాంటి డిమాండ్ చేసినా పట్టించుకోవలసిన అవసరం లేదు. రాజధాని సమస్య ఒక్క ఉత్తరాధ్రకో, మరో ప్రాంతానికో మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఐదు కోట్ల ఆంధ్రులకు సంబందించిన విషయం. నిజానికి, రాష్ట్ర విభజన అనంతరం గత టీడీపీ ప్రభుత్వం అందరి ఆమోదంతో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించింది. ఈ మేరకు  రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ  తీర్మానం చేసింది. ప్రతిపక్ష నేతగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా శాసన సభలో అమరావతి ఏకైక రాజధానిగా అంగీకరించారు. రాజధాని తీర్మానానికి వైసీపీ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రకటన చేసింది. అక్కడితో, ఏపీ రాజధాని చర్చ ముగిసిపోయిందనే  అందరూ అనుకున్నారు. నిర్మాణ పనులు మొదలయ్యాయి , కొంతవరకు పూర్తయ్యాయి. అసెంబ్లీ, సెక్రటేరియట్, హై కోర్ట్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడి నుంచే పరిపాలన సాగిస్తోంది.   అయితే  వైసీపే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పని మడమ తిప్పని వంశంలో పుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు, మడమ తిప్పారు. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఆలోచనను తెర పైకి తెచ్చి తేనే తుట్టెను కదిల్చారు. రావణ కాష్టం రగిల్చారు. దీంతో  రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ళు అయినా, రాజధాని చుట్టూనే రాజకీయం నడుస్తోంది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన మూడు సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల మంటలను రాజేయడమే కాకుండా ఏ విషయంలోనూ స్థిరమైన అభిప్రాయం లేకుండా పిల్లి మొగ్గలు వేస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్  కోర్టు తీర్పులు ఏవీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకునే కుట్రలకు తెరతీశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అన్యాయంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రైతులు చేస్తున్న పాద యాత్రకు అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నారు.  మరో వంక అమరావతి రైతుల ధర్మ పోరాటాన్ని అడ్డుకునేందుకు   ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతో, మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మానవ హారాలు, ర్యాలీలు అంటూ వైసీపీ శ్రేణులు వీధుల్లోకి వచ్చాయి. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామలంటూ గర్జించారు. సవాళ్ళు విసిరారు. కానీ, అంతలోనే మళ్ళీ వెనకడుగు వేశారు. మూడు రాజధానుల కోసం రాజీనామాలకు సిద్దం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన తర్వాతి రోజే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా లేఖ మూడు రాజధానుల జేఏసీకి అందజేశారు. ఆ వెంటనే,ఇతర ఎమ్మెల్యేలు కూడా తాము సైతం రాజీనామాలకు సిద్ధమన్నారు. ఇతర ప్రాంతాల వైసీపీ నేతలు మేము సైతం.. అంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో  గత రెండు మూడు రోజులలో చోటు చేసుక్కున్న పరిణామాలు ఇక మూడు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు రావడమో లేకపోతే నేరుగా ముందస్తు ఎన్నికలు రావడమో ఖాయమన్న వాతావరణం కనిపించింది.  అయితే   ఒక్క రోజులోనే అనూహ్యంగా వైసీపే నేతలు అలవాటుగా మాట తప్పారు, మడమ తిప్పారు. సీనియర్ మంత్రి బొత్స, మరో మంత్రి అమర్నాథ్ రాజీనామాల వల్ల ఏం వస్తుందని ఎదురు ప్రశ్నించారు.  నిజమే,   బొత్స సత్యనారాయణ సెలవిచ్చినట్లుగా అధికార పార్టీ  ఎమ్మెల్యేలో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలో రాజీనామాలు చేయడం వలన ప్రయోజనం ఏం ఉండదు. నిజానికి రాజధాని విషయంలో ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు రాజధానిని మార్చే ప్రశ్నే లేదని,  అమరావతి రాజధానిగా కొనసాగుతుందని వైసీపీ ప్రజలకు హామీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఇల్లు కట్టుకున్నారని, అక్కడే రాజధాని ఉంటుందని ప్రస్తుత మంత్రులు కూడా అప్పట్లో ప్రజలకు హామీ ఇచ్చారు. జగన్ రెడ్డి సుదీర్ఘంగా సాగించిన పాదయాత్రలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ వైసీపీ నేతలు ఎవరూ మూడు రాజధానుల ముచ్చట కాదు కదా అధికార వికేంద్రీకరణ అనే మాటనే తీసుకోలేదు. కాబట్టి   ఇచ్చిన మాట తప్పిన వైసీపీ ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలనీ, మూడు రాజధానుల ఎజెండాగా మళ్లీ ఎన్నికలకు వెళదాం రమ్మని తెలుగుదేశం సవాల్ చేస్తోంది. ఇప్పడు బంతి వైసీపీ కోర్టులో వుంది. మంత్రులూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా విషయంలో వెనకడుగు వేయడంతో టీడీపీ మరింత గట్టిగా అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు  రావాలని వైసీపీని డిమాండ్ చేస్తోంది. దీంతో వైసీపీ కుడితిలో పడిన ఎలుకల కొట్టుకుంటోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారారా?

ఢిల్లీ లిక్కర్ స్కాం టీఆర్ఎస్ కాళ్ల కింద భూమిని కుదిపేస్తోందా? అంటే ఈడీ, సీబీఐల దూకుడు చూస్తుంటే ఔననే అనక తప్పడం లేదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ స్కాం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కాళ్ల కింద నేల కదిపేస్తుందని తొలుత భావించినా.. ఆ తరువాత దర్యాప్తులో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్న విషయాలు ఈ స్కాంలో కర్త,కర్మ,క్రియ మొత్తం తెలంగాణ గడ్డేనన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్కాం లింకులన్నీ తెరాస చుట్టే తిరుగుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలో తొలి అరెస్టు జరిగిన తరువాత ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక ఈ స్కాం కు సంబంధించి అనుమానితులలో ఒకరిద్దరిని అప్రూవర్ చేసుకుని కుంభకోణం నిగ్గు తేల్చే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ ముందుకు సాగుతున్నాయి. ఈ కేసులో తెలంగాణలో అభిషేకరావును అరెస్టు చేయడం ద్వారా లిక్కర్ స్కాం మూలల్లోకి దర్యాప్తు సాగుతోందని పరిశీలకులు అంటున్నారు.   ఢిల్లీలో లిక్కర్ పాలసీ మారిస్తే.. అందులో ఉన్న స్కాం మూలాలన్నీ తెలంగాణలోనే కనిపిస్తుండటం, అందులోనూ ఈ కుంభకోణంలో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పై ఆరోపణలు రావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఇప్పటి వరకూ మూడు అరెస్టులు జరిగాయి. అరెస్టయిన ముగ్గురిలో ఒకరు టీఆర్ఎస్ పెద్దలకు  సన్నిహితుడైన  బోయినపల్లి అభిషేక్ రావును ఒకరు. ఇప్పటికే ఆయనను సీబీఐ మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా ఆయనను విచారిస్తోంది. కానీ  రాబిన్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు పలు రకాలుగా అభిషేక్ రావుతో వ్యాపారాలు చేస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైను అరెస్టు చేయకపోవడమే పలు అనుమానాలకు తావిస్తోంది. అరుణ్ రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారిన కారణంగానే ఆయనను అరెస్టు చేయలేదని సీబీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు  అరుణ్ రామచంద్ర పిళ్లైను ప్రశ్నించిన అధికారులు ఆయన నుంచి స్కాం వివరాలన్నీ తెలుసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే సీబీఐ వద్ద ఈ స్కాం తెర వెనుక పెద్దలకు సంబంధించిన సమాచారం పూర్తిగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజులలో ఈ స్కామ్ కు సంబంధించి మరిన్ని అరెస్టులు  జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒక వేళ నిజంగానే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లైతే.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు, సంచలనాలు తథ్యమని, రాష్ట్ర రాజకీయాలలో కీలక వ్యక్తుల అరెస్టులు కూడా జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.  అందుకే డిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి టీఆర్ ఎస్ పెద్దగా స్పందించడం లేదనీ, అనవసరంగా ఈ స్కాం విషయంలో విమర్శలు, ఖండనలు చేసి మరింత కెలుక్కోవడమెందుకన్నట్లుగా గుంభనంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  పక్కా ఆధారాలు లభించడంతోనే ఈ కేసులో సీబీఐ, ఈడీలు దూకుడు పెంచాయనీ పరిశీలకులు అంటున్నారు. 

స‌మాజ్ వాదీ పార్టీకి  ఇక‌ క‌ఠిన ప‌రీక్షనే?

దేశ రాజ‌కీయ కుటుంబాల్లో పెద్ద‌దిగా పేర్కొనే కుటుంబ పెద్ద ములాయం సింగ్ యాద‌వ్‌. పైకి  ఎంతో స్నేహపూర్వ‌కంగా క‌నిపిస్తూనే క‌ఠిన నిర్ణ‌యాల‌తో ముందుకు న‌డిపించే స‌త్తా ఉన్న నాయ‌క‌త్వం ఆయ‌న ది. 36 సంవ‌త్స‌రాలు పాటు విక్ర‌మాదిత్య‌మార్గ్‌లో  వైట్ హౌస్ అని పార్టీ అభిమానులు పిలిచే విశాల‌మైన భ‌వంతిలో ఆయ‌న నిత్యం పార్టీ వారితో స‌మావేశ‌మ‌వుతూండేవారు. లోప‌ల రామ్‌సేవక్ యాద‌వ్‌, లోహి యా, మ‌ధు లిమాయే, చంద్ర‌శేఖ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌, రాజ్‌నారాయ‌ణ్‌, జానేశ్వ‌ర్ మిశ్రా వంటి హేమాహేమీల ఫోటోలే క‌న‌ప‌డ‌తాయి. ఈ వ‌రుస‌లో అంత‌టి స్థాయిలో దేశంలో మ‌న్న‌న‌లు అందు కున్న నాయ‌కుడు ములాయం. మూడు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రిగా చేసి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీకి తిరుగులేని చ‌రిత్ర‌ను సృష్టించ‌డంలో ములాయంసింగ్ యాద‌వ్ రాజ‌కీయ‌రంగంలో పార్టీల‌కు అతీతంగా అంద‌రి ఆద‌రాభిమానాలు పొందారు. ములాయం మరణంతో అఖిలేష్ తన తండ్రిని, ఎస్పీ దాని నాయకు డిని కోల్పోయారు. ఇక స‌వాళ్ల‌ను ధాటిగా ఎదుర్కొ నేందుకు మ‌రింత సిద్ధ‌ప‌డాలి. 1982లో ఫైర్‌బ్రాండ్ రాజ‌కీయ‌నాయ‌కునిగా తెర‌మీద‌కి వ‌చ్చి ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో త‌న ప్ర‌త్యేక ముద్ర వేశారు. 2018లో మాజీ ముఖ్య‌మంత్రులు త‌మ అధ‌కార నివాసాలు వ‌దిలేయాల‌ని తీర్పు ఇవ్వ‌ డంతో ములాయం విక్ర‌మాదిత్య‌మార్గ్ కు దూర‌మ‌య్యారు. అప్ప‌టి నుంచి ఆ బంగ్లా ఖాళీగానే ఉంది. ఇక్క‌డి నుంచే 1989లో అజిత్ సింగ్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ యుద్ధం చేశారు. అప్ప‌ట్లో ప్ర‌ధాని వీ.పీ.సింగ్ అజిత్ కు ఎంతో మ‌ద్ద‌తునిచ్చారు. 1990లో పోలీసులు క‌ర‌సేవ‌కుల‌పై దాడులు చేయ‌డం జ‌రిగింది. ఆ సంఘ‌ట న తో ఆయ‌న మౌనం వ‌హించారు. 1992 అక్టోబ‌ర్ 4న ములాయం ఇక్క‌డి నుంచే స‌మాజ్ వాదీపార్టీ ఆరం భించారు. మ‌రు సంవ‌త్స‌ర‌మే ఆయ‌న  మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ ఈ ప‌ర్యాయం త‌న పార్టీ త‌ర‌ఫునే బహుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీ ఎస్‌పి) మ‌ద్ద‌తుతో పీఠం అధి ష్టించారు. 1995లో రెండు పార్టీలు వీడి పోయి తీవ్ర‌స్థాయిలో విభేదించుకున్నా, ములాయం మాత్రం అధి కారంలో ఉండ‌గ‌లిగారు. అంతేకాదు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను త‌న చుట్టూ రెండు ద‌శా బ్దాలు తిరిగేట్టు చేయ‌ గ‌లిగారు.  అలాగే, 1996లో లోక్‌స‌భ‌కు మొద‌టిసారిగా ఎన్నిక‌యిన వెంట‌నే కేంద్రంలో ర‌క్ష‌ణ మంత్రి గానూ ప‌దవి చేప‌ట్ట‌డంతో ఎస్ పి పార్టీ ప్రాంతీయ‌త నుంచీ జాతీయ స్థాయిలో కీల‌క‌పాత్ర వ‌హించే స్థాయికి గుర్తింపు తెచ్చుకుంది. 2012లో యుపి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ గెలిచిన‌ప్ప‌టికీ ములాయం మాత్రం త‌మ్ముడు శివ‌పాల్ యాద‌వ్ అడ్డుకుంటాడ‌ని తెలిసినా,  త‌న కుమారుడు అఖిలేష్ కు రాజ‌కీయ వారస త్వాన్ని అం దించారు ములాయం. వాస్త‌వానికి త‌న కుమారుడికి అధికారం పూర్తిగా అందించే వ‌ర‌కూ త‌మ్ముడి రాజకీయ ఎత్తుగ‌డ‌ల‌నుంచీ కాపాడుతూ వ‌చ్చారు. క్ర‌మేపీ కుటుంబంలో శివ‌పాల్‌, అఖిలేష్ విభేదాల‌తో కు టుంబం రాజ‌కీయ ప‌టం మీద స‌త్తువ త‌గ్గింది. దీంతో మోదీ సార‌ధ్యంలో బీజేపీ యుపీలో విజృంభించింది. ఫ‌లితంగా రాష్ట్రంలో ఎస్‌.పీ పార్టీ రెండు ప‌ర్యాయాలు భారీ ఓట్ల తేడాతో  ఓడి పోయింది.  ఇక ఇపు డు పార్టీ మ‌రింత స‌మ‌స్య‌ను ఎదుర్కొనే అవ‌కాశ‌మూ ఉంది.   ఇన్నాళ్లూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జాతీయ రాజ‌కీయాల్లోనూ చక్రం తిప్పిన స‌మాజ్ వాదీ పార్టీ ములాయంసింగ్ (82)  మ‌ర‌ణంతో స‌మ‌స్య‌ల్ని ఎద‌ర్కొన వ‌ల‌సిన ప‌రిస్థితుల్లో నిలిచింది. 2013లో ఒక‌సారి అఖిలేష్ త‌న రాజకీయ ఎదుగుద‌ల గురించి మాట్లాడు తూ, గురువును వెనుక నుంచి గ‌మ‌నిస్తూనే ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అన్నారు. ములాయం సింగ్ తో తండ్రిగా, రాజ‌కీయ గురువుగారూ  అఖిలేష్  గొప్ప అనుబంధంతో ఉన్నారు. కానీ త‌న కుమారుడు రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌లై ఉండ‌డంతో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేక పోయాన‌ని ములాయం కూడా అన్నారు.  రెండోత‌రం నాయ‌కుడ‌యిన అఖిలేష్‌కీ రాజ‌కీయాలు  అంత సులువుగా సాగిపోయేంత‌టివి కావు. త‌న రాజ‌కీయ‌జీవితం అంతా రోల‌ర్ కోస్ట‌ర్ వంటిద‌ని ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటున్నానని,  తొలినాళ్ల‌లో రాష్ట్రంలో ఉన్న‌త‌వ‌ర్గాల ఆధిప‌త్యంతో ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాన‌ని, తాను వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తు ల‌కు చెందిన‌వాడిని క‌నుక రాజకీయంగా ఎన్న‌డూ మ‌ద్ద‌తు లేదని 1990ల్లో ఒక‌సారి ములాయం మీడియా తో మాట్లాడుతూ అన్నారు. అయితే 2012లో త‌న కుమారుడు అఖిలేష్‌కు త‌న రాజ‌కీయ‌వార‌స‌త్వాన్ని అంద‌జేస్తూ, ముఖ్య‌మంత్రి తండ్రిగా ఎంతో  గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని అన్నారు.  ఇక ఇప్పుడు పార్టీ అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తుంది. ములాయం మృతితో  రాష్ట్రంలో మారు మూ ల గ్రామాల‌కు పార్టీతో  ఉన్న‌సంబంధాలు దెబ్బ‌తినే అవ‌కాశాలున్నాయి. ములాయం, ఆయ‌న పార్టీని  ఇప్పటివ‌ర‌కూ బీజేపీ ఆగ‌డాల‌ను ఎదుర్కొన‌గ‌లిగిన గ‌ట్టి శ‌క్తిగా  విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రజాదరణను సృష్టించేందుకు కుల ఆధారిత వ్యాప్తితో మతపరమైన సమీకరణ ను కలిపిన బిజెపి బలీయమైన రాజకీయ యంత్రాంగా నికి పార్టీ వ్యతిరేకంగా ఉంది. అంతే కాకుండా, పార్టీ కొన్ని వర్గాల కోసం మాత్రమే పనిచేస్తుందనే భావనను తొలగిం చడానికి పోరాడుతోంది, పోషకాహార నెట్ వర్క్ లపై దృష్టి పెడుతుంది. అందరికీ అభివృద్ధిని చేర్చడానికి దాని పాత తరహా కుల రాజకీయాలను తిరిగి ఊహించలేము. లక్నో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మనోజ్ దీక్షిత్  ఇలా అన్నారు.. ఎస్పీ తన బ్రాండ్ ములాయం ను కోల్పోవడంతో బాధ తప్పదు. పార్టీలోని  ప్రతి  అంగుళాన్ని ఆయనే నిర్మించారు. ఇప్పుడు, విధే యు లు, కుటుంబంతో  సహా చాలా మంది  విడిపోతారు.  కానీ అప్పుడు, పార్టీ కొత్త రూపు దాలుస్తుంది, అఖి లేష్ తర్వాత  21వ శతాబ్దపు పార్టీ  దాని పూర్తి నియంత్రణను పొందుతుంద‌ని ఆయన అన్నారు. ములాయం మరణంతో అఖిలేష్ తన తండ్రిని, ఎస్పీ దాని నాయకు డిని కోల్పోయారు. ఇక స‌వాళ్ల‌ను ధాటిగా ఎదుర్కొ నేందుకు మ‌రింత సిద్ధ‌ప‌డాలి. మ‌రీ ముఖ్యంగా ఎస్‌పి కి చాలాకాలం నుంచీ పెట్ట‌ని కోట‌గా ఉన్న మ‌ణి పూర్‌, క‌నోజ్‌, సంబ‌ల్ వంటి  నియోజ‌క వ‌ర్గాల్లో పార్టీ ప‌ట్టు త‌ప్పిపోకుండా కాపాడుకోవా ల్సిన బరువు బాధ్య త అఖిలేష్ ఏ మేర‌కు స్వీక‌రిస్తారని, విప‌క్షాలు, ప్ర‌త్య‌ర్ధుల నుంచి స‌వాళ్ల‌ను ఏమేర‌కు ఎదుర్కొన‌గ‌ల్గు తార‌న్న‌ది చూడాలి. 

ఆత్మగౌరవానికి... అహంకారానికి మధ్య పోటీ మునుగోడు ఉప ఎన్నిక!

మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మునుగోడు ఉప ఎన్నికను నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికీ, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అహంకారానికీ మధ్య జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు. విశేషమేమిటంటే ఇప్పటిదాకా తెలంగాణ ఆత్మగౌరవం అన్న పదాన్ని గుత్తాధిపత్యంగా అట్టే పెట్టుకున్న తెరాస ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని వదిలేసి జాతీయ నినాదాన్ని ఎత్తుకుంది. అయినా అలవాటులో పొరపాటు అన్నట్లుగా కేటీఆర్ మాత్రం మునుగోడు ప్రజల ఆత్మగౌరవం అన్న నినాదాన్నిఎత్తుకున్నారు. అయితే ప్రత్యర్థి అయిన కమలం పార్టీ మాత్రం ఈ సారి జాతీయ నినాదాన్ని, జాతీయ వాదాన్ని ప్రస్తావించకుండా మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గతఎనిమిదేళ్లుగా తెరాస అధినేత కేసీఆర్ కాలరాసారని, అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శిస్తుంటే... మంత్రి కేటీఆర్ మాత్రం మునుగోడు ఉప ఎన్నికకు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అహంకారము, బీజేపీ అధికార దాహమే కారణమని దుయ్యబడుతున్నారు. ఎవరికీ అవసరం లేని, ఎవరికీ అక్కర్లేని ఉప ఎన్నికను బీజేపీ బలవంతంగా ప్రజల మీద రుద్దిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బలప్రదర్శన కోసమా అన్నట్లుగా బీజేపీ రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు తెరతీసిందని ఆరోపించిన కేటీఆర్, బీజేపీకి, రాజగోపాలరెడ్డికి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.  వేలకోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో జనాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఈరోజు ఉప ఎన్నికలు తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలానికి మునుగోడు ప్రజల జన బలం కి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని కేటీఆర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ధన దాహం, వేల కోట్ల రూపాయల ఆయన కాంట్రాక్టుల కోసమే వచ్చిన ఎన్నిక ఇదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యేగా అభివర్ణించారు. నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాల పట్టింపు లేకుండా  తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారిగా  రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అభివర్ణించారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల   రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.   వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరారని విమర్శించిన కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి ధన దాహంతోనే ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దారన్నారు.   బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమీషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.   చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బిజెపికి రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.  

శాఖాహార మొసలి తనువు చాలించింది!

సృష్ఠిలో హేతువుకు ఇంకా అందని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటికి కారణాలేమిటన్నవిషయంలో అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అదిగో అలాంటి విశేషం, వింతే మాంసం ముట్టని మొసలి. నిజమే  కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయం కోనేరులో ఉన్న మొసలి మాంసం ముట్టదు. అది పూర్తిగా శాఖాహారి. దాని పేరు పబియా. భక్తులు కోనేరులో స్నానాలు చేస్తున్నప్పుడు వారి వద్దకు వచ్చే ఆ మొసలిని చూసి వారెవ్వరూ భయపడరు. ఎందుకంటే అది  వారికి ఎలాంటి హానీ చేయదని వారికి తెలుసు కనుక.  అంతే కాదు.. క్రమం  తప్పకుండా ఆలయంలో  పూజ సమయంతో ఆ మొసలి  చెరువులోంచి బయటకు వచ్చి గుడిలో  స్వామి వారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని  తిరిగి చెరువులోకి వెఢుతుంది. జీవితాంతం ఆ మొసలి ప్రసాదం తినే బతికింది. కనీసం చెరువులో ఉన్న చేపలను కూడా అది ఎన్నడూ ముట్టలేదు. అందుకే ఆ మొసలి పబియా శాఖాహార మొసలిగా గుర్తింపు పొందింది. ఎంతో భక్తితో నైవేద్య సమయానికి దేవాలయంలోకి చేరి  స్వామివారి దర్శనం చేసుకుని నైవేద్యం స్వీకరించి, మరలా కోనేరులోకి పయనించే ఆ మొసలిని గుడిలో పూజారులూ, గుడికి వచ్చే భక్తులూ కూడా ఎంతో ప్రేమగా, బక్తిగా చూసుకుంటారు. అయితే ఆ శాఖాహార మొసలి సోమవారం (అక్టోబర్ 10) తెల్లవారు జామున మరణించింది.  పబియా మరణం పట్ల పూజారులూ, స్థానికులూ, భక్తులూ కూడా ఎంతో బాధపడ్డారు.  ఆ మొసలికి దేవస్థానం అధికారులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. 

 సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక ఎందుకు  ఆగింది?

కేంద్ర ప్రభుత్వం తదుపరి ప్రధాన న్యాయమూర్తి నామినేషన్‌ను ప్రారంభించడంతో సుప్రీంకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందు, ఈ నియామకాలపై నిర్ణ యం తీసుకునే కొలీజియంలోని ఐదుగురు న్యాయమూర్తులలో ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోలేని లేఖలను ఉపయోగించి ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళుతున్నా రని అభ్యంతరం వ్యక్తం చేశారు. గత నెలలో ఒక అపాయింట్‌మెంట్ ఓకే కాగా, మరో నలుగురిని నియ మించే అసంపూర్తిగా ఉన్న పని ఇప్పుడు మూసివేయబడిందని  కొలీజియం తాజా తీర్మానం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని కొలీజియంలో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు సభ్యులుగా ఉన్నారు, వీరిలో జస్టిస్ డివై చంద్రచూడ్ - సిజెఐగా తదుపరి వరుసలో ఉన్నారు . జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో విభేదించారు. సెప్టెం బరు 26న అధికారిక సమావేశం జరగడానికి ముందు “కొంత కాలంగా అనధికారిక చర్చలు జరుగుతున్నా యి, అక్కడ పదకొండు మంది పేర్లు పరిశీలించబడ్డాయని అక్టోబర్ 9  నాటి  ముగింపు తీర్మానం పేర్కొంది. సెప్టెంబరు 26న జరిగిన సమావేశంలో, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  దీపాంకర్  దత్తాను సుప్రీం కోర్టు కు ఎన్నుకోవడంపై  ఏకగ్రీవ అభిప్రాయం వచ్చింది”, కాబట్టి “ఆ మేరకు ఒక తీర్మానం ఆమోదించ బడింది. మిగిలిన 10 మంది న్యాయమూర్తుల పేర్ల పరిశీలన సెప్టెంబర్‌కు వాయిదా పడింది.  ఎందుకంటే కొంతమంది కొలీజియం సభ్యులు నిర్ణయం తీసుకునే ముందు ఇతర అభ్యర్థులపై మరిన్ని తీర్పులను కోరింది. దీంతో సమావేశం సెప్టెంబరు 30కి వాయిదా పడి మరిన్ని తీర్పులు వెలువడ్డాయని తాజా తీర్మానం పేర్కొంది. ముఖ్యంగా, సెప్టెంబర్ 26 మొదటి సారి గత తీర్పులను  ఒక ఆబ్జెక్టివ్ అసెస్ మెంట్ మేకింగ్  అనే  వ్యవస్థ ను ప్రవేశపెట్టింది. ఈ సమయంలోనే సీజేఐ తన నియామకాల ప్రతిపాదనను ఇతర నలుగురు సభ్యులకు లేఖలో పంపారు. జస్టిస్‌లు ఎస్‌కె కౌల్‌, జస్టిస్‌ కెఎమ్‌ జోసెఫ్‌ సమాధానాలు పంపగా, జస్టిస్‌లు చంద్రచూడ్‌, జస్టిస్‌ నజీర్‌లు అలంభించిన పద్ధతికి అభ్యంతరం తెలుపుతూ తిరిగి రాశారు. వారి లేఖలు ఈ అభ్య ర్థులలో ఎవరికీ వ్యతి రేకంగా ఎలాంటి అభిప్రాయాలను వెల్లడించలేదు" అని తాజా తీర్మానం పేర్కొంది. సీ.జేఐ  లలిత్ అక్టోబర్ 2న మరొక లేఖలో వారి కారణాలను లేదా పద్ధతికి ప్రత్యామ్నాయాలను కోరింది. ఇద్దరు న్యాయమూర్తులు సమాధానం ఇవ్వలేదు. "కాబట్టి, కొలీజియం ఏర్పాటు చేసే న్యాయమూర్తుల మధ్య చర్చ జరగడానికి ఈ విషయం చాలా సరైనది" అని అక్టోబర్ 9 నాటి తీర్మానం పేర్కొంది. ఈలోగా, తన వారసుడిని నామినేట్ చేయాలని సీ.జేఐ ని అభ్యర్థిస్తూ కేంద్ర న్యాయ మంత్రి నుండి ఒక లేఖ అందిందని అది జతచేస్తుంది. సీ.జేఐ లలిత్ పదవీకాలం నవంబర్ 9న ముగుస్తుంది.  ఈ పరిస్థి తుల్లో తదు పరి చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు మరియు సెప్టెంబర్ 30, 2022న జరిగిన సమా వేశంలో అసంపూర్తిగా ఉన్న పనులను తదుపరి చర్చలు లేకుండా ముగించారు” అని కొలీజియం చివ రికి తీర్మానించింది. అంటే వచ్చే నెలలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన నియామకాలు చేయవచ్చు.

పీక్స్ కు జగన్ ఫొటోల పిచ్చి!

ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అలా తయారైంది జగన్ పరిస్థితి. అ  వైసీపీ అధినేత‌, ఆంధ్ర సీఎం జగన్ కు ఫొటోల పిచ్చి బాగా ముదిరిపోయిందని అంటున్నారు పరిశీలకులు.  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జ‌గ‌న్ బొమ్మలతో రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు భారీ ఫోటో ఎగ్జిబిష‌న్ కూ సిద్ధ‌ప‌డ్డాయి. చిత్ర‌మేమంటే ఎల్‌పీఎం రికార్డుల్లోనూ ఆయ‌న ముఖ చిత్రం క‌న‌ప‌డేట్టు చేస్తున్నారు.  పూర్వం రాజుగారికి క‌లొచ్చింది.. హ‌ఠాత్తుగా ప్ర‌జ‌లంతా త‌న‌ను మ‌ర్చి పోయి ప‌క్క రాజ్యం రాజుని కుర్చీలో కూచోబెట్టిన‌ట్టు. అంతే పొద్దున్న లేవ‌గానే రాజ‌ధానిలో అన్ని గోడ‌ల‌కీ చిత్ర‌కారుల‌చేత త‌న బొమ్మ గీయించి పెట్టార‌ట‌! అలా ఉంది ప్రస్తుతం జగన్ తీరు.  ప్ర‌జ‌లు త‌నను మ‌ర్చిపోతారే మోన‌న్న భీతీ ప‌ట్టుకుందా అన్న అనుమానం కలుగుతోంది జగన్ కు పెరిగిన ఫొటోల పిచ్చి చూసి అంటున్నారు పరిశీలకులు. అన్ని ప్రాంతాల్లోనూ అన్ని కార్యాల‌యాల్లోనూ, వీల‌యితే అన్ని ప‌త్రాల మీదా  చిరునవ్వుతో చిద్విలాసంగా  ఉన్న త‌న ముఖార‌విందాన్ని జనానికి దర్శన భాగ్యం   క‌లిగించాల‌ని ప‌ట్టుద‌ల ప‌ట్టు కుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సమష్టి బాధ్యతను సాంతం ముఖ్యమంత్రి క్రెడిట్‌లో వేసి ఆయన్ను శాశ్వత ఆరాధ్యుడిగా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుకోసం ఎన్నెన్నో కొత్త దారులు వెతుకుతు న్నారు. సీఎంతో పాటు తమకు కొంత చోటు ఉండాలనుకుని అధికారులు కూడా వారి ఫొటోలు సిద్ధం చేసుకుంటున్నారు. వేలకోట్ల ప్రజాధనంతో చేపడుతున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి, మంత్రి, అధికారుల ఫొటోలు ఎందుకు? రైతులకు ఇచ్చే వ్యక్తిగత పట్టాలు, రికార్డులపై వారి ముఖచిత్ర ప్రదర్శన  దేనికోసం? అన్న అభ్యంతరాలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి.  ఇప్ప‌టికే అన్నింటా త‌న, తన తండ్రి పేరు మారుమోగేట్లు చేయ‌డానికి సంస్థలకు పేర్ల మార్పిడి ఉద్య‌మాన్ని చేప‌ట్టా రు. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. కానీ వాటిని ఇసుమంతైనా పట్టించుకోని జగన్  ఇక ఇప్పుడు ఫోటోల‌ ఉద్యమం చేపట్టారు.  కరపత్రాల మీద బొమ్మ స‌హ‌జం. అది అన్ని పార్టీల‌వారూ ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసే ప‌నే. కానీ ఈయ‌నకు ఎన్నిక‌ల బొమ్మ స్ప‌ష్ట‌మ‌యిన‌ట్టుగా ఉంది. అందుకే అన్నింటా త‌న స్టాంప్ ఉండాల‌ని కోరుకుంటున్నారు.   అందుకే భూ రికార్డులపైనా తన ఫొటోలే. మూడేళ్ల పాల‌న త‌ర్వాత ప్ర‌జ‌ల‌నుంచి ఎలాంటి మంచి మాటా విన‌బడక పోవ‌డంతో ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా త‌న వేపు తిప్పుకోవ‌డానికి, చేస్తున్న విశ్వ‌య‌త్నాల్లో ఈ ఫోటోల దాడి ఒక‌టిగా విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. అనేకానేక స‌ర్వేలు, గ‌డ‌ప గ‌డ‌ప‌కు వంటి కార్య‌క్ర‌మాల‌తో స‌హా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మ‌నే సూచ‌నే చేస్తుండ టంతో, ప్ర‌జ‌ల్లోకి ఈ విధంగా వెళ్లి ఫోటోతో విజ్ఞ‌ప్తులు చేయ‌డం గొప్ప మార్గంగా ఆలోచించార‌నే అనుకోవాలి.  ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల్లో ఎలాగూ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న బొమ్మే ఉంటుంది. కానీ అన‌వ‌స‌ర‌మ‌యిన చోట కూడా త‌న ముఖ‌ చిత్రంతో పొద్దున్నే ఎదురుకావ‌ల‌ని కోరుకోవ‌డం త‌నను, ప్ర‌భుత్వాన్ని కాపాడాల‌ని వేడు కోవ‌డ‌ంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికే విసిగెత్తిన ప్ర‌జ ఈ వేడుకోలును ఎలా అంగీక‌రిస్తారు. రాష్ట్రంలో ఎలాంటి ప్ర‌గ‌తీ లేదు, ఎవ‌రికీ పాల‌న ప‌ట్ల సంతృప్తి లేదు. ఈ పరిస్థితిలో అన్నిటా తన రూపే క‌న‌ప‌డాల‌న్న జగన్ ఆతృత  ఎబ్బెట్టుగా ఉందని జనమే అంటున్నారు.  

కమలం లక్ష్యం కారు కాదు కాంగ్రెస్సే!

మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అందులో అనుమానం లేదు. అధికార తెరాస మునుగోడును ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్న జాతీయ రాజకీయలకు లాంచింగ్ ప్యాడ్ గా భావిస్తోంది. అందుకే హడావిడిగా పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) గా మార్చుకుంది. అయితే, సాంకేతిక ఇబ్బందుల కారణంగా పేరు మార్పు ప్రక్రియ పూర్తి కాకపోయినా, పార్టీ నాయకత్వం మాత్రం బీఆర్ఎస్ ప్రస్థానం మునుగోడు గెలుపు నుంచే మొదలవుతుందని భావిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ మునుగోడుకు తోలారు. నియోజక వర్గాన్ని సాధ్యమైనన్ని ముక్కలు చేసి, ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క నేతను ఇంచార్జిగా నియమించారు. ఉపఎన్నిక పోలింగ్ వరకు ఇంటి ముఖం చూడకుండా, మునుగోడులోనే మకాం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా కేవలం 2500 ఓట్లున్న చిన్న గ్రామానికి ఇంచార్జిగా వెళుతున్నారు. అంటే  మునుగోడు ఉపన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చును.  మునుగోడు ఉప ఎన్నికను తెరాస జాతీయ రాజకీయ ప్రస్థానానికి లాంచింగ్ ప్యాడ్ గా భావిస్తుంటే, బీజేపీ, దక్షిణాదిన మరీ ముఖ్యంగా తెలంగాణలో పార్టీ విస్తరణకు ప్రవేశ ద్వారంగా భావిస్తోంది. మునుగోడులో గెలిస్తే తెలంగాణ తమ ఖాతాలో చేరినట్లేనని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా విశ్వశిస్తోంది.ఆ ప్రభావం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక పైనా ఎంతో కొంత ఉంటుందని భావిస్తున్నట్లు తెల్సుస్తోంది. అందుకే మునుగోడు  సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డిని, కాంట్రాక్టుతో కట్టిపడేసి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు.   నిజానికి, బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికకు తలుపులు తెరిచారు. నిజానికి మునుగోడు ఉపఎన్నిక బీజేపీ జాతీయ నాయకత్వం కోరి తెచ్చుకున్న ఉపఎన్నిక. కాబట్టి సహజంగానే  కమల పార్టీ, తమ  అంబుల పొదిలో ఉన్న, అన్నిఅస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అంతే కాదు ఉప ఎన్నికలో తెరాసను ఓడించేందుకంటే, కాంగ్రెస్ ను మూడవ స్థానానికి నేట్టివేసేందుకే వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, కారుకు కమలానికి మధ్య కాంగ్రెస్  అడ్డులేకుండా చేసుకునేందుకే, కమల దళం మునుగోడు ఉప ఎన్నికను కోరి తెచ్చుకుందని అంటున్నారు.  అయితే కాంగ్రెస్ పార్టీని మూడవ స్థానానికి పరిమితం చేయడం అయ్యే పనేనా అంటే మాములుగా అయితే, కాకపోవచ్చును కానీ హస్తం పార్టీ  ప్రస్తుతం ఎదుర్కుంటున్న అసాధారణ పరిస్థితుల్లో అంత ఈజీ టాస్క్ కాకపోయినా అసాధ్యం అయితే కాదని అంటున్నారు. మునుగోడు నియోజక వర్గాన్ని ఎంచుకోవడంలోనే బీజేపీ సగం గమ్యం చేరిందని విశ్లేషకులు అంటున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ కు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో ఉన్న పలుకు బడిని, పట్టును, ఇతర అనుకూల, ప్రతికూల అంశాలను బేరీజు వేసుకునే బీజేపీ మునుగోడును ఎంపిక చేసుకుందని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలో రాహుల గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలోనే ఉప ఎన్నిక జరిగేలా షెడ్యూలు ఖరారు చేయడం కూడా బీజేపీ వ్యూహంలో భాగంగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఉక్కరి బిక్కిరి చేసేందుకే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను ముందుకు తెచ్చిందని అంటున్నారు.  అదలా ఉంటే తాజా పరిణామాలను గమనిస్తే, బీజేపీ వ్యూహం కొంతవరకు పనిచేస్తున్నట్లే కనిపిస్తోంది. నిజానికి రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరినా, ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కూడా అయిన వెంకటరెడ్డి  మునుగోడు ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. నిజానికి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని నమ్ముకునే, పాల్వాయి స్రవంతి పోటీకి సిద్ధమయ్యారని అంటారు. అంతేకాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇష్టం లేకున్నా, వెంకట రెడ్డి సిఫార్సు మేరకే కాంగ్రెస్ అధిష్టానం, ఆమెకు టికెట్ ఇచ్చిందని అంటారు. కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి కూడా కోమటి రెడ్డి మీద ఎన్నో ఆశలు పెట్టు కున్నారు. ఈరోజుకు  కూడా ఆమె ‘అన్న వస్తాడు, గెలిపిస్తాడు’ అనే ఆశతోనే ఉన్నారు.అయితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కుటుంబ సమేతంగా ఈ నెల ( అక్టోబర్) 15 న విదేశాలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ ఆయన ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన  తర్వాతనే తిరిగొస్తారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార సారధి మధు యాష్కీ గౌడ్ సహా మరి కొందరు ముఖ్య నాయకులు మునుగోడు బాధ్యతల నుంచి తప్పు కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటి రెడ్డి విమానం ఎక్కేస్తున్నారు. కాంగ్రెస్ కు ఇదొక సెట్ బ్యాక్ అయితే, రాష్ట్రంలోకి  రాహుల గాంధీ భారాత్ జోడో యాత్ర ప్రవేశిస్తున్న నేపధ్యంలో, యాత్ర ఏర్పాట్లు, పర్యవేక్షణకు ఇప్పటికే మునుగోడులో బాధ్యతలు నిర్వహిస్తున్న మరి కొందరు సీనియర్ నాయకులను వెనక్కి పిలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సో .. ఈ పరిణామాలను  గమనిస్తే, బీజేపీ మునుగోడు లక్ష్యం తెరాసను ఓడించడం కాదు, కాంగ్రెస్ ను బలహీన పరచడమే  అని స్పష్ట మవుతోందని అంటున్నారు.

యాటిట్యూడే కేసీఆర్ జాతీయ ఆకాంక్షలకు అడ్డం పడుతోందా?

 టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణా ముఖ్య‌మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు మర్యాద గీత ఉంటుందన్న విషయాన్ని ఆయన ఎన్నడూ గుర్తించరు. రాజకీయ అవసరం, లబ్ధికి మించిన ప్రధానమైన అంశమేదీ  ఆయన దృష్టిలో ఉండదు. జాతీయ రాజకీయాలలో అజాత శత్రువుగా అందరూ గౌరవించే మలాయం సింగ్ యాదవ్ గత నెలన్నరగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నా ఒక్క‌సార‌యినా  వెళ్లి ప‌రామ‌ర్శించ లేదు.  కానీ  జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తన ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం ఆయన దేశ వ్యాప్తంగా పర్యటనలు చేసి పలువురు రాజకీయ నేతలతో భేటీ అయ్యారు. అంతేనాతనకు మద్దతు లభిస్తుందనుకుంటే.. వారికి చార్టర్ విమానాలు పంపి మరీ ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. అలాగే ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు చార్టర్ విమానాన్ని పంపించి మరీ రాష్ట్రానికి రప్పించారు. ఆయనతో భేటీ అయ్యారు. అయితే కేసీఆర్ జతీయ పార్టీ ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల నుంచీ, ఇతర పార్టీల నాయకుల నుంచీ అనుకున్నవిధంగా స్పందన  రాలేదు. ఇందుకు ఆయన యాటిట్యూడ్  కారణమని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆయ‌న‌కు రాజ‌కీయ ల‌బ్ధి ఆలోచ‌నే తప్ప ఏ రాజ‌కీయ‌పార్టీతోనూ, నాయ‌కుల‌తోనూ ప్ర‌త్యేకించి సత్సంబంధాలు పెట్టుకున్న‌ట్టు ప్రత్యేకించి రాజకీయ నేతలతో స్నేహ సంబధాలు పెనవేసుకున్న సందర్భమూ లేదు. ఆయన పొత్తులూ, ములాఖత్ లూ అన్నీ రాజకీయమే.  అందుకే అఖిలేష్ కు చార్టర్ ఫ్లైట్ పంపి మరీ ఆహ్వానించిన కేసీఆర్.. అదే అఖిలేష్ తండ్రి తీవ్ర అనారోగ్యంతో దాదాపు నెలన్నరగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే కేసీఆర్ కనీసం ఒక్కటంటే ఒక్కసారైనా వెళ్లి పరామర్శించలేదని రాజకీయ వర్గాలలో విమర్శలు వినవస్తున్నాయి.   ఇపుడు బీఆర్ ఎస్ పేర జాతీయ రాజకీయాల్లో  చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌కు ద‌క్షిణాది కంటే ఉత్త‌రాది రాజ‌కీయ పార్టీలు, నాయ కుల‌తో స్నేహ‌బంధాలను పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. చిత్ర‌మేమంటే ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న‌కు  ఉత్తరాది నుంచి ఎటువంటి మద్దతూ, ప్రోత్సాహం అభించలేదు. చివరాఖరికి పార్టీ పేరు మార్చిన సభకు హాజరైన   క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార స్వామి కూడా సభ తరువాత స్వరాష్ట్రానికి వెళ్లి తమరాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేయదనీ, తమ పార్టీకి బీఆర్ఎస్ కూ ఎలాంటి పొత్తూ లేదని ప్రకటించారు.  అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ములాయం సింగ్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు కేసీఆర్ యూపీ వెళుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం (అక్టోబర్ 11) జరుగుతాయి.

ఐసిసి ప్లేయ‌ర్స్ ఆఫ్ ద మంత్‌...హ‌ర్మ‌న్‌ప్రీత్‌, రిజ్వాన్‌

భార‌త్ మ‌హిళ‌ల క్రికెట్ కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌, పాకిస్తాన్ వికెట్‌కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ ఐసిసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తో భార‌త్ త‌ల‌ప‌డిన వ‌న్డే సిరీస్ లో హ‌ర్మ‌న్ ప్రీత్ అద్బుత ప్ర‌తిభ క‌న‌ప‌ర‌చిన సంగ‌తి తెలిసిందే. ఐసిసి సెప్టెంబ‌ర్ నెల అవార్డు పోటీలో భార‌త్ వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన‌, బంగ్లా కెప్టెన్ నిగ‌ర్ సుల్తానాల‌ను హ‌ర్మ‌న్ అధిగ‌మించింది. వాస్త‌వా నికి వారిద్ద‌రూ గ‌త టోర్నీల్లో ఎంతో అద్భుత ప్ర‌తిభ క‌న‌ప‌రిచారు.  నిగ‌ర్‌, స్మృతీతో పోటీప‌డి ఈ అవార్డు గెలుచుకోవ‌డం గొప్ప ఆనందాన్నిస్తోంద‌ని హ‌ర్మ‌న్ ప్రీత్  అన్న‌ది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్ మీద వ‌న్డే సిరీస్ గెల‌వ‌డం భార‌త మ‌హిళా క్రికెట్ చ‌రిత్ర‌లో ఎన్న‌ద‌గ్గ విజ‌య‌మ‌ని, అందుకు ప్ర‌జ‌లు,  క్రికెట్ అభిమానుల నుంచి ఇప్ప‌టికే శుభాకాంక్ష‌లు అందుకున్నామ‌ని భార‌త్ కెప్టెన్ అన్న‌ది. 1999 త‌ర్వాత ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించ‌డం అదే మొద‌టిసారి కావ‌డం విశేషం. పైగా కెప్టెన్ గా ఆమెకు ఎంతో ప్ర‌త్యేకం. ఈ సిరీస్ లో ఆమె 103.27 స్ట్ర‌యిక్‌రేట్‌తో 221 యావ‌రేజ్‌తో అత్య‌ధి కంగా 221 ప‌రుగులు చేసింది.  ఐసీసీఅవార్డుల పోటీలో భార‌త్‌స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్రీన్‌ల‌ను అధిగ‌మిం చాడు పాక్ ఆల్‌రౌండ‌ర్ రిజ్వాన్‌. సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన టి20 ల్లో అద్భుత బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శించి అంద‌రి దృష్టీ ఆక‌ట్టుకున్నాడు. త‌న అవార్డును ఇటీవ‌ల పాకిస్తాన్‌లో భారీ వ‌ర్షాల‌కు క‌ష్టాల్లో చిక్కుకున్న ప్ర‌జ‌ల‌కు అంకిత‌మిస్తున్నాన‌ని రిజ్వాన్ ప్ర‌క‌టించాడు. సెప్టెంబ‌ర్‌లో పాక్ స్టార్ ఆడిన ప‌ది మ్యాచ్‌ల్లో ఏడు అర్ధ సెంచ‌రీలు చేశాడు. ఆసియాక‌ప్‌లో హాంకాంగ్‌, భార‌త్ ల మీద విజృంభించా డు. టోర్నీలో అత్య‌ధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మ‌న్‌గా నిలిచాడు.  కాగా విజేత‌లు హ‌ర్మ‌న్ ప్రీత్‌, రిజ్వాన్‌లు ఐసిసి నుంచి బంగారు ప‌త‌కాలు అందుకుంటారు.