బెజవాడలో జగన్ కు నాగార్జునేదిక్కు!?

ప్రముఖ నటుడు  అక్కినేని నాగార్జున తనకు రాజకీయాలపై ఎంత మాత్రం ఆసక్తి లేదని పదే పదే చెబుతున్నా, వైసీపీ మాత్రం ఆయనను వదలడం లేదు. ముఖ్యంగా విజయవాడలో లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా అక్కినేని నాగార్జున అయితేనే బాగుంటుందని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అక్కినేని నాగార్జున తాను ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని పదే పదే చెబుతున్నా... జగన్ మాత్రం ఆయనపై ఒత్తిడి తెస్తున్నారనీ, ఇప్పటి వరకూ బెజవాడ పార్లమెంటు స్థానంలో గెలవలేకపోయిన వైసీపీ ఈ సారి ఆ స్థానంలో గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఆ స్థానంలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్.. అక్కడ నుంచి అక్కినేని  నాగార్జునను నిలబెడితేనే విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని నాగార్జున వైసీపీ అభ్యర్థి అయితే సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా వైసీపీకి అధిక ప్రయోజనం ఉంటుందనీ, ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓట్లను కూడా ఆయన చీల్చగలుగుతారనీ, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లలో చీలిక బారీగా ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే నాగార్జున అంగీకారం, తిరస్కారంతో సంబంధం లేకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయనే విజయవాడ లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం వెనుక వైసీపీయే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాలు, తన రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుని జగన్ నాగార్జునపై విజయవాడ నుంచి పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రాజకీయ వర్గాలలో బాగా ప్రచారంలో ఉంది. విజయవాడ లోక్ సభ స్థానంలో వైసీపీ విజయం సాధించాలంటే... ఆ స్థానం నుంచి నాగార్జునను నిలబెట్టడం వినా మరో మార్గం లేదని జగన్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాల సమాచారం. అన్నిటికీ మించి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి నాగార్జునను బరిలోకి దింపితే... దాని ప్రభావం ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా పడి... ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలోని వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపడతాయని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే నాగార్జున బహిరంగంగానే తానే పార్టీ తరఫునా ఎన్నికలలో పోటీ చేయబోయేది లేదని పదే పదే విస్పష్టంగా చెబుతున్నా... పట్టించుకోకుండా వైసీపీ తన ప్రయత్నాలు తాను చేస్తూనే.. అక్కినేని నాగార్జునే విజయవాడ లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి అన్న ప్రచారాన్ని కొనసాగిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మరోసారి ఆశల పల్లకిలో కమేడియన్ అలీ!.. గుంటూరు వైసీపీ అభ్యర్థిగా అవకాశం?

 చట్టసభకు కమేడియన్ అలీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంత కాలంగా ఆశపడి భంగపడుతూ వచ్చిన అలీకి వైసీపీ అధినేత జగన్ మరో సారి తాయిలం ఖాయమని సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో అలీని గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీకి దింపనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుంటూరు -2 అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా పై జగన్ ఒకింత ఆగ్రహంగా ఉన్నారనీ, ఆయన పని తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారనీ చెబుతున్నారు. అదే విధంగా ప్రజలలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉందన్న సర్వేల సమాచారం ఆధారంగా వచ్చే ఎన్నికలలో ఆయనను తప్పించి అలీకి పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో గూడుకట్టుకున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకూ , సాధ్యమైనన్ని నియోజకవర్గాలలో కొత్త ముఖాలను రంగంలోనికి దింపాలని జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే గ్లామర్, పాపులారిటీలను దృష్టిలో ఉంచుకిని సాధ్యమైనంత వరకూ సినీ రంగానికి చెందిన వారిని పార్టీలోకి తీసుకువచ్చి ప్రయోజనం పొందాలని కూడా వైసీపీ అధినేత భావిస్తున్నట్లు వైసీపీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే గుంటూరు నుంచి  అలీని అసెంబ్లీకి పంపాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా అలీ గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశపడిన సంగతిని ఈ సందర్భంగా చెబుతున్నారు. అయితే అప్పట్లో అలీకి అసెంబ్లీ టికెట్ దక్కలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా రాజ్యసభకు పంపుతారనీ, ఏదో ఒక కార్పొరేషన్ కు చైర్మన్ చేస్తారని మరోసారి అలీని ఆశల పల్లకిలో ఊరేగిస్తూ మూడున్నరేళ్లు  గడిపేసిన జగన్.. ఈ సారి అలీకి మరో తాయిలం ఎరవేశారని విశ్లేషకులు అంటున్నారు. ఇక మరో నటుడు పోసాని కృష్ణమురళికి కూడా ఈ సారి అసెంబ్లీకి పంపాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం తరఫున చిలకలూరి పేట నుంచి పోటీ చేసి పరాజయం పాలైన పోసానికి అదే నియోజకవర్గం నుంచి ఈ సారి వైసీపీ అభ్యర్థిగా దింపాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.చిలకలూరి పేట నియోజకవర్గంలో అంతర్గత విభేదాల నేపథ్యంలో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం ద్వారా వర్గ పోరుకు చెక్ పెట్టినట్లవుతుందని జగన్ భావిస్తున్నారంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి మూడోంతుల మంది సిట్టింగ్ లకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే జగన్ అన్యాపదేశంగా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుంటూరు, చిలకలూరి పేటల నుంచి అలీ, పోసానిలకు లైన్ క్లియర్ అయ్యిందన్న టాక్ వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది.  

బీఆర్ఎస్.. జాతీయ, ప్రాంతీయ ద్విపాత్రాభినయం..క్లిక్ అయ్యేనా?

అనుకున్నట్లే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) భారత రాష్ట్ర  సమితి (భారాస) గా పేరు మార్చుకుంది. జాతీయ పార్టీగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. తెరాస /భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు 68 ఏళ్ల వయసులో తమ రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అయితే, పేరు మారినా, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా కొత్తగా ప్రస్థానం మొదలు పెట్టినా, పార్టీ కార్యక్షేత్రం మారలేదని, కొత్త పాత పార్టీల వ్యవస్థాపక అధ్యక్షుడు హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్పష్టం చేశారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నాన్నామని చెప్పారు. అంతే,కాదు, ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా, రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే, దేశమంతా పర్యటిస్తానని కేసేఆర్ స్పష్టం చేశారు. అలాగే, కార్యక్షేత్రం వదిలేది లేదని, ఈ విషయంలోనూ  ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని  చెప్పారు.  అయితే, నిజంగానే కేసీఆర్ ఎప్పటిలా జోడు పదవుల్లో కొనసాగుతారా ? సమయం సందర్భం చూసుకుని, ముఖ్యమంత్రి పదవిని మరొకరికి అప్పగిస్తారా,అనేది చూడవలసి వుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి స్వయంగా కేసీఆర్ చేసిన, నిన్నటి (బుధవారం) ముగింపు ప్రకటన వరకు ఆయనే తెరాస  పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే, 2014 నుంచి ఈ రోజు వరకు పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ  జోడు పదవులలో కొనసాగుతున్నారు. అఫ్కోర్స్, కుమారుడు కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, చేదోడు వాదోడుగా ఉన్నారనుకోండి, అది వేరే విషయం.  అయితే, రాష్ట్ర  స్థాయిలో సాధ్యమైన జోడు పదవుల స్వారీ జాతీయ స్థాయిలో సాధ్యమవుతుందా? ఈ ఏర్పాటు ఎంత కాలం కొనసాగుతుంది? అనేది, ఇప్పుడే తెలిసే విషయం కాదు. నిజమే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదివితో పాటు, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా జోడు పదవులు తనకే కావాలని కోరుకున్న ఆ రాష్ట ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,అశోక గెహ్లాట్ ఎదురైన అవరోధాలు, అడ్డంకులు, కేసేఆర్’ కు లేవు. కాంగ్రెస్ పెట్టుకున్న ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం తెరాసకు పెట్టుకోలేదు. అంతేకాదు, అది తెరాస అయినా భారాస అయినా,గులాబీ పార్టీ కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే కాబట్టి, రాజస్థాన్’ పరిణామాలను ఇప్పటి కిప్పుడు తెలంగాణలో ఉహించలేము.   కానీ, కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పును అధికారికంగా గుర్తించి, తెరాస అధ్యక్షుడు కేసేఆర్, భారాస అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత, సంస్థాగత మార్పులు చేపట్టక తప్పక పోవచ్చును. అలాగే, అలాంటి ఆలోచన గులాబీ బాసుకు లేక పోలేదని అంటున్నారు. అయితే, తెరాస పేరు మార్పు,అనుకున్నట్లుగా ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుందా, లేదా అనేది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, సో అంత వరకు  సంస్థాగత మార్పులు ఉండవనే అంటున్నారు. అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్,ఓ వంక జాతీయ వాదాన్ని ఎత్తు కుంటూనే, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదాన్ని వదిలేది అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ తమకున్న అనుభవంతో జోడు పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించ వచ్చునేమో కానీ, జోడు విధానాలను, జోడు వాదాలను ఎలా, సమన్మయ పరచు కుంటారు అనేది, ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుందని అంటున్నారు. రెండు దశాబ్దాల తెరాస చరిత్ర, కేసీఆర్ రాజకీయ జేవిత చరిత్ర మొత్తం తెలంగాణ కేంద్రంగానే సాగిందనేది కాదన లేని నిజం.    కేసేఅర్’ కు జాతీయ స్థాయిలో ఏదైనా గుర్తింపు ఉందంటే, అది తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ అస్తిత్వ వాదంతో ముడిపడి ఉన్నగుర్తింపే కానీ, మరొకటి కాదు. అయితే, ఆ ప్రస్తావన ఎక్కడా రాకుండా, ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలనే జాతీయ ఎజెండాలో చేర్చారు. అందులోనూ ప్రధానంగా సంక్షేమ పధకాలను, మరీ ముఖ్యంగా కౌలు రైతలకు కాదని, వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఆస్తులు ఉన్న మంత్రి మల్లా రెడ్డి వంటి భూస్వాములు, రాజకీయ, వ్యాపార రంగాలలో స్థిరపడిన ధనినికులు, ప్రభుత్వ ఉద్యోగులకు సహా భూస్వాములకు ప్రజల సొమ్మును దోచి పెడుతున్నారనే ఆరోపణలున్న రైతు బంధు, ఇంకా రాష్ట్ర్రంలోనే పూర్తి స్థాయిలో పట్టాలేక్కని  దళిత బంధు, గిరిజనబందు వంటి పథకాలనే తెలంగాణ మోడల్’ గా ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఈ ఎజెండాకు దేశ ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ఎలా ఉన్నా, జంట పదవులు, జోడు వాదాలలో భారాస ప్రస్థానం ఎలా ముందుకు సాగుతుంది అనేది, చూడవలసి ఉందని అంటున్నారు.

మామా అల్లుళ్ల మ‌ధ్య స‌యోధ్య కుదురుతుందా?

ములాయంసింగ్ యాదవ్ మరణం తరువాత సమాజ్ వాదీ పార్టీ అధినేత, అతని విడిపోయిన మామ ఇటీవలి రోజుల్లో చాలా సార్లు కలిసి కనిపించారు. సయోధ్య కుదరడం లేదనే ఆలోచనలో పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అక్టోబరు 10న ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, అతని మామ శివపాల్ సింగ్ యాదవ్ మధ్య సయోధ్య కుదిరిందా లేదా వారి వైరం ఇప్పుడు ముదిరి పాకాన పడు తుందా అనేది చ‌ర్చ‌నీయాంసంగా మారింది. ములాయం పరిస్థితి క్షీణించడం ప్రారంభించడంతో, అఖిలేష్,  శివపాల్ ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. ఈ నెల ప్రారంభంలో ములాయంను ఐసీయూకి తరలించినప్పుడు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు ఆయన ఆరోగ్యం గురించి విచారించేందుకు ఆసుపత్రికి వచ్చినప్పుడు, అఖిలేష్, శివపాల్, రామ్ గోపాల్ యాదవ్ - ములాయం, శివ పాల్ బంధువు, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఉన్నారు. వాటిని. ఆసుపత్రిలో ముగ్గురు నేతలు కలిసి ఉన్నట్టు ఎస్పీ ట్విట్టర్‌లో షేర్ చేసిన వివిధ ఫొటోలు. సోమవారం ఎస్పీ వ్యవస్థాపకుడు మరణించిన తరువాత, ఇద్దరూ అతని మృతదేహాన్ని అతని గ్రామమైన సైఫాయికి తరలిం చారు. మరుసటిరోజు, చివరి వీక్షణ కోసం మృతదేహాన్ని సైఫాయి మేళా మైదానానికి తీసుకువెళుతున్న ప్పుడు, మృతదేహాన్ని రవాణాచేస్తున్న ట్రక్కులో అఖిలేష్, శివపాల్ మరియు ప్రముఖ నాయకుడి కుమారుడు ఆదిత్య ఉన్నా రు. పార్టీ శ్రేణులకు అతీతంగా నాయకులు ములాయంకు నివాళులర్పించేందుకు వేదిక వద్దకు చేరుకున్నప్పుడు యాదవ్ కుటుంబం మొత్తం వేదికపై నిలబడ్డారు. ఒక్కసారిగా ఎస్పీ అధ్యక్షుడు భావోద్వేగానికి లోనవడంతో శివపాల్ అఖిలేష్ భుజంపై చేయి వేసి ఓదార్చారు. వేదికపై, ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య ములాయం మృతదేహంపై ఉంచడానికి రామ్ గోపాల్ యాదవ్‌కు పుష్ప గుచ్ఛాన్ని అందించినప్పుడు, రామ్ గోపాల్ దానిని సమీపంలో నిలబడి ఉన్న శివపాల్‌కు అందించమని మౌర్యను కోరారు. అనంతరం రాంగోపాల్‌, శివపాల్‌ కలిసి మృతదేహానికి పుష్పగుచ్ఛం అందించారు. సైఫాయ్‌లోని విలేకరులు బుధవారం శివపాల్‌కు అఖిలేష్‌కు మధ్య ఇది ​​కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందా అని అడిగినప్పుడు, అనుభవజ్ఞుడైన నాయకుడు, ఇది సమయం కాదు. (సరియైన) సమయం వచ్చినప్పుడు చూడవచ్చు అని అన్నారు. తన సోదరుడిని ఎస్పీ సంరక్షక్ (పోషకుడు)గా భర్తీ చేయగలరా అని అడిగిన ప్రశ్నకు, నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సమయం కాదు" అని శివపాల్ పునరుద్ఘాటించారు. 2012లో ములాయం ముఖ్యమంత్రిగా చేసిన శివపాల్, అఖిలేష్ ఆశయాలు 2016లో ఎస్పీ నియంత్రణ కోసం తరతరా లుగా సాగుతున్న పోరాటం మధ్య ఒక కొలిక్కి వచ్చాయి. సెప్టెంబరు 13, 2016న, ములాయం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా శివ పాల్‌ని నియమించిన తర్వాత అఖిలేష్ అన్ని మంత్రిత్వ శాఖల నుండి శివపాల్‌ను తప్పించడంతో కుటుంబ కలహాలు తీవ్రమ య్యా యి. 2017 జనవరిలో అఖిలేష్ ఎస్పీకి నాయకత్వం వహించడంతో, అప్పటి సీఎంకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యు ల్లో రామ్ గోపాల్ కూడా ఉన్నారు. 2017 ఎన్నికల తర్వాత శివపాల్ ఎస్పీ నుంచి విడిపోయి ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా)ని స్థాపించారు. అనుభవజ్ఞు డైన నాయకుడు ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం తన మేనల్లుడితో చేతులు కలిపి జస్వంత్‌నగర్ నియోజకవర్గం నుండి ఎస్పీ గుర్తుపై గెలిచారు. అయితే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ విజయం సాధించకపోవడంతో అఖిలేష్,  అతని మామ మధ్య పాత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కూటమి, శాసనసభా పక్ష సమావేశాల నుంచి తనను ఎస్పీ బయటకు పంపిందని శివపాల్ ఆరోపించారు. ఎస్పీ చీఫ్ స్పందిస్తూ.. తన మామ పార్టీకి సభ్యత్వం లేని విషయాన్ని గుర్తు చేస్తూ.. సంస్థ బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు.. జాప్యం వెనుక కథేంటంటే?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలకు సంబదించి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య  విభేదాలున్నాయి. రాష్ట విభజన జరిగి ఎనిమిదేళ్ళు అయినా ఇంకా తెలుగు రాష్టాల మధ్య విబేధాలు అలాగే   కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదారు నెలలకు ఒక సారి  ఉభయ రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది. విబేధాల పరిష్కారం కోసం కేంద్ర హోం శాఖ పరిధిలో ఏర్పాటైన కమిటీ   చర్చలు జరుపుతోంది. అయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా విబేధాలు పరిష్కారం కావడం లేదు. సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. ప్రతి సారి చర్చల చివరాఖరులో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కలిసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకోండని కేంద్ర ప్రభుత్వం పెదరాయుడు తరహాలో ఉచిత సలహా ఒకటి ఇచ్చి చేతులు దులుపు కుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రయత్నం చేయవు. ముఖ్యమంత్రులు మాట్లాడుకోరు.అధికారులు కలుసుకోరు. ఒకరిపై ఒకరు విమర్శలు అయితే చేసుకుంటారు.ఇద్దరు కలిసి కేంద్రంపై నెపం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండని తమాషా చూస్తుంది. గడచిన ఎనిమిదేళ్ళుగా ఇదే కథ. ఇలాగే  నడుస్తోంది.  అయితే అన్ని విషయాల్లో ఎలా ఉన్నా ఉభయ  తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్ల  పెంపు విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను సంఖ్యను పెంచాలని సూచించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఆంధ్ర ప్రదేశ్ లో  175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని స్పష్టంగా పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని అంత వరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని, పదే పదే పార్లమెంట్ సాక్షిగా  స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని, అయితే 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్ర మంత్రి గత వర్షాకాల సమావేశాల్లో మరో మారు స్పష్టం చేశారు.  మరో వంక  ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని కానీ ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ రెడ్డి సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. పురుషోత్తం రెడ్డి పిటిషన్ పై సెప్టెంబర్‌లో విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.  అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం, సుప్రీం నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు వాయిదాల మీద వాయిదాలు కోరుతోంది. తాజాగా,  గురువారం (అక్టోబర్ 13) మరో మారు   సుప్రీం  కోర్టు  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదలా ఉంటే  కేంద్ర ప్రభుత్వం నియోజక వర్గాల పెంపు విషయంలో జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్టాలకు  ఒక విధానాన్ని, తెలుగు  రాష్ట్రాలకు మరో పద్దతిని పాటించడం వెనక  రాజకీయం ఉందని, ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా తెరాస  సీట్ల పెంపుకోసం గట్టిగా పట్టుపడుతోంది.  సీట్ల సంఖ్య పెరిగితే, ఎన్నికల సమయంలో అసంతృప్తుల సంఖ్యను తగ్గించుకోవచ్చని తెరాస భావిస్తోంది.  అయితే  సీట్ల పెంపు వలన  ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి ఎలాంటి ప్రయోజానం కనిపించడం లేదు. అందుకే జమ్మూకశ్మీర్ లో నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసి ప్రక్రియ కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం ససేమిరా అంటోంది. ఏదో ఒక సాకుతో ..మెల్లగా 2026 వరకు నెట్టుకొచ్చే ఆలోచన చేస్తోందని అంటున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా గడవు లోగా కేంద్ర ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడవలసి ఉందనీ అంటున్నారు. అయితే,  కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే  అవకాశాలు తక్కువే అని అంటున్నారు.  కేంద్రం  సుముఖంగా ఉన్నా జమ్మూ కశ్మీర్ లో నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. అంతే కాదు, సుప్రీ కోర్టు ధర్మాసనం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల కేసులను తెలుగు రాష్ట్రాల కేసుతో కలిపి విచారిస్తోంది. సో .. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేదని, కేంద్ర ప్రభుత్వం పదేపదే చెపుతున్న విధంగా 2026 వరకు ఆగక తప్పదని అంటున్నారు. అంతవరకు ఇంతే ..

నాయ‌కా, ఇది త‌గునా..నిల‌దీసిన ర‌ఘురామ‌

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి రోజు రోజుకీ గండాలు గ‌డుస్తున్న లెక్క‌వేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వైసీపీ రెబెల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు తీవ్ర‌ స్థాయిలో త‌మ పార్టీ నాయ‌కుడు, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి మీద మరోసారి విరుచుకుప‌డ్డారు. అంద‌రం క‌లిసిక‌ట్టుగా రాజీనామా చేసి మూడురాజ‌ధానుల ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని సూచించారు. లోక్ సభ ఎంపీలతో పాటు, రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేయడమే కాకుండా, 151 మంది ఎమ్మెల్యేలు కూడా తమ శాసన సభ్యత్వానికి రాజీ నా మా చేసి ఎన్నికలకు వెళ్తే, మూడు రాజధానుల ఏర్పాటు పై ప్రజలు తమ నిర్ణయాన్ని ఓటు హక్కు ద్వారా తెలియజేస్తార న్నా రు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజ ధాని అమరావతికి మద్దతుగా మాట్లాడి, ఇప్పుడు వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యా స్పదంగా ఉందని విమర్శించారు. మూడు రాజధానుల ఎజెండాతో తాజాగా ఎన్నికలకు వెళ్లి, మళ్లీ నెగ్గితే, రాష్ట్ర పునర్వి భజన చట్టాన్ని మార్చాలని పార్లమెంటును అడుగుదామని అన్నారు. అయినా చట్ట సవరణ జరిగే అవకాశమే లేదన్నారు. ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి కి మద్దతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారా యణలు మాట్లాడిన వీడియో క్లిప్పింగులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అమరావతిని బ్రహ్మాండంగా నిర్మిస్తామని జగన్మో హన్ రెడ్డి ప్రజలకు హామీ ఇవ్వగా, కబ్జాదారులు మాత్రమే రాజధాని మార్పును కోరుకుంటారని సత్తిబాబు గతంలోనే జ్యోతిష్యం చెప్పారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి యేనన్న ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి గెలిచామని, ఇప్పుడు వికేంద్రీకరణ ఎజెండాతో ఎన్నికలకు వెళితే ప్రజలు 175కు 175 స్థానాలలో గెలిపిస్తారేమో చూద్దామంటూ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. అత్త మీది కోపం దుత్త మీద తీసినట్లుగా సాక్షి దినపత్రిక పైనున్న అక్కసును తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయి రెడ్డి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పై తీసినట్లుగా ఉన్నదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. విశాఖ భూ కుంభ‌కోణం పై వెల్లువెత్తు తున్న విమర్శలకు సాక్షి దినపత్రికలో ఎక్కడా ఖండన కనిపించకపోవడంతో, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీ రావును ఏక వచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత కొంతకాలం నుంచి వార్తా దినపత్రిక, టీవీ ఛానల్ ను ప్రారంభించాలనుకుంటున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు రామోజీరావు పై ఆగ్రహంతోనే వార్తా దినపత్రిక, టీవీ ఛానల్ ను ప్రారంభించనున్నట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  విజయసాయిరెడ్డి ప్రారంభించనున్న పత్రిక, చానెల్ కు సాక్షి దినపత్రికకు ఇచ్చిన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తుందని అనుకో వడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సాక్షి దినపత్రిక, చానెల్ లో విజయసాయి రెడ్డికి ఇతర పత్రికలు ఇచ్చినంత ప్రాధా న్యత కూడా ఇవ్వడం లేదని చెప్పారు. విశాఖ భూముల వ్యవహారంలో ఏ 1 కు తెలియకుండా, ఎ2 కొట్టేశారా? అన్న అనుమా నం ఏ 1 కు వచ్చినట్లుందని ప్రజలు అనుమానిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పత్రిక, టీవీ ఛానల్ 10 రూపాయల షేర్లను 300 నుంచి 400 రూపాయలకు విక్రయించి, ఆ సొమ్మును రాబట్టగలరని ఎద్దేవా చేశారు. పత్రిక, టీవీ ఛానల్ రంగంలోకి అడుగుతున్న విజయ సాయి రెడ్డికి రఘురామకృష్ణంరాజు అభినందనలు తెలియజేస్తూ, మిగతా పత్రికలు ఛానల్ విలేకరుల మాదిరిగానే రచ్చబండ కార్యక్రమానికి నీతి టీవీ, నిజాయితీ దినపత్రిక విలేకరులు హాజరు కావచ్చునని ఆహ్వానం పలికారు.  లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభించిన అదాన్ డిస్టలరీ కంపెనీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారి సహకారం లేకుండానే రెండు మూడు వేల కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి చేరుకుందా?  అని రఘురామ ప్రశ్నించారు. మద్యం వ్యాపారంలో ప్రముఖ కంపెనీలకు లేని టర్నోవర్ విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి ఎందుకు చేరుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ మద్యం కంపెనీలను కాదని, విజయసాయి అల్లుడు కంపెనీకి అంత వ్యాపారం వచ్చేసిందంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించారు. తల్లి కూతురు, 104, 108 అంబులెన్స్ లతో పాటు, పోర్టు, సారా వ్యాపారం, నామినల్ ధరకే స్థలాల కొనుగోలు, అన్నీ వారికేనని అన్నారు. ప్రజా ఆస్తి హక్కు పై ముఖ్యమంత్రి ఫోటో ముద్రణ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని ఇదే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ కు దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఒక లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారితోపాటు, భూ రెవెన్యూ చీఫ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ వ్యవహారం పై వారం రోజులు వేచి చూస్తానని, లేకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు.. భూ యజమానుల ఇండ్లలో శాశ్వ తంగా ఉండే ఆస్తిపత్రాలపై పార్టీ రంగులతో ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు. ప్రజా ఆస్తి హక్కు పత్రాలను పొందడానికి, భూ యజమానులు ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నంబర్ ను ఇవ్వాలని కోరడం కూడా నిబంధనలకు విరుద్ధమే నని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని, ప్రజా ఆస్తి హక్కు పత్రాలపై పార్టీ రంగులతో ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం, ఈ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

పొగ‌మంచు హ‌రివిల్లు!

ఆకాశం ఎప్పుడూ అద్బుత‌మే. విచిత్ర‌మే. ఊహించ‌ని చిత్రాలు చూపుతుంది. వ‌ర్షాకాలం ఇంద్ర‌ధ‌న‌స్సు ఎప్ప‌టికీ గొప్ప ఆనం దాన్నిస్తుంది. ఇంద్ర‌ధ‌న‌స్సుమీంచి జారివ‌చ్చిందంటాడు త‌న ప్రేయ‌సి గురించి ఓ క‌వి. మీరు ఎక్కువగా వర్షపు రోజులలో ఆకాశాన్ని కప్పి ఉంచే అందమైన ఇంద్రధనస్సు అందాల్ని త‌ప్ప‌క చూసి ఉంటారు. అలాంటి అందాన్ని ఆస్వాదించడానికి ఎవరు ఇష్ట పడరు? అలాంటి  సౌందర్యానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మూడు రోజుల క్రితం స్టూ బెర్మాన్ అనే ఫోటోగ్రాఫర్ ఈ వైరల్ చిత్రాన్ని క్యాప్చర్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మిస్టర్ బెర్మాన్ ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం, అతను కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో ఫోటోగ్రాఫర్, అతను ప్రపంచ సౌందర్యాన్ని పంచుకోవడం ఇష్ట పడతాడు. పొగమంచులను కొన్నిసార్లు తెల్లని రెయిన్‌బోలు లేదా క్లౌడ్‌బోలు లేదా దెయ్యం ఇంద్రధనస్సు అని పిలుస్తారు!  అవి సూర్య రశ్మి, తేమ అదే క‌ల‌యిక‌తో రెయిన్‌బోలుగా తయారవుతాయి. రెయిన్‌బోలు గాలిలో వర్షపు చుక్కలతో నిండి నప్పు డు సంభ విస్తాయి. మీరు ఎల్లప్పుడూ ఇంద్రధనస్సును చూస్తారు. సూర్యునికి ఎదురుగా ఉండే దిశ, పొగమంచులు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి, ఎప్పుడూ సూర్యునికి ఎదురుగా ఉంటాయి, కానీ పొగమంచు పెద్ద వర్షపు చినుకుల కంటే పొగమంచు లేదా మేఘం లోపల ఉండే చిన్న బిందువుల వల్ల ఏర్పడతాయి. సూర్యుడు పొగమంచును చీల్చినప్పుడు మీరు ఒకదాన్ని చూడవచ్చు. లేదా సముద్రం మీద పొగమంచు కోసం చూడండి. పొగమంచులో నీటిబిందువులు చాలా చిన్నవిగా ఉండ‌డంతో, పొగమంచులు బలహీనమైన రంగులను కలిగి ఉంటాయి లేదా రంగులేనివిగా ఉంటాయి. మీరు మధ్యలో దగ్గరగా చూస్తే, మీరు నీడ‌లాటివి కూడా చూడవచ్చు. పొగమంచుతో కూడిన శాన్ ఫ్రాన్సిస్కో ఆకాశంలో, ఫోటోగ్రాఫర్ ఈ వింత, అరుదైన గాలి లో జరిగే అద్భుతాన్ని బంధించాడు. ఈ దీన్నే ఫోగ్‌బో అని పిలుస్తారు, అలాగే తెల్లటి ఇంద్రధనస్సు అని పిలుస్తారు.  ఈ చిత్రం మారిన్ హెడ్‌ల్యాండ్స్ [ద్వీపకల్పం]లోని హాక్ హిల్ వద్ద తీసింద‌ని శాన్ ఫ్రాన్సిస్కో రష్యన్ హిల్ పరిసరాల్లో నివసించే ఫోటోగ్రాఫర్ స్టువర్ట్ బెర్మాన్ చెప్పారు. ఆయ‌న ఇలాంటి త‌న కెమెరాలో బంధించ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్‌!  

షర్మిల.. నాడు జగనన్న బాణం.. నేడు?

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో  సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు?  అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’ అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే షర్మిల ఎవరు వదిలిన బాణం అన్న ప్రశ్న ముగిసిన అధ్యాయంగా మారిపోవాలి. తెలంగాణలో  ఆమె బాటలో ఆమె రాజకీయ అడుగులు(యాత్ర) వేస్తున్నారు.  అయితే ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు మరో మారు షర్మిల ఎవరి చేతిలో బాణం అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.  అంతే కాదు.. వైఎస్ఆర్టీపీ పేర  ఆమె చేస్తున్న రాజకీయ యాత్ర, వేస్తున్న అడుగుల   లక్ష్యం ఏమిటి?  నిజంగా ఆమె ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ కు నేరుగా గురిపెట్టారా? లేక రాజకీయ వ్యూహంతో గదిలో స్విచ్, వరండాలో లైట్ అన్న చందంగా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి షర్మిలకు వెన్నుదన్నుగా ఉన్నశక్తులేమిటి? వ్యక్తులెవరు?  ఈ ప్రశ్నలకు కూడా గట్టిగానే వినిపిస్తున్నారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధినేత్రిగా వేస్తున్న అడుగులు మాత్రం బయటకు తెలియకపోయినా ఒక లక్ష్యన్ని సాధించేందుకేనని మాత్రం పరిశీలకులు చెబుతున్నారు.  ఆ లక్ష్యం కోసమే తెలంగాణలో   ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలో కాలు పెట్టింది మొదలు తెలంగాణ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ అయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత,  మేనల్లుడు హరీష్ రావు,  మరో   బంధువు సంతోష్ ఇలా రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు సంధిస్తున్నారు. నిజానికి  ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే ఎక్కువగానే షర్మిల తెరాస ప్రభుత్వాన్ని విమర్శలతో దుమ్ము దులిపేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో ప్రధాని మోడీ బట్టలు ఊడదీసి నడిబజార్లో నిలబెడతామని అంటున్నారు. కానీ షర్మిల తెరాస ప్రభుత్వం బట్టలు రోజు విప్పుతూనే ఉన్నారు.  అయితే ఉరుములేని పిడుగులా ఆమె ఇటీవల ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఇందుకోసమే ఆమె  ప్రజా ప్రస్థానం  పాదయత్రకు షార్ట్ బ్రేక్ ఇచ్చారు. హస్తినలో ఆమె రహస్యంగా ఎవరిని కలిశారో, ఏమేం మంతనాలు జరిపారో తెలియదు కానీ, ప్రత్యక్షంగా మాత్రం సీబీఐ డైరెక్టర్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో   అవినీతిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డినిపైనా అవినీతి ఆరోపణలు చేశారు. సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, మిషన్ భగీరథ సహా తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు అన్నిట్లోనూ అవినీతి ప్రవహించిందని, ఆన్నిటి పైనా, సిబిఐ విచారణ కోరుతూ ఫిర్యాదు చేసినట్లు ఆమె మీడియాకు చెప్పారు. అయితే వాస్తవం చెప్పాలంటే.. ఆమె ఇప్పుడు ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐకి చేసిన ఫిర్యాదులో కొత్త విషయాలేవీ లేవు.  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాళేశ్వరం అవినీతి గిరించి ఎప్పటి నుంచో, సందర్భం వచ్చినప్పుడూ, రానప్పుడూ కూడా ఇవే ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఇక మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి ఎకంగా ఒక బృహత్ గ్రంధానికి సరిపడినంత సమాచారాన్ని ఎప్పుడో మీడియా ముందుంచారు. అంతెందుకు సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా   కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు.  అయినా ఇప్పటి దాకా ఆ ఆరోపణలపై ఎటువంటి దర్యాప్తూ, జరగలేదు.  మరిప్పుడు అవే పాత ఆరోపణలతో షర్మిల సీబీఐకి ఫిర్యాదు  ఢిల్లీ ఎందుకెళ్ళారు? ఈ ఫిర్యాదు వెనుక ఆమె టార్గెట్ ఎవరు? అన్న ప్రశ్నలూ, సందేహాలూ సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. పైకి గురి కేసీఆర్ ఫ్యామిలీపైనే అన్నట్లు కనిపించినా.. ఆమె నిజంగా టార్గెట్ చేసింది మాత్రం తన అన్న, ఏపీ సీఎం జగన్ నే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా భావించే మేఘా కృష్ణారెడ్డి లక్ష్యంగానే షర్మిల ఈ ఫిర్యాదు చేశారనీ, ఆమె వెనుక బీజేపీ పెద్దలున్నారనీ కూడా అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు షర్మిల తన ఫిర్యాదుతో బీజేపీ పెద్దల కేసీఆర్ ను ఇరుకున పెట్టాలన్న లక్ష్యానికీ,  తన అన్న జగన్ ను ఇరుకుల పెట్టాలన్న లక్ష్యానికీ గురిపెట్టేలా సీబీఐకి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.   అందుకూ నాడు జగన్ వదిలిన బాణం షర్మిల ఇప్పుడు బీజేపీ చేతిలో ఆస్త్రంగా మారారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

వైసీపీ పుణ్య‌మే విశాఖ‌లో భూదందాలు..టీడీపీ

విశాల స‌ముద్ర‌తీరంతో ఆంధ్రా ముంబైగా పేరుబ‌డిన విశాఖ‌ప‌ట్నం దారుణంగా భూదందాల‌కు, హ‌త్యా రాజ‌కీయాల‌కు నిల‌య‌మైంద‌ని తెలుగుదేశం నేత‌లు మండిప‌డుతున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మూడు రాజ‌ధానుల అంశం తెర‌మీద‌కి తీసుకురావ‌డంతోపాటు విశాఖ‌ను అభివృద్ధిచేయడానికి అనే నెపంతో పాల‌నా వికేంద్రీక‌ర‌ణ మాట‌ను ప‌దే ప‌దే లేవ‌నెత్తుతూ విశాఖ‌ను భూదందాల‌కు కీల‌క ప్రాంతంగా వైసీపీ నేత‌లు మార్చేశార‌ని విప‌క్షాలు ముఖ్యంగా తెలుగుదేశం చాలారోజులుగా ఆరోపిస్తూ న్నది. ఇటీవ‌లి కాలంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌ర వైసీపీ నేత‌లు విశాఖ‌ను సెటిల్మెంట్ అడ్డాగా చేసుకున్నార‌ని టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు బొండా ఉమా మ‌హేశ్వ‌ ర‌రావు ఆరోపిం చారు.   గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, విజయ సాయిరెడ్డి దసపల్లా భూములుసహా, ఇతరవిలువైన భూముల్ని కొట్టేసినా, కూర్మన్నపాలెంలోని స్థలాన్ని వైసీపీ ఎంపీ ఎంవీవీ,  రూ.500కోట్ల విలువైన మధురవాడ ఎన్సీసీ భూముల్ని, డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ తమ్ముడు కాజేశార‌ని అన్నారు.  డేటా సెంటర్ కు గతప్రభుత్వం కేటాయించిన రూ.600కోట్ల భూమిని, హయగ్రీవా వృద్ధాశ్రమానికి చెందిన రూ.400కోట్ల భూమిని దిగమింగార‌న్నారు.  బేపార్క్, రాడిసన్ హోటల్, భీమిలి బీచ్రోడ్ లోని నేరెళ్లవలసలోని రూ.100కోట్ల భూమికబ్జాకు గురైంర‌ని, వృద్ధా శ్రమాలు, అనాథాశ్రమాలుసహా, బడులు, గుడులు సహా వేటినీ వైసీపీ భూమాఫియా వదలడం లేదని ఆరోపించారు.  భూకబ్జాలపై  ఇంత‌వ‌ర‌కూ  జగన్ రెడ్డి ఎందుకు నోరువిప్పడంలేర‌ని ప్ర‌శ్నించా రు. జ‌గ‌న్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విశాఖనగరాన్ని కాపాడాలని, అక్కడిప్రజలకు అండగా నిలవా లనుకుం టే,  తక్షణమే తన పార్టీనేతల భూదందాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   త‌మ నాయ‌కుని హయాంలో ఆర్థిక రాజధానిగా విశాఖనగరం విరాజిల్లితే, వైసీపీప్రభుత్వం వచ్చిన మూడు న్నరేళ్లలోనే రూ.40వేలకోట్లపైచిలుకు భూములు కొట్టేశారని. ఇంత జరుగుతున్నా విశాఖ నగరంలోని  ప్రజా సంఘాలు ఎందుకు స్పందించడంలేదని బొండా అన్నారు. లోపాయికారీగా రూ.40 వేల కోట్ల విలువైన భూములుకొట్టేసిన సంఘటనల గురించి  ఆ ప్రాంత ప్రజలు, మేథావులు ఆలోచిం చాలన్నారు. ముఖ్యమంత్రి తన అనుకూల మీడియా ముందు కట్టు కథలు చెప్పి, ప్రజల్ని నమ్మిం చడం కాకుండా, తక్షణమే విశాఖ కేంద్రంగా సాగుతున్న భూదందాలపై హైకోర్ట్ సిట్టింగ్ న్యాయమూర్తితో  విచారణకు  ఆదే శించాల‌ని బొండా ఉమా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా, విశాఖను రాజధానిచేయాలన్న ఆలోచన జగన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి రావడానికి ప్రధానకారణం తనపార్టీనేతల భూకబ్జాలబాగోతం బయటిప్రపంచానికి తెలియకుండా చేయడానికేనని తెలుగుమహిళవిభాగం రాష్ట్రఅధ్యక్షురాలు, టీడీపీపొలిట్ బ్యూరోసభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత తేల్చిచెప్పారు.  గురువారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మూడు న్నరేళ్ల నుంచి విచ్చలవిడిగా సాగిన వైసీపీనేతలభూదందా తనను కబళించకూడద నే జగన్ రెడ్డి కొత్తగా వికేంద్రీ కరణనినాదం తెరపైకి తెచ్చి, ఉత్తరాంధ్రవాసుల్ని  అమరావతి రైతులపైకి ఉసిగొల్పు తున్నాడ న్నారు. వైసీపీ నిర్వహిస్తున్నది  ప్రజాగర్జనా... భూకబ్జాదారుల గర్జనా అని ప్రశ్నించారు.  జేఏసీ అంటే జగన్ యాక్షన్ కమిటీ. దానిలో సూత్రధారులు, పాత్రధారులు వైసీపీనేతలేన‌న్నారు.  రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతికి జై కొడుతుంటే, జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం మాత్రమే మూడు ముక్కలాట  ఆడుతు న్నారని అన్నారు.  ఇప్పుడు ఉత్తుత్తి గర్జనలుచేస్తున్న విజయసాయిరెడ్డికి, ఆ పార్టీ నేతలకు విశాఖస్టీల్ ప్లాంట్ను ప్రైవేటీక రిస్తున్నప్పుడు గర్జన చేయాలనిపించలేదా? రైల్వేజోన్ సాధి స్తామంటూ రైలుబొమ్మని కారు వెనకాల తగిలించుకున్న మాజీమంత్రి జోన్ సాధనకోసం ఏనాడు ఎందుకు గర్జనలు పెట్టలేదని ప్ర‌శ్నించారు.  కాగా,  బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటని, పేనుకు పెత్తనం ఇస్తే తల గొరికినట్టు  విజయసాయిరెడ్డికి పెత్తనమిస్తే ఉత్తరాంధ్రను దోచేశాడని టీడీపీ  రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పంచుమర్తి అనురాధ  ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహిం చిన విలే కరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ,  గుణంలేని వాడే కులం గొడుగు పడతార‌ని, విజయ సాయి రెడ్డి  వైయస్ కుటుంబం పంచన చేరి దొంగ లెక్కలు రాసి జగన్ రెడ్డితో సహా 16 నెలలు చిప్ప కూడుతిన్నారని అన్నారు. రాజ్యసభ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉత్తరాంధ్రలోని  ప్రజల ఆస్తు లు, భూములు దోచే స్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు అచ్చెన్నాయుడుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తే బీసీలు అధికంగా ఉన్న  ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జిలుగా  విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను జగన్ రెడ్డి నియమించారు. బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో నెల్లూరుకి చెందిన విజయసాయిరెడ్డి పెత్తన మేంటని ప్ర‌శ్నించారు.  సాయిరెడ్డి తన కూతురు, అల్లుడిని అడ్డం పెట్టుకుని ఉత్తరాంధ్రను దోచేస్తు న్నార‌న్నారు.  భూ కబ్జాలు చేస్తూ నాకేం సంబందం లేదంటూ అమాయకుడిలా మాట్లాడటం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి మాటలు సొంత పార్టీ నేతలు కూడా నమ్మే పరిస్థితి లేదనిఎద్దేవా చేశారు.  తన కుమార్తె ఆస్తులతో తనకేం సంబంధమన్న విజయసాయి రాష్ట్రంలో ఎవరు భూములుకొన్నా చంద్రబాబుగారి బంధువులవని  విజ‌య‌సాయిరెడ్డి ఎలా మాట్లాడతా డని ప్ర‌శ్నించారు. కాపులు, దళితులు, బీసీలు అన్ని కులాల్ని ఆర్దికంగా, రాజకీయంగా అణగ ద్రోక్కుతున్నారు.  ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించేందుకు గంగరాజును వెల్లగొట్టార‌ని, ఎంపీ రఘురామరాజుపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె అన్నారు.  కాపు నేత మాజీ మంత్రి నారాయణపై అక్రమ కేసులు పెట్టారు, బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నార‌న్నారు. రిజర్వేషన్లు తగ్గించి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  1600 మంది బీసీలకు పదవులు లేకుండా చేశారు. ప్రకా శం జిల్లాలో బీసీ మహిళ ఆత్మహత్యకు పాల్పడింద‌న్నారు. 

హృతిక్ రోష‌న్ అనుకున్నాడు..ప్రాణం తీసుకున్నాడు!

రోడ్డంతా ప‌రిగెట్టుకెళ్లి పాత బిల్డింగ్ పైకి వెళ్లి తీరిగ్గా చ‌చ్చేట్టు కొట్టుకుని ర‌క్తం క‌నిపించ‌గానే  అమాంతం విలన్ ని  హీరో కింద‌కి తోసేస్తాడు. గాయాల‌తో అత‌నూ మెల్ల‌గా దిగుతాడు. మ‌రో సినిమాలో ఏకంగా రైలు త‌లుపు కి ఊగులాడుతూ న‌లుగురి కొట్టిప‌డేస్తాడు మ‌హేష్‌బాబు..! ఇవ‌న్నీ పెద్ద తెర‌మీద చూసి గోల చేయడానికి  వీరాభిమానుల‌కు మంచి ఫుడ్‌. కానీ అలా ఎన్న‌టికీ వాస్త‌వంలో జ‌ర‌గ‌వు. అలా ఎవ్వ‌రూ ధైర్యం చేయద్ద‌ని స‌ద‌రు హీరోలే ప్ర‌చార‌మూచేస్తుంటారు. కానీ వినేదెవ‌రు? త‌న హీరో ఫ‌లానా సినిమాలో చేశాడు గ‌నుక  మ‌నం ఓ ట్ర యల్ వేద్దామ‌నుకునే ప్ర‌బుద్ధులు త‌యార‌య్యారు. డ్ర‌స్‌, హెయిర్‌స్ట‌యిల్‌, న‌డ‌క‌, మాట కాదు ఏకంగా స్టంట్ సీన్లు ప్రాక్టీస్ చాలా ప్ర‌మాదం. ఒక కుర్రాడు ఇలానే స్టంట్ సీన్ చేయ‌బోయే ప్రాణాలు తీసుకున్నాడు.  స‌రదాలు ప్రాణంతీసేవిలా ఉండ‌కూడ‌దు. సెల్ఫీల పిచ్చిలో ఇప్ప‌టికీ  చాలామంది ప్రాణాల‌మీద‌కు తెచ్చు కుంటున్నారు. అనేక సంఘ‌ట‌న‌లు తెలిసీ కుర్రాళ్లు రెచ్చిపోతున్నారేగాని త‌గ్గ‌టం లేదు. గ‌తంలో టూవీల‌ర్ రేసులు, కార్ల రేసులు, త‌ర్వాత సెల్ఫీల పిచ్చి, ఇపుడు వెలుగులోకి వ‌స్తున్ స్టంట్ల పిచ్చి. ఇంట్లో స‌ర‌దాకి పిల్ల‌లు స్టంట్ సీన్లు చేస్తుంటారు.. దిండ్ల‌తో. అక్క‌డ ఇంటిల్ల‌పాదికీ స‌ర‌దా కాల‌క్షేపం. పిల్లాడిని ఆడించ డంలో మురిపెంగా చూసుకోవ‌డంలో భాగం. కానీ ఊహించ‌ని ప్ర‌మాదాల వెంటాడుతుండే ఫీట్స్ కుటుంబా నికి తేరుకోలేని అవాంత‌రం. పంజాబ్ చావా రైల్వేస్టేష‌న్ ప‌రిధిలో ఒక రైలు వేగంగా వెళుతోంది. హ‌ఠాత్తుగా ఓ కుర్రాడికి ఏ హృతిక్ రోష‌న్ గుర్తొచ్చాడో ఏమోగాని అమాంతం స్టంట్ సీన్ లాంటిది చేయ‌డం మొద‌లెట్టాడు. కొంత‌సేప‌య్యాక ఏకంగా బ‌య‌ట ఫుట్‌బోర్డ్ మీద నుంచుని వీర విన్యాసాలు చేశాడు. ఏదో కుర్రాడు ఉత్సాహ‌ప‌డుతూ, ఓవ రాక్ష‌న్ చేస్తున్నాడ‌ని మ‌రో కుర్రాడు వీడియో తీశాడు. మ‌నోడు మ‌రింత రెచ్చిపోయాడు. ఈ  ఆవేశంలో తాను ఉన్న‌ది వేగంగా ప‌రిగెడుతున్న రైలు బోగీ ఫుట్‌బోర్డు మీద అన్న ధ్యాసే మ‌ర్చిపోయాడు.. ప‌ది నిమిషాల త‌ర్వాత ట్రాక్ ప‌క్క‌నే ఉన్న క‌రెంటు స్తంభానికి కొట్టుకున్నాడు.. అంతే! వీడియో అయింది, అత‌ను జీవితాన్ని చాలించాడు.

అటు రాజ‌కీయం,ఇటు క్రికెట్. .. కుట్ర‌లు, వివాదాలు!

వివాదాలు, క‌క్ష‌పూరిత చ‌ర్య‌లు, వ్యాఖ్యానాలు ఏ రంగంలోనైనా స్నేహ‌వాతావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీస్తాయి. ఇం దుకు రాజ‌కీయాలే కాన‌క్క‌ర్లేదు, క్రీడారంగం అందుకేమీ మిన‌హాయింపూ కాదు. రాజ‌కీయాల్లో అధికార‌, విప క్షాల నాయ‌కులు, అభిమానులు, అనుచ‌రుల మ‌ధ్య ఉండే గొడ‌వ‌లు, వివాదాలు, దాడుల గురించి దాదా పు రోజూ వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఇలాంటివి ఇటు క్రీడారంగంలోనూ ఉన్నాయి. అయితే ఇవి పెద్ద‌గా తెర‌మీద‌కి రావు. అంతా తెర వెనుక రాజ‌కీయాలు, కుట్ర‌లే ఎక్కువ‌. ఎవ‌రు ఎవ‌ర్ని స‌మ‌ర్ధిస్తు న్నారు, ఎవ‌ర్ని ఎవ‌రు పైకి రావ‌డంలో అడ్డుకుంటున్నార‌న్న‌ది చూచాయిగానే తెలుస్తుంది గాని వెంట‌నే బ‌య‌ట‌ప‌డ‌దు. కానీ దాని ప్ర‌భావం ఎంతో ఉంటుంది. ఒక‌రి అభివృద్ధి మ‌రొక‌రికి కంట‌కింపుగా ఉండ‌డం అనేది కేవ‌లం రాజ‌కీయ‌రంగానికే ప‌రిమితం కాదు.  చాలాకాలం నుంచి క్రీడారంగంలో ముఖ్యంగా అంద‌రికీ ఇష్ట‌మైన ఎంతో కొంత అవ‌గాహ‌న ఉన్న క్రికెట్‌లో  నూ చిత్ర‌మైన రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. భార‌త క్రికెట్ బోర్డు, సెల‌క్ష‌న్ క‌మిటీల మీటే చివ‌రి మాట అవుతుంది. క‌నుక అందులో అధికారికంగా రాజ్యం ఏల‌డం దేశంలో క్ర‌కికెట్‌ను ఏల‌డంతో స‌మానం. అం దునా అంతులేని ధ‌న‌ప్ర‌వాహంతో సాగిపోయే క్రికెట్‌లో ఇది చాలా సీరియ‌స్‌గానే ఆట‌కు దెబ్బ‌తీస్తు న్నద న్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఇందులోకి రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌వేశంతో మ‌రింత ఆస‌క్తి క‌రంగా మారిం ది. ఒక‌రిని గ‌ద్దె దింప‌డానికి కొంద‌రు ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను త‌న దారిలోకి తెచ్చుకుని వారితో యు ద్ధం ప్ర‌క‌టించి అధిష్టానానికి స‌వాలు విస‌ర‌డ‌మో, ప్ర‌భుత్వం కొన‌సాగేందుకు బ‌లం స‌రిపోద‌ని అసెం బ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌పెట్టేంత‌వ‌ర‌కూ లాక్కెల్ల‌డం, ఆన‌క అధికారం చేజిక్కించుకోవ‌డం ఇటీవ‌లే మ‌హారాష్ట్రలో చూశాం. ఉద్ద‌వ్ ఠాక్రేను గ‌ద్దె దింప‌డంలో అధ‌కారం చేజిక్కించుకోవ‌డంలో ఏక్‌నాథ్ షిండే వేసిన ఎత్తుగ‌డ అస‌మాన్యం. శివ‌సేనలో ఉండి శివ‌సేన‌నే చీల్చిన మ‌హాశ‌క్తిగా, ఉద్ధ‌వ్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చిన వీరుడిగా షిండే వ‌ర్గం పేర్కొన్న‌ది. ఇది మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో గొప్ప మ‌లుపుగా పేర్కొన్నారు.  తాజాగా క్రికెట్ బోర్డు అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దాదా సౌర‌వ్ గంగూలీ ప‌ద‌వీ కాలం అయిపోయినా దిగ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేదు. పైగా అత‌ను ఐసిసి ప‌ద‌వికి అవ‌కాశం వ‌చ్చినా వ‌దులుకోవ‌డానికే సిద్ధ‌ప‌డు తున్నాడు. కార‌ణం ఇక్క‌డ ఆధిప‌త్యం చెలాయించే అవ‌కాశం చేజారిపోతుంద‌ని. దేశంలో క్రికెట్‌ను కేవ‌లం ప్లేయ‌ర్‌గానే కాదు అధికారిగా కూడా త‌న యుక్తితో చెలాయించాల‌న్న ఆలోచ‌న ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అన్న‌ది క్రికెట్ పండితులు ఆలోచిస్తున్నారు. గంగూలీ ఆలోచ‌న వెనుక బీజేపీ వారి మ‌ద్ద‌తు ఉంద‌న్న అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి. బోర్డు కార్య‌ద‌ర్శిగా ఉన్న జై షా కి గంగూలీకి ఉన్న స్నేహం అటువంటిది. కానీ దాదాను మ‌రో సారి అధ్య‌క్ష ప‌దవిలో చూడాల‌ని బోర్డు స‌భ్యులు, క్రికెట్ అధికారుల్లో చాలామంది పెద్ద‌గా అనుకోవ‌డం లేదు. అలాగే అత‌ను ఐసిసికి వెళ్ల‌డానికి కొంద‌రు పెద్ద‌లు అడ్డుప‌డు తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజానిజాలు తేల‌వ‌ల‌సి ఉంది. బోర్డు అధ్య‌క్షునిగా త‌న‌నే కొన‌సాగిస్తారనే ఆలోచ‌న‌లోనే నామినేష‌న్ వేయ‌లేదు. కానీ రోజ‌ర్ బిన్నీని ఏక‌గ్రీవం చేసే ప‌రిస్థితు లు ఏర్ప‌డ‌డంతో అవ‌మానంతో గంగూలీ మొహం ఎర్ర‌బ‌డింది. అయితే దాదాకి రాజ‌కీయాలు అంత‌గా ఇష్టం లేదు గ‌నుక బీజేపీ పంచ‌న చేర‌డానికి పెద్ద‌గా సుముఖంగా లేడ‌న్న‌ది బ‌య‌ట‌ప‌డ‌టంతోనే అత‌నికి ఈ అవ‌మానం ఎదుర‌యింద‌న్న వార్త‌లు ప్ర‌చారంలో ఉన్నాయి.  త‌మిళ‌నాడులో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షం అన్నాడిఎంకే స్థాపించ‌బ‌డి యాభ‌యి సంత్స‌రాల‌వుతోంది. ఈ త‌రు ణంలో ఆ పార్టీలో విభేదాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. మాజీ ముఖ్య‌మంత్రి ఇ.కె.ప‌ళ‌ని స్వామి పార్టీ ప‌గ్గాలు ప‌ట్టే అవ‌కాశం చేజిక్కించుకున్నారు. త‌న మాజీ డిప్యూటీ ఓ.ప‌న్నీర్ సెల్వం పార్టీ ప‌ద‌వి నుంచి త‌ప్పు కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. త‌మిళ‌నాడులో వేగంగా జ‌రిగిపోతున్న రాజ‌కీయాప‌రిణామాల్లో ఇపి ఎస్ అంత‌కంటే వేగంగా పావులు క‌దిపి త‌న మాజీ డిప్యూటీకి చుక్క‌లు చూపించారు. దీంతో ఇక ఓపీ ఎస్  ప‌క్కక తొల‌గించాల్సిందే. అయితే దీనితో అన్నా డిఎంకెలో విస్పోటం అంత త్వ‌ర‌గా ఉండ‌క‌పోవ‌చ్చు. గ‌తంలో ఎం.జి.రామ‌చంద్ర‌న్ డిఎంకె నుంచి విడిపోయి ఏడిఎంకే (త‌ర్వాత ఇదే ఏఐఏడిఎంకె అయింది) ని 1972 అక్టోబ‌ర్‌లో పెట్టారు. అప్ప‌టికి ఆయ‌న త‌మిళ సినీరంగాన్ని ఏలుతున్నారు. కానీ రాష్ట్ర సిఎం డిఎంకె అధ్య‌క్షుడు క‌రుణానిధి  ఎంజీఆర్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. దీన్ని త‌ట్టుకోలేక ఎంజీఆర్ వీరాభిమాని ఒక‌రు ఉదుంమ‌ల్‌పేట్ లో ఆత్మాహుతికి పాల్ప‌డి ప్రాణాలు తీసుకున్నాడు.  ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇటు క్రికెట్‌లోనూ చోటు చేసుకుంటూన్నాయి.. అనాదిగా. చాలాకాలం నుంచి క్రికెట్ విష‌యంలో అంద‌రికీ తెలిసిన సంగ‌తి కేవ లం ముంబై ప్లేయ‌ర్ల‌కే టీమ్ ఇండియాలోకి వెళ్లే అవ కాశాలు క‌ల్పించ‌డం, లేదా ద‌క్కెట్టు కొంద‌రు స‌హ‌క రిం చ‌డం. ఇందుకు గ‌వాస్క‌ర్ వంటి సూప‌ర్ స్టార్లు కూడా పాత్ర వ‌హిస్తున్నార‌న్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఉన్నాయి. దీని మీద చాలాకాలం చ‌ర్చ జ‌రిగింది. కార‌ణం లేక‌పోలేదు, ముంబై కాకుండా వేరే ప్రాంతాల నుంచి ముఖ్యంగా యుపి, బీహార్‌, త‌మిళ‌నాడు  నంచీ వ‌చ్చిన‌వ‌రిని హేళ‌న చేయ‌డం, ఆటను విమ‌ర్శించ‌డం అనేది జ‌రుగుతూనే ఉంది. స‌చిన్ కోసం  కొంద‌రి అవ‌కాశాలు దెబ్బ‌తిన్నాయ‌న్న‌ది అప్ప‌ట్లో ప్ర‌చార‌మ‌యింది. స‌చిన్ , కాంబ్లే కాంబినేష‌న్‌లో మ‌హారాష్ట్ర‌, ముంబైలో అద్బుత క్రికెట్ చూసిన‌వారంతా వారిని టీమ్ ఇండియాకి తీసుకున్నారు. క్ర‌మేపీ కాంబ్లీ వెన‌క‌బ‌డ‌టం జ‌రిగింది. అప్ప‌టికి గంగూలీ విజృంభిస్తుండ‌డంతో ఓపెన‌ర్‌గా స‌చిన్‌తో జ‌త‌క‌ట్టాడు. ఇది త‌ప్ప‌ని ప‌రిస్థితి కావ‌డంతో దాదాను నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌లేదు.   కానీ అంత‌కు ముందు,  త‌మిళ‌నాడు నుంచే వెళ్లిన కె.శ్రీ‌కాంత్ ఇటువంటి అవ‌మానాలు చాలా ప‌డ్డాడ‌ని అనాలి. అత‌నే ఓప‌న‌ర్ కావ‌డం ముంబై వారికి న‌చ్చ‌లేదు. అత‌నిలో చిత్ర మైన టెక్నిక్ ఉండ‌డం ప‌రు గులు సాధించ‌డం ఇత‌రుల్లో క‌న‌ప‌డ‌దు. అందువ‌ల్ల ముంబై వారికి అత‌న్ని మూడో స్థానానికి దించే ప్ర‌య త్నాలే చేశారు. అత‌నికి ఆడ‌టం త‌ప్ప ఇలాంటి రాజ‌కీయాలు తెలీవు గ‌నుక రాణించి నిల‌బ‌డ్డాడు. చిత్ర మేమంటే 1983 ప్ర‌పంచ‌క‌ప్ విజేత జ‌ట్టు కెప్టెన్ టీమ్ ఇండియా విజ‌యంలో కీల‌క‌పాత్ర వ‌హించిన క‌పిల్ దేవ్‌ను ముంబైప్లేయ‌ర్లు దారుణంగా అవ‌మానించేవార‌ని అప్ప‌ట్లో వార్త‌లు విన బ‌డేవి. క‌పిల్ వాటికి త‌న ఆట‌తో ధీటుగా సమాధానం చెప్పేడు. చాలా చ‌ర్చ‌ల్లో అత‌న్ని అవ మానించ‌డం కూడా జ‌రిగింది.   అనిల్ కుంబ్లే 2016 లో టీమిండియా కోచ్‌గా ఎన్నికయ్యాడు.  కోహ్లీ, కుంబ్లే‌ల మధ్య వివాదం ఆస్ట్రేలియా భారత పర్యటనతో ప్రారంభమైంది. టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ గాయం కారణంగా ఆడలేదు. అజింక్యా రహానే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, జట్టు ఎంపికలో మా త్రం కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ విషయంలో కుంబ్లేతో గొడవ పడ్డా డు. ధర్మశాల టెస్టులో కుల్దీప్‌కు చోటు ఇవ్వాలా వద్దా అన్న విషయమై ఇద్దరి మధ్య వివాదం  చెల రేగిం ది. అయితే, కుల్దీప్ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక్కడ నుంచి విరాట్, కుంబ్లేల మధ్య వివాదం వార్తల్లో కూడా నిలి చింది. ఇది కాకుండా అప్పటి బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించాలని, జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని కుంబ్లే కోరుకున్నాడు.ఈ  వివాదం కారణంగా 2017 లో కుంబ్లే తన పద వికి రాజీనామా చేశారు. అయితే ఈ వివాదాన్ని కోహ్లీ నిరంతరం ఖండిస్తూనే ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా కోహ్లీ అదే పని చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో, భారత్ తన ప్రత్యర్థి పాకి స్థాన్‌తో ఓడిపోయింది. దీని తర్వాత, భారత టీం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. కుంబ్లే లేకుం డా కరేబియన్ దేశానికి బయలుదేరింది. కుంబ్లే గైర్హాజరు విషయంపై మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీకి అధిపతిగా ఉన్నందున, దాని సమావేశం కోసం ఆగి పోయాడంటూ బీసీసీఐ కవర్ చేసింది. అయితే కుంబ్లే తన పదవికి రాజీనామా చేయడంతో అసలు విష యం బయటకు పొక్కింది. కుంబ్లే తన రాజీనామాలో కోహ్లీతో విభేదాలను పేర్కొంటూ బీసీసీఐకి లేక సర్పించాడు. దీంతో బీసీసీఐ రవిశాస్త్రిని హెచ్ కోచ్‌గా నియమించింది. అస‌లు జ‌ట్టు ఎంపిక విష‌యంలోనే అన్ని మ‌త‌ల‌బులూ జ‌రుగుతాయి. త‌న‌వారు, ఇత రులు అనే కోణం ఇక్క‌డ బాగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంటుంది. చాలామంది ఢిల్లీ, ముంబై ప్లేయ‌ర్లు  చిన్న త‌నం నుంచీ అక్క‌డి ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌డంతో ఆట‌లో ముంద‌డుగు వేసి సెల‌క్ట‌ర్ల దృష్టిలో ప‌డ‌డం టీమ్ ఇండియా త‌లు పులు త‌ట్ట‌డానికి వీలుంటుంది. కానీ ద‌క్షిణాది, ఉత్త‌రాది ప్లేయ‌ర్లు నానా అవ‌స్థాప‌డి  ఆ మెట్లెక్కే స‌మ‌యా నికి ఆట్టే కాలం ఆడ‌లేని శ‌రీర‌ధారుడ్య‌మూ క‌లిగి ఉండ‌రు. అనేక అడ్డంకులు, నిబంధ‌న‌ల కార‌ణంగా చాలామంది వెన‌క‌బ‌డిపోతున్నారు. అందుకే ప్రొఫెష‌న‌ల్‌గా రావ‌డానికి ఈత‌రం వారిలో చాలామంది ఉత్త రాది రాష్ట్రాల‌కు త‌ర‌లిపోతున్నారు. అందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ  రాయుడు.  ఎంత బాగా ఆడినా, గొప్ప ప్లేయ‌ర్‌గా అంద‌రి దృష్టిలో ప‌డినా సెల‌క్ట‌ర్లు లైట్ తీసుకోవ‌డం దారుణం. ఇదే చాలాకాలం నుంచి జ‌రు గుతోంది. అయితే స‌చిన్ త‌రం ప్లేయ‌ర్లు రిటైర్ కావ‌డం, ధోనీ లాంటి ఝార్ఖండ్ ప్లేయ‌ర్ ఉద్భ వించ‌డంతో ముంబై ప్రాభ‌వం త‌గ్గింది. అంద‌రూ ధోనీ భ‌జ‌న ధోనీ లాంటి ప్లేయ‌ర్ల అవ‌స రాన్ని అప్పుడే గ్ర‌హించిన‌ట్టు న‌టిస్తూ వ‌చ్చారు. ఢిల్లీ ప్లేయ‌ర్ ఓపెన‌ర్  సెహ్‌వాగ్‌ని ఒక టెస్ట్‌కి ధోనీ కూచో బెట్ట డంతో ముంబై కార్లంతా దేశంలో పెద్ద చ‌ర్చ లేవ‌దీశారు. కానీ ధోనీ మాత్రం అధికారుల‌కు న‌చ్చ‌జెప్పి త‌న మాటే నెగ్గించుకున్నాడు. అలా జ‌ట్టులోకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌కా వారికి అవ‌కాశాలు ద‌క్కాయి. ఇది స‌రిగ్గా పార్టీ రాజ‌కీయాల్లో చ‌ద‌రంగం ఆడి అధ్య‌క్ష‌స్థానాన్ని చేజిక్కించుకునే రాజ‌కీయ లోక‌ల్ లీడ‌ర్ల వ్య‌వ‌హారం లాటిదే! 

విజయసాయి కొత్త పార్టీ.. చానల్ అందుకేనా ?

ఒక జర్నలిస్ట్ కు సొంతంగా పత్రిక లేదా ఓ వెబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? సహజంగా, ఉన్న ఉద్యోగం ఊడి, కొత్త ఉద్యోగం ఏదీ దొరకని సమయంలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం కంటే, సొంతంగా ఏదో ఒకటి చేద్దామనే అలోచన పుడుతుంది. సరే, ఆలా ఆలోచన చేసిన జర్నలిస్టులు చాలా వరకు చేతులు కాల్చుకుని మళ్ళీ చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగంలో సర్దుకుపోయిన వారే అనుకోండి, అది వేరే విషయం.  జర్నలిస్టుల విషయాన్ని కాసేపు పక్కన పెట్టి రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఉన్న పార్టీలో ఉక్కపోత మొదలై, పక్క పార్టీలతో పని కాదనుకున్నప్పుడు సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తారు. అఫ్కోర్స్ అక్కడా సక్సెస్ రేటు తక్కువే అనుకోండి. అయినా ఉన్న పార్టీలో ఉక్కపోత తట్టుకోలేక సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన చేసే రాజకీయ నాయకులు  మంచి కాసుల పార్టీ అయితే, పార్టీ కంటే ముందే సొంతంగా ఒక  న్యూస్ పేపర్, ఒక న్యూస్ చానల్ ప్లాన్ చేస్తారు.   అందుకే కావచ్చును వైసీపెలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు హటాత్తుగా సొంతగా న్యూస్ చానల్ పెడుతున్నానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. విజయసాయి, సొంత చానల్ తో ఆగుతారా, సొంత పార్టీ వరకు వెళతారా అనే చర్చ, వైసీపీ వర్గాల్లోనే మొదలైందని అంటున్నారు. అంతే కాదు,ఢిల్లీ  స్థాయిలో ఇందుకు సంబంధించి కొంత గ్రౌండ్ వర్క్ కూడా జరిగిందని వైసీపీలో వినవస్తోంది. వైఎస్ కుటుంబ సభ్యులను ముందుంచి, విజయసాయి రాజకీయంగా ముందదుగు వేసే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని అంటున్నారు.  ఢిల్లీ పెద్దలతో పాటుగా  పొరుగు రాష్ట్రానికి  చెందిన ముఖ్యనేత ఒకరు తెర వెనక నుంచ కథ నడిపిస్తునట్లు తెలుస్తోంది. అందుకే, విజయ సాయి, ఓపెన్ గా చానల్ పెడుతున్నానని ప్రకటించారని  అంటున్నారు.     వైసీపీకి సాక్షి న్యూస్ పేపర్, న్యూస్ చానల్ ఉన్నాయి. అంతే కాదు, ఆ రెండు పత్రికలు,  ఆ ఒక్క చానల్ మినహా మిగిలిన న్యూస్ పేపర్లు, న్యూస్ చానల్స్ చాలా వరకు జగన్  రెడ్డి సువార్త పుత్రికలు అన్నట్లుగానే, వైసీపీ ప్రభుత్వాన్ని మోస్తున్నాయి.  జగన్ రెడ్డితో చక్కని ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అటువంటప్పుడు  వైసీపీకి ఇప్పుడు మరో చానల్ అవసరం ఏమొచ్చింది? అంటే, ఛానల్ అవసరం వచ్చింది  వైసీపీకి కాదు. జగన్ రెడ్డికీ కాదు విజయ సాయి రెడ్డికే  ఆ అవసరం వచ్చిందని  లోగుట్టు తెలిసిన, విజయసాయి సన్నిహిత మీడియా మిత్రులు చెపుతున్న మాట. నిజమే  కారణాలు ఏవైనా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. వైసీపీలో విజయసాయి రెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు. అదీ తెలుస్తూనే వుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయ సాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక, విశాఖ భూదందాల బాగోతం, ఫ్లడ్ గేట్స్ తెరిచినట్లుగా బయటకు వస్తోంది. విజయ సాయి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా   జగన్ రెడ్డి కాదుకదా, వైసేపీ నాయకులు ఎవరూ  ఆయనకు అండగా నిలవడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించడం లేదు. నిజానికి, విజయసాయిరెడ్డి భూదందాల వ్యవహారాలన్నీ ప్రభుత్వ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయని అంటున్నారు.   ఇక సాక్షి పత్రిక, చానల్ సంగతి అయితే, చెప్పనే అక్కర లేదు. ఇతర పత్రికల్లో వైసీపీ నేతలఫై ఏ చిన్న ఆరోపణ వచ్చినా, కలాలను ఎక్కుపెట్టే సాక్షి విపక్షాలు విజయ సాయిపై విరుచుకు పడుతున్నా కిమ్మనడం లేదు.  దీంతో విజయసాయి రెడ్డికి సీన్ అర్ధమైందని అంటున్నారు. అందుకే నెపాన్ని సాక్షిపై నెట్టి చానల్ ఆలోచనను బయట పెట్టారని అంటున్నారు.  తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను సాక్షి టీవీ సమర్ధవంతంగా తిప్పి కొట్టడంలో విఫల  మవుతోందని, అందుకే తాను చానల్ పెడుతున్నానని చెప్పుకొచ్చారు.  అదలా ఉంటే  నిజానికి జగన్ రెడ్డి, విజయ సాయి మధ్య చాలా కాలంగా  ప్రచ్చన్న యుద్ధం సాగుతోందని, ఏదో ఒక రోజున ప్రచ్చన యుద్ధం ప్రత్యక్షయుద్ధంగా మారక తప్పదని అంటున్నారు. అది గ్రహించే విజయ సాయి యుద్ద సన్నాహాలు ప్రారంభించారని అంటున్నారు. నిజానికి వైసీపీ సీనియర్ నేతలు చాలా మందిలో అసమ్మతి బుసలు కొడుతోంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రిపై కంటే, ముఖ్యమంత్రి చుట్టూ చేరిన కోటరీపై పార్టీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రిని వారే తప్పుదారి పట్టిస్తున్నారని అంటున్నారు. అంతే కాకుండా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే ఎమ్మెల్యేలు, మంత్రులకు బహిరంగంగానే హెచ్చరికలు చేయడం, పని తీరు మెరుగు పరచుకోకపోతే, ప్రత్యామ్నాయం చూసుకోవలసి వస్తుందని చెప్పడంతో, పార్టీలో తమ భవిష్యత్ ఏమిటనే విషయంలో సందిగ్దంలో  ఉన్నారు. ఈ నేపధ్యంలో పిల్లి  మెడలో తిరుగుబాటు గంట కట్టేది ఎవరని ఎదురుచూస్తున్న నాయకులు  విజయ సాయిలో ఆ స్పార్క్ చూస్తున్నారని అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా, 2024కు ముందు వైసీపీ నెంబర్ 2’ తధ్యమని అంటున్నారు.

హిజాబ్ తీర్పు సీజేఐ చేతిలో

క‌ర్ణాట‌కాలో హిజాబ్ ధ‌రంచ‌డంపై సుప్రీం కోర్టులో గురువారం వెలువ‌డిన తీర్పు రెండు ర‌కాలుగా వ‌చ్చిం ది. విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ ధ‌రించ‌డం నిషేధన‌పై రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుధాంశు ధూలి యా  విరుద్ధంగా తీర్పునిచ్చారు. విద్యార్ధులు హిజాబ్‌ను విద్యాసంస్థ‌ల‌కు వ‌చ్చిన‌పుడు ధ‌రించ‌ రాద‌ని ఆయ‌న తీర్పునిచ్చారు. ఇపుడు ఈ అంశాన్ని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలో పెట్ట‌ను న్నారు. ఈ అంశంపై భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి విచారించి తీర్పు నివ్వ‌వ‌ల‌సి ఉంటుంది.  ఈ అంశానికి సంబంధించి క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పుకి వ్య‌తిరేకంగా వ‌చ్చిన 26 అప్పీళ్ల‌ను జ‌స్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేశారు. విద్యాసంస్థ‌ల్లో పిల్ల‌లు హిజాబ్‌ను ధ‌రించ‌డం అనేది ఇస్లాంలో ప్ర‌త్యేకంగా చెప్ప‌లేద‌ని, అది అక్క‌డ ధ‌రించి తీరాల‌న్న‌దేమీ ప్ర‌స్తావించ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ విష‌య‌మై తాను 11 ప్ర‌శ్నల‌తో ప్ర‌శ్నావ‌ళిని త‌యారు చేయ‌గా అందిన స‌మాధానాల‌న్నీ అప్పీళ్ల‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చా య‌న్నారు.  అయితే రాష్ట్ర హైకోర్టు ఈ విష‌యంలో వేరే మార్గంలోకి వెళ్లింద‌ని జ‌స్టిస్ ధూలియా అభిప్రాయ‌ప‌డ్డారు. కోర్టు తీర్పును ఆయ‌న త్రోసిపుచ్చారు. విద్యార్ధులు హిజాబ్‌ను ధ‌రించ‌డం అవ‌స‌ర‌మా కాదా అన్న‌ది ఇస్లామ్‌లో పేర్కొన్నారా లేదా అన్న అంశం కూడా ఈ వివాదానికి అప్ర‌స్తుత‌మ‌న్నారు. ఈ అంశం వారి విద్యార్థుల అభిమ‌తానికి, ఆర్టిక‌ల్ 14, ఆర్టిక‌ల్ 19కి  సంబంధించిన‌ద‌ని ఆయ‌న అన్నారు. విద్యార్ధిని జీవి తం మెరుగుప‌రుస్తున్నామా అన్న‌దే ఆలోచించాన‌ని, ఫిబ్ర‌వ‌రి 5న ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాన్ని ర‌ద్దు చేసి, ఆ నిషేధాన్ని తొల‌గించాల‌ని ఆదేశించాన‌ని జ‌స్టిస్ ధూలియా అన్నారు.   కాగా హిజాబ్ పై విరుద్ధ తీర్పులప‌ట్ల క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం స్పందించింది. ఇంత‌కంటే మంచి తీర్పు ఉండ ద‌ని, మ‌హిళ‌లంతా హిజాబ్‌ను ధ‌రించ‌డం ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని మంత్రి బిసి న‌గేష్ అన్నారు. కోర్టు తీర్పు హ‌ర్ష‌ణీయ‌మని అయితే, సుప్రీం కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది అన్నారు.  క‌ర్ణాట‌కాలో విద్యాల‌యాల‌కు ఆడ‌పిల్ల‌లు హిజాబ్ ధ‌రించి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకావ‌డం మీద ఈఏడాడి ఫిబ్ర‌వ‌రిలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిషేధాజ్ఞ‌లు జారీ చేసింది. దాన్ని ప్ర‌శ్నిస్తూ వ‌చ్చిన అప్పీళ్ల‌పై హైకోర్టు కూడా నిషేధాజ్ఞ‌లు స‌ర‌యిన‌వేన‌ని తీర్పునిచ్చింది. ప్ర‌స్తుతం ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో స‌వాలు చేశారు. ఈ అంశంలో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వ‌వ‌ల‌సి ఉంది. కాగా ప్ర‌స్తుతం దేశంలో నిషేధించిన పాప్యుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పి ఎఫ్ ఐ) ముస్లిం విద్యార్ధులు హిజాబ్ ధ‌రించాల్సిందే అంటూ వివా దాన్ని లేవ‌నెత్తింద‌ని  క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ  సుప్రీం కోర్టులో వాద‌న‌ వినిపించింది. 

మునుగోడు హుజురాబాద్ కాదు!

హుజురాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఅర్ కోరి తెచ్చుకున్నారు. గులాబీ పార్టీ ఓన‌ర్లం మేమే అంటూ ఈటల రాజేందర్ ధిక్కార స్వరం వినిపించిన నేపధ్యంలో, ఇంకెవరూ అలాంటి సాహసం, చేయకుండా ఈటలపై వేటు వేశారు. అయితే కేసీఆర్ లెక్క తప్పింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో, కేసీఆర్ సర్వ శక్తులు ఒడ్డినా ఓటమి తప్పించుకోలేక పోయారు.  బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన ఈటల 20 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరేశారు.  నిజానికి, హుజురాబాద్ ఓటమి అక్కడితో ఆగలేదు. ఈటల ఏకుమేకయ్యారు. అంతవరకు సక్సెస్ ‘స్టొరీ’గా సాగిన తెరాస కథ మలుపు తిరిగింది.  తెరాసకు చిక్కులు మొదలయ్యాయి. అంతవరకు కేంద్రంలో అధికారంలో ఉన్నా  రాష్ట్ర రాజకీయాల్లో పక్కాగా థర్డ్ ప్లేస్ లో ఉన్న బీజేపీ, అటు కాంగ్రెస్ కు ఇటు తెరాసకు కూడా సవాలుగా మారింది.  తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం కన్ను పడింది. ఇక ఆ తర్వాత ఏమి జరుగుతోందన్నది చరిత్ర. ఈ క్రమంలోనే, మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక దానంతట అదిగా వచ్చింది కాదు. హుజురాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ ఎలా అయితే కోరి తెచ్చుకున్నారో అదే విధంగా మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ కోరి తెచ్చుకుంది. ఫలితం కూడా అలాగే ఉంటుందా  అంటే అది వేరే చర్చ. కానీ హుజురాబాద్  లో కనిపించిన తెరాస దూకుడు, మునుగోడులో కనపడడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా  తెరాస నాయకత్వం మునుగోడు విషయంలో తప్పుడు సంకేతాలు పంపిస్తోందని అంటున్నారు. అభ్యర్ధి ఎంపిక మొదలు  ప్రచార వ్యూహం వరకు తెరాస నాయకత్వం అడుగులు తడబడుతున్న వైనం కనిపిస్తోందని అంటున్నారు. హుజురాబాద్  అంతకుముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఇంచార్జిగా వ్యవహించారు. ఆ రెండు ఉపఎన్నికల్లో తెరాస ఓడినా  చివరి వరకు గులాబీ పార్టీలో ఓటమి భయం కనిపించలేదు. మునుగోడు విషయంలో ఇప్పటికి కూడా ఇంచార్జి విషయంలో పూర్తి స్పష్టత లేదు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కంగాళీ వ్యవహారంతో, ‘టూ మెనీ కుక్స్ స్పాయిల్  ద డిష్’ అన్నట్లుగా మునుగోడు వంటకం తయారవుతుందని అంటున్నారు.  మరో వంక తెరాసని ఓటమి భయం వెంటాడుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే, తెరాస నాయకత్వం  తప్పుడు సంకేతాలు పంపిందని పార్టీ శ్రేణులనుంచే వినిపిస్తోంది. ఒక విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్  అభ్యర్ధి ఎంపిక విషయంలో మీనా మేషాలు లెక్కిస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత  మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈలోగా పార్టీలో లుకలుకలు కొన్ని బయట పడ్డాయి. అదెలా ఉన్నా అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి సర్వేలపై ఆధారపడి, చివరి వరకూ ఎటూ తేల్చుకోలేక పోవడం పార్టీ బలహీతను బయట పెట్టుకున్నట్లు అయిందని, పరిశీలకులు అంటున్నారు.  ఆలాగే, తోక పార్టీలు, సూదీ దబ్బనం పార్టీలంటూ అవహేళన చేసిన సిపిఐ, సిపిఎం పార్టీలతో ‘బేరం’ కుదుర్చుకోవడం, ఒక ఉప ఎన్నిక కోసం ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కూడా రాంగ్ సిగ్నల్స్ పంపిందని అంటున్నారు.  అదలా ఉంటే, ఒక్క ఉప ఎన్నికలో గెలుపు కోసం ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కుమార్తె కవిత మినహా ఎమ్మెల్సీలు, అందరికీ ముక్కలు ముక్కలుగా బాధ్యతలు అప్పగించడం, ఓటమి భయాన్ని సూచిస్తోందని అంటున్నారు.   మరో వంక మంత్రి కేటీఆర్ మునుగోడు ఎన్నికల ఫలితం వల్ల టీఆర్ఎస్‌కు వచ్చేది పోయేది ఏమీ లేదని చెబుతూ వస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలప్పుడూ అదే చెప్పారు. తేడా వస్తుందన్న రిపోర్టులు ఉండటం వల్లనే ఇలా చెబుతున్నారన్న అభిప్రాయానికి రావడాని ఇలాంటి వ్యాఖ్యలు కారణం అవుతున్నాయని అంటున్నారు. ఈ అన్నిటినీ మించి, పార్టీ అభ్యర్ధి నామినేషన్ అయినా వేయక ముందే, మంత్రులు ఒకరి వెంట ఒకరు, పోటీ పడి మరీ పోటీ నుంచి తప్పుకుంటామని చేస్తున్న ప్రకటనలు క్యాడర్ కే కాదు,. కాండిడేట్ (కూసుకుంట్ల)కు కూడా మింగుడు పడడం లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న గుజరాత్ కు ప్రధాని మోడీ భారీగా కేంద్ర నిధులను కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్న మంత్రి కేటీఅర్, ప్రధాని మోడీ మునుగోడుకు రూ. పద్దెనిమిది వేల కోట్ల నిధులు ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. అంతకు ముందే మునుగోడు మంత్రి జగదీష్ రెడ్డి అదే సవాల్ చేశారు. ఇక ఇప్పుడు ఎర్రబెల్లి ఇత్యాది మంత్రులంతా అదే పల్లవి ఎత్తుకున్నారు. అయితే, మంత్రులు పోటీ నుంచి తప్పుకుంటామని పదే పదే చెప్పడం వలన తెరాస నేతలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే పలాయనవాదం జపిస్తున్నారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. ఒక విధంగా నెగిటివ్ పబ్లిక్ పర్సెప్షన్  క్రియేట్ అవుతోందని పబ్లిక్ పల్స్ తెలిసిన విశ్లేషకులు బావిస్తున్నారు.  ఓ వంక బీజేపీ అభ్యర్ధి రాజగోపాల రెడ్డి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? దమ్ముంటే పోటీకి రండని,  సవాల్ విసురుతుంటే, కేటీఆర్ పలాయనవాదం చిత్తగించడం ఏమిటని, పార్టీ నాయకులే విస్తుపోతున్నారు. నిజానికి, రాజీనామాకు ముందే రాజగోపాల్ రెడ్డి తెరాస ప్రభుత్వానికి సిమిలర్ సవాల్  విసిరారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజక వర్గాల్లో చేసిన అభివృద్ధి మునుగోడులో చేస్తే, రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయనని, రాజగోపాల్ తెరాసకు సవాల్ చేశారు. తెరాస ప్రభుత్వం ఆ సవాలు స్వీకరించలేదు, కాబట్టే రాజగోపాల రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పడు అదే సవాలును ఇటు నించి అటు తిప్పడంలో అర్థమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అంతిమ ఫలితం ఎలా ఉన్నా, తెరాసను మునుగోడులోనూ  హుజురాబాద్ భయం వెంటాడుతోందని అనిపిస్తోందని, అంటున్నారు.

లోకీ.. ప‌ప్పీ కాదు.. బ్యాట్‌మెన్ ని!

ఆ మ‌ధ్య చింటూ ఎదురు ఫ్లాట్‌లో త‌న స్నేహితుడి ద‌గ్గ‌రికి వెళ్లాడు. త‌లుపు తీయ‌గానే  హాల్లో సోఫా ద‌గ్గ‌ర బ్యాట్‌మెన్ డ్ర‌స్‌లో ఏదో క‌నిపించగానే భ‌య‌ ప‌డి ఆగిపోయాడు. ర‌వి వ‌చ్చి.. అదే మా  కుక్క‌పిల్ల‌రా .. భ‌యప‌డ‌కు.. రా అంటూ లోప‌లికి తీసికెళ్లా డు. భ‌యం భ‌యంగానే  దాని ద‌గ్గ‌రికి వెళ్లి దాన్ని త‌ల‌మీద చేత్తో త‌ట్టాడు. అప్ప‌టికి గాని ధైర్యం రాలేదు! అవును టామీయే!.. బ్యాట్‌మెన్ ఎలా అయింది?!  పిల్లులు, కుక్కపిల్ల‌ల పెంప‌కంప‌ట్ల అమితంగా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇంట్లో పిల్ల‌లు అడుగుతున్నా ర‌నీ ఓ కుక్క‌పిల్ల‌నో, పిల్లినీ తెచ్చి పెంచుకోవ‌డం స‌ర‌దా అయిపోయింది. వాటిని పొద్దుటో, సాయింత్ర‌మో త‌మ‌తో పాటు వాకింగ్‌కి తీసికెళ్ల‌డాలూ కూడా! పైపెచ్చు చ‌క్క‌గా డ్ర‌సింగ్ కూడా ఈమ‌ధ్య మొద‌ల‌యింది. అన్నింటికీ మించి జంతువుల‌తో వ‌స్తున్న టీవీ సిరీస్‌లో వాటికి ఉండే డ్ర‌స్‌లు వెయ డానికి ప్ర‌య‌త్నిస్తు న్నారు. వాటిని కూడా అలా చూడ్డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. అందులో భాగ‌మే బాట్ మెన్ డ్ర‌స్‌తో కుక్క పిల్ల‌ను త‌యారుచేయ‌డం! స‌ర‌దాకి అంతే లేదు.. బ్యాట్‌మ‌న్ డ్ర‌స్‌, షూలు కూడా తొడిగి అచ్చం అలానే ఉండేట్టు త‌యారుచేస్తు న్నారు. ఆ బ్యాట్‌మ‌న్ గాల్లో ఎగిరి నానా భీభ‌త్సం సృష్టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. కానీ ఈ కుక్క‌, కుక్క‌పిల్లా ఆ డ్ర‌స్ వేసుకుని మ‌హా ఇబ్బంది ప‌డుతోంది. కార‌ణం వాటికి ఇలాంటి డ్ర‌స్‌లు గ‌ట్రా ఎలా న‌ప్పుతాయి. తోక‌వూపుతో అలా ఇంట్లోనో, వీధిలోనో, తోట‌లోనో తిర‌గ‌డం అల‌వాటుగ‌దా! అమెరికాలో ఓ న‌గ‌రంలో ఓ కుటుంబం త‌మ కుక్క‌పిల్ల  లోకీ ని  అలా డ్ర‌స్ చేసి వీడియోలు తీశారు. దాని విన్యా సాలు చూసిన నెట్‌జ‌న్ సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంది!

ఆగు.. తిన‌నీ!

స్కూలు, కాలేజీ విద్యార్ధుల‌కు చిరుతిండిగా మారింది పానీపూరీ. ఇపుడు దాదాపు అన్ని ప‌ట్ట‌ణాల్లో ఇది యువత‌కు సాయంత్రాలు స‌ర‌దాగా తిన‌డానికి ఆస‌క్తిక‌రంగా మారింది. ఏకంగా దుకాణాలూ వెలిశాయి. అస్సాం తేజ్‌పూర్‌లో ఏకంగా ఏనుగు  కూడా  ఇష్టంగా తిన్న‌ది.  చాలా ప్రాంతాల్లో ఈ దుకాణాలు మీటింగ్ ప్లేస్‌గానూ మారింది. స‌ర‌దా క‌బుర్ల‌కు ప్ర‌త్యేకించి హోట‌ళ్ల‌కే వెళ్ల క్క‌ర్లే కుండా త‌యార‌యింది. తింటూ క‌బుర్లాడుకోవ‌డం కుర్రాళ్ల‌కు స‌ర‌దాగా మారింది. వేడి వేడిగా తినే చిరు తిళ్ల కంటే చ‌ల్ల‌చ‌ల్ల‌గాకుండ‌లోంచి పానీపూరీని నింపి ఇవ్వ‌డం క్ష‌ణాల్లో గుటుక్కున మింగ‌డం .. తిన డంలో త‌మ‌షా! అన్న‌ట్టు చాలాప్రాంతాల్లో పోటీలు కూడా పెట్టుకుంటున్నారట! కాస్తంత ఎండ‌వేళ‌కి రోడ్డుమీద అలా వెళుతూంటే హ‌ఠాత్తుగా కొంద‌రు పానీపూరీ తింటూ ఏనుగు మావ‌టికి క‌న‌ప‌డ్డారు. కాస్తంత సేద‌తీరిన‌ట్టుంటుంద‌ని అక్క‌డికి వెళ్లాడు. ఓ రెండు తిన్నాక వెనకే ఉన్న ఏనుగు తొండంతో చేయి లాగ‌డం ఆరంభించింది. ఆగ‌మ్మా..వెళ‌దాం..అస‌లే కాళ్ల నొప్పులు, పైపెచ్చు దాహంతో కూడిన ఆక‌లి.. తిన‌నీ అన్నాడు మావ‌టి. అబ్బే విన‌లేదు, ఇంకా లాగింది. అత‌నికి అప్ప‌టికిగాని  అర్ధం కాలేదు.. గ‌జ‌రాజుకి కూడా ఈ టేస్ట్ చూడాల‌నుంద‌ని. అంతే ఒక‌టి అందించాడు. క్ష‌ణంలో మ‌ళ్లీ తొండం చాపింది. మ‌రోటి.. మ‌రోటి.. ఓ నాలుగు అయ్యాక ఇక లాభం లేద‌ని మావ‌టి ఏనుగుని లాక్కెళ్లాడు. ఏ ముప్ప య్యో.. బండంతానో తింటే!.. డ‌బ్బులెవ‌రిస్తారు.. దాని పాటికి అది నిమ్మ‌ళంగా న‌డిచి వెళుతుం ది.. దుకాణం వాడు మావ‌టి పీకేగా ప‌ట్టుకునేది.. అందుక‌ని గ‌జ‌రాజుగార్ని మావ‌టి అతి క‌ష్టంమీద లాక్కెళ్లిపోయాడు.

స‌రోగ‌సి...ఈ త‌రం మ‌హిళ‌ల్లో సంతానం ఆశ‌!

చ‌దువు, మంచి ఉద్యోగం, పెళ్లి ఆ త‌ర్వాత పిల్ల‌లు.. ఇదే ప్ర‌తీ యింట్లో పెద్ద‌వాళ్లు వాళ్ల పిల్ల‌ల నుంచీ ఆశించేది. పూర్వం ఇల్లంతా పారాడుతూ, ఆడుతూ పిల్ల‌లుండేవారు, ఆ త‌ల్లుల్ని సంతాన‌ల‌క్ష్మీ అని పిలిచేవారు. ఆ కాలం దాటి చాలా ముందుకువ‌చ్చేశాం. ఇపుడు అంతా కెరీర్ ఓరియంట్ జీవితా ల‌యిపోయాయి. కెరీర్ జీవితంలో సింహ‌భాగం ఆక్ర‌మించేసింది. అబ్బాయిలు, అమ్మాయిలూ అదే దృష్టితో జీవితంలో ముందుకు వెళుతున్నారు. పెళ్లి మీద‌, సంతానం మీద శ్ర‌ద్ధ‌పోయింది. పెళ్ల‌యినా ఒక్క‌రిద్ద‌రు కాదు ఒక్క‌రే ముద్ద‌ని స‌రిపెట్టుకునేంతగా బిజీ అయిపోయారు. శ‌నివార‌మో, ఆదివార‌మో త‌ప్ప ఒక‌రినొక‌రు కాస్తంత ప్ర‌శాంతంగా మాట్లాడుకునే స్థితిలో లేరు. కొంద‌రు అస‌లు పిల్ల‌లు క‌న‌డం విష‌యంలోనూ మ‌రో ఆలోచ‌న చేస్తున్నారు. ఆ ఆలోచ‌నే స‌రో గ‌సీ! ఇటీవ‌లి కాలంలో ఈ స‌రోగ‌సీ గురించిన చ‌ర్చ జ‌రుగుతోంది. కార‌ణం స‌మాజంలో సెల‌బ్రెటీలు దాని ప‌ట్ల మ‌క్కువ చూపు తుండడంతో ఆ ఆలోచ‌న అంద‌రికీ న‌చ్చుతోంది.  అయితే ఇది ఎంత‌వ‌ర‌కూ సమంజ‌సం సామాజికంగా, వైద్య‌ప‌రంగా ఎంత వ‌ర‌కూ  అంగీక‌రించ‌ద‌గ్గ‌దా అన్నది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అనారోగ్యం, పిల్ల‌లు పుట్ట‌ర‌ని డాక్ట‌ర్లు నిర్ధారించిన వారు జీవితంలో పిల్ల‌లతో జీవించాల‌న్న ఆనందంకోసం అలాంటి త‌ప్ప‌నిస్థితిలో ఈ స‌రోగ‌సీ ప‌ద్ధ‌తికి మొగ్గు చూపు తున్నారు. అయితే దీన్ని కొంద‌రు దుర్విని యోగం చేస్తున్నా ర‌న్న వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. కానీ అందులో నిజానిజాలు తేల‌వ‌ల‌సి ఉంది. ఇటీవ‌లి కాలంలో సినీరంగంలో కొంద‌ రు సెలబ్రిటీ లు ఈ ప‌ద్ధ తిని అనుస‌రించారు. టాలివుడ్ కోలివుడ్ నటి నయన తార సరోగసి పద్దతి లో కవలలకు జన్మని వ్వడం విన్నాం. ఇక సరో గ‌సిలో వైద్యులు చెపుతున్న వివరాల ప్రకారం శుక్రకణాలు X,X కలిస్తే ఆడ పిల్లని  XY. కలిస్తే మగ పిల్లవాడని ఒక సరోగట్ కు ఒకరిని మాత్రమే కనాలని నిబంధన ఉన్నా, కవలలు సాధ్యమా అన్న ప్రశ్నకు గైన‌కాలజిస్టులు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. భారత ప్రభుత్వం సరోగసితో వ్యాపారం చేయడాన్ని నివారించేందుకు జనవరి 25 న సరోగసి చట్టం 2021 తెచ్చింది. ప్రముఖ వైద్య నిపుణులు అంశుమన్ కుమార్ మాట్లాడుతూ, సరోగసి వైద్య ప్రక్రియ దంపతు లకు సంతానం కలగదో పిల్లలు కావాలని కోరు కుంటారో  వారు గర్భసంచిని  అద్దెకు తీసుకోవచ్చు.అలా గర్భాన్ని అదీకిచ్చే మహిళను సరోగేట్ అని అంటారు. సంతానం  కోరుకునే వారిలో శుక్రకణా లను, అండాశయం లోనుండి తీసి ల్యాబ్ లో పరీక్షించిన తరువాత వైద్య ప్రక్రియ ద్వారా వాటిని సంక రం చేస్తారు. వైద్య విధానం ద్వారా మాత్రమే సరోగేట్ గర్భసంచిలో చేరుస్తారు. సరోగేట్ గర్భంలోనే పిండం పెరుగుతుంది. ఆమె తొమ్మిది మాసాల త‌ర్వాత‌ జన్మనిస్తుంది ఈసమయంలో  సరోగేట్ తో జరిగిన ఒప్పందం ప్రకారం  వైద్య ఖర్చు దంపతులే భరిం చాలి మనదేశం లో ఉన్న ఆర్ధిక అసమా నతలు బలహీనంగా ఉన్న మహిళలు సులభంగా సరోగేట్ తల్లులు లభిస్తూ ఉండడంతో విదేశీయులు, ఆర్ధికంగా బలంగా ఉన్నవారు పిల్లలను కనేందుకు ఈ మార్గం ఎంచుకోవడం ఈ పద్దతిలో పిల్లలను పొందడం సరోగేట్ తల్లికి డబ్బులు ఆశచూపడం చట్టప్రకారం ఇది నిషేదించిన కొన్ని నియమ నిబంధ‌నలను రూపొందించి సరోగాసిని నివా రించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం హ‌ర్ష‌ణీయం. డిల్లి హైకోర్ట్ న్యాయవాది కరణ్ సింగ్ మాట్లాడుతూ సరోగసి నియంత్రణ చట్టం రెగ్యు లేషన్ యాక్ట్ 2021 ప్రకారం వ్యాపార సంబం ధ సరోగాసిని నిలుపుదల చేసింది. డిసెంబర్ 2౦21 పార్లమెంట్ లో చట్టం ఆమోదించింది. జనవరి 25 2022న ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో న్యాయశాఖ గెజిట్ నోటిఫి కేషన్ జారీ చేసింది. చట్టం ప్రకారం సరోగసి నిబంధనలకు లోబడి పరస్పర  పరో పకారంతోనే సరోగాసీకి అనుమతిస్తారు. సరోగేట్ తల్లికి తప్పనిసరిగా దంపతులు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయా ల్సి ఉంటుంది. ఆమెకు ౩6 నెలలు నిండి ఉండాలి. దీనితోపాటు సరోగేట్ తల్లికి అయ్యే వైద్యం ఖర్చు దంప తులె భరించాలి. సరోగేట్ తో మరే ఇతర ఆర్ధిక లావాదేవీలు నిర్వహించారాదు. ఏ క్లినిక్ లో అయితే సరోగాసి చేస్తున్నారో అది తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండ డం తప్పనిసరి. సరోగేట్ మదర్ విష‌యానికి వ‌స్తే.. హైకోర్ట్ న్యాయావాది నవీన్ శ‌ర్మ చెప్పిన వివరాల ప్రకారం కొన్ని నిబందనలు చేర్చారు. ఎవరైనా ఒకమహిళ ఒక్కసారి మాత్రమే  సరోగేట్ మదర్ గా ఉంటుంది. ముందే ఆమె వివాహిత అయ్యి ఉండాలి. ఆమెకు ఎటు వంటి మత్తు పదార్ధాలు తీసుకునే అలవాటు ఉండకూడదు. వైద్య పరంగా ఆమె ఫిట్ గా ఉండాలి. ఒక వేళ సరోగేట్ తల్లికి ఇన్సూ రెన్స్ చేయించక పోవడం, వైద్య ఖర్చులు ఇచ్చే నిబంధన ను ఉల్లంఘిస్తే ఆ దంపతులకి ప‌దేళ్లు  జైలు ప‌ది లక్షల జరిమానా విధిస్తారు. దంపతులలో పురుషుల వయస్సు 26 నుంచీ 55 సంవత్సరాల మధ్య ఉండాలని స్త్రీల వయస్సు 23 నుంచీ 50 సం వత్సరాల మధ్యలో ఉండాలి. విడాకులు తీసుకున్న వివాహితలు, వేరుగా జీవిస్తున్న వారు హోమో సేక్షువల్స్ సరోగాసికి అను మతిలేదని నిబంధనలో పేర్కొన్నారు. కాగా సరోగాసి ద్వారా పుట్టిన బిడ్డకు రక్షణ సంరక్షణ విధానం లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదని ఇందు కోసం సరోగసి చట్టంతో పాటు  బాలల సంరక్షణ, దత్తత  కార్ నిబంధన 2015 ప్రకారం అనుసరిం చాలని, తద్వారా బాలిక సంరక్షణ కలిగిస్తుందని అయితే సరోగ‌సి నిషేదింప బడలేదని సరోగసి ని నియంత్రణ చేసేందుకు చట్టం రూపొం దించామని నిపుణులు పేర్కొన్నారు.

కేసేఆర్ ఢిల్లీ పర్యటన అసలు రహస్యం ఇదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అయితే, ముందుగా అనుకుని ఆయన ఢిల్లీ వెళ్ళలేదు.ఇటీవల మరణించిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు.   మంగళవారం (అక్టోబర్ 11) ఢిల్లీ చేరుకున్న వెంటనే భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో అద్దెకు తీసుకున్న బంగళాను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లోని 5వ నెంబరు బంగళాను బీఆర్‌ఎస్‌ కార్యాలయం కోసం తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం (అక్టోబర్ 12) వసంత విహార్ లో  నిర్మాణంలో ఉన్న  తెరాస భవన్  నిర్మాణ పనులను పరిశీలించారు.  అయితే  ముఖ్యమంత్రి ఢిల్లీలో ఆగింది ఇందుకేనా  ఢిల్లీలో ఎన్నిరోజులు ఉంటారు  అనేదానిపై  ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం ఏదీ లేదని అంటున్నారు. అయితే   నాలుగైదు రోజులు ఢిల్లీలోనే ఉంటారని బీఆర్ఎస్ వర్గాల సమాచారం. అవసరం అయితే, ఇంకొన్ని రోజులు అక్కడే ఉన్నా ఉండవచ్చని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమి చేస్తున్నారు? అనుకోకుండా వెళ్లి అక్కడే ఎందుకు ఉండి పోతున్నారు అంటే పార్టీ వర్గాలు ఇది పూర్తిగా రాజకీయ పర్యటన అనే చెపుతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తరువాత తొలిసారి జాతీయ పార్టీ నేతగా ఢిల్లీలో ముఖ్యమంత్రి కాలు పెట్ట్టారు. జాతీయ పార్టీకి సంబందించిన వ్యహారాలపైనే దృష్టి పెడతారని అంటున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులు, వివిధ సంఘాల నేతలను కేసీఆర్ కలిసే అవకాశం ఉందని, అలాగే బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహరచన చేస్తారని అంటున్నారు.   అయితే  అది నిజమా అంటే  నిజమే. కానీ, సంపూర్ణ సత్యం అయితే కాదు. అది అర్థ సత్యం మాత్రమే అనేది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో అదే విధంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో వినిపిస్తున్న మరో ముచ్చట. ముఖ్యమంత్రి వెంట ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ తో పాటుగా మరికొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. నిజానికి, గత కొంత కాలంగా  కవిత, సంతోష్ ఇద్దరూ కూడా కేసీఆర్ గుడ్ లుక్స్ లో లేరు.  ఆ ఇద్దరినీ ముఖ్యమంత్రి దూరంగా ఉంచుతున్నారని పార్టీ వర్గాల్లోనే కాదు బయట కూడా విపిస్తోంది. తెరాస పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు దసరా పండగ పూట నిర్వహించిన పార్టీ పండగ కార్యక్రమంలో కవిత కనిపించలేదు. అలాగే  మునుగోడు ఉప ఎన్నికల ప్రచార బృందంలో  ముఖ్యమంత్రి మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ బాధ్యతలు అప్పగించారు, కానీ, కవిత, సంతోష్ లకు  మాత్రం ఏ బాధ్యతలు ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరినే, ప్రత్యేకంగా  వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అయితే దీని వెనక ఉన్న రహస్యం ఏమిటీ, అనే ప్రశ్నకు సమాధానం అయితే చిక్కడం లేదు.   మరో వైపు  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ సంస్థలు దూకుడు పెంచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో, ఎమీల్సీ కవిత వద్ద కొంత కాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన, ఆమె వ్యాపార భాగస్వామి, బినామీగా అనుమానిస్తున్న అభిషేక్ రావు సిబిఐ అరెస్ట్ చసిన తరువాత, ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం చేయడం, అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. నిజానికి, ఢిల్లీ లిక్కర్ స్కాం లో అభిషేక్ రావు, వెన్నమనేని శ్రీనివాసరావు పేర్లతో పాటుగా కవిత పేరు కూడా ప్రముఖంగా విపిస్తున్న  విషయం తెలిసిందే. లిక్కర్‌ పాలసీ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయినా   ఈడీ అధికారులు అభిషేక్ రావు, వెన్నమనేని శ్రీనివాసరావును నివాసాలు, కార్యాలయాలలో సోదాలు చేశారు. ఆ ఇద్దరిని విచారించారు. అయినా ఇంతవరకు కవిత జోలికి మాత్రం రాలేదు, కానీ, ఇక ఆ ఇదరి అరెస్ట్ తర్వాత, వారి నుంచి సేకరించిన ఆధారాలతో కవితను విచారించే అవకాశం, ఉందని అందుకే కేసీఆర్ బిడ్డను కాపాడుకునేందుకు ‘పెద్ద’లను కలిసే  పనిలో ఢిల్లీలో మకాం చేశారని అంటున్నారు. ప్రస్తుతం అభిషేక్ రావు సీబీఐ కస్టడీలో ఉన్నారు. మరో వంక మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనేక రకాల చర్చలకు దారి తీస్తోంది.

ఉక్రెయిన్ లో రష్యా విలీనంపై ఖండ‌న...యు.ఎన్‌ ఓటింగ్‌కు భారత్ దూరం

నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఏ) బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం 143 మంది సభ్యులు తీర్మా నానికి అనుకూలంగా ఓటు వేయగా, ఐదుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. భారత్‌తో సహా 35 మంది తీర్మా నానికి దూరంగా ఉన్నారు. భద్రతా మండలిలో రష్యా ఇదే విధమైన ప్రతిపాదనను వీటో చేసిన కొద్ది రోజు ల తర్వాత ఈ తీర్మానం వచ్చింది, దీనికి భారతదేశం దూరంగా ఉంది. ఎవరూ వీటోని ఉపయోగించని చోట సభ్యులు ఆమోదించిన తాజా తీర్మానం, రెఫరెండం అని పిలిచిన తరువాత నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాలలో రష్యా అక్రమ విలీన ప్రయత్నాలను  ఖండించింది. సోమ వారం యుఎన్‌జిఎలో ఉక్రెయిన్ , రష్యా ఘర్షణ పడిన రెండు రోజుల తర్వాత ఈ ఓటు వచ్చింది. సోమ వారం, ఉక్రేనియన్ భూభాగాలను మాస్కో అక్రమ విలీన ప్రయత్నాన్ని ఖండించడానికి ముసాయిదా తీర్మానంపై యుఎన్‌జిఏ లో రహస్య  బ్యాలెట్ నిర్వహించాలన్న రష్యా  పిలుపును తిరస్కరించడానికి భారత దేశం ఓటు వేసింది. ఉక్రెయిన్‌పై తీర్మానంపై రష్యా రహస్య బ్యాలెట్‌ను ప్రతిపాదించిన తర్వాత అల్బేనియా బహిరంగ ఓటును అభ్యర్థించింది. అల్బేనియా పిలుపునిచ్చిన విధానపరమైన ఓటుకు భారత్ అనుకూలంగా ఓటు వేసింది.  అల్బేనియన్ ప్రతిపాదనకు అనుకూలంగా 107 ఓట్లు వచ్చాయి, 13 దేశాలు  ఓటును వ్యతిరేకించగా, 39 మంది గైర్హాజరయ్యారు. చైనా, ఇరాన్ మరియు రష్యాతో సహా ఇరవై నాలుగు దేశాలు ఓటు వేయలేదు. సెప్టెంబర్ చివరి వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డోనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా అనే నాలుగు ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్నట్లు పత్రాలపై సంతకం చేశారు. ఈ వారం క్రిమి యా వంతెన పేలుడు తర్వాత రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది, ఇది మాస్కో నుండి ప్రధాన ఉక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులను ప్రేరేపించింది. రష్యా చర్యలను ఖండిస్తూ, యుఎన్  చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్, తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని యుద్ధం మరో ఆమోదయోగ్యం కాని తీవ్రతకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని అన్నారు. నివేదించబడిన సమ్మెలు పౌర ప్రాంతాలకు విస్తృతంగా నష్టం కలిగించాయి మరియు డజన్ల కొద్దీ మరణాలు, గాయాలకు దారితీశాయి,  ఎప్పటిలాగే  ఫిబ్రవరి 24 నాటి రష్యా దాడికి పౌరులు అత్యధిక ధరను చెల్లిస్తున్నారని తేలింది. శనివారం క్రిమియా బ్రిడ్జి దాడి తర్వాత పుతిన్ ఈ వారం కఠినమైన  ప్రతీకార చర్యలను హెచ్చ రించారు. ఒక టెలివిజన్ ప్రదర్శనలో, పుతిన్ క్రిమియా బ్రిడ్జ్ పేలుడు తర్వాత ఉక్రెయిన్ అంతటా సైనిక , మౌలిక సదుపాయాల లక్ష్యాలను రష్యా ఛేదించిందని చెప్పారు.