చిరు ఘటన..ఎందుకీ రచ్ఛ

మెగాస్టార్ చిరంజీవి, పాపులర్ ప్రవచన కర్త గరికపాటి మధ్య యాధృచ్ఛికంగా జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమం వేదికగా రచ్చ రచ్చ అవుతోంది.  హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు విషయంలో గరికపాటి తొందరపాటుతోనో, తన ప్రసంగానికి అవాతరం అవుతోందనో ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అ యితే వెంటనే నిర్వాహకులు సముదాయించారు. చిరంజీవి సంయమనం పాటించారు. అక్కడితో ఆ వ్యవహారం ముగిసిపోయింది. అయితే చిరంజీవి అభిమానులూ, ఆయన సోదరుడు నాగబాబు సామాజిక మాధ్యమం వేదికగా ఈ అంశాన్ని పెద్దది చేయడానికి చూపుతున్న ఉత్సాహం చిరు గౌరవాన్ని ఇనుమడింప చేసేదిగా లేదు సరికదా.. ఏదో రూపంలో విమర్శలు చేయాలని, బురద జల్లాలనీ ప్రయత్నించే వారికి అవకాశం ఇచ్చేదిలా ఉంది. ఇప్పటికే నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు బ్రాహ్మణ సంఘాలు స్పందిస్తున్నాయి. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు వ్యవహరించిన తీరు అహంకారానికి నమూనాగా ఉందనీ, అందుకనే ప్రవచన కర్త గరికపాటి అసహనం వ్యక్తం చేశారనీ వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నాయి. అవును నిజమే అలయ్ బలయ్ కార్య‌క్ర‌మంలో చిరంజీవి – గ‌రిక‌పాటి జరిగిన చిరు ఘటన అవాంఛనీయమే.  చిరుని చుట్టిముట్టి ఫొటోలు దిగుతున్న అభిమానుల సందడి అప్పుడే ప్రసంగించడానికి ఉపక్రమిస్తున్న గరికపాటిని ఒకింత అసహనానికి గురి చేసింది. అందుకే మీరు ఫొటో సెషన్ ఆపకపోతే నేను వెళ్లి పోతాను అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. విషయం గ్రహించిన చిరంజీవి   వెంటనే అభిమానులను సముదాయించి ఫోటో సెషన్ కు స్వస్తి పలికారు. ఆ తరువాత గరికపాటి, చిరంజీవి పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. జరిగిన సంఘటన వారిరువురిపైనా ఎలాంటి ప్రభావం చూపలేదనడానికి ఇదే నిదర్శనం.  ఇరువురూ కూడా వారి వారి రంగాల్లో లబ్ధ ప్రతిష్టులు , నిష్ణాతులు. ఇద్దరిలో ఒకరు పద్మశ్రీ అయితే ఒకరు పద్మభూషణ్. జరిగిన సంఘటన కాకతాళీయమేనని ఇరువురూ గ్రహించారు. దానిని అక్కడితో ఆపేస్తే బాగుండేది.. కానీ చిరంజీవి సోదరుడు నాగ‌బాబు  అత్యుత్సాహంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా గ‌రిక‌పాటిపై కౌంట‌ర్ వేశాడు. చిరంజీవి ఇమేజ్‌ని చూస్తే ఏపాటి వాడికైనా ఈ పాటి అసూయ క‌ల‌గ‌డం ప‌రిపాటే అంటూ సెటైర్ వేశారు.  అందుకు తందాన పాడుతున్న చందంగా చిరంజీవి  అభిమానులు గ‌రిక‌పాటి క్ష‌మాప‌ణ‌లు డిమాండ్ చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. దీంతో గరికపాటికి మద్దతుగా ఆయన అభిమానులు బ్రాహ్మణ సంఘాల పేర రంగంలోకి దిగారు.  ఈ తీరు ఇటు చిరంజీవికీ, అటు గరికపాటికీ కూడా గౌరవాన్ని తెచ్చి పెట్టేది కాదు. ఒక ముగిసిన అధ్యాయాన్ని లాగి పీకి రచ్చ చేయడం తగదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిదని విజ్ణులు సూచిస్తున్నారు. 

యాపిల్ స్మార్ట్ వాచ్ టైం బాంబ్ లా పేలింది!

దీపావళి దగ్గరకొస్తోంది. టపాసుల కొనుక్కుని తనివి తీరా కాల్చాలని పిల్లలు పెద్దలూ ఉబలాటపడటం మామూలే. అయితే దీపావళికి ముందే పేలుళ్లు వినిపిస్తున్నాయి. అయితే అవి టపాసుల వల్ల వచ్చే పేలుళ్లు కాదు. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్ వాచ్ లు పేలడంతో వస్తున్న శబ్దాలు. చాలా సందర్బాలలో ఈ పేలుళ్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకులు నడుస్తుండగా పేలి మరణాలు సంభవించిన సంఘటనలు విన్నాం. చూశాం. ఎలక్ట్రిక్ బైకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాన్ని ఆయా బైకుల తయారీ కంపెనీలూ కూడా అంగీకరించాయి. అలా పేలిన బైకులకు సంబంధించి బ్యాచ్ బైకులను మార్కెట్ నుంచి ఉపసంహరించాయి కూడా. ఇక ఇప్పుడు ఈ పేలుళ్లు స్మార్ట్ వాచ్ లకూ పాకాయి. ప్రముఖ కంపెనీ యాపిల్ కు చెందిన స్మార్ట్ వాచ్ భడేల్మని పేలిపోయింది. అదృష్ట వశాత్తూ ఆ స్మార్ట్ వాచ్ యూజర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి యాపిల్ స్మార్ట్ వాచ్ వాడుతున్నాడు. ఆ స్మార్ట్ వాచ్ బ్యాటరీ ఉబ్బిపోయి లోపలి నుంచి శబ్దాలు వస్తుండటంతో భయపడిన ఆ స్మార్ట్ వాచ్ యూజర్ దానికి ఇంటి నుంచి బయట దూరంగా పడేశాడు. ఆ వెంటనే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనపై యాపిల్ స్పందించిన తీరే విమర్శలకు తావిస్తోంది. తమ కంపెనీ స్మార్ట్ వాచ్ పేలిందన్న సంగతి ఎవరికీ చెప్పవద్దంటూ ఆ వినియోగదారుడిపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఒక డాక్యు మెంట్ పై సంతకం చేయించుకుని, పేలిపోయిన వాచ్ ను రికవర్ చేసుకుంది. మొత్తం మీద స్మార్ట్ వాచ్ లు ఉపయోగించే వారు ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఈ సంఘటన చెబుతోంది.

మునుగోడు టిఆర్ ఎస్ అభ్య‌ర్ధి కూసుకుంట్ల‌

కూసుకుంట్ల ప్రభాక‌ర్‌రెడ్డిని మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ  అభ్య‌ర్ధిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టిం చారు. మునుగోడులో బీసీ ఓట‌ర్లు అధిక‌శాతంలో ఉన్నారు. స‌ర్వేల ఆధారంగా కూసుకుంట్ల గెల‌వ‌డానికి అవ‌కాశం ఉంద‌న్న స‌మాచారంతోనే కేసీఆర్ ఆయ‌న్ను త‌మ అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు.  మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న కూసుకుంట్ల..ఈనెల 10న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి హాజరుకానున్నారు. మును గోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి ‍స్రవంతి పోటీ చేస్తు న్నారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలంనుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పని చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని  టీఆర్ ఎస్ స్థానిక నేతలు, కార్యకర్తలు కోరు కుంటున్నారని.. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే నివేదిక‌ల‌ను పరిశీలించిన తరువాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల‌ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, బీజేపీ నేత ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ (బీ ఆర్  ఎస్) అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ వెంటే ఉన్నారని, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అందులోనూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది. 

ఉట్టికెగరలేనమ్మస్వర్గానికి నిచ్చెనేసినట్లేనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసిందట.. అలా ఉంది.. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీ అనడం. ఎవరు ఔనన్నా కాదన్న టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ.. ఎంత గొప్పలు చెప్పుకున్నా.. దేశ్ కీ నేతా అంటూ దేశ వ్యాప్తంగా ప్లెక్సీలూ పోస్టర్లూ ఏర్పాటు చేసి మీడయాలో ప్రచారం చేసినా కేసీఆర్ ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీ నాయకుడే. ఆయన క్షేత్ర స్థానం తెలంగాణయే. ఇక తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎగరాలంటే.. ముందుగా ఆయనకు కావలసింది.. లోక్ సభ స్థానాలు. తెలంగాణలో ఉన్నవి కేవలం 17 లోక్ సభ స్థానాలు మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయన పార్టీ గెలిచింది తొమ్మిది స్థానాలు మాత్రమే. దేశ వ్యాప్తంగా ఉన్న లోక్ సభ స్థానాలు 542. అంటే తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని ఏకంగా పార్టీ పెట్టిన కేసీఆర్ కు తన సొంత రాష్ట్రంలో ఉన్నవి కేవలం 17 లోక్ సభ స్థానాలు. సరే ఆయన కరిష్మాతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలోనూ తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగలిగినా మొత్తం లోక్ సభ స్థానాలలో ఆయనకు వచ్చే స్థానాల సంఖ్య ఎక్కువలో ఎక్కువ మూడు శాతానికి మించదు. ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ పెట్టి నెగ్గుకు వద్దామని కేసీఆర్ భావించడం నేల విడిచి సాము చేయడంలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు. తెరాస అధినేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ ఎనిమిదేళ్లలో ఆయన ఎన్నడూ ప్రాంతీయ వాదాన్ని దాటి ఒక్క అడుగు పక్కకు వేసి దేశం మొత్తం అనే యోచన చేసిన దాఖలాలు లేవు. దేశం విషయం ఎందుకు పొరుగున ఉన్న సాటి తెలుగు రాష్ట్రం ఏపీ గురించి ఒక్క మంచి ముక్క చెప్పిన పాపాన పోలేదు. ఎంత సేపూ ఎన్నికలు , గెలుపు వ్యూహాలతో ఆంధ్ర, తెలంగాణ మధ్య ఎడాన్ని పెంచడానికే ప్రయత్నించారు. నీళ్లు, ప్రాజెక్టులు, విభజన సమస్యల పరిష్కారం ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా ఏపీకి న్యాయం జరగడానికి అవకాశం లేని ఎత్తుగడలనే అవలంబించారు. తెలంగాణా చాలా చిన్న రాష్ట్రం. కేవలం 17 లోక్ సభా స్థానాలు ఉన్నాయి. లోక్ సభ మొత్తం సీట్ల సంఖ్య 542. అందులో కేవలం మూడు శాతమే లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం నుంచి ఒక నాయకుడు ఏకంగా దేశాన్నే ఏలాలని యత్నం చేయడాన్ని ‘ఉట్టి ఎక్కగలిగామ( తెలంగాణలో అధికారం)నే సంబరంతో స్వర్గానికి నిచ్చెన వేసిన చందంగా ఉందని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేసి, జాతీయ రాజకీయాల్లో తనకు కీలక పాత్ర దొరికినట్లు కేసీఆర్ సంబరాలు చేయడం వినోదాన్ని కలిగిస్తోందంటున్నారు. నిజమే దేశంలోని అత్యంత ధనిక పార్టీలలో తెరాస ఒకటి. అందులో సందేహం లేదు. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కానీ, జాతీయ రాజకీయాలలో అత్యధిక కాలం చక్రం తిప్పి, ఎక్కువ కాలం అధికారంలో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కానీ ఆ విషయంలో అంటే ధనిక పార్టీ అన్న విషయంలో  కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ తో పోటీలో లేవు. అందుకే జాతీయ పార్టీ సారథిగా ఆయన పర్యటనల కోసం ఏకంగా సొంత విమానాన్నే కొనుగోలు చేయడానికి కేసీఆర్ నిర్ణయించారు. అంతేనా దేశ వ్యాప్తంగా అన్ని భాషలూ, రాష్ట్రాలలో పెద్ద ఎత్తునప్రకటనలు జారీ చేయగలిగారు. నిజమే  అధికారికంగా టీఆర్ఎస్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 860 కోట్లున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైట్ మనీకి కనీసం పది పదిహేను రెట్ల నల్లధనం ఉండడం సహజమేనని అంటుంటారు. అందుకే పార్టీ పేరు పెట్టక ముందే ఢిల్లీలో ఓ భారీ భవంతిని తీసుకొని రంగులతో కేసీఆర్ ముస్తాబు చేయించారు. దేశవ్యాప్తంగా తిరిగేందుకు  సొంత విమానం కూడా ఏర్పాటు చేసుకోగలిగారు. అయితే.. జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో కేసీఆర్ కు స్పష్టత ఉన్నట్లు మాత్రం కన్పించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. జాతీయ రాజకీయ పార్టీని స్థాపించి కేసీఆర్ మోడీని ఢీ కొనాలని నిర్ణయించారు.  బలవంతుడైన శత్రువును ఢీకొనవలసి వచ్చినప్పుడు చుట్టు పక్కల వారందరినీ కలుపుకొని జట్టు కట్టాలి. మోడీతో శత్రుత్వం ఉన్న ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి జాతీయ శక్తులను సమీకరించాలి. కానీ కేసీఆర్ ఆ ప్రయత్నం చేయలేదు.  జాతీయ పార్టీ అంటే కనీసం ఆరేడు రాష్ట్రాల్లో సొంతంగా పోటీచేసే శక్తి ఉండాలి. ఆ శక్తి కేసీఆర్ కు లేదని ప్రత్యేకంగా చెప్పక్కర లేదంటున్నారు.  పొరుగు రాష్ట్రాలు ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా కేసీఆర్ కు ఏమాత్రం పట్టు ఉన్న దాఖలా లేదు. డీఎంకే పార్టీ పలుమార్లు ఆంధ్రలో పోటీ చేసింది. కానీ ఒక్కసారి కూడా డిపాజిట్ దక్కించుకున్న చరిత్ర లేదు. కేసీఆర్ పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఉండే అవకాశం లేదంటున్నారు. సాటి తెలుగురాష్ట్రం అయిన ఏపీలోనే ఆయనకు ఆదరణ లభించే అవకాశాలు మృగ్యం. అటువంటి కేసీఆర్ జాతీయ పార్టీకి ఇతర ప్రాంతాలలో ఆదరణ లభిస్తుందని ఎలా భావించగలం అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద.. జాతీయ పార్టీ ప్రకటన ద్వారా కేసీఆర్ దుస్సాహసానికి పాల్పడ్డారనే అంటున్నారు. ఆ సంగతి పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ విషయంలో కేసీఆర్ కొత్త పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అని పరిశీలిస్తే ఆయనతో కలిసి వచ్చేవారు ఒక్కరూ కన్పించడం లేదని అంటున్నారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ కేంద్రంలో మోడీతో స్నేహం కోసం తహతహలాడుతున్నాయి. ఆ పార్టీల అధినేతలు మోడీని ఎదిరించే సాహసం చేయరు. అందుకే ఎన్నికల పొత్తు లేకపోయినా, బీజేపీతో కలిస్తే తనకు బలమైన ముస్లింలలో అసంతృప్తి వస్తుందని తెలిసినా మూడేళ్లుగా లోక్ సభ, రాజ్యసభలలో బీజేపీ వైపే జగన్ నిలబడుతున్నారు. మోడీ అడగకుండానే మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదంటున్నారు. ఒకసారి మోడీని ధిక్కరించి, జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టి విఫలం అయ్యారు. అందువల్ల అలాంటి దుస్సాహసం మరోసారి చేసే అవకాశం ఉండకపోవచ్చు. కేసీఆర్ ఉద్యమం, టీఆర్ఎస్ పుట్టుక ఆంధ్రుల మీద ద్వేషంతో నడిచినవే. ఆంధ్రులు తమ నీళ్లు దొంగిలిస్తున్నారని, తమ ఉద్యోగాలు ఎత్తుకుపోతున్నారని, తమ నిధులు తరలిస్తున్నారని ఆగం చేసి మరీ కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం సాధించారు. ఆంధ్రుల ప్రయోజనాలకు విరుద్ధ పోకడ గల పార్టీకి ఆంధ్రలో కాలుపెట్టే ఛాన్స్ లభిస్తుందని ఊహించడానికి కూడా వీలుకాదు. అందువల్ల కేసీఆర్ కొత్త  పార్టీకి ఏపీలో ఎలాంటి బలమూ రాకపోవచ్చని అంటున్నారు. రాజకీయ నిరుద్యోగులు ఎవరైనా అక్కడక్కడా బీఆర్ఎస్ పార్టీ శాఖలు ప్రారంభించవచ్చు. కానీ అవి పేరుకు మాత్రమే అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రులను కేసీఆర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా రాష్ట్రానికి వస్తావ్ బిడ్డా అంటున్నారు ఆంధ్ర ప్రజలు.

 రేవంత్‌.. ఇప్పుడెలా?

కొత్త‌ద‌నాన్నే అంద‌రూ కోరుకుంటారు. సైకిల‌యినా, కార‌యినా స‌రే. పిల్ల‌డికి కొత్త బ్యాగ్ ఇష్టం, పై చ‌దువు ల‌కు వెళ్లే కుర్రాడికి మంచి కాలేజీ కొత్త వాతావ‌ర‌ణం కోరుకుంటాడు. ఎన్నాళ్లుబోయినా ఒకే  ఇంట్లో ఉం డాలా అని బోరింగ్ గా అనుకునేవారు కొత్త ఇల్లు కొన‌డానికి వేట‌లో ఉంటారు. పాత త‌రం ఆలోచ‌న‌లు వ‌ది లి అంద‌రూ వెళ్లే ఈ త‌రం దారిలోకి వెళ్లాల‌ని  చాలామంది  ఉన్న‌దారిని వ‌దులుకోను యిష్ట‌ప‌డ తారు. ఇపుడు కాంగ్రెస్ నుంచి చాలామంది మ‌ళ్లీ టీఆర్ ఎస్ కారు వెళుతోన్న మార్గాన్ని ఎంచుకుం టున్నారు.  తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న టీఆర్ ఎస్ పార్టీకి బీఆర్ ఎస్ అనే కొత్త పేరు పెట్టుకున్నారు. దాంతోనే ఇక రాజ‌కీయాల్లో దూసుకుపోవాల‌ని ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇప్ప‌టికే మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను, పార్టీ వీరాభిమానుల‌ను స‌మాయ‌త్తం చేశారు. మ‌నం దేశ రాజ‌కీయాల్లోనూ హ‌ల్‌చ‌ల్ చేయాల‌న్న ప్ర‌బోధ చేసి ఉర‌క‌లు పెట్టిస్తున్నారు. టీఆర్ ఎస్‌గా కంటే బీఆర్ ఎస్‌గానే ఉత్త‌రాది ప్రాంతా ల్లోకి వెళ్ల‌డానికి వీల‌వు తుంద‌ని కేసీఆర్ న‌మ్ముతున్నారు. పార్టీ పేరు, గుర్తుకీ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఓకే అనేస్తే ఇక మును గోడు ఉప ఎన్నిక‌ల నుంచే వీరావేశంలో దూసుకుపోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. కేసీఆర్ త‌న పార్టీ మార్చి దేశంలో త‌న పార్టీ ప్ర‌భావాన్ని చూప‌డానికి యువ‌త‌ను కూడా ఎంతో ఆక‌ట్టు కుంటున్నారు. ఆయ‌న వాడి వేడి గ‌మ నించి కాంగ్రెస్‌లోంచి కొంద‌రు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధ‌ ప‌డ్డారు. చిత్ర‌మేమంటే వీరంతా గ‌తంలో  టీ ఆర్ ఎస్ నుంచీ ఇటు వ‌చ్చిన‌వారే! పాత‌త‌రం పాల‌న‌లోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ని యువ‌త‌తో నింపి ముందుగు వేగంగా వేయించాల‌ని తెలం గాణా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి యువ‌త‌ను ఎంతో ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగాలు చేసి చాల మందిని పార్టీలోకి తీసుకురాగ‌లిగారు. టీఆర్ ఎస్ నాయ‌కులు, అధినేత వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో విసిగెత్తిన కొంద‌రు మూటాముల్లూ స‌ద్దుకుని కాంగ్రెస్ పంచ‌న చేరారు. రేవంత్ ఘ‌న విజ‌యం సాధించినంత ఆనం దించా రు. కేసీఆర్ కి గొప్ప ఝ‌ల‌క్ ఇచ్చాన‌ని లోలోప‌ల తెగ ఆనందించారు. కానీ అది కేవ‌లం తాత్కాలిక మేన‌ని ఇపుడు స్ప‌ష్ట‌మ‌యింది.  క‌ద‌ల్లేని కాంగ్రెస్‌లో ఉండేకంటే ఢిల్లీ దాకా ఉర‌క‌లు వేయ‌బోతున్న టీ ఆర్ ఎస్ లోకి మ‌ళ్లీ వెళ్ల‌డ‌మే మేలు అని బాగా ఆలోచించే వారంతా మ‌ళ్లీ ఈ గ‌ట్టుకే వ‌చ్చే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ జంపింగ్ జిలానీల‌లో రేవంత్ ఇపుడు కంగార‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. త‌ను ఎంతో ప్ర‌తిష్ట‌గా భావించి ప్ర‌చారం చేసుకున్న‌దంతా కేవ‌లం డొల్లేన‌ని అధిష్టానానికి ఎగ‌స్పార్టీవారు తెలియ‌జేస్తే, గ‌తేంగాను. అస‌లే రాహుల్‌గాంధీ భార‌త్ జోడో అంటూ యువ‌త‌ను ఆక‌ట్టుకునే ప్ర‌చార యాత్ర‌లో ఉన్నారు. ఈ సంగ‌తి క్లియ‌ర్గా తేలితే, తెలిస్తే తిట్టే తిట్లు హిందీలోనూ తెలంగాణా వారికి అర్ధ‌మ‌వుతాయి. మ‌రి అంత‌టి అవమానం దాటేసేందుకు రేవంత్ మ‌రో అమాయ‌క బృందాన్ని త‌న గ‌ట్టుమీద‌కి తెచ్చుకోవ‌డానికి వెతుక్కో వాలేమో!

కాంగ్రెస్‌ను యువ‌భార‌త్ పార్టీగా మారుద్దాం...శ‌శిథ‌రూర్ సూచ‌న‌

వెన‌క‌టికి పులి చార‌ల కోసం తోడేలు వాత‌లు పెట్టించుకుందిట‌. ఇపుడు కేసీఆర్ త‌న పార్టీ పేరును టీఆర్ ఎస్ నుంచి బీఆర్ ఎస్ గా మార్చారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఓకే అనేస్తే ఇక అదే పేరు ఖాయ‌మై ఎన్నిక‌ల్లోకి అదే పేరుతో పోటీ చేస్తుంది. ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌మీద దృష్టి సారించ‌డంతో పార్టీని ఆ దిశ‌గా ప‌రుగులు పెట్టించాల‌ని ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న అభిప్రాయాలే ఎక్క‌వగా విన‌ప‌డుతు న్నాయి. దేశంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి దేశంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, వీరాభిమానుల‌ను ఉత్స‌హంగా ఉర‌క‌లు వేయిం చడానికి కార్యోన్ముఖుల‌ను చేయ‌డానికి కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర కొన‌సా గిస్తున్నారు.  దీనికి తోడుగా యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డానికి అస‌లు పార్టీ పేరునే యువ భార‌త్ కాంగ్రెస్ అంటూ పేరు మారిస్తే ఎలా ఉంటుంద‌ని థ‌రూర్ అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు వినిపించేలా అన్నారు. అనాదిగా దేశంలో అన్ని ప్రాంతాల్లో గ‌ట్టి మ‌ద్ద‌తు, కార్య‌క‌ర్త‌ల బేస్ ఉన్న పురాత‌న పార్టీకి పేరు మార్చాల‌ని థరూర్  ఎందుకు ఆలోచ‌న చేసిన‌ట్టు?   కాంగ్రెస్ క్ర‌మేపీ యువ‌త‌ను మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటూ భ‌విష్య‌త్ మ‌రింత అనుకూలించేలా వ్యూహ ర‌చ న‌లు చేస్తూ ముందుకు పోతోంది. అయితే పార్టీ నాయ‌క‌త్వం మార్పు అవ‌స‌రం అని భావించిన కాం గ్రెస్ ఏక‌గ్రీవ ఎన్నిక క‌ష్ట‌మై ఎన్నిక దాకా వెళుతోంది. పోటీలో సీనియ‌ర్లు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, కేంద్ర మాజీ మంత్రి శ‌శిథ‌రూర్ ఉన్నారు.  కాంగ్రెస్ భావీభార‌త పౌరుల‌ను ఆక‌ట్టుకోవాలంటే ఇలా భార‌త్ జోడో యాత్ర‌లు చేయ‌డంతో పాటు పార్టీ లోకి యువ‌త‌ను మ‌రింత ఆక‌ట్టుకోవాల‌ని భావించారు. దేశంలో యువ‌త ఎక్కువ శాతం ఉంద‌ని వారిని పార్టీవైపు మొగ్గేలా చేస్తే పార్టీ మ‌రింత ప‌టిష్ట‌ప‌డి బీజేపీని ఎదిరించగ‌ల‌ద‌ని థ‌రూర్ అభిప్రాయం. అంతేకాదు అందుకు పార్టీ పేరునీ మార్చుకుంటే బావుంటుంద‌నే సూచ‌న ఢిల్లీ పెద్ద‌ల‌కు మ‌రింత బాగా వినిపించేలా అన్నారు.  సాధారణ కార్యకర్తలు, ముఖ్యంగా యువకుల నుంచి తనకు సానుకూల స్పం దన వస్తోందని చెప్పారు.  రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడీ యాత్ర, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నికలు పార్టీకి ముఖ్యమని, విప క్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.  దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలో త‌న‌కు  యువత మద్దతుగా నిలవడం సంతోషంగా ఉంది. 35 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు దేశ జనాభాలో 65 శాతం ఉన్నారు. మనది యువ భారత్‌. యువ భారత్‌ పార్టీగా కాంగ్రెస్‌ను మార్చాలని భావిస్తున్నాన‌న్నారు.  యువ భారత్‌ ఆశలు, ఆకాంక్షలు, కలలకు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నాన‌ని,  ప్రస్తుతం యువ భారత్‌కు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. యువతతో పాటు పార్టీలోని సీనియర్లు కూడా త‌న‌కు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాన‌ని శశిథరూర్‌ అన్నారు.  

మూడు రాజధానుల రాజకీయం ఎత్తిపోయిందా? ఉత్తరాంధ్ర మంత్రుల్లో ఫ్రస్టేషన్ కు అదే కారణమా?

ప్రజాభీష్టాన్ని కాదని ముందుకు వెళితే ఏం జరుగుతుందో ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూస్తే అర్ధమౌతుంది. గత ఎన్నికలకు ముందు అమరావతే ఏపీ రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికిన వైసీసీ ఇప్పుడు మూడు రాజధానులంటూ మాట మార్చడాన్ని రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తోంది. అమరావతే ఏపీ ఏకైక రాజధాని అని నినదిస్తూ మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు అన్ని ప్రాంతాల నుంచీ వెల్లువెత్తుతున్న మద్దతుతో వైసీపీ అధినేత మైండ్ బ్లాక్ అయినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా యాత్రను అడ్డుకోండంటూ ఆయన మంత్రులు, పార్టీ శ్రేణులకు ఆదేశాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో సీనియర్ మంత్రులు కూడా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల రాజకీయం ఎత్తిపోయిందా? రైతుల మహాపాదయాత్ర వైసీపీ నేతల్లో గుబులు రేపుతోందా? రైతుల మహాపాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ జగన్  , ఆయన కేబినెట్ సహచరులను గాభరా పెడుతోందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. రైతుల మహాపాదయాత్ర సాగుతున్న కొద్దీ.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా జనం గళమెత్తుతున్నారు. గతంలో కంటే బలంగా వారు తమ వాణిని వినిపిస్తున్నారు. యాత్రకు వ్యతిరేకంగా  వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి తోడు వాడవాడలా మహాపాదయాత్రకు లభిస్తున్న స్పందన వైసీపీ వర్గాల్లో ఫ్రస్ట్రేషన్ కు కారణమౌతోంది. దాంతో వైసీపీలో ఎంతో కొంత అనుభవం ఉన్న మంత్రులు కూడా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. మంత్రులు బొత్స, అమర్నాథ్ లు అయితే కొడాలి నాని భాషను అరువు తెచ్చుకుని మరీ మాట్లాడుతున్నారు. వారి ఈ వైఖరే మూడు రాజధానుల పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతను ఎత్తి చూపుతోంది. రాష్ట్రం మొత్తం అమరావతే ఏకైక రాజధాని అని ముక్తకంఠంతో నినదిస్తున్నదన్న విషయం రైతుల మహాపాదయాత్ర సాగుతున్న కొద్దీ ప్రస్ఫుటమౌతోంది. దీంతో దిక్కు తోచని స్థితిలో పడ్డ వైసీపీ అధీష్టానం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. దాని పర్యవశానమే బొత్స రైతులను దోపిడీ దారులు అనడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రైతుల మహాపాదయాత్రను బొత్స దోపిడీ దారుల మహాయాత్రగా అభివర్ణించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరువ అవుతున్న కొద్దీ.. దానిని ఎలాగైనా అడ్డుకోవాలన్న తపన, తాపత్రేయం వైసీపీలో ఎక్కువ అవుతోంది. రెచ్చగొట్టి ఏదో ఒకటి చేసి రైతుల మహాపాద్రయాత్రను నిలిపివేయాలన్న తహతహ కనిపిస్తోంది. అందుకే విశాఖ వస్తే రైతుల కాళ్లు విరగ్గొడతాం, తరిమి కొడతాం అంటూ ప్రేలాపనలకు దిగడానికి కూడా వైసీపీ మంత్రులు, నేతలు వెనుకాడటం లేదు. మహాపాదయాత్రకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న  రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. మూడు రాజధానులంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ ప్రకటించినప్పుడు కొద్దొ గొప్పో ఉత్తరాంధ్రలో సానుకూలత కనిపించింది. కానీ ఇప్పుడు ఆ సానుకూలత అంతా ఆవిరైపోయిందని అంటున్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో నేరాలు పెరిగిపోవడం, భూ కబ్జాలు, దౌర్జన్యాలూ పెచ్చరిల్లడంతో విశాఖ వాసులు కూడా అమరావతికే జై కొడుతున్న పరిస్థితి ప్రస్ఫులంగా కనిపిస్తోంది. అందుకే వైసీపీ నుంచి రెచ్చగొట్టే విధంగా ఎన్ని ప్రకటనలు వచ్చినా ఎవరూ స్పందించడం లేదంటున్నారు.  ఇక వైసీపీ నేతలు మూడు రాజధానులపై చర్చ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ ప్రహసనాలుగా మారిపోతున్నాయి.  ఇక వైసీపీలోకి కింది స్థాయి క్యాడర్ కూడా మూడు రాజధానుల అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అక్కడక్కడ అమరావతి రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేయడం వినా మూడు రాజధానులకు మద్దతుగా వారి నుంచి ఎటువంటి ప్రయత్నం, కార్యక్రమాలు ఉండటం లేదు. హై కమాండ్ హుంకరిస్తేనే ఇక తప్పదన్నట్లు స్థానిక రైతులు అమరావతికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మహాయాత్రలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు అరకొర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తరువాత కామ్ అయిపోతున్నారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడితే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో  అమరావతి రైతులు   అందరి మద్దతుతో  ముందుకు సాగుతున్నారు. అమరావతి రైతులకు ఈ స్థాయి మద్దతు వస్తుందని వైసీపీ నేతలు మహాపాదయాత్రకు ముందు ఊహించలేదు. రైతులకు టీడీపీ, జనసేన సహా అన్ని పార్టీలు  ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. అయితే  ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికి… ఇప్పుడు మడమ తిప్పిన వైసీపీ వ్యతిరేకతను జనం ఇసుమంతైనా లెక్క చేయని పరిస్థితే రాష్ట్రమంతటా కనిపిస్తోంది.   వైసీపీ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ వ్యతిరేకతకు దడిసే మహాపాదయాత్ర మార్గంలో వైసీపీ శ్రేణులు అడ్డకోవడానికి ప్రయత్నించే సాహసం చేయడం లేదు. వైసీపీ అధిష్ఠానం మెప్పు కోసం ఏదో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చేసేమన్నట్లుగా చేసి మమ అనిపిస్తున్నారు.   

పేరుమార్చ‌గానే జాతీయ‌పార్టీ కాదు.. ఎన్నిక‌ల క‌మిష‌న్

టీఆర్ ఎస్‌ను, బీఆర్ ఎస్‌గా పేరు మార్చేందుకు అనుమ‌తించ‌మ‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు టీఆర్ ఎస్ ప్ర‌తిపాద‌న‌లు పంపింది. పార్టీ స‌ర్వ‌స‌భ్య‌స‌మావేశంలో ఆమోదించిన తీర్మానంతో పాటు, పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ రాసిన లేక‌ను కూడా గురువారం పంపించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ధర్మేంద్ర శర్మకు మాజీ ఎంపీ బీ వినోద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి అందించారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని మాజీ ప్రధాన ఎన్ని కల కమిషనర్‌లు వీఎస్‌ సంపత్‌, సునీల్‌ అరోరా తెలిపారు పేరు మారినా బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీ మాత్రమే అవుతుందని, అది జాతీయ పార్టీ కాదని చెప్పారు. నిబంధనల ప్రకారం జాతీయ పార్టీకి అవస రమైన ఓట్ల శాతం, సీట్లు వచ్చినప్పుడే దానికి జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. టీఆర్ఎ స్‌ పేరును బీఆర్ ఎస్ గా  మార్చేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతిస్తే ఎన్నికల గుర్తులు ఆర్డర్‌ ప్రకా రం ఆ పార్టీ ఎన్నికల గుర్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని సునీల్‌ ఆరోరా వెల్లడించారు.  కాగా, పేరు మారినంత మాత్రాన ఎన్నికల గుర్తు మారదని, అయితే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆ రాష్ట్రాల్లో అదే ఎన్నికల గుర్తుతో వేరే పార్టీ ఉంటే బీఆర్‌ఎస్‌ ఆ రాష్ట్రంలో తన ఎన్నికల గుర్తు మార్చుకోవాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ అధికారి ఒకరు తెలిపారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీకి ఇతర రాష్ట్రా ల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  అయితే, బీఆర్‌ఎస్‌ పేరిట ఇప్పటికే మూడు పార్టీలున్నట్లు విలేకరులు   వినోద్‌ కుమార్తో  ప్రస్తావిం చగా పార్టీ పేరు వేరు, అబ్రివేషన్‌ వేరు అని బదులిచ్చారు. పార్టీ పేరు బిఆర్ ఎస్‌గా మార్చిన తర్వాత తెలం గాణ రాష్ట్ర సమితి పేరిట ఎవరూ రాజకీయ పార్టీని నమోదు చేసుకోరాదని, ఆ విషయాన్ని చట్టం చెబుతున్నదని వినోద్‌ కుమార్‌ తెలిపారు. మరోవైపు, ఈ నెల 14లోపు ఎన్నికల సంఘం గుర్తిస్తే బీఆర్‌ ఎస్‌ తరఫునే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని, లేదంటే టీఆర్‌ఎస్‌ పేరిటే అభ్యర్థి బరిలో ఉం టారని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. 

కావ‌డానికి చిన్న గ్రామ‌మే...కేసీఆర్‌కు మ‌హా కీల‌కం

త‌న పార్టీ పేరును టీఆర్ ఎస్ నుంచి బీఆర్ ఎస్‌కు మార్చినా, దేశ రాజ‌కీయాల్లోకి దూసుకెళ్ళాల‌ని ఎంతో ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం లోని చిన్న ప‌ల్లె మీద ప్ర‌స్తుతం దృష్టి కేంద్రీక‌రించారు. అదే లంక‌ల‌ప‌ల్లి. హైద‌రాబాద్ నుంచి 75 కి.మీ దూరంలో ఉన్న ఈ ప‌ల్లో జ‌నాభా కేవ‌లం 2,085మంది. అయినా దీనికో ప్ర‌త్యేక‌తా ఉంది. ప్ర‌స్తుతం మునుగోడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున రంగంలోకి దిగ‌డానికి సిద్ధ‌ప‌డుతున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి స‌న్నిహితుడు పాకా స‌తీష్ గ్రామం అది. అత‌ను త‌న అనుచ‌రుల‌తో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లోకి చేర‌డానికి ఉత్సాహ ప‌డుతున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక న‌వంబ‌ర్ 3న జ‌రుగ‌నుంది.  మునుగోడు మండ‌లంలోని ఆ ప‌ల్లె గ‌త ప‌దిహేనేళ్లుగా కాంగ్రెస్ కు మ‌ద్ద‌తునిస్తూన్న‌ది. రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలోకి మార‌డంతో కాంగ్రెస్‌కు ప‌ట్టు స‌డ‌లింది. గ‌త స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో స‌తీష్ 1,857 లో అధిక శాతం సాధించి గెలిచాడు. అత‌నికి స‌ర్పంచ్‌గా మంచి పేరు ఉంది. అంత‌కు ముందు ఎన్నిక‌ల్లోనూ మంచి మెజారిటీతో స‌ర్పంచ్‌గా గెలిచాడు. కాగా మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు ముందే స‌తీష్ కాంగ్రెస్‌ను కాద‌ని టీఆర్ ఎస్ కారు ఎక్కేందుకు సిద్ధ‌ప‌డ‌టం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే అవుతుందంటున్నారు.  అయితే ఇదంతా ఇప్ప‌టికిప్పుడు జ‌రిగిన ప‌రిణామం కాదు. రెండు మాసాలుగా స‌తీష్ కోసం  టీఆర్ ఎస్ వ‌ల‌వేసింది. చేప ఇప్ప‌టికి ప‌డిందంతే! చాలామంది స‌ర్పంచ్‌లు, మాజీ స‌ర్పంచ్‌లు ఈ ప్రాంతంలో అనాదిగా కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తునిస్తూన్నారు. ఇపుడు వారంతా స‌తీష్ బాట‌లో న‌డిచే అవ‌కాశం ఉంది.  ఉప ఎన్నిక‌ల‌కు రాష్ట్ర ఆరోగ్య‌మంత్రి హ‌రీష్ రావును మ‌ర్రిగోడు మండ‌ల ఇన్‌ఛార్జును చేశారు కేసీఆర్‌. ఆయ న్ను స‌ర్పంచ్‌ల‌తో స‌మావేశ‌మై మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైనా టీఆర్ ఎస్ ను గెలిపించాల‌న్న సం దేశాన్ని బాగా వినిపించ‌మ‌ని కేసీఆర్ ఆదేశించారు. అంతేగాక రోజూ నిద్ర‌పోనీకుండా చేసి అక్క‌డి వారి నుంచి స‌మాచార సేక‌ర‌ణ‌కు ఉప‌క్ర‌మించారు.  దీనికి తోడు టీఆర్ ఎస్ పేరు బీఆర్ ఎస్‌గా మార‌డంతోనే గ్రామంలో పెద్ద ఎత్తున ట‌పాసులు పేల్చి ఆనం దించారు. టీఆర్ ఎస్‌ను మునుగోడులో గెలిపించే ప‌థ‌కంలో భాగంగా టీఆర్ ఎస్ సీనియ‌ర్లు హ‌రీష్‌, కేటీ ఆర్‌, ఇత‌ర ఎమ్మెల్యేలు అంద‌రూ ఈ చిన్న‌గ్రామంలో ప్ర‌చారం మీద‌నే ఎక్కువ దృష్టిపెట్టారు. ఇటీవ‌లి టీఆర్ ఎస్ ఎగ్జిక్యూటివ్ స‌మావేశంలోనూ, గ్రామాల్లో పార్టీ ప్ర‌చారానికి ప్ర‌తీ ఎమ్మెల్యేకీ  ఒక్కో  గ్రామం అప్ప గించారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 80 గ్రామాలు ఉన్నాయి. ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో ప్ర‌తీ ఇంటికి వెళ్లి పార్టీ ప్ర‌చారం చేయాల‌ని కేసీఆర్ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక‌కు ప్ర‌తీ గ్రామాన్ని ఎంతో కీల‌కంగా తీసుకోవ‌డ‌మే కాకుండా కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. 

కుప్పం టు ఇచ్ఛాపురం.. లోకేష్ పాదయాత్ర

వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరకతను తమ వైపు మళ్లించుకోనేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  అందులో భాగంగా  జగన్ గెద్దె నెక్కిన వెంటనే ప్రజా వేదిక కూల్చివేయడం నాటి నుంచి.... నేటి వరకు ఈ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లాలని... అలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే   తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర చేపట్టే విధంగా చంద్రబాబు రంగం సిద్దం చేశారని  పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  పాదయాత్ర 2023 జనవరి 26వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు స్వంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రారంభమై.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు. దాదాపు 450 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.  ముందుగా అనుకున్న మేరకు లోకేష్ పాదయాత్ర ఇప్పటికే ప్రారంభించాలని చంద్రబాబు భావించారని..  కానీ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉండడంతో,  పాదయాత్ర ప్రారంభ తేదీని జనవరి 26 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారని చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి   అన్ని విధాలా కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ పటిష్టం కావడమే కాకుండా.. నారా లోకేశ్‌పై అధికార పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యతిరేక ప్రచారాన్ని సైతం తిప్పికొట్టాలని, అలాగే నారా లోకేశ్ సామర్థ్యం ప్రజలందరికీ తెలిసేలా ఉండాలన్న లక్ష్యంతో చంద్రబాబు లోకేష్ పాదయాత్ర విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అలాగే లోకేశ్   పాదయాత్ర.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మీదగా సాగేలా.. ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.  పాదయాత్ర రూట్ మ్యాప్, సాగాల్సిన తీరు, ఆయా నియోజకవర్గాలలో పాదయాత్రను సక్సెస్ చేసే బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అన్నవి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే రూట్ మ్యాప్ ఖరారుకు ముందు   చంద్రబాబు పార్టీలోని  కీలక నేతలతో సమావేశమై, పాదయాత్రపై కూలంకషంగా చర్చించనున్నారు. ఆ క్రమంలో ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి మంది తక్కువ కాకుండా ఈ భేటీకి హాజరుకాబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఎన్నికల్లో గెలుపు కోసం పలు పార్టీలు వ్యూహాకర్తలను ఆశ్రయిస్తుంటే... చంద్రబాబు మాత్రం తన వ్యూహాలనే నమ్ముకుని పక్కాగా ముందుకు సాగుతున్నారు.  

ఏపీలో అడుగు పెట్టేందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా?

తెలుగు రాష్ట్రాలలో, ఆమాట కొస్తే దేశంలో రాజకీయాలే కాదు, రాజకీయ చర్చలు,విశ్లేషణలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిత్ర విచిత్రంగా వంపులు తిరుగుతున్నాయి. కొత్త కొత్త ఎత్తులు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.  ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజకీయాల దారిలోనే రాజకీయ విశ్లేషకులు సాగుతున్నారు. వాస్తవాల కంటే ఉహాలకు, వ్యూహాగానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న, ‘జాతీయ’ నిర్ణయం సహజంగానే రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిజానికి కేసీఆర్ తీసుకున్న పార్టీ పేరు మార్పు నిర్ణయం  ఇప్పటికిప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని,కేసీఆర్ సహా ఎవరు ఉహించడం లేదు. ఆశించడం లేదు.  నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా (గిట్టని వాళ్ళు ఆర్థికంగా కూడా అంటారు) ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం  కాలం చెల్లిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందుకోసంగా, ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు. నిజానికి ఆ క్రతువుకు ఏమి పేరు పెట్టినా ప్రొఫెసర్ కోదండ రామ్  చెప్పినట్లుగా ఈ మొత్తం క్రతువు వెనక ఉన్న మూల మంత్రం మాత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్నసవాలు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని, 1200 మంది యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసీఆర్ ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు  అనే వాళ్ళున్నారు.  సరే, తెరాస పేరును కేసీఆర్ ఎందుకు బీఆర్ఎస్ గా మార్చారు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది.  జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే,  దాయాది రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ  ప్రధాన ప్రతిపక్షం టీడీపీలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది? ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.  అయితే, ఇందుకు సంబంధించి ఎవరెన్ని విశ్లేషణలు చేసినా, తెలుగు దేశం పార్టీ  అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మాటలు లేకుండా ఓ చిన్న చిరునవ్వుతో చేసిన విశ్లేషణ ముందు అవన్నీ దిగతుడుపే. బీఆర్ఎఎస్ పై సాధికారిక వ్యాఖ్య ఎవరైనా చేశారంటే  అది చంద్రాబాబు ఒక్కరే.  ఏపీ రాజకేయాలపై బీఆర్ఎస్ ప్రభావం గురించి మాత్రమే కాదు., అసలు బీఆర్ఎస్ గురించి ఇంతవరకు వచ్చిన విశ్లేషణలు అన్నిట్లోకి చద్రబాబు ‘చిరునవ్వు’ ఒక్కటే  సాధికారిక విశ్లేషణ అనుకోవచ్చును. అవును  బీఆర్ఎస్ గురించి చంద్రబాబు చేయని విశ్లేషణ, ఆయన అనుభవానికి, విజ్ఞతకు అద్దం పడుతోంది.  ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు  మోడీ, షా సిట్టంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆయన ముందు మరో ఆప్షన్ లేదు. మోడీ షా కూర్చోమంటే కూర్చోవాలి నుంచో మంటే నుంచోవాలి లేదంటే ఏమిజరుగుతుందో వేరే చెప్పనక్కర లేదు. నిజానికి, జగన్ రెడ్డి  2019 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే, బీజేపీకి సరెండర్ అయిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ దయ మన ప్రాప్తం అని చేతులేత్తేసింది మొదలు ఇంత వరకు మళ్ళీ ఆయన ఎత్తిన చేతులు దించలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఎన్నికల విషయంలోనే కాదు, పార్లమెంట్ లో వివాదాస్పద బిల్లుల ఆమోదం వరకు ఎక్కడా,  కేంద్రానికి రుచించని నిర్ణయం ఏదీ తీసుకోలేదు.  ఎక్కడి వరకో ఎందుకు, కొద్ది రోజుల క్రితం, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  ఉప రాష్ట్రపతి జగదేష్ ధన్కర్ కు వంగివంగి దండాలు పెడుతున్న దృశ్యం చూస్తేనే  వైసీపీ స్టాండ్ ఏమిటో అర్థమవుతుంది. అయితే  బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై అసలే ఉండదా అంటే ఉంటుంది.  నిజానికి, ఒక్క ఏపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్ తో చేతులు కలిపేందుకు  సిద్ధంగా లేరు. అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజా సంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము  కానీ ఆ ప్రభావం ఎలా, ఎంత  ఉంటుందనేది మాత్రం, ఇప్పుడే చెప్పే విషయం కాదు. అదలా ఉంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంటర్ కావడానికి ముందు చాలా హార్డిల్స్ దాట వలసి ఉంటుంది. కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసీఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఆ రాష్ట్ర ప్రజలు అనుమతిస్తారా?  తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును మరిచి పోతారా?  నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు ఆ రాష్ట్ర ప్రజలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారా?  కేసీఆర్  నేను మరిపోయాను అంటే  ఏపీ ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ నమ్మించగలరా? అవును ఆయనకు రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ కొట్టిన పిండి ఆయినా,  ఆయన ఏపీ ప్రజలను నమ్మించగల రని అనుకున్నా, అది పొరపాటే అవుతుంది.  నిజానికి, కేసీఆర్ ఏపీలో ఎంటర్ అవ్వాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సారి కాదు, వెయ్యి సార్లు ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పవలసి ఉంటుందని అంటున్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఏపీ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అది జరగని పని, అ దే జరిగితే, తెలంగాణ నూకలు చెల్లినట్లే అవుతుంది. సో .. అది జరగదు. నిజానికి, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టినట్లు, ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెట్టలేరు, అందుకే ఆయన ఇంతవరకు ఏపీ విషయంలో గుంభనంగా, మైదానాన్ని ఊహాగానాలకు వదిలేశారని అంటున్నారు.

కోనసీమలో బీఆర్ఎస్ పోస్టర్ల కలకలం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి పూర్తిగా రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రకంపనలు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా చెప్పుకునే కోససీమలో బీఆర్ఎస్ పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లు ఎవరు వేశారు అన్న విషయంలో స్పష్టత లేకపోయినా, కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని ప్రధాన కూడలి అయిన గడియారస్తంభం సెంటర్ లో బీఆర్ఎస్ పోస్టర్లు వెలిశాయి. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పేర వెలసిన ఈ పోస్టర్లలో ఆ అభ్యర్థి పేరు కూడా లేదు. కేసీఆర్ పై ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉంటుందనీ, ఇంత కాలం ఏపీపై విద్వేషం వెళ్లగక్కిన ఆయనను జాతీయ పార్టీ పెట్టిన వెంటనే ఏపీ జనం ఎలా అంగీకరించి, ఆయన పార్టీని స్వాగతిస్తారనీ పలు విశ్లేషణలు వెలువడ్డాయి.   ఆయన ఏ అజెండాతో ఏపీలో ప్రవేశించగలుగుతారని కూడా పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు.  తాజాగా బీజేపీ నేత జీవీఎల్.నరసింహరావు కూడా బీఆర్ ఎస్ పార్టీపై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ కు బీఆర్ ఎస్ వస్తే రావచ్చనీ, కానీ వచ్చేముందు ఆ పార్టీని తాము నిలదీస్తామని  స్పష్టం చేశారు. అలాగే ఏపీలో అధికార వైసీపీ కూడా కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీపై   స్పందించింది. ప్రస్తుతానికి పార్టీ పేరు ప్రకటించారు మినహా, రాజకీయ అజెండాను, వచ్చే ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో పోటీ చేస్తామనేది స్పష్టంగా చెప్పలేదనీ అందుకే ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.  ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను తాము స్వాగతిస్తామని వ వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేసీఆర్ పార్టీతో తమకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీపై చర్చ నడుస్తున్న క్రమంలో కోనసీమ బీఆర్ ఎస్ పార్టీ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు కలకం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరు ప్రకటన మినహా కేసీఆర్ ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అధికారికంగా పార్టీ కమిటీలను గాని, నియోజకవర్గ ఇన్ ఛార్జిలను ప్రకటించలేదు. అయినప్పటికి కోనసీమలోని అమలాపురం పట్టణంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ ఎస్ ఏంపీ అభ్యర్థినంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

డెబోరాను టాంజానియాకు తీసికెళ్లిన ప్రేమ‌!

ప్రజలు ప్రేమ కోసం అన్ని రకాల పనులు చేస్తారు. ఒక‌రు కొట్లాడ‌తారు, ఒక‌రు ఇంట్లోంచి పారిపోతారు, మ‌రొక‌రు చావ‌డానికీ సిద్ధ‌ప‌డ‌తారు. కానీ అమెరిక‌న్ మ‌హిళ డెబోరా మాత్రం టాంజానియా వెళ్లింది!  ఒక అమెరికన్ మహిళ తన జీవితాంతం ప్రేమ‌తో జీవించ‌డానికి త‌న ప్రియుడితో ఉండటానికి తన దేశా న్ని విడిచిపెట్టాలని ఎంచుకుంది. కాలిఫోర్నియాకు చెందిన డెబోరా బాబు తన కంటే 30 ఏళ్లు చిన్న వాడ‌యిన‌ మాసాయి గిరిజనుడిని పెళ్లి చేసుకోవడానికి  ఒక‌టీ రెండూ  కాదు ఏకంగా  9 వేల‌మైళ్లు ప్రయా ణించింది. 2017లో టాంజానియాలోని జాంజిబార్‌లోని బీచ్‌లో నడకలో సైటోటి బాబును కలుసుకుంది. తల్లి-కుమార్తె ద్వయం షికారు చేస్తున్నప్పుడు వారు ఇద్దరు మాసాయిలను క‌లుసుకున్నారు, వారిలో ఒకరు 30 ఏళ్ల సైటోటి సావనీర్‌లు విక్రయిస్తున్నారు. వారు సావనీర్‌లకు నో చెప్పినప్పటికీ, డెబోరా వారితో ఫోటో తీయడం ముగించి చాట్ చేయడం ప్రారంభించింది. అలా మాట‌ల్లో ప‌డి,  ఫలవంతమైన స్నేహం గా మారి వారిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. వారి పర్యటనలో తదుపరి గమ్యస్థానానికి కూడా వారితో పాటు సైటోటీ  వెళ్లాడు. అయినప్పటికీ, డెబోరా అమెరికాకు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, సైటోటి  డెబోరాను వివాహం చేసుకోవాలని కోరింది,  వయస్సు అంతరం గురించి మొదట్లో ఆందోళనలు  ఉన్నప్పటికీ, డెబోరా పిల్లలు ప్రేమ‌ కోసం వెళ్ళమని ఆమెను ప్రోత్సహించారు. డెబోరా తర్వాత టాంజానియాకు తిరిగి వచ్చింది. సైటోటీ అధికారికంగా ఆమె పెళ్లాడ‌మ‌ని కోరింది. జూన్ 2018లో.  ఈ ఏడాది జూలైలో వారి యూనియన్‌ను చట్టబద్ధం చేయడానికి ముందు వారు సాంప్ర దాయ మాసాయి వివాహాన్ని చేసుకున్నారు. డెబోరా ఇప్పుడు తన మాసాయి పేరు నషిపాయితో వెళు తుంది. టాంజానియాలో సైటోటీ , అతని కుటుం బంతో కలిసి నివసిస్తుంది. అమెరికాలో నివసించాలనే అతని కోరిక ఎంత గా ఉందో డెబోరాకి తెలుసు కాబట్టి సైటోటీ గ్రీన్ కార్డ్ కోసం మాత్రమే త‌న‌తో ఉన్నాడని ఆరోపించింది.  నేను అతనిని దత్తత తీసుకున్నానా లేదా నేను అతని అమ్మ మ్మనా అని ఆమె ప‌ట్ట‌ణ‌ ప్రజలు అడుగుతారన్న భ‌య‌మూ ఉంది, ఇది సైటోటీని కలవరపెడు తుంది. కానీ అవేమీ త‌న మీద త‌న‌ ఆనందంపై ఎలాంటి దుష్ప్ర‌భావం చూప‌వ‌నే అంటోంది డెబోరా.

అమ్మకి బూటు లేసు కట్టిన రాహుల్.. భారత్ జోడో యాత్రలో సోనియా

కాంగ్రెస్ అధినేత్రి  సోనియాగాంధీ రాహుల్ గాంధీ భాతర్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో ఆమె ప్రజల మధ్యకు రావడం ఇదే ప్రథమం.  కర్ణాటక  మండ్య జిల్లాలో రాహుల్‌తో కలసి సోనియా పాదయాత్ర చేశారు. రాహుల్‌ తన తల్లికి ఆసరాగా కాసేపు ఆమె భుజం చుట్టూ చేయి వేసి నడిపించారు. విజయదశమి సందర్భంగా రెండు రోజుల విశ్రాంతి తర్వాత రాహుల్  పాదయాత్ర పునఃప్రారంభమైంది. తల్లి భుజం చుట్టూ చేయి వేసి నడుస్తున్న ఫొటోను రాహుల్ ట్వీట్ చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత సోనియా గాంధీ ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటి సారి.  పాదయాత్రలో నడుస్తుండగా సోనియా షూలేసులు ఊడిపోయాయి. దీంతో ఆమె నడవడానికి ఒకింత ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన రాహుల్ గాంధీ వెంటనే ఆమె షూ లేసులు కట్టారు. ఈ దృశ్యం పాదయాత్రలో పాల్గొన్న వారందరినీ కదిలించివేసింది. అమ్మంటే రాహుల్ కు ఎంత ప్రేమ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

కొడాలి నాని పరిస్థితి ఏంటి.. వైసీపీ కూరలో కరివేపాకేనా?

వాడుకోవడం అనే పదాన్ని వాడుకోవడంలో.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసినంతగా.. ఆ పార్టీలో మరోకరిని తెలియదనే ఓ చర్చ వైసీపీలో  లీడర్ నుంచి క్యాడర్ వరకు జోరుగా నడుస్తోంది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చే వరకు తల్లి విజయమ్మ, చెల్లి  షర్మిల సేవలను ఎంతగా ఉపయోగించుకున్నారో తెలిసిందే. ఆ తరువాత అధికారం దక్కిన తరువాత  వారిని  జగన్ పక్కన పెట్టేయడంతో వారు  తెలంగాణకు పరిమితమైన సంగతి  తెలిసిందే.  తాజాగా ఇలా వదిలించుకునే వారి జాబితాలోకి   గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా చేరిందన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. ఇటీవల జగన్ అధ్యక్షతన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో.. పని తీరు బాలేదంటూ హెచ్చరించిన వారి జాబితాలో కొడాలి నాని పేరు కూడా ఉందని, ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో  కొడాలి నానికి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం దాదాపు లేనట్టేనని పార్టీ వర్గాల్లోనే కాదు, గుడివాడ నియోజకవర్గంలో కూడా జోరుగా సాగుతోంది.  జగన్ వ్యవహార శైలి కొడాలి నాని స్పందన సంగతి పక్కన పెడితే, నాని ఫ్యాన్స్ మాత్రం తెగ హర్టయిపోయారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.   వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే.. తన కేబినెట్‌లోకి కొడాలి నానిని తీసుకున్నారు. ఆ క్రమంలో  జగన్‌పై దోమ కాదు సరికదా ఈగ కూడా వాలనివ్వకుండా కొడాలి నాని చూసుకున్నారని.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బాహుబలి సినిమాలో కట్టప్ప మాదిరిగా  జగన్ పట్ల వ్యవహరించారని వారు గుర్తు చేసుకుంటున్నారు.  జగన్‌పై ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇలా విమర్శలు గుప్పిస్తే.. అలా ప్రెస్ మీట్ పెట్టి.. అలా అలా బండబూతులతో వారిపై విరుచుకుపడేవారని కొడాలి నాని ఫ్యాన్స్ ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేరు కాస్తా.. బూతుల సరఫరా శాఖ మంత్రిగా ప్రజల్లో   నానిపోయిందని వారు చెబుతున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో ఇతర మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నాబాబు వగైరా వగైరా ఉన్నా.. వారికెవరికీ రానీ పేరు..గుర్తింపు కొడాలి నానికి మాత్రమే వచ్చిందని వారు వివరిస్తున్నారు. అలాంటి తమ నాయకుడు ప్లస్ తమ ఆరాధ్య దైవం కొడాలి నానిని అలా వాడుకొని ఇలా వదిలేస్తారా? అంటూ వారంతా జగన్ పై గుస్సా అవుతున్నారు.    చివరికీ జగన్ కోసం కొడాలి నాని రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేశ్‌, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై నాని విమర్శలు గుప్పించారని వారు గుర్తు చేసుకొంటున్నారు. జగన్ మలి కేబినెట్‌లో కూడా కొడాలి నానికి చోటు దక్కుతుందని తామంతా భావించామని.. కానీ అలా జరగలేదని వారు వివరిస్తున్నారు. చివరికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి.. వైయస్ఆర్ పేరు పెట్టడంపై కొడాలి నాని మనస్సు తీవ్రంగా గాయపడిందని..... అయన ఈ అంశంపై తమ అభిమాన నాయకుడు నాని ఎక్కడా పెదవి విప్పలేదని.. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్   గుర్తు చేస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ కోసం తమ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంత చేస్తే.. చివరికీ ఆయన పట్ల వైయస్ జగన్ ఇలా.. వ్యవహరించడం సరికాదని మొత్తం మీద నానిని జగన్ కూరలో కరివేపాకులా తీసి పారేశారన్న భావన మాత్రం అందరిలో వ్యక్తమౌతోంది.

వెట్రిమార‌న్ సినిమాపై బీజేపీ మండిపాటు

వెట్రిమారన్, కమల్హాసన్ ప్రకట నలను తెలంగాణ గవర్నర్ తమి ళిసై సౌందరరాజన్ విమ ర్శిం చారు. హిందూసాంస్కృతిక గుర్తింపులను మరుగుపరిచే ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరే కంగా ప్రజలు తమ నిర‌స‌న తెలి య‌ జేస్తార‌న్నారు. మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ పై వివాదమేమంటే.. రాజ రాజ చోళుని జీవితాన్ని వర్ణించే మొ దటి భాగం రాజ రాజ చోళుడు హిందూ రాజు కాదా అనే చర్చలో బిజెపి నాయకులు చేరడంతో తీవ్రమవుతుంది. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం మాట్లాడుతూ, చోళ రాజు అనేక దేవాలయాలను నిర్మించాడని, తంజావూరులోని అలాంటి ఒక దేవా లయం పరిసరాల్లో తాను పెరిగానని అన్నారు. హిందూ సాంస్కృతిక చిహ్నాల గుర్తింపును దాచే ప్రయత్నాలను ప్రజలు అంగీ కరించరని, కొనసాగుతున్న వివాదం మధ్య ఆమె అన్నారు. కమల్ హాసన్ నుండి మద్దతు పొందిన దర్శకుడు వెట్రిమారన్ తన వ్యాఖ్యలపై నిందలు వేసిన గవర్నర్, ప్రజలు వారికి వ్యతి రేకంగా గళం విప్పుతారని అన్నారు. ఆరాధన అనే భావన తమిళులలో పాతుకుపోయిందని, శైవులు, వైష్ణవులు రెండూ హిందువుల గుర్తింపు అని ఆమె అన్నారు. చోళరాజుల కాలంలో నిర్మించిన తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం పరి సరాల్లోనే తాను పెరిగానని సౌందరరాజన్ విలేకరులతో చెప్పారు. రాజ రాజ చోళ వివాదం విష‌యానికి వ‌స్తే..మణిరత్నం పిఎస్‌-1ని విమర్శిస్తూ, జాతీయ అవార్డు గ్రహీత తమిళ దర్శకుడు వెట్రి మారన్ పిఎస్‌-1లో చిత్రీకరించిన రాజ రాజ చోళుడు హిందువు కాదని అన్నారు. తమిళ గుర్తింపును లాక్కోవాలని బీజేపీ ప్రయ త్నిస్తోందని వెట్రిమారన్ అన్నారు. వారు ఇప్పటికే తిరువల్లువర్‌కు కాషాయరంగు చేయడానికి ప్రయత్నించారు. మేము దానిని ఎప్పటికీ అనుమతించకూడదు. బాహ్య శక్తులను ప్రతిఘటిస్తూ తమిళనాడు లౌకిక రాష్ట్రంగా కొనసాగుతోందని వెట్రిమారన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపగా, కమల్ హాసన్ వెట్రిమారన్ ప్రకటనలను సమర్థించారు. రాజ రాజ చోళుని కాలంలో హిందూ మతం లేదని అన్నారు. వైణవం, శివం, సమానం ఉన్నాయి, హిందూ అనే పదాన్ని సమిష్టిగా ఎలా సూచిం చాలో తెలియక బ్రిటిష్ వారు హిందూ అనే పదాన్ని సృష్టించారు. తూత్తుకుడిని టుటికోరిన్‌గా ఎలా మార్చారో అదే విధంగా ఉంది అని కమల్ హాసన్ అన్నారు. రాజరాజ చోళన్ హిందూ రాజు కాదని జాతీయ అవార్డు గ్రహీత తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేసిన ప్రకటన చక్రవర్తి మతపర మైన గుర్తింపుకు సంబంధించిన చర్చకు తెరతీసింది. వల్లూవర్‌ను కాషాయీకరణ చేయడం లేదా రాజ రాజ చోళన్‌ను హిందూ రాజు అని పిలవడం నిరంతరం జరుగుతూనే ఉంటుంద‌ని తమిళ చిత్రనిర్మాత వెట్రిమారన్ ఒక కార్యక్రమంలో అన్నారు. వెట్రిమారన్ వాదనపై బీజేపీ నేత హెచ్ రాజా స్పందిస్తూ, రాజ రాజ చోళన్ హిందూ రాజు అని పేర్కొన్నారు. త‌న‌కు వెట్రి మారన్‌లా చరిత్ర గురించి అంతగా అవగాహన లేదు, కానీ రాజ రాజ చోళన్ నిర్మించిన రెండు చర్చిలు, మసీదులను గురించి తెలియ‌జేయాల‌న్నారు. అతను తనను తాను శివపాద శేఖరన్ అని పిలుచుకున్నాడు. అప్పుడు అతను హిందువు కాదా? అని హెచ్ రాజా ప్రశ్నించారు. సినిమా అనేది సాధారణ మాధ్యమం కాబట్టి, ఒకరి ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయా లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని వెట్రిమారన్ హెచ్చరించారు.

ల‌క్నో వ‌న్డే..సంజూ శ్ర‌మ వృధా..9 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా గెలుపు

ల‌క్నోలో జ‌రిగిన తొలి వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా భార‌త్ పై 9 ప‌రుగుల తేడాతో గెలిచింది. వ‌ర్షం కార‌ణంగా ఎంత ఆల‌స్యంగా ప్రారంభ మైన మ్యాచ్‌ని 40 ఓవ‌ర్ల‌కు కుదించారు. డాషింగ్ బ్యాట‌ర్లు డేవిడ్ మిల్ల‌ర్‌, క్లాస‌న్‌లు భార‌త్ బౌలింగ్‌ను సునాయాసంగా ఎదు ర్కొంటూ అద్బుత బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్రేక్ష కుల‌ను ఆకట్టుకున్నారు. క్లాస‌న్ 65 బంతుల్లో 74, మిల్ల‌ర్ 63 బంతుల్లో 75 ప‌రుగులు, డీ కాక్ 54 బంతుల్లో 48 ప‌రుగులు చేసి త‌మ జ‌ట్ట‌కు 249 ప‌రుగుల భారీ స్కోర్ రావ‌డంలో కీల‌క‌పాత్ర‌ వ‌హించారు. ద‌క్షిణాఫ్రికా 40 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 249 ప‌రుగుల చేసింది. భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో భార‌త్ బౌల‌ర్లు అంత‌గా స‌ఫ‌లీకృతం కాలేదు. పేస‌ర్ సిరాజ్ 49 ప‌రుగులు, బిష్ణోయ్ ఏకంగా 69 ప‌రుగులు ఇచ్చుకున్నారు. శార్దూల్ 35 ప‌రుగు లిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అంతేగాక భార‌త్ ఇన్నింగ్స్ చివ‌రి భాగంలో వ‌చ్చి అప్ప‌టికే విజృంభించి ఆడుతున్న శాంస‌న్‌తో క‌లిసి ప‌రుగుల వ‌ర‌దే సృష్టించాడు.  250 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన భార‌త్ ఊహించ‌నివిధంగా పేల‌వంగా బ్యాట్ చేసింది. కెప్టెన్ ధవ‌న్, శుభ‌మ‌న్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ ఇద్ద‌రూ 6వ ఓవ‌ర్‌కే పెవిలియ‌న్ చేరారు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ మ‌రీ 8 ప‌రుగులే! ప‌దో ఒవ‌ర్ అయ్యేస‌రికి భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 24 ప‌రుగుల‌తో ఉంది. ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాఫ్రికా వికెట్ న‌ష్ట‌పోకుండా 41 ప‌రుగులు చేసింది. కానీ రితిరాజ్‌, కిష‌న్‌లు ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిల‌బెట్టారు. వారిద్ద‌రూ 62 బంతుల్లో 37 ప‌రుగులు చేశారు. తొలి వ‌న్డే ఆడుతున్న రితిరాజ్ గైక్వాడ్ ఫ‌ర‌వాలేద‌ని పించాడు. కానీ 18 వ ఓవ‌ర్లో వెనుదిరిగేడు. అప్ప‌టికి అత‌ను 17 ప‌రుగులు చేశాడు. జ‌ట్టు స్కోర్ 50కి చేరుకుంది. ఆ త‌ర్వాత ఓవ‌ర్లోనే కిష‌న్ వెనుదిగాడు. అత‌ను 37 బంతుల్లో 20 ప‌రుగులు చేశాడు. ఈ దుస్థితి నుంచి జ‌ట్టును బ‌య‌ట‌ప‌డేయ‌డానికి సంజూశాంస‌న్ రంగంలోకి దిగాడు. ఎంతో ఆచీ తూచీ ఆడుతూ ఇన్నింగ్స్ నిల‌బెడుతూ ప‌రుగులు సాధించాడు. శాంస‌న్‌తో పాటు అయ్య‌ర్ జోడీగా జ‌ట్టు స్కోర్‌ను ప‌రుగులు పెట్టించారు. 23వ ఓవ‌ర్‌కి భార‌త్ స్కోర్ 100కి చేరుకుంది. అప్టికి అయ్య‌ర్ 34 ప‌రుగులు శాంస‌న్ 12 ప‌రుగుల‌తో ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసి అప్ప‌టికి 34 బంతుల్లో 53ప‌రుగులు సాధించారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ అర్ధ‌సెంచ‌రీని 33 ప‌రుగుల్లో చేశాడు. 27వ ఓవ‌ర్లో అయ్య‌ర్ అవుట‌య్యాడు. అప్టికి జ‌ట్టు స్కోర్ 5 వికెట్ల‌న‌ష్టానికి 118 ప‌రుగులు. అయ్య‌ర్ స్థానంలో వ‌చ్చిన శార్ధూల్ ఠాకూర్ వ‌స్తూనే ధాటిగా ఆడుతూ ప‌రుగులు సాధించ‌డంలో శాంస‌న్‌కు జోడీ అయ్యాడు. ఇద్ద‌రూ జాగ్ర‌త్త‌గా ఆడుతూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. 30వ ఓవ‌ర్ల‌లో భార‌త్ 150 ప‌రుగులు పూర్తి చేసింది. 37 ఓవ‌ర్లో 200 ప‌రుగులు సాధించింది. శాంస‌న్ 180 ర‌న్‌రేట్ తో 49 బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ పూర్తిచేశాడు. అక్క‌డి నుంచి ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను కంగారుపెట్టించాడు. ముఖ్యంగా ఎన్గిడీ, షంసీల‌ను బాదాడు. 38వ ఓవ‌ర్లో శార్దూల్ వెనుదిరిగేప్ప‌టికి అత‌ను 31 బంతుల్లో 33ప‌రుగులు సాధించాడు. కానీ ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో వ‌రుస‌గా రెండు వికెట్లు ఆవేష్‌, కుల్దీప్‌లు పెవిలియ‌న్ చేర‌డంతో విజయం సాధించ‌డం క‌ష్ట‌మైంది. అప్ప‌టికీ శాంస‌న్ ఎంతో ధాటిగా ఆడుతూ స్కోర్‌ను ద‌గ్గ‌రికి తీసికెళ్లాడు. చివ‌రి రెండు ఓవ‌ర్లు ఎంతో ధాటిగా బ్యాట్ చేశ‌డు. ముఖ్యంగా షంషీ వేసిన చివ‌రి ఓవ‌ర్లో 30 ప‌రుగులు రావాలి. శాంస‌న్ మ‌రింత దూకుడుగా ఆడుతూ ఒక సిక్స్ మూడు ఫోర్లు కొట్టి ద‌క్షిణాఫ్రికాను ఖంగారు పెట్టాడు. అయినా కేవ‌లం 9 ప‌రుగుల దూరంలో భార‌త్ ఓట‌మి చ‌విచూసింది. సంజూ శాంస‌న్  62 బంతుల్లో 86 చేసి అజేయంగా నిలిచాడు.

బీజేపీ’ బీ టీమ్ బీఆర్ఎస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మిత్రులు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ముచ్చటగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి ఇద్దరూ హ్యాట్రిక్ సాధించేందుకు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.  వ్యూహాత్మక వైరాన్ని ప్రదర్శిస్తున్నారు. నువ్వు కొట్టినట్లు చేయి నేడు ఏడ్చినట్లు చేస్తాను అన్న రీతిలో వ్యవహరిస్న్తున్నారు. ఇద్దరి మధ్య ఏదో భీకర యుద్ధం సాగుతోందనే భ్రమలు కలిపించేందుకు, అటు నుంచి ఇటు నుంచి అటు ఉభయ పక్షాలూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది ప్రత్యర్ధి పార్టీలు చేసే ఆరోపణ అనిపించినా, కాదు. నిజం.  నిజానికి, ఇదే విషయాన్ని తెలంగాణ పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో నెత్తీ నోరూ కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ఎందుకనో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పడు మరోసారి అదే విషయం తేట తెల్లంగా తెలిసిపోయింది. విజయ దశమి పండగ పూట కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే కేసేఆర్ ప్రాంతీయ పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. మోడీ గుజరాత్ మోడల్ కు కేసేఆర్ తెలంగాణ మోడల్ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటూ చాలా కాలంగా ప్రచారం కూడా జరుగుతోంది.  కానీ, ఇంతా చేసి చివరకు జాతీయ పార్టీ ప్రకటన తర్వాత, ఆయన తమ జాతీయ పోరాటం గుజరాత్ నుంచి కాదు  మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రారంభ మవుతుందని ప్రకటించారు. నిజానికి, కర్ణాటక, మహా రాష్ట కంటే ముందుగా గుజరాత్ అసెంబ్లీకి మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ నిజంగా మోడీని, గుజరాత్ మోడల్ ను  వ్యతిరేకించడమే నిజం అయితే, ముందుగా ఆయన తమ జాతీయ పోరాటాన్ని గుజరాత్ నుంచి  ప్రారంభిచాలి. కానీ, అయన అసలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావనే తీసుకురాలేదు. దీని భావమేమి చంద్రశేఖర అంటే సమాధానం రాదు.  నిజానికి కేసేఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నదే  కేంద్రంలో మళ్ళీ మరో సారి మోడీని గెలిపించెందుకే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే చెపుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు కేసీఆర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు కాంగ్రెస్ మిత్ర పక్షాలను ఏకంచేసి దిశగా ప్రయత్నాలు సాగిస్తునారు. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం రమ్మని ఆహ్వానించారు.  అలాగే, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే కేసేఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ను బలహీన పరిచి బీజేపీని బలపరిచేందుకు చేసిన కుట్ర. సరే ఆ ప్రయత్నం ఫలించ లేదనుకోండి అది వేరే విషయం.  ఆ ప్రయత్నం విఫలమైంది కాబట్టే ఇప్పుడు జాతీయ పార్టీ పేరున తక్షణం అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలను వదిలేసి బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కర్ణాటక,మహారాష్ట్రలను ఎంచుకున్నారు. అంత వరకు ఎందుకు గడచిన ఎనిమిది సంవత్సరాలలో  తెలంగాణలోనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను ప్రలోభాలకు గురి  చేసి గోడ దూకించిన కేసీఆర్, బీజేపే వైపు మాత్రం కన్నెత్తయినా చూడలేదు. సో ... అనుమానం లేకుండా కేసీఆర్ తెర తీసిన భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్, నిజానికి భారతీయ జనత పార్టీ  (బీజేపీ) బీ టీమ్.  ఇది కూడా ఆరోపణ కాదు నిజం అంటున్నారు. అందుకే, అందరి మీదకు ఒంటికాలు మీద లేచే సిబిఐ, ఈడీ తెలంగాణకు వచ్చే సరికి వట్టి ఊపులే తప్ప గట్టి  చర్యలు తీసుకోవడం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు.

ఫ్రెంచ్ రచయిత్రి ఎర్నాక్స్‌కు సాహిత్య నోబెల్‌

ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నాక్స్‌ ఈ ఏడాది సాహిత్య నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 82 ఏళ్ల ఎర్నాక్స్ ధైర్యం, ప్రయోగాలతో వ్యక్తిగత జ్ఞాపకాలకు అడ్డుగా నిలుచున్న సామూహిక బంధనాలను చీల్చుకుంటూ మూలాలు, వేరుపడి ఉండటానికి సంబంధించిన విషయాలను ఆవిష్కరించారని నోబెల్ జ్యూరీ పేర్కొంది.  1940లో వెటోట్ అనే చిన్న పట్టణంలో నార్మండీ తెగలో ఆనీ ఎర్నాక్స్ జన్మించారు. ఆమె తన మూలాలు, నార్మన్ తెగ మూలాల గురించి భిన్న కోణాలు, పార్శ్వాలను గురించి సంబంధించిన తన వ్యక్తిగత అను భవాలు, ఆవిష్కరించిన కోణాలను ఆమె అక్షరబద్ధం చేశారు. వాటిని నవలలుగా రచించారు. రచయిత్రిగా ఆమె ప్రయాణం సుదీర్ఘమైనది అని నోబెల్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది.