ఫ్లూ పొంచి ఉంది జర బద్రం సి డి సి హెచ్చరిక 

వర్షాకాలం తరువాత రానున్నది ఫ్లూ కాలమే అని అంచనా వేస్తున్నారు.ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఫ్లూ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటినిబంధనలు పాటించడం వల్ల ఫ్లూ కేసులు 6౦ %తగ్గు ముఖం పట్టాయి. కోవిడ్ తరువాత పదివారాలు లాక్ డౌన్ ఉన్నందున కొలంబియ విశ్వ విద్యాలయం  పరిశోధకులు శాస్త్రజ్ఞులు అధయనం చేసారు. ముఖం పై మాస్క్,చేయి సానిటైజ్ చేసుకోడం వల్ల ఇంఫ్లూ ఎంజా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా కోవిడ్ సమయం లో నిరోధించ గాలి గా మన్నారు. ఇన్వి రాన్ మెంట్ హెల్త్  సైన్సెస్  అసిస్టెంట్ ప్రోఫెసర్ సెన్ పైన్ వెల్లడించారు. మేల్మేన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ న్యూయార్క్ కు చెందిన శాస్త్రజ్ఞులు తమ పరిశీలనలో కోవిడ్ 19  ఇంఫ్లూ ఎంజా ఒకే రకంగా వ్యాప్తి చెందుతుంది.సార్క్ కోవిడ్ ను నియంత్రించడం ద్వారా ఇంఫ్లూ ఎంజా  విస్తరణను తగ్గించ వచ్చు. దురదృష్ట వసాత్తూ చాలా ప్రదేశాలాలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్19 నియమ నిబందన ను  తొలగించారు.కాగా రానున్న చలికాలం ముందు ముందు ఫ్లూ విజ్రుంభించే కాలం అని పేర్కొన్నారు. అంటే దాని ఆర్ధం ఫ్లూ చాలా సులభంగా త్వరగా విస్తరిస్తుంది.అయితే రక్షణ కవచం లేకుంటే  ప్రజలలో రోగనిరోదక శక్తి తగ్గడం వల్ల ఇంఫ్లూ ఎంజా గత సంవత్సరం యు ఎస్ లో ఫ్లూఎంజా లేదు. ఇంఫ్లూ ఎంజా  వైరస్ ఎప్పటికప్పుడు పరివర్తన,రూపాంతరం  చెందుతూ ఉంటుందని పై అన్నారు. ప్రతి రెండు,లేదా 5 సంవత్సరాల కోక సారి ఇంఫ్లూ ఎంజాతో ఇన్ఫెక్షన్ కు గురియ్యారని. ఇంఫ్లూ ఎంజా మళ్ళీ వచ్చే అవకాసం ఉందని మన రోగ నిరోధక శక్తి తగ్గిందో సమస్యలు తప్పవని ఒక పరిశోదనలో పై బృందం కంప్యుటర్ మోడల్ ద్వారా ప్రయాణం ఆంక్షలు,పేస్ మాస్క్,సామాజిక దూరం  పాట శాలాల మూసివేత వల్ల 2౦2౦ లో వ్యాప్తి ప్రభావం లేదని తేల్చారు. ఫ్లూ విస్తృత వ్యాప్తి చెందితే... ఒక నాతన పరిశోదనలో విస్తృత స్థాయిలో ఇన్ఫెక్షన్ వ్యాధులు వ్యాప్తి చెందితే రానున్న కాలం ఫ్లూ ను  ఎదుర్కోక తప్పదు అని ఈ సంవత్సరాన్ని ఫ్లూ సంవత్సరంగా పేర్కొన్నారు.నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజ్  ఎండి మెడికల్ డైరెక్టర్ బెతేన్స్ డే డాక్టర్ విలియమ్స్ స్కాఫ్నర్ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని. అంచనా వేస్తున్నారు. యు ఎస్ లో ఇప్పటికే 2,౦౦౦ కేసులు నమోదు అయ్యాయని యుఎస్ కు చెందినా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  ప్రిమిక్షన్ 2౦2౦ -2౦ 21 ఫ్లూ సీజన్ గా పేర్కొన్నారు.ఫ్లూ సీజన్ 35 మిలియన్ల కేసులు ఉన్నాయని సమాచారం. 2౦2౦ -2౦21 లో ఒక బాలుడు మాత్రమే ఫ్లూ తో మరణించాడని.మూడు సీజన్లలో 144 -199 కన్నా  తక్కువే అని సి డి సి పేర్కొంది. సామాజిక దూరం,మాస్క్ వంటివి పిల్లలు వేసుకోవడం,పాతాశాలలు మూసి వేయడం వల్ల ఇంఫ్లూ ఎంజా లేదని. తేల్చారు. కొంత మంది నిపుణులు చర్చల సమయం లో ప్రజలలో ఇమ్యునిటి సరిగా లేక పోయినా ఇబ్బిడి ముబ్బిడి గా  జనభాపెరుగుదల వల్ల ఫ్లూ త్వరగా విస్తరిస్తుందని.ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఎక్కువే అని లేదా ఫ్లూ వల్ల తీవ్ర అనారోగ్యం.అస్వస్థత,కు గురి  కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.స్థానికంగా ఆయారాష్ట్ర్రాలు ప్రజా ఆరోగ్యానికి చెందిన అధికారులు  మాస్క్ వేసుకోవాలాని లేదంటే ఫ్లూ కు గురికాక తప్పదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  సిడిసి 2౦2౦ -2౦21 ని ఫ్లూ నివారణ సంవత్సరంగా ప్రకటించింది.                                            

అనాఫిలాక్సిస్   వస్తే అన్ని సమస్యలే 

అనాఫిలాక్సిస్ అనుకోకుండా చాలా తీవ్రంగా మొత్తం శరీర మంతా ఎలర్జిక్ రియాక్షన్  శరీరం నుండి విడుదలయ్యే హిస్తామిన్ ఇతర రసాయనాలు విడుదల వల్ల ఒక్కో సారీ గాలి తీసుకునే మార్గాలు మూసుకు పోవడం వల్ల గాలి పీల్చడం కష్టంగా ఉంటుంది.దీనిఫలితంగా సంకోచించడం జరగదు.దీనివల్ల అసహజమైన నొప్పి క్రామ్స్,వాంతి వచ్చినట్టుగా ఉండడం.డయేరియా ,హిస్టామిన్ కు కారణం రక్తాన్ని రక్త నాళాన్ని పలుచగా చేస్తుంది.దీని కారణం గా లో బ్లడ్ ప్రెషర్ రక్త ప్రవాహం లోనే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ లీక్ కావడం కూడా గమనించ వచ్చు.దీని వాళ్ళ శరీరం లో రక్తం శాతం తగ్గుతూ ఉంటుంది.లో బ్లడ్ ప్రేషేర్, లేదా లొబ్లడ్ వోల్యుం షాక్ కు గురికావడం. లేదా ఊపిరి తిత్తు లలో వాపు దీని  వల్ల ఊపిరి తీసుకోడానికి సంబంధం ఉంది.దీర్ఘ కాలంగా అనాఫ్య్లక్షిస్ కు కారణాలుగా చెప్పవచ్చు. దీనికి కరాణాం కొన్ని రకాల మందులు. ఆహారం కూడా ఎలర్జీ కి దారి తీస్తుంది. పోలిమ్య్క్షిన్,మార్ఫిన్,పోల్లెన్స్,లేదా ఇతరా ద్రవాలు పీల్చినప్పుడు  చాలా అరుదుగా  అనాఫిలాక్సిస్ వస్తుంది. అనాఫిలాక్సిస్  లక్షణాలు ..... అనాఫిలాక్సిస్ లక్షణాలలో ఊపిరి పీల్చికోవడం కష్టంగా ఉండడం మాట్లాడ లేకపోవడంవనకడం.గందర గోళం, మాదిబలహీనంగా కొట్టుకోవడం.సైనో సిస్,  దురద దద్దుర్లు.అలసట బద్ధకం,వాంతులు,విరేచనాలు. తీవ్రమైన నొప్పి,చర్మం ఎర్రగామారడం.దగ్గు,దీనికి ప్రతి చర్యగా నోటిలో ఎదో రసాయన వాసన,కొద్ది పాటి  రక్తపు చుక్కకే కళ్ళు తిరిగిపోవడం.ఈ లక్షణాలు నిమిషం లో లేదా గంటలో వస్తాయి.  అనాఫిలాక్సిస్  నిర్ధారణ .... అనాఫిలాక్సిస్ ,ఎలేర్జి   కారణ మైనప్పుడు చికిత్స తరువాతే చేస్తారు. అనాఫిలాక్సిస్ కు చికిత్స .... అనాఫిలాక్సిస్  ఒక అత్యవసర చికిత్స చేయాల్సిన స్థితి,దీనికోసం సి పి ఆర్ కార్డియో పల్మనరీ రెసురెసుస్క్తిట్టి ఎషణ్ , దీనినే ప్రజలు సీవియర్ ఎలేర్జిక్ రీయాక్షన్  అని తెలుసు. ఇది మారిత ప్రమాదం గా మారి ఎపి-పెన్ లేదా ఇతర  ఎలేర్జి కిట్ ఒక వేళ అత్యవసరంగా చికిత్స తపనిసరి కావచ్చు.ఇందుకోసం నోటి ద్వారా గాలిమార్గాన్ని పంపించాల్సి రావచ్చు  దీనిని వైద్య పరిభాషలో ఎండో ట్రాచీల్ ఇంటుబెషన్ అంటారు.దీనిని ట్రాఛి యా అత్యవసర సమయం లో  ట్రై కో స్టమి,క్రై కో త్యరోటమీ వీటికి ట్యూబ్ ను నేరుగా గొంతులోనుంచి వేస్తారు.ఎఫినేఫిన్ ఇంజక్షన్ ను ఆలస్యం చేయకుండా  దీనిలక్షనాలు తగ్గించడానికి యాంటి ఇస్తామిన్స్,కార్టి కాస్టర్ రోఇడ్స్ ను వాడతారు. గాలి పీల్చుకోడం ఇబ్బందిగా ఉంటే అది అత్యవసరం కావచ్చు.                                                                 

ఇంజక్టబుల్ ప్యాచ్‌తో హార్ట్ ఎటాక్ నుండి రికవరీ

గుండె పోటు నొప్పి వచ్చిన తరువాత పాడై పోయిన ధమని ప్రాంతం పై వచ్చే చారాలు లేదా మచ్చలు ఉండడం వల్ల  సంకేతాలు సమాచారం అందదు. పైగా శరీరానికి రక్త ప్రసారం అందదుదీనివల్ల గుండె బలహీన పడుతుంది. ఈకారణంగానే గుండె అసహజంగా కొట్టుకుంటుంది. ఈసమస్యను ఒమ్హ్యత్మియా లేదా ఫైల్యూర్ అంటారు. ఇప్పుడు వైద్యుల కు రెండురకాల ప్రాత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఒకటి పాడై పోయిన కణజాలాన్ని రిపేర్ చేయడం లేదా శస్త్ర చికిత్స ద్వారా  వేరొకటి ఇంప్లాంట్ చేయడం ఎలక్ట్రికల్ బ్రిడ్జ్ ద్వారా గుండెకు సంకేతం పంపడం  లేదా చాతిని తెరచి ఓపెన్ హార్ట్ సర్జరీ దీనివల్ల కొన్ని గుండె సమస్యలు  వచ్చే అవకాసం ఉంది వైద్యులు ఓపెన్ హార్ట్ లేదా గుండెను,చాతిని తెరచి  సర్జరీ చేసే విధానాన్ని నివారించాలి.  ఈ పద్దతిలో చేసే శస్త్ర చికిత్సకు బదులు  నూతనంగా రూపొందించిన ప్యాచ్ ను ఉపయోగించవచ్చని అయితే పాడై పోయిన  డ్యామేజ్ అయిన గుండె కణజాలాన్ని గ్రాఫ్టింగ్ చేయవచ్చు.ఇప్పుడు శాస్త్రజ్ఞులు తమ మాటను నిలబెట్టుకునెందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇంజుక్ట బుల్ ప్యాచ్ ఒకరకమైన ఆకారం తో కూడిన గుండె కణం పై మజిల్ పై గ్రాఫ్టింగ్ చేస్తారు. అయితే ఇంజక్టబుల్ ప్యాచ్ ను ఇప్పటికి వరకు ప్రజలపై పరీక్షించాలేదని. ఈ రకమైన ట్రైల్స్ నిర్వహించేందుకు మరింత సమయం పడుతుంది.  జంతువుల పై జరిపిన ట్రైల్స్ విజయవంత మయ్యాయి. ప్రయోగాత్మకంగా తయారు చేసిన ప్యాచ్ ను చుట్టవచ్చు.గుండెలోని కణజాలానికి  మజిల్ కు అంటించవచ్చు. ఒక సారి ప్యాచ్ ను పెట్టిన తరువాత గుండె సహజం గా  పని చేసేటట్లు చేస్తుంది. ఎలుకలు,పందుల పై నిర్వహించిన ప్రయోగం లో సాధించిన అంశాల పై నేచర్ బయో మెడికల్ ఇంజనీరింగ్ లో ప్రచురించారు. పరిశోదనలో పాడై పోయిన గుండె పై అమర్చగానే ఎలుకలలో ఉన్న గుండె కణాలు కండరాలు  గుండె సహజంగా కొట్టుకోవడం అరంభించిందని గుర్తించామన్నారు.శరీరానికి రక్త సరఫర జరిగిందని  తెలిపారు.గుండె కణజాలానికి రక్త సరఫరా జరిగిందని.తెలిపారు. నాలుగు వారాలలో గుండె సహజంగా పని చేయడం జరిగిందని.ప్యాచ్ చేసిన గుండెకు బాగా పని  చేశాయని ఆక్సిజన్ పంప్ చేయడం శరీరానికి రక్త సరఫరా అందించమని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇంజక్టబుల్ ప్యాచ్ తో హార్ట్ అట్టాక్ ను నివారించాగలిగే చికిత్స అందరికీ అందుబాటులో కి రావాలని  కోరుకుందాం.              

అక్టోబర్ నెల వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల

అక్టోబర్ నెలలో  అంతర్జాతీయ  క్యాన్సర్  అవగాహన నేలగ  అతర్జాతీయ క్యాన్సర్  పరిశోదన సంస్థ క్యాన్సర్ అవగాహన నెల గా ప్రకటించారు.  ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్భారంగా మారుతోంది.2౦2౦ నాటికి ప్రపంచంలో బ్రస్ట్ క్యాన్సర్ ను సహజంగా గుర్తిస్తున్నారు.  ఇప్పటికే 2.26 మిలియన్ల బ్రస్ట్ క్యాన్సర్ కేసులు  గుర్తించినట్లు ఇందులో 6,85,౦౦౦ మంది మరణించారని ఐ ఏ ఆర్ సి తెలిపింది.  2౦2౦ నాటికి బ్రస్ట్ క్యాన్సర్ చాలా సహజమని స్త్రీలు క్యాన్సర్ వల్ల మరణించడం సహజమైన  ప్రక్రియగా పేర్కొంది.  ప్రపంచ వ్యాప్తంగా బ్రస్ట్ క్యాన్సర్ వల్ల మరణాల రేటు పరిశీలిస్తున్నారు. అత్యధిక ఆదాయం గల దేశాలాలో సామాజిక ఆర్ధిక అసమానతలు కూడా మరణాలకు కారణం గా పేర్కొన్నారు.  స్త్రీ ఆరోగ్యం విషయంలో వివక్ష చూపడం విచారకరం. వక్షోజాల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్సతో జీవించడం దుర్భరంగా మారింది.ఆర్ధికంగా,మధ్యంతర కుటుంబాలాలో ఆదాయం తక్కువగా ఉండడం తో చాలా మంది చికిత్స అందక మరణిస్తున్నారని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో మూడు వంతులు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వక్షోజాల క్యాన్సర్ అవగాహన తోనే మరణాలు ఆపగలం.          

ప్రతి ఒక్కరికి జీవించే హక్కు

స్వచ్చ మైన వాతావరణం పొందడం మానవహక్కు ---యు ఎన్ మానవహక్కుల కాన్సిల్ తీర్మానం. ప్రపంచం లో వాతావరణ కాలుష్యం రాసాయానాలు వెలువడడం ఇతర వాతవరణాల వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందని దీనికారణంగా 13.7 మిలియన్ల మరణాలు ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 24%గా ఉందని ఐక్య రాజ్యసమితి జాతీయ మానవహక్కుల మండలి తీర్మానం ప్రవేసపెట్టింది.తీర్మానం లో స్వచ్చ మైన,పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన వాతావరణం మనవహక్కని ఐక్యరాజ్య సమితి హై కమీషనర్ సభ్య దేశాలు ఈనిర్ణ యాన్ని అమలు చేసేందుకు  పని చేయాల్సి ఉందని ఇది ల్యాండ్ మార్క్ గా యు ఎన్ పేర్కొంది. ప్రపంచం లో ప్రతి ఒక్కరికి స్వచ్చమైన ఆరోగ్యవంతమైన వాతావరణం పొందడం ప్రాధమిక హక్కు గా పేర్కొంది.ఈసమావేశం లో కోస్టారికా,మాల్దీవ్స్,మొరాకో,స్లోవేనియా,స్విట్జర్ ల్యాండ్,దేశాలు తీర్మానం 48 /13 మెజారిటితో ఆమోదం లభించింది అంటే తీర్మానానికి 43 దేశాలు మద్దతు తెలిపాయి. కాగాచైనా, భారాత్, జపాన్, రష్యా దేశాలు తటస్తంగా ఉండడం గమనార్హం.యు ఎన్ ఆమోదించిన తీర్మానాన్ని ధైర్యంగా అమలు చేయాలనీ,ఆరోగ్యవంతమైన వాతావరణం ద్వారా పారదర్సకత తో కూడిన ఆర్ధిక, సాంఘిక వాతావరణం విధాన నిర్ణయం ప్రజలకు రాక్షన తో పాటు.ప్రకృతిని పరిరక్షిస్తుందని ఐక్య రాజ్యసమితి జాతీయ మానహక్కుల సామాఖ్య కమీషనర్ మిచెల్లీ బచ్ల్ట్ నొక్కి చెప్పారు.           

 అంతుపట్టని అల్పోర్ట్ సిండ్రోమ్ తో సమస్య తప్ప దా ?

కొన్నికొన్నిరకాల రోగాల పేర్లు చాలామంది కి తెలియనే తెలియవు పైగా వాటి పేర్లు సైతం మన నోటికి పలకదు.వాటిలో చాలానే అనారోగ్యాలు ఉన్నాయి.అల్పోర్ట్ సిండ్రోమ్ లోపల ఉన్న డిజార్దర్ దీనివల్ల మూత్రపిండాల లో డ్యామేజ్ అయ్యి ఉండవచ్చని అంటారు వైద్యులు.ఈ సమస్య ఉన్నవారిలో మీ మూత్రంలో రక్తం,వినికిడి ని కోల్పోవడం కంటిలో లోపాలు ఏర్పడే అవకాసం ఉందని నిపుణులు అంటున్నారు.ఈ వ్యాధి కిడ్ని కిందిభాగం లో సమస్యవస్తుందని,చెవి లోపలి భాగం అంతర్ చెవి,కళ్ళలోకోక్లియా వచ్చే అవకాసం ఉంది.దీనికి కారణం జీన్స్ లో చీలిక రావడం లేదా గీరుకు పోవడం అయితే అల్పోట్ సిండ్రోమ్  సమాస్య రావడం అరుదుగా వస్తుంది.దీనిని జెనిటిక్ సమస్యగా తేల్చారు కాగా అత్యంత కష్టంగా .ఎక్ష్ క్రోమోజోం లో కను గోన్నట్లు నిపుణులు స్పష్టం చేసారు. అల్పోర్ట్ సిండ్రోమ్  లక్షణాలు ---- అల్పోర్ట్ సిండ్రోమ్ సహజంగా మహిళలలో చాలా తక్కువ శాతం ఉంటుందని.అసలు లక్షణాలు లేకపోవడం లేదా మినిమల్ గా ఉండడం గమనించవచ్చు.ఒక వేళ స్త్రీలలో లక్షణాలు లేక పోయినావీరి జీన్స్ నుండి వారిపిల్లలకు సంక్రమించవచ్చు.అయితే పురుషులలో ఈ వ్యాదిలక్షణా లు చాలా తీవ్రంగా ఉంటాయని.చాలా త్వరగా వృద్ది చెందుతుందని అంటున్నారు నిపుణులు.అల్పోర్ట్ సిండ్రోమ్ కు కారణం దీర్ఘ కాలిక గ్లోమేరులోనేఫ్రిటిస్ ఇది కిడ్నిలో అంటే మూత్ర పిండాలలో కిడ్నిలలో ఇంఫ్లామేషణ్ లేదా అసలు లక్షణాలే లేకపోవడం.చివరి దశలో 4౦ -5౦ సంవత్సరాలాలో అల్పోర్ట్ సిండ్రోమ్ ను మూత్రం లో అసహజమైన రంగులో ఉండడం లేదా రక్తం పడడం.వినికిడి లోపం,కంటి చూపుకోల్పోవడం దగ్గు,కాళ్ళలో వాపులు కంటి చుట్టూ వాపువంటి లక్షణాలుగా తేల్చారు. అల్పోర్ట్ సిండ్రోమ్ నిర్ధారణ పరీక్ష... అల్పోర్ట్ సిండ్రోమ్ నిర్ధారణకు శారీరకంగా ఎటువంటి ప్రత్యేక లక్షణాలు  లేవు.సహజంగా శారీరకంగా రక్తం తో కూడిన మూత్రం తో వచ్చే వారికి యూరిన్ఎనాలసిస్ లో రక్తం,ప్రోటీన్,లేదా ఇతర అబ్నార్మాలిటీస్ ,బ్లడ్ యూరియా నైట్రోజన్,క్రెఅటినిన్ ఎక్కువైనా రక్తం కూడిన మూత్రంలో తగ్గి ఉండవచ్చు.ఎర్రరక్త కణాలలో హేమక్రోటిక్ .ఆడియోమెట్రి గనక ఉంటె చెవి నరాలు లేకుంటే చేమిటి సమస్య వస్తుంది.అవసరమైన పక్షం లో బయాప్సీ లో దీర్ఘకాలిక గ్లోమేరులోనే ఫ్రిటిస్ ఉన్నట్లు గమనిస్తే అల్పోర్ట్ సిండ్రోమ్ గా నిర్దారిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అల్పోర్ట్ సిండ్రోమ్ కు చికిత్స... అల్పోర్ట్ సిండ్రోమ్ ను నిలువరించేందుకు,పెంచడానికి  చికిత్స లేదుహై బిపి ని తప్పకుండా అదుపు చేయాలి.దీర్ఘకాలికంగా కిడ్నీ ఫైల్యూర్ కాకుండా ఉండడానికి చికిత్స చేయాలి.చివరి స్టేజ్ లో డయాల్ సిస్,లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ తప్పనిసరిగా చేయాల్సి  వస్తుంది.  

ఆల్బినిసం సమస్యలు

ఆల్బినిసం శరీరంలో   మెలనిన్  ఉత్పత్తి తగ్గడం వల్ల ముఖ్యం గా తల పై వెంట్రుకలు రాలిపోవడం లేదా జుట్టుపెరగక పోవడం స్కాల్ప్  సోరియాసిస్, జుట్టు తెల్లబడి పోడానికి కారణం మెలనిన్ ఉత్పత్తి లేకపోవడం కారణం గా పేర్కొన్నారు.ఈ సమస్యను జెనెటిక్ లోపం గా పేర్కొన్నారు.ఆల్బినిసం టైప్1 ను త్యరోసినస్ ఇది ఒక ఎన్జయం లేకపోవడం లేదా ఉత్పత్తి ఆగిపోవడం వల్ల.ఎమినో యాసిడ్ లోపం వాళ్ళ మెలనిన్ టైప్ 2 ఆల్బినిసం వల్ల పెగ్మేంటేషన్ అంటేపొక్కులు,దద్దుర్లు వస్తాయి,అయితే ఈ సమస్యకు కారణం గర్భస్థ సమయం లో పుట్టిన వెంటనే సమస్య లు రావడం గమనించవచ్చు. అల్బనిసం లక్షణాలు ---- అల్బనిసం యొక్క లక్షణాలలో జుట్టునుండి దద్దుర్లు,మచ్చలు,చర్మం లేదా కళ్ళలో వస్తుంది.రోగి  చర్మం పై సోరియాసిస్ ను పోలిన మచ్చలు చర్మం రంగు మారుతుంది.జుట్టు రంగు కూడా మారుతుంది.రోగి కళ్ళు సరిగా గుర్తించలేరు చూపు మందగించడం స్పర్శను పూర్తిగా కోల్పోతారుఅవేలుతురు ను చూడలేరు. నిర్ధారణ పరీక్ష ----- ఆల్బినిసం ను నిర్ధారణకు జెనెటిక్ పరీక్ష ను వినియోగిస్తారు.ఎలక్ట్రోరేర్ ఇనోగ్రాం పరీక్ష ను  బ్రెయిన్ వేవ్ ను ఒక లైట్ ద్వారాకంటిని పరీక్స్శిస్తారు అలాగే కన్ను పనిచేస్తుందా లేదా పరేక్షిస్తారు.అల్బనిసం ప్రభావం ఏమేరకు ఉందొ తెలుసుకుంటారు. అల్బెనిసం కు చికిత్స ----- అల్బనిసం కు చికిత్స లేదు .చర్మం కళ్ళు దీనిబారిన పడకుండా రక్షించుకోడమే మార్గం.  

ఆడేనో కార్సినోమాస్‌కి భయపడకండి!

ప్రపంచ ఆరోగ్య సంస్థ అడెనోకార్సినోమ ఒక మాలిగ్నెంట్ గా పేర్కొందిఅంటే దీని ఆర్ధం ఒకరకమైన గడ్డ ఇది సాధారణ మైనది కావచ్చు లేదా క్యాన్సర్ గడ్డ కావచ్చుగొట్టం లో గడ్డ,అసినార్,లేదా పాపిల్లరి,గా పెరుగుదల  కనిపిస్తుంది.  ట్యూమర్ సెల్ల్స్ లో శ్లేష్మం ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ప్రధామిక స్థాయి లో దీని నిర్వచనం ప్రకారం సూచించేది ఏమిటి అంటే అడెనో కార్సినోమాఒక కణజాలం గా గ్రంధి గా ఇందులో కొన్ని రకాల శ్లేష్మాలు ఉత్పత్తి చేస్తాయి.అడెనో కార్సినోమా  చాలా సహజంగా వచ్చే ఒకరకమైన ఊపిరి తిత్తుల క్యాన్సర్,ప్రత్యేకంగా స్త్రీలు,పొగ తాగని వారిలో ఇది కనిపిస్తుంది.అందుకే దీనిని క్యాన్సర్ కుటుంబం గా పేర్కొన్నారు.దీనిని మరోరకంగా క్యాన్సర్ కానీ చిన్న కణాలకార్సినోమాగాపిలుస్తారు.అడెనోకార్సినోమా ముఖ్యంగా ఊపిరితిత్తులు, అన్న వాహిక, పెద్దపేగు, లాలాజలగ్రంధులు,అడెనో కార్సినోమా ఫలితంగాగతంలోవచ్చినవ్యాధులు, లేదా ఊపిరితిత్తులలోగాయాలు,పెద్దపేగులో పుండు,వంటివి అడెనోకార్సినోమా అని నిర్వచించారు. అడెనో కార్సినోమా లక్షణాలు ----- అదేనోకార్సినోమా లో ఎక్కువ శాతం ఊపిరి తిత్తులలో  పెరిఫేరి లక్షణాలు ఉంటాయి అయితే తరచుగా  కొన్ని సందర్భాలలో వీటి లక్షణాలను కనబడవు అయితే బాగా ముదిరి పోయాక మాత్రమే రోగులలో  కనిపిస్తుంది.వారికి క్యాన్సర్ ఉందన్న ఆలోచన వారికి తెలియదు.వారి శరీరం అంతా పూర్తిగా పాకి  ఇక చికిత్సకు కూడా లొంగ నంతగా చేయిదాటి పోతుంది.అడే నోకార్సినోమా చాలా ఎక్కువసార్లు ఊపిరితిత్తుల కింది భాగం లో ప్లేరురాల్ మేమ్బ్రేన్స్ ను ఊపిరి తిత్తులను  అంటుకుని ఉంటుంది ఇది నల్లటి పొక్కులు లేదా మచ్చలు శ్లేష్మం ఆగడ్డ నుండి వస్తూ ఉంటుంది.మెరిసినట్టుగా పాలిపోయి న రంగులో ఉంటుంది. అడెనో కార్సినోమా నిర్ధారాణ పరీక్షలు ----- అడెనోకార్సినోమా ను గుర్తించేందుకు ఊపిరి తిత్తుల  రేడియోలాజికల్ పరీక్ష,కణాల బయాప్సి పరీక్ష తప్పనిసరిగా చేస్తారు. అసలు మన శరీరంలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ గద్దకదని అయితే అది ఏగడ్డో తెలియాలంటేడాక్టర్ సూచన  మేరకు  బయాప్సి చేయించడం నుఖ్యం. అడినోకా ర్సినిమా కు చికిత్స---- అడెనో కార్సినోమాకు చీమో తెరఫీ,లేదా రేడియేషన్ తెరఫీ లేదా అవసరమైన పరిస్థితి లో శస్త్ర చికిత్స  చేస్తారు.      

ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్ నెస్ వస్తే చనిపోవడం ఖాయమా?

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 21 కేసులు, తూర్పు ఆఫ్రికా ట్రైపనోసోమియాసిస్ గా పిలిచే ఈ అనారోగ్యాన్ని 1967  లో ఆఫ్రికా కు వచ్చిన ప్రయాణికుల నుండి వచ్చింది. తూర్పు,పశ్చిమ ఆఫ్రికా లలో  దాదాపు 2౦,౦౦౦ మందిలో స్లీపింగ్ డిసీజ్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం వస్తు ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి టి సెట్సే అనే ఈగ వల్ల వ్యాపిస్తోందని గుర్తించారు. ఈగ రక్తాన్ని పీల్చేస్తుంది. ఈ ఈగను కేవలం ఆఫ్రికాలో మాత్రమే కనుగొన్నారు. టి సెట్సే ఈగ వల్ల  తరచుగా నొప్పిగా ఉంటుంది. దీని కాటు వల్ల  ఎర్రగా మారి వాచిపోతుంది. ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్ నెస్ లక్షణాలు: తూర్పు ఆఫ్రికా ట్రై పనో సోమియాసిస్ కు కారణం ప్రోటోజొవ ట్రైపనో సోమ బ్రుసి రహోదేశి ఎంసె వల్ల జ్వరం తీవ్రమైన తలనొప్పి,కోపం,అలసట,కళ్ళు చేతుల  చుట్టూ వాపు, తీవ్రమైన తల నొప్పి,అలసట, కండరాల నొప్పులు,లింఫ్ నోడ్స్ వల్ల మెడ వెనుక భాగం లో నొప్పి ప్రధానంగా ఎప్పుదతే ఈగ కాటు వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల శరీర దారుడ్యం లో మార్పులు.తీవ్రమైన కోపం,ఏకాగ్రతను కోల్పోతారు,అసలు ఏమి చేస్తున్నామో, ఏమిచేయాలో అర్ధం కాక గందర గోళానికి ,మాటలో తేడా,లేదా వణుకు మూర్చ వంటి వి వేదిస్తాయి.పోద్దస్తమానాం సుదీర్ఘనిద్ర వాళ్ళ నిద్ర లేమి రాత్రి సహజంగా ఎదురయ్యే సమస్య.పశ్చిమ ఆఫ్రిక ఆఫ్రికన్ స్లీపింగ్ డిసీజ్ ఒక వేళ దీనిని సత్వరం గుర్తించక పోయినా చికిత్స చేయకున్నా కొద్ది నేల్లలలో చనిపోతారు.

కాలినడక ఎంత మేలో తెలుసా...?

ఆధునిక వైద్య రంగానికి దిక్సూచి  యునానీ నే డాక్టర్ ఎస్ జి వి సత్యఅన్నారు.   నేడు వైద్యరంగం ఆధునిక పితామహుడు హకీమ్ బుఖరత్.సహాబ్ అని  అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ గా అంటారని ఆమె అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆమె తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ యునానితోనే సర్జరీ పుట్టిందని హకీమ్ బుఖారత్ సహాబ్ గుండె జబ్బుల వారికి 3౦౦ సంవత్సరాల బి సి లోనే ప్రేవెంషణ్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న నినాదం ఇచ్చింది హకీమ్ బుఖ్రాత్ సహాబ్ అని ఆమె అన్నారు. రోజూ ఒక వ్యక్తి 15 నిమిషాలు నడిస్తే గుండె  జబ్బు లు రావని అన్నారు. డాక్టర్ సత్య.ఇలా నడవడం వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయని,ముఖ్యంగా హార్ట్ డిసీజ్ తగ్గించవచ్చు.శరీరంలో పిక్కలు రెండవ గుండే లాంటిదని అంటారు. కింద నుండి రక్త ప్రసారం ఇవ్వాలి.ప్రతి తోజూ నడిచినప్పుడు కాళ్ళలో ఉండే రక్త నాళాలు స్క్వీజ్ అవుతాయి కిందనుండి పైకి పై నుండి కిందకి రక్త ప్రసారం జరుగుతుంది. గర్భంలో ఐదు వారాలలో పెరిగేది గుండె అని,వ్యక్తి మరణించిన తరువాత ఐదు నిమిషాలు కొట్టుకునేది గుండె నట కాబట్టి గుండెకి అంత విలువ మనకు ముందు వెనక వచ్చేది గుండె మాత్రమే. గుండె పని చేయాలంటే ఎంతో శక్తి కావాలి.గుండెని పని చేయించాలి అంటే హర్త్ను బలంగా ఉంచాలి.హార్ట్ గుండె పైన బరువు తగ్గించాలి.అంటే మీ గుండెకు  అనవసరమైన కొవ్వు ను పెంచకూడదు.ఒక మహా కవి ఏమన్నాడంటే తిండి కలిగితే కండ కలదోయ్ కందకలవాడెను మనిషోయి. అంతే కాని కొవ్వు కలిగితే గుండె కలదోయ్ కొవ్వు కలావాడెను మనిషోయ్ అని అనలేదు. కొవ్వు పెరిగిందో గుండె పని చేయదు అని గుర్తుంచు కోవాలి. బి పి సమస్య రాకుండా పెరగ కుండా చూసుకోవాలి.బిపి ఏదైనా ప్రమాదమే హై బిపి కి కళ్ళలో పక్షవాతం,లో బిపికి తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి. అన్నిటి కన్నా లో బిపి ప్రమాదకరమని అన్నారు డాక్టర్ సత్య. గుండెల్లో ముఖ్యంగా గుండె రక్త నాళాలలో పూడుకు పోయి ఉంటాయని,అవే బ్లాక్స్ మనల్ని ఇబ్బంది పెడతాయని డాక్టర్ సత్య అన్నారు.అలోపతిలో ఒక రక్తనాళం పూడుకు పోతే స్టన్టింగ్ వేస్తారని రెండు రక్తనలాకు రెండు స్టంట్లు చికిత్స కాదని అన్నారు లేదా మూడు రక్తనాళాలు పూడుకుపోతే బై పాస్ సర్జరీలు చేస్తారని ఇది రోగులకు ఖర్చుతో కూడున్నాడని అన్నారు.కొన్ని కొన్ని సందర్బాలాలో స్టంట్ కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయని ఎసర్జరీ అయినా పోస్ట్ అపెరేషణ్ కీలక మని అన్నారు. పోస్ట్ ఆపరేషన్ లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న చీము పట్టి ఇన్ఫెక్షన్ వస్తుందని దానికి మళ్ళీ స్టంట్ వేయడం ఖర్చుతో కూడుకున్న పనిగా పేర్కొన్నారు. అయితే గుండెలో రక్తనాళాలు పూడుకు పోతే స్టంట్ వేసుకోక ముందే యునాని వైద్యంలో శాస్త్గ్రచికిత్స లేకుండానే యునానిలో రక్తనాళాలలో వచ్చే బ్లాక్స్ ను కరిగించావచ్చని ఆమె భారోసఇచ్చారు. గుండె లో పూడిక ఉన్నా యునానిలో జోశాందా తీసుకుంటే ఎక్కడా బ్లాక్స్ ఇన్న కరిగిపోతాయని అన్నారు. జోశండా హార్ట్ కు చెందినదని హకీమ్ బుఖ్రాత్ సహాబ్ అలిసీనా 1౦37 ఏ డి లో వైద్యులు ఆధునిక వైద్యానికి ఇచ్చిన ఒక ప్రాచీన గ్రంధం నేటికి ఎన్సైక్లో పీడియా గా 6౦ సంవత్సరాలుగా అదే పుస్తకాన్ని వాడుతున్నారు. యునానీలో 66 రకాల మూలికలు హార్ట్ కోసం ఉన్నాయి అని డాక్టర్ సత్య  స్పష్టం చేసారు. అన్నిరకాల సమస్యలకు యునానిలో సమాగ్రచికిత్సలు ఉన్నాయని సత్య యునాని హెల్త్ సెంటర్ లో ఇచ్చే జోశాందా తో బ్లాక్స్,త్రంబోసిస్ కు కూడా చికిత్స చేయవచ్చు.గుండెలో చాలా సన్నని రక్త కణాలు ఉంటాయి బ్లాక్ అన్నది రక్త నాళం కాక మనశరీరంలో ఎక్కడైనా రక్త నాళాలు పూడుకు పోవచ్చు.లేదా మెదడులో సైతం రక్త నాళాలు పూడుకు పోవచ్చు.జోషాన్ దాతో  హార్ట్ బ్లాక్స్ కరిగించవచ్చు.మీరు చేయాల్సిందల్ల కేవలం జోషాన్ దా ప్యాక్లో ఉండే మూలికలను రాత్రి నన పెట్టి ఉదయం వేలాలో రెండు గ్లాసుల నీళ్ళలో మరిగించి గ్లాసుడు కషాయం తీసుకుంటే రక్తనాళాలు పూడికలు పోయి ఆరిగ్యంగా ఉంటారు.ప్రతిరోజూ ఒక 15 నిమిషాలు నడిస్తే గుండె సమస్యలు రావని అంటారు యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ సత్య. స్టంట్ కు ముందు ఒక్కసారి యునాని వాడండి స్టంట్ కు దూరంగా ఉందండి ఆరోగ్యంగా ఉంటూ మీ గుండెను ఆరోగ్యంగా  ఉంచుకోండి.        

తులసి ఆకులతో చర్మ వ్యాధులు పోతాయా...!

మన దేశంలో మొక్కలను దైవ సమానంగా పూజిస్తాం.పరమ పవిత్రమైనదిగా భావిస్తాం అలా పూజించే మొక్కలో తులసి ఒకటి.తులసి దేశంలో ఉన్న ప్రతి హిందువుల ఇళ్ళలో అత్యంత పవిత్రంగా స్త్రీలు  పూజిస్తారు. ఇక కార్తీక మాసం ఒచ్చింది అంటే తులసి మొక్కకు పూజ చేయని స్త్రీ అంటూ ఉండదు.ముఖ్యంగా ఏ ఇంటి కోడలైనా పెళ్ళైన స్త్రీ పవిత్ర స్నానం ఆచరించి ఉదయాన్నే తులసి కోట చ్గుట్టూ ప్రదక్షిణం చేయడం తులసమాకు దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.సంప్రదాయబద్దంగా మనతో జీవించే తులసిలో ఔషద గుణాలు ఎక్కువగా  ఉంటాయని  అంటారు యు నాని వైద్య నిపుణులు డాక్టర్ఎస్ జి వి సత్య. తులసి అసలు నామం అసియం పెంటం.అసియం లెన్ని స్టార్ ప్రస్తుతం మనం చూదేవి కేవలం 5 రకాల తులసి మొక్కలు అందుబాటులో ఉన్నాయి.తులసి చెట్టును ప్రతి ఇంటి ముందు లేదా పెరట్లో పెంచుతూ ఉంటారు.వేటిలో ఎక్కువ ఔషద విలువలు ఉన్నాయి అనడం లో ఏమాత్రం సందేహం లేదు. తులసి ఆధ్యాత్మికత... భక్తి కోణంలో చూసినప్పుడు తులసి తో పూజిస్తే మంచిఫలి తాలు వస్తాయని.అంటారు అందుకే పుణ్య క్షేత్రం లో తులసి తీర్ధం ఇస్తారు.పండితులు.  తులసిలో ఔషద గుణాలు ఉంటాయి కాబట్టి. ఇక రోగి ఆఖరి నిమిషం లో ఉన్నప్పుడు తులసి నీళ్ళు పోస్తే బతుకు తారు అంటారు.దీనికి కారణం మన గొంతులో ఉన్న శ్లేష్మం లేదా కప్ఫం నిరోదించే శక్తి ఉంటుంది కాబట్టి.అందుకే తులసి నీళ్ళు పోసినప్పుడు తిరిగి అనారోగ్యం నుండి కోలుకుని  లేస్తూ ఉంటారు.అని  ప్రచారం లో ఉంది.ఎన్నిరకాల జ్వరాలు ఉన్న 1౦ రకాల తులసి,పది రకాల గిలో కలిపి కషాయం చేస్తే డెంగు,మలేరియా,వైరస్ లు నివారిస్తుంది.జ్వరం అదుపులో ఉండాలంటే 99 ఉంటె జ్వరం తగ్గినట్టే.శరీరం తన బాడీని రిపేర్ చేసుకుంతుంది.జ్వరాన్ని తగ్గించడానికి యాంటి బాయిటిక్స్ ఇచ్చి తగ్గించాలి.1౦1 దేగ్రీల ఫారన్ హీట్ ,లేదా ఆపైన జ్వరం ఉన్న యునానిలో జ్వరం తగ్గించి,ఇన్ఫెక్షన్ తగ్గించడం ,ముఖ్యం జ్వరం కాదు అంటారు.యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ గి వి సత్య మనకు జ్వరం 99 ఆపైన తగ్గకుండా పెరుగుఉతూ ఉంటె.రక్త పరీక్ష చేసి చికిత్స తీసుకోవాలి అసలు జ్వరం ఇరకమైనది అన్నది తెలిస్తే సత్వరచికిత్స చేయవచ్చు.కొన్ని మామూలు జ్వరాలు,లోనని విషజ్వరాలు.కొన్ని వార్స్ వచ్చే జ్వరాలు  కాలానుగునంగా వచ్చే జ్వరాలు.ఇలా శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్న జ్వరం రావడం గ్యారంటీ.అయితే అలోపతిలో మాత్రమే యాంటి బాయిటిక్స్ ఇంతాయని సత్వరం పనివ్హేస్తాయని అనుకుంటారు. అది తప్పు యునానిలో యాంటీ బాయిటిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు యునానిలో మందులు ఉన్నాయి. సాధారణ జలుబు దగ్గు జ్వరం వచ్చిన ప్రత్యామ్నాయంగా యునాని పనిచేస్తుందని అంటున్నారు డాక్టర్ సత్య ఇక ఎక్కువ గా వేడి ఉన్నప్పుడు కాస్త శరీరానికి స్పంజింగ్ చేస్తే చాలు శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే మన పెద్దలు త్వరగా వేడి తగ్గాలంటే నుదుటి పైన తడిపిన గుడ్డను ఉంచడం ద్వారా వేడి ని తగ్గించవచ్చు. చేతి వాడిని వదిలి కాలి  వాడిని పట్టుకున్నట్లు రక రాకల పద్దతులు వెంటనే ఇంటర్వైన్ ఇంజక్షన్ ఇచ్చేస్తారు లేదాసేలైన్ గ్లూకోజ్ ఇస్తారు అలా చేస్తే తాత్కాలికం గా ఉపసమనం కలిగిస్తుంది శాశ్వత ఛికిత్స అవసరం అంటారు డాక్టర్ సత్య.ముఖ్యంగా ఎవరికైతే ఆక్సిజన్ తగ్గుతుందో వారి గదుల్లో తులసి మొక్కను పెంచితే మొక్క కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ ను అందిస్తుంది.ఇక చర్మ సమస్యలు ఉన్నవారు తులసి ఆకులు నూరి చర్మానికి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.ముఖ్యంగా క్యాన్సర్స్,పులిపిరులు పోవాలంటే ఆకులు తినాలి.తీర్ధం లో ఆహారంలో తులసి వేసుకోవాలి.అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి చెట్టునుండి నేరుగా వదద్దని అంటారు.నీళ్ళలో పాలాలో, ఆహారంలో అలంకరించి   తీసుకోవాలి.కవితకు కాదేది అనర్హం అన్నట్టు.వైద్యానికి ఏమొక్కకాదు  అనర్హం. 

గ్లోబల్ సోడియం బెంచ్ మార్క్...

ఎక్కువ శాతం సోడియం తీసుకుంటే హై బి పి కి దారి తీస్తుంది.డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరిక. సోడియం వాడకం గ్లోబల్ సోడియం బెంచ్ మార్క్ నిర్దేశించింది. డబ్ల్యూ హెచ్ ఓ సోడియం బెంచ్ మార్క్ పై తీసుకున్న నిర్ణ యాన్ని జోర్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ స్వాగతించింది.వివిధ రకాల ఆహారాలలో సోడియం వాడకం జాతీయ ఉప్పు నియంత్రణ కార్యక్రమాన్ని చెప్పటింది.సోడియం వాడకాన్ని ఆహార పరిశ్రమలో నియంత్రించేందుకు సోడియం బెంచ్ మార్క్ ను నిర్ణయించారు.సోడియం వాడకం ప్రత్యేక కేటగిరీ గా నిర్ణ యించారు. చాలా  దేశాలలో ముఖ్యంగా ప్రోస్ స్సెడ్ ఫుడ్ లో సోడియం ప్రధానంగా వాడతారు. ఆస్ట్రేలియాలో అక్కడి వాతావరణానికి అనుగుణంగా స్థానిక ఆహారం అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. ముఖ్యంగా నిల్వ ఉంచే ఆహారంలో సోడియం వాడకాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పబ్లిక్ హెల్త్ అడ్వకేసి విధానాల  ప్రభావం ఆరోగ్యవిధానం ప్రొఫెసర్ జాక్వే వెబ్స్టార్ జోర్జ్ ఇన్స్టిట్యూట్ దిరెక్టర్ డబ్ల్యూ హెచ్ ఓ సమన్వయ కేంద్రం జనాభా తగ్గింపు పై మాట్లాడుతూ ఇది చాలా కీలక మైన మలుపు గా పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వాడకం పై కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పస్టం చేశారు.మేము చేసిన పరిశోదన 9 4 దేశాలలో జాతీయ ఉప్పు నియంత్రణ వీధి విధానాలను అమలు చేస్తున్న వేళ్ళ మీద లెక్క పెట్ట వలసిన అవసరం పై డబ్ల్యూ హెచ్ ఓ చొరవ చూపింది.దీనివల్ల ప్రజా ఆరోగ్యం పై పడే  ప్రభావం తెలియ చేయడం తో పాటు ప్రజలు ఆరోగ్యవంత మైన అర్ధ వంత మైన ఆరోగ్యం అందించ వచ్చని డబ్ల్యూ హెచ్ ఓ భావిస్తుంది. బెంచ్ మార్క్ పై డబ్ల్యూ హెచ్ ఓ తో కలిసి పని చేసేందుకు వివిద దేశాల సభ్యులు ముందుకు రావాలని అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించడం ద్వారా ఆహార పరిశ్రమలో ఉప్పు శాతం తగ్గే విధంగా చర్యలు చేపట్ట వచ్చని పేర్కొన్నారు.జోర్జియా ఇన్స్టిట్యూట్ కు చెందిన డై టీషియన్ ఇమేలి రోస్ వార్నే మాట్లాడుతూ ఆయాదేశాలు గ్లోబల్ సోడియం బెంచ్ మార్క్ ను అనుసరించ వచ్చని ప్రభుత్వ సమయం వృధా కాకుండా ఆర్ధిక ప్రయత్నించాలని అన్నారు.డబ్ల్యూ హెచ్ ఓ బెంచ్ మార్క్ అందించేందుకు  కృత నిశ్చయం తో ఉన్నామని ఎక్కువ మోతాదులో సోడియం తీసుకుంటే హై బీపీ వల్ల మరణిస్తున్నారని అందుకే ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని డబ్ల్యూ హెచ్ ఓ సూచించింది.ఆస్ట్రేలియా ఆహారం లో ఉప్పు తగ్గింపు ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఉప్పు వాడకం శాతం నియంత్రించడం.ప్రాజెక్టు మూడు విడతలుగా నిర్వహిస్తారు. మొదటి విడత... మొదటి విడతలో ప్రాధమికస్థాయిలో సమగ్ర సమాచారం  సమస్యలను కనుగొనడం, అభివృద్ధి స్థాయిని కొలవడం  రెండవ విడతలో... రెండవ విడతలో స్థానిక సమగ్ర సమాచారం, ప్రపంచ విజ్ఞానం . వివిధ రకాల అవకాశాలు,, విఢీ విధానాలు ఉప్పు నియంత్రణ కార్యక్రమ నిర్వహణ వివిధ వర్గాల లేదా స్థానిక స్వచ్ఛంద సంస్థలు గ్రామాలలో ఉప్పు  నియంత్రణ పై అవగాహన కార్యక్రమం. అనుభందంగా పని చేసే భాగ స్వాముల సహకారంతో ఆంశాల వారీగా విచారణ, ఫెడరల్ వ్యవస్థలు, ప్రధాన జాతీయ పరిశ్రమలు శాస్త్రీయ పరిశోదనలు వీధి విధానాల అనువాదం పరిశ్రమలలో మార్పుకు చర్యలు. చివరిగా మూడవ విడత.... ప్రాధమిక స్థాయిలో నిర్వహించిన కార్క్రమాల సమీక్ష వాటి  ప్రభావం. వాటిని డాక్యుమెంట్లు విధి విధానాల రూప కల్పన పై స్పందన వివిద రకాల కార్య క్రమాల పై అనుసంధానం చేయడం ఉప్పువినియోగంలో 5 సంవత్సరాల కాలంలో మనం సాధించిన వృద్ధి..ప్రజల భాగ స్వామ్యం వాడకం. అందుకోసం ప్రభుత్వాలు తాము ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం . పనితీరును పరిశీలించడం, జాతీయ స్థాయిలో అమలు తో పాటు కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలి. స్తితి.... ప్రాధమిక స్థాయిలో వివరాల సేకరణ చేయాలి న్యూసౌత్ వేల్స్ ఆస్ట్రేలియా లో 2 0 1 1 మార్చి జూన్ మధ్యలో అప్రతిహతంగా సాగింది మూత్ర విసర్జనలో ఉప్పు శాతం పెరగడం రోజుకు తొమ్మిది గ్రాములు వ్యక్తులు 3 గ్రాములు రోజుకు తీసుకోవాలి ఆస్ట్రేలియన్లకు 29 % వాడకం చేయవచ్చని సూచించింది.

నేడు వరల్డ్‌ హార్ట్‌ డే

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హృద్రోగులందరూ తమ గుండె సమస్యలపై పూర్తిగా అవగాహన కల్పించడం వరల్డ్ హార్ట్ డే లక్ష్యం.గుండె పనితీరు దానినిర్వహరణ పై అవగాహన  వైద్య పరిభాషలో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధుల నివారణ పై అవగాహనకై ప్రతి ఏట సెప్టెంబర్ 29 న వరల్డ్ హార్ట్ డే ను నిర్వహిస్తున్నారు.ప్రతి ఏటా గుండె సంబందిత వ్యాధుల సమాస్యలు ఎదుర్కుంటున్న వారి సంఖ్య పెరుగు తోంది.ఈ నేపద్యంలో ఈ అంశం ప్రజలకు పూర్తిగా అవగాహన పెంచడం అవసరం. గతంలో 7౦ సంవత్సరాలు పై బడిన వారికి నాత్రమే గుండె సమాస్యలు వాస్తాయని భావించేవారు. అయితే ఇప్పుడు తక్కువ వయస్సు ఉన్న యువతీ యువకులకు గుండె సంబందిత సమస్యలు తీవ్ర తరం కావడం గమనిస్తున్నాము.గత రెండు మూడు సంవత్సరాలలో వారి జీవన శై లి లో మార్పులు  అనారోగ్య సమస్యలు మరోవైపు కోవిడ్ ప్యాన్డమిక్ మరింత తీవ్రంగా మారింది. తక్కువ వయస్సులోనే చాలామంది గుండె సంబందిత వ్యాధి బారిన పడుతున్నారు.దీనివల్ల ప్రజలు ఆరోగ్య సేవలు కోసం వెళ్లేందుకు భయందోళన కు గురి అవుతున్నారు.డబ్ల్యు హెచ్ ఓ సమాచారం ప్రకారం నాన్ కమ్యునికేబుల్ డిసీజేస్ వల్లే మరణిస్తున్నారు.ప్రపంచంలో అత్యంత ప్రమాదకరం నాన్ కమ్యు నికేబుల్ డిసీజ్ వల్ల  చనిపోయిన వారు 25%2౦25 నాటికి 2౦ 12 కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ పై దృష్టి పెట్టాలి.కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.సి వి డి ని సత్వరం గుర్తించడం,తొలగించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ నొక్కి చెప్పింది.డబ్ల్యు హెచ్ ఓ,డబ్ల్యు హెచ్ ఎఫ్ సంయుక్తంగా వరల్డ్ హార్ట్ డే 1999 లో ప్రారంభించింది.నాటి నుంచి నేటివరకు ప్రపంచవ్యాప్తంగా కోర్దియో వ్యాస్క్యులర్ డిసీజ్ తో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ. ప్రతి ఏటా సెప్టెంబర్ 29 న గుండె సంబందిత అం శాల పై అవగాహన కల్పిస్తారు.అయితే ప్రతి ఒక్కరు తమని తాము ఎలా రక్షించుకోవాలో,వ్యాధి రాకుండా ఉండాలంటే హానికర రసాయనాలు ఆహారనియ మాలు గుండె ఆరోగ్యం ఎలాఉందో పరీక్ష చేయించుకోవాలని.ఒకసారి సర్జరీ తరువాత లేదా స్టన్ టింగ్,లేదా బై పాస్,సర్జరీ,పేస్ మేకర్ లు వేయించుకున్న వారు తప్పని సరిగా మల్లి గుండె పని తీరు మార్పుల పై మీ కార్డియో సర్జన్ ను సంప్రదించాలి.కేవలం గుండె.రక్త ప్రసారంలో మార్పులు,లేదా ఆయాసం,నడవ లేకపోవడం వంటి సమస్యలు పూర్తిగా ప్రాధమిక స్థాయిలో గుర్తించడం వల్ల వ్యాధి లేదా సమాస్య మరింత తీవ్రంగా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.  

తాజా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ టెక్నాలజీ...

కొందరికి గుండు ఉంటేనే ఇష్టం ఇంకొందరికి జుట్టు ఉంటేనే ఇష్టం ఎవరి ఇష్టా ఇష్టాలు ఎలా ఉన్నా అసలు జుట్టు రాలిపోడానికి ప్రదాన కారణాలు ఏమిటి అన్న అంశాన్ని కనుక్కోవాలని శాస్త్రజ్ఞులు నిర్ణ యించారు. అయితే ఇప్పుడు కొందరికి బట్ట తల వరంగా మారిందని కొత్తాన్దాన్ని తెచ్చిందని,సెక్సీగా ఉంటారని.రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. జుట్టు ఊది పోయినందుకు తమకు బాధలేదని అంటున్నారు కొందరు. దీనికోసం మరిన్ని ప్రత్యామ్నాయాలు వెతకాలని బట్టతలకు ప్రాధమిక కారణాలు ఏమిటో గుర్తించలేదని ఆక్సిడెటివ్ టేస్ట్,సరిగా రక్తప్రసారం జరగక పోవడం పరిశోధకులు అందించిన వివరాల ప్రకారం ఆక్స్ నానో ప్రిలిమనరీ మైక్రో నీడిల్ ప్యాచ్ సీరియం నానో పార్టికల్ రెండు సమస్యల పై పోరాడుతుందని. జుట్టు పునరుత్పత్తి చేయవచ్చు.ఈ ప్రయోగాన్ని ఒక ఎలుకపై నిర్వహించారని తెలిపారు. సహజంగా బట్టతలకు ప్రధాన కారణం అలోఫెషియా పురుషులు ఇబ్బంది పడుతున్నారు. స్త్రీలలో వచ్చే బట్టతల జుట్టు రాలిపోవడం అది శాస్వతంగా ఉండిపోతుంది.ఆయా చుట్టూ పక్కల ప్రాంతలాలో రక్తకణాలు సరిగా ఉండకపోవడం లేదా రక్త ప్రసారం సరిగా లేక పోవడం సంభవిస్తుంది. ఫాలికల్స్ న్యుట్రియాంట్స్ విడుదల చేయడం.సీటో కిన్స్ ఇతర మాలిక్యుల్స్ ఇతర ఆక్సిజన్ అందక పోవడం సరిగా అందాక పోవడం వల్ల సెల్ల్స్ మరణిస్తాయి.దీనివల్లే కొత్తగా మొలవక పోవడానికి కారణాలుగా గుర్తించారు.గతంలో ఫ్యంగ్ హ్యువన్ లి జియాన్ క్వింగ్ జ్యంగ్వో అతని మిత్ర బృందం సీరం నానో పార్టికల్స్ ఉన్నాయని. మిమిక్ ఎంజాయం లలో అదనంగా ఉన్న ఆక్సిజన్ వల్ల వచ్చే ఒత్తిడి వల్ల లివర్ ఇంజురీ గాయాలు,అల్జీమర్స్ వ్యాధులకు కారణం అవుతోంది.ఏది ఏమైనా నానో పార్టికల్స్ చర్మం దాటి బయటికి పోవు.మినిమిల్లి ఇంవిజివ్ పద్దతిలో సీరం నానో పార్టికల్స్ ను రూపొందించే పనిలో పడ్డారు.సీరం నానో పార్టికల్స్ జుట్టు మొదళ్ళ నుండి  చర్మం లోపలికి పంపడం ద్వారా జుట్టును మరల మోలిపించవచ్చు.మొదటి దశలో పరిసోదకులు సీరం నానోపార్టికల్స్ బయో డి గ్రేయబుల్ పోలితిలిన్ గ్లైకో లైపిడ్ కాంపౌండ్ ను ఆతరువాత దిజాల్వే అయ్యే మైక్రో నీడిల్ ప్యాచ్ ప్రరాలురోనిక్ యాసిడ్ మా నవ చర్మానికి ప్రత్యామ్నాయంగా సీరం నానో పార్టికల్స్ ఒక మోల్డ్ గా తయారు చేస్తారు.పరిశోధకులు ప్యాచ్ ను సీరం కొంటైనింగ్ నానోపాట్టికల్ ను ఒక ఎలుకపై వేసినప్పుడుజుట్టు త్వరగా పెరగడాన్ని గమనించినట్లు చాలా తక్కువసమయంలో వాటిని అప్లయ్ చేయడం ద్వారా నానోపాటికల్ ను చర్మం లో చొప్పించడం అలోఫేషియా రోగులకు శుభావార్తగా చెప్పవచ్చు. ఈ పరిశోదనను జెజియాంగ్ ప్రావిన్స్ నేషనల్ కీ ఆర్ అండ్ డి ఆఫ్ చైనా నేషనల్ నే చ్యురల్ సైన్స్ ఫౌండేషన్ ఈ అంశం పై పరిశోదనలు కొనసాగిస్తున్నారు.కొత్త శాస్త్రీయ పద్దతితో జుట్టు పునరుత్పత్తి చేయవచ్చని శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం.  

చర్మ సమస్యలకు లైట్ థెరపీ...

చర్మ సమస్యలకు లైట్ తెరఫీ తో చికిత్స చేయవచ్చు మొదటిది న్యారో బ్యాండ్ ఆల్ట్రా వైలెట్ బి (ఎన్ బి యు వి బి) లైట్ మీకు లైట్ బాక్స్ లో లేదా బూత్ లో కూర్చుంటేచాలు.మీ డాక్టర్ లేజర్ ను అప్లయ్ చేస్తాడు. మరొకటి పి యు వి ఏ అని పిలుస్తారు.ఆల్ట్రా వైలెట్ యు వి ఏ లైట్ బూత్ ద్వారా సూర్య రస్మితో వైద్యం దీనినిసోరోలిన్ అని కూడా అంటారు.రెండురకాల చికిత్సలు 7౦ % ప్రభావ వంతంగా పని చేస్తాయి.చర్మానికి రంగును తిరిగి తెస్తాయి.కాని పి యు విఏ చర్మం క్యాన్సర్ ను తగ్గిస్తుంది. సోరియాసిస్... puva theraphi... లైట్ తెరఫీ ద్వారా ఫ్లాగ్ కు చికిత్స చేయ వచ్చు.గోళ్ళు,స్కాల్ప్ సోరియాసిస్ ఎన్ బి యు వి బి లైట్ బాక్స్ ఇతర లట్లు సోర్స్ లేజర్ సహాయ పడుతుంది.చర్మం పై ఇతరకనాలు పెరగ కుండా కాపాడుతుంది.మీ రోగనిరోదక శక్తి నిశ్చలంగా ఉంచుతుంది.అది మరింత తీవ్రతరం కాకుండా కాపాడుతుంది.ఇంఫ్లామేషణ్ దుఎఅద ఉంటుంది.డాక్టర్స్ సోరియాసిస్ కు పి యు వి ఏ లైట్ తెరఫి ద్వారా చికిత్స చేస్తారు.సోరోలిన్ అనే ను వాడడం యు వి ఏ లైట్ చికిత్స  కు ముందు స్నానం చేయాలా వద్ద అన్న సందేహలకు నిపుణులు సలహాలు తెలియచేస్తారు. scalodarma స్కేలో డేర్మా... ఎప్పుదతే చర్మం పెళుసుగా మారుతుందో మీ డాక్టర్స్ మీకు యు వి ఏ 1 ఫోటో తెరఫీ చేస్తారు. ఈ రకమైన లైట్ చర్మం లోపల కంటూ చేరి ఆయా ప్రాంతాలలో కాస్త ఒడులుగా తయారు చేస్తుంది దురదను తగ్గిస్తుంది.లైట్ చికిత్స ద్వారా ఐ పి ఎల్ ప్రభావం తక్కువగా ఉండడం తో డార్క్ రంగులో చర్మం పై ఉండే ప్యాచ్ ను తగ్గించేందుకు సహాయ పడుతుంది.లైట్  ట్రీట్మెంట్ ను ఇంటెన్స్ పల్సడ్ లైట్ ఐ పి ఎల్ డార్క్ స్కిన్ ప్యాచ్ లకు సహాయ పడుతుంది. sad... అయాకాలాలో ప్రభావ వంతమైన డిజాస్టర్ ఒత్తిడికి గురి అవుతారు.అలాగే ప్రతి సంవత్సరం సహజంగానే తక్కువ వెలుతురు ఉంటుంది.లక్షనాలాను బట్టి తెల్ల దిసన్ ల్యంఫ్ ను వాడవచ్చు.ఈ లైట్ ద్వారా మెలటోనిన్ ను పెంచేందుకు దోహదం చేస్తుంది.మనలో ఉండే హార్మోన్లు మనం నిద్రపోవడానికి మూడ్ లో ఉండడానికి సన్ ల్యంప్ ఒక ప్రిస్కేప్షణ్.సన్ ల్యంప్ ను డాక్టర్స్ టిపికల్ గా రికమండ్ చేయడం గమనించవచ్చు.ప్రతి రోజు 3౦ నిమిషాలు లైట్ ముందు ఉండాలి. depression... ఒత్తిడి బ్రైట్ లైట్ తెరఫి నాన్ సీజన్ లో వచ్చే ఒత్తిడి కి చికిత్స చేస్తారు.డాక్టర్లు ట్రీట్ మెంట్ తో పాటు కొంత మెడిటేషన్ అవసరం.లైట్ బాక్స్ కు ముందు 3౦ నిమిషాలు ప్రతి రోజూ ఉండాలి. acneమొటిమలు... యుక్త వయస్సులో ఉండే స్త్రీపురుషు లను వేదించే ముఖ్యమైన సమస్య మొటిమలు.ఇవి చూడడానికి ముఖం పై అందవికారంగా కనిపిస్తాయి.లేజర్ చికిత్స ద్వారా దర్మటా లజిస్ట్లు చికిత్స చేస్తారు.ఇందుకోసం వారు బ్లూ లేదా ఎరుపు రంగు లైట్ ను బ్యాక్టీరియా ను చంపేందుకు వాడతారు.అలాగే మొటిమల చికిత్సకు వినియోగిస్తారు.లేదా ఇమ్పల్సడ్ లైట్ సహకారం తో జీవం కోల్పోయిన చర్మాన్ని ముఖం పై ఉన్న జిడ్డు ను తొలగిస్తారు.బ్లాక్ హెడ్స్ ఉన్న వారికి లైట్ తెరఫి అందరికీ పనికి రాదు.ఇందు కోసం తక్కువ శక్తి కలిగిన ఎరుపు కలిగిన బ్లూ రంగు ఉన్న లేజర్ లైట్ ను  ఇళ్ళలో వాడాలి. pain నొప్పి... ఎర్ర లైట్ తో చేసే తెరఫి చాలా తక్కువ ప్రభావం ఉంటుంది.మస్క్యులో స్కాలటేల్ డి జార్దర్ ఉన్నవారు.ఈ లైట్ వెన్నెముక నొప్పి కి ఇతర నొప్పులకు ఆస్టియో ఆర్తరైటిస్,రోమటైడ్ ఆర్తరైటిస్ కర్పాల్ సిండ్రోం వంటి సమస్యల వల్ల  నొప్పి నిద్రలేమి సమస్యలు---sleep disorders---  ఒక లైట్ బాక్స్ మీ నిద్ర లేమి సమస్యను సరి చేస్తుంది.ఎప్పుడు మేలుకువరావాడం.లో క్రమపద్దతిలో  పని చేస్తుంది.యు వి లైట్ ఏ మాత్రం ప్రమాదం లేదని అది బయటికి కనపడకుండా డి వైజ్ ను వినియోగించవచ్చు.లైట్ ముందు ఎంతసేపు కూర్చోవాలన్న విషయాన్ని డాక్టర్లు నిర్దారిస్తారని తెలిపారు. demnitiya-డి మ్నీషియా... ఒక పరిశోదనలో తెలిసిన అంశం ఏమిటి అంటే సహజంగా చమట వేడిమి లాగానే వారు ఒకవేళ రూముల్లో ఉండే వారికి దిమ్ని షియా వారికి సహకరిస్తుంది ఏ రకమైన ఒత్తిడి ఉండదు.దీనివల్ల మరిన్ని ఎక్కువ గంటలు పని చేయగలరు.లైట్ తెరఫి వాళ్ళ డిప్రెషన్ నుండి దిమ్నీషియ తగ్గించుకోవచ్చు mylosis fungoidesi---- .దీనిని టిసేల్ లింఫోమా అంటారు.దీనివల్ల దద్దుర్లు వస్తాయి.అది మీకు సంక్రమణ దానిని బట్టి అది ఏ స్టేజి లోఉందో అది ఎలా ఉందొ మైకోసిస్ ఫన్గోడిన్ దానీ న్యారో బ్యాండ్ ద్వారా యాంటి యు వి బి,పి యు వి ఏ,ఫోటో గ్రాఫి చికిత్స వల్ల 6౦%నుండి 9౦% ప్రభావ వంతంగా పని చేస్తుంది.క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. mordenamarfiyaa----- మొర్దేనా మార్ఫియా ---- మార్ఫియా అన్నది ఒక చర్మ సంబంధమైన స్థితి.ఎర్రగా,తెల్లగా ఉంటుంది.లేదా చాలా గట్టిగా నొప్పి లేకుండా ఉంటుంది. మీ చర్మం పై ప్యాచెస్ ఉంటాయి.అది తీవ్రమతే మీ శరీరం అంతా వ్యాపిస్తుంది.దీనికోసం అల్ట్రా వైలెట్ లైట్ ను సూచించ వచ్చు. cgvhd---cutaneous-graft--vgrsushost disease---- మీ శరీరంలో ఈ రకమైన స్థితి మీ శరీరంలో ట్రాన్స్ ప్లాంట్ చేసిన కణాల వాళ్ళ వస్తుంది.బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ లైట్ తెరఫి సహజంగా మొదట ఇస్తారు.దీనిపై చేసిన పరిశోదనలు పి యు వి ఏ, యు విబి సహకరిస్తుంది. సి గి విహెచ్ డి మీశారీరం పై దాడి చేసినప్పుడు పి యు వి ఏ,యు వి ఏ,యు వి ఏ డి ద్వారా నిరాకరించేందుకు సహకరిస్తుంది.

ఆస్ సిండ్రోమ్‌కు చికిత్స లేదు...

ఆస్ సిండ్రోమ్ ఒక అరుదైన ఇడొ పతిక్ గా పేర్కొన్నారు.దీనికి గల కారణాలు ఏమిటి అన్నది పూర్తిగా తెలియ రాలేదు. ఇది వారసత్వంగా వచ్చే డిజార్డర్ అది పుట్టిన వెంటనే గుర్తించాలి.దీని ప్రాధమిక ;ఆక్షణం రక్త హీనత.బోన్ మారో లో ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు వృద్ధి పొందుతాయి.అవి ఇల్లస్ట్రేటెడ్ అస్ సిండ్రోమ్ ని అనీమియా త్రిఫల్ అంగెల్  తంబ్స్  లేదా ఆసే స్మిత్ సిండ్రోమ్ గా పిలుస్తారు. దీనిలక్షనాలు.... ఆస్ సిండ్రోమ్ లక్షణాన్ని బట్టి అనీమియా రక్తహీనత,గుండెలో లోపాలు,వ్యక్తి పెరుగుదల ఆలస్యంకావడం ఫోన్ టేల్లెస్ మూసుకు పోవడం. ఇరుకు భుజాలు.క్లెఫ్ట్ పాలెట్,చెవులు సరిగా వ్రుదికాక పోవడం లేదా లోపాలు కలిగి ఉండడం. కనురెప్పలు వాలిపోవడం,వంటి లక్షణాలు ఉంటె వారికి అస్ సిండ్రోమ్ గాచేప్పవచ్చు.వారి జాయింట్స్ ను పెంచలేము.వారిలో కొంత మందికి ట్రిపుల్ జాయింట్ తంబ్  ఉండవచ్చు.కొందరిలో చిన్న చిన్న  క్నుకల్స్వెవేలి  జాయింట్స్ పై చర్మం చారలు కలిగి ఉంటారు. చికిత్స ... దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఆస్ సిండ్రోమ్ కు లేదు.దీనికి బోన్ మ్యారో చికిత్స లేదా ట్రాన్స్ప్ ప్లాంట్,లేదా రక్త మార్పిడి లేదా కార్టికస్టరోయిడ్స్ తో చికిత్స చేస్తారు.నిర్ధారణ--- ఆస్ సిండ్రోమ్ నిర్ధారణకు సి బి సి పూర్తి రక్త పరీక్ష,ఎకో కార్డియోగ్రం ,ఎక్స్ రే,బోన్ మ్యారో బయాప్సివంటి పరీక్షలు  చేసి నిర్ధారిస్తారు.

ఆర్స్ కాంగ్ సిండ్రోమ్...

వివరణ --- ఆర్స్ కాంగ్ సిండ్రోమ్ చాలా అరుదుగా వచ్చే సమస్య  ఎక్స్ క్రో మోజోం లోపం  తో  అనుసంధానం,కలిగి ఉండడం.  ఒక జన్యు పరమైన  డిజా ర్డర్ గా పేర్కొన్నారు.స్త్రీలు  మాత్రమే  ఆర్స్కాంగ్  సిండ్రోమ్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి పురుషులలో ను తీవ్రంగా ఉంటుంది.ఆర్స్కాంగ్ గ్ సిండ్రోమ్ కు కారణం జన్యు లో వచ్చే మార్పులు దీనిని fgdy1 xక్రోమోజోమ్స్ తక్కువ గా ఉండడంకారణమని తెలుస్తోంది. దీనిలక్షణా లు ఎలా గుర్తించాలి... ఆర్స్ కాంగ్  సిండ్రోమ్ లక్షణాలలో మొదటిది ముఖం గుండ్రంగా ఉండడం. విధవ రాళ్ల కు హెయిర్ లైన్ ,పెద్దగా విశాలంగా ఉండే కళ్ళు,వాలిపోయిన కనురెప్పలు,చిన్నముక్కు ముక్కు రంద్రాలు చిట్లి పోవడం,పళ్ళలో పగుళ్ళు.కొంచం కుంచించుకు పోయి నట్లుగా ఉండే చాతి,చిన్న పిల్లలలో యుక్త వయస్సు ఆలస్యంగా రావడం.ఇన్జునియల్ హెర్నియా,మానసిక లోపం. వారి చెవి భాగం ఒంగి ఉండడం.అరచేతులు క్ట్రీస్ ఉండడం.ఐదవ వేలు వంపులు వంపులు గా ఉండడం.పై పెదవి పైన విశాల మైన గాడి క్రింది పెదవి క్రీస్ ఉన్నట్లుగా ఉంటుంది.ఆధునికంగా మానసిక లోపం .వారి చేవ్వి పై భాగం కొంచం ఒంగి ఉండడం.కనిపిస్తుంది. ఈ సమస్యకు చికిత్స... అయితే  ఆర్స్ కాంగ్ కోసం ఇదే చికిత్స,ఉందా లేదా ఆర్తో డాన్ టిక్నిపుణులు  చికిత్సఒక్కటే మార్గమా.  ,లేదా మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ చేస్తారా,సాధారణ సర్జన్లు లేదా పాలెట్ క్లిఫ్ట్ చేసే నిపుణులు సర్జరీ  చేస్తున్నారా అన్న అంశాన్ని పూ ర్తిగా తెలుసు కోవాలి నిపుణులతో క్షుణ్ణంగా చర్చించాకే సిద్ధం కావాలి.  పైన పేర్కొన్న నిపుణులు మాత్రమే ముక్కు   ద్వార ములో ఉన్న లోపాలను సరిచేసి చికిత్స చేస్తారు. .  .ఆర్స్ కాంగ్ సమస్య వల్ల హార్మోన్ సమస్యలకు చికిత్స చేస్తారు అయితే అర్స్ కాంగ్ సమస్య తో బాధ పడే వారు బరువు పెరగడం వంటి సమస్యకు చికిత్స తీసుకోవాలి ఆర్స్ కాంగ్ సిండ్రోమ్  సమస్యను ఇంకా పరిశీలనలు చేస్తూనే ఉన్నారు. వ్యాధి నిర్ధారణ... అర్స్ కాంగ్ వ్యాధి నిర్దా రణ కు ఎక్స్ రే,జెనిటిక్ టేస్ట్లు వినియోగిస్తారు.  

శ్వాసని పరీక్షిస్తే షుగర్ తెలిసిపోతుంది

50 ఏళ్ల నాగలక్ష్మిగారికి తనకి షుగర్‌ ఉందేమో అని అనుమానం. తను తరచూ వినే షుగర్‌ వ్యాధి లక్షణాలన్నీ తనలో కనిపించడమే ఆ భయానికి కారణం. అలాగని షుగర్‌ పరీక్ష చేయించుకుందామా అంటే ఆమె రక్తమంటే చచ్చేంత భయం. ఒకసారి ఎలాగొలా షుగర్ పరీక్ష చేయించుకున్నా, అది ఉందని తేలితే నెలనెలా చారెడు రక్తం పరీక్షల కోసం ధారపోయాల్సిందే కదా!   ఇది కేవలం ఒక్క నాగలక్ష్మిగారి బాధే కాదు. మన దేశంలో చాలామంది తమకు షుగర్‌ ఉందన్న అనుమానం ఉన్నా కూడా, పరీక్షలు చేయించుకోకుండా అశ్రద్ధ వహించడానికి ముఖ్య కారణం ఈ రక్త పరీక్షలే! కానీ అలాంటివారికి ఓ శుభవార్త వచ్చేసింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఇప్పుడు శ్వాస ఆధారంగా షుగర్ పరీక్ష చేసే యంత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.   ఇప్పుడు ప్రతి రోడ్డు మీదా ఎర్రలైటు పడినప్పుడు ‘బ్రీత్‌ ఎనలైజర్లు’ పట్టుకొని పోలీసులు పరీక్షలు నిర్వహించడం చూస్తున్నాం. రక్తంలో కలిసిన ఆల్కహాల్‌ శాతాన్ని తెలుసుకోవడం తేలిక కనుక ఈ ప్రక్రియ చాలా సులభంగా సాగిపోతోంది. కానీ డయాబెటిస్‌ అలా కాదు. మన తీసుకునే ఆహారం, నీరు వంటి చాలా పదార్థాల వల్ల, కేవలం శ్వాస ద్వారానే డయాబెటిస్‌ ఉందా లేదా అన్నది తెలుసుకోవడం కష్టం. అందుకోసం శాస్త్రవేత్తలు ఒక ఉపాయాన్ని ఆలోచించారు.     డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో జీవక్రియ (మెటాబాలిజం) చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. దీని వలన ఎసిటోన్‌ అనే తరహా రసాయనం అధికమొత్తంలో రక్తంలో పేరుకుపోతూ ఉంటుంది. శ్వాస ద్వారా ఈ ఎసిటోన్ నిల్వలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు పరిశోధకులు. అలా తీసుకున్న ఎసిటోన్‌ను ఇన్‌ఫ్రారెడ్‌ లేజర్ కిరణాలతో పరీక్షించి షుగర్‌ నిల్వల స్థాయిని గ్రహించే ప్రయత్నం చేశారు. ఈ తతంగం అంతా పూర్తి చేసేలా ఒక యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రం ద్వారా వివిధ వ్యక్తుల శ్వాసని పరీక్షించినప్పుడు, వారి షుగర్‌ నిల్వలను దాదాపు ఖచ్చితంగా తెలిశాయి.   శ్వాస ద్వారా షుగరు నిల్వలను తెలుసుకోవడం అనేది భారతీయులకు నిజంగా శుభవార్తే! ఎందుకంటే భారతీయులలో దాదాపు ఆరుకోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. జన్యుపరంగా డయాబెటిస్‌ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉండటం, మన జీవనశైలి మరీ యాంత్రికంగా మారిపోవడం, బియ్యం వంటి చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం మీద ఆధారపడటం వంటి కారణాల వల్ల మన భారతీయులలో డయాబెటిస్ ముప్పు ఎక్కువ. నిజంగానే శ్వాస ద్వారా షుగర్‌ వ్యాధిని తెలుసుకునే పరికరం అందుబాటులోకి వస్తే అశ్రద్ధ చేయకుండా, ఎప్పటికప్పుడు తగిన చికిత్స తీసుకునేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.   ఒకవేళ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు రూపొందిస్తున్న ఈ యంత్రం సఫలం కాకపోయిన భయం లేదు. ఎందుకంటే కేంబ్రిడ్జికి చెందిన కొందరు పరిశోధకులు ‘ఇసోప్రిన్‌’ అనే మరో రకం రసాయనంతో శ్వాసతో షుగర్‌ని కొలిచే యంత్రాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒక దశాబ్దంలోగా శ్వాసతో షుగర్‌ పరీక్ష అనే కల నిజం కావచ్చు. అప్పుడు నాగలక్ష్మిగారే కాదు ప్రతి ఒక్కరూ షుగర్‌ పరీక్ష చేయించుకునేందుకు ముందుకు వస్తారు. ప్రభుత్వమే సామూహికంగా ఉచితంగా షుగర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశమూ ఉంటుంది. - నిర్జర.

బలమైన దెబ్బ తగిలితే స్పృహ కోల్పోతారా?

అథ్లెట్లకు బల మైన దెబ్బతగిలితే స్పృహ తప్పుతారా అన్నప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. అథ్లెట్లు ముఖ్యంగా క్రీడాకారులు  ఎవరికైనా  తల పై దెబ్బ లేదా ప్రమాదం జరిగితే స్పృహ కోల్పోతార ని అంటున్నారు మిపుణులు. బలమైన దెబ్బకు మెదడు మధ్య భాగం లో అదీ డ్యామేజి జరిగిందని అనుమానం వ్యక్తం చేసారు. ఆత్లేట్లతో పోల్చి చూసినప్పుడు ఓక పరిశోదనలో న్యురాల జీ లో  ఒక బల మైన దెబ్బ కొన్కుసన్ చరిత్ర ఉందన్న విషయాన్ని గుర్తించారు.అమెరికన్ అకాడమి న్యురా లజి మెడికల్ జర్నల్ లో ప్రచురించారు.ముఖ్యంగా ఫుడ్ బాల్ వోల్లీ బాల్ ఆడే క్రీడాకారులలో ఆటగాళ్ళలో సాకర్ లో పాల్గొనే క్రీడాకారులు ఈ సమస్యను గుర్తించి నట్లు తెలిపారు. మెదడు పై బలమైన దెబ్బలు తగలడం వల్ల కొన్కుస్సిఒన్ వల్ల దీర్ఘ కాలం పాటు మెదడు పై ప్రభావం చూపుతాయి. ఒక్కో సారి వారు పోటిలో పాల్గొనేందుకు డాక్టర్స్ క్లియరెన్స్ తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపులు  పేర్కొన్నారు. ఈ అంశం పై పరిశోదన చేస్తున్న టొరంటో కెనడా సెంట్ మైకేల్ ఆసుపత్రి కి చెందిన రచయిత స్చ్వెఇజెర్ పి హెచ్ డి చేసారు. తరాచుగా వచ్చే కొన్కుస్సిఒన్ బల్లమైన దెబ్బ వల్ల స్ప్రుహకోల్పోవడం వంటి సమస్య.ముఖ్యంగా యువకులను వేదిస్తుందని, గుర్తించారు.ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ లోనూ ఈ సమస్య ను గుర్తించి నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ సమస్యనుండి బయట  పడేందుకు పెద్ద ఎక్కువ సమయం పట్టదని బాల మైనదెబ్బ తగిలితే స్పృహ తప్పిపోవడం వంటి చరిత్ర ఉన్న అత్లేట్లలో సబ్టెల్ క్రానిక్ చెంజేస్ వారి మెదడు మాధ్య భాగం లో రక్త ప్రవాహం తదితర అంశాలను పరిశీలించారు.. ముఖ్యంగా అత్లేట్లకు బలమైన గాయాలు అయితే స్పృహ తప్పిపోతారు అని నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా వాలీబాల్. ఫుట్ బాల్ వంటి క్రీదాలాలో సహజంగా హెడ్డర్ ద్వారా గోల్స్ చేయడం క్రీదాలో ఒక భాగం ఆసమయం లోనే శరీరానికి ముఖ్యంగా మెదడుకు  బలమైన దెబ్బలు తగులు తూ ఉంటాయి ముఖ్యంగా బయట పడగలిగినప్పటికీ దీర్ఘాకాలాం లో క్రీదాలో పాల్గొనాలంటే డాక్టర్ల క్లియరెన్స్ తప్పనిసరి చెయడం తోక్రీడా జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది అనడం లో సందేహం లేదు.