గుండె జబ్బు వచ్చిందో గుటుక్కేనా..!

నేడు ప్రపంచంలో మారిన జీవన శైలి.ఆహారపు అలవాట్లు,ముఖ్యంగా  మానసిక ఒత్తిడి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.దెబ్బకు  స్త్రీ,అయినా ,పురుషులైనా ప్రాణాలను గుటుక్కు మనిపించే ప్రాణాంతక జబ్బులలో గుండె జబ్బు ఒకటి.హార్ట్ అట్టాక్ రావడానికి కారణం ముఖ్యంగా మనం జీవించే విధానం ప్రధాన కారణం గా పేర్కొంటున్నారు నిపుణులు. లేదా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం గా పేర్కొన్నారు. జీవన విధానాన్ని మార్చుకోడం ద్వారా గుండె పోటు వచ్చే అవకాశాన్ని 7౦ % దాకా తగ్గించ వచ్చనేది నిపుణుల అభిప్రాయం. అలవాట్లు మార్చుకోవడం ద్వారా గుండె పోటు రాకుండా మీరు ఎంత వరకూ సఫలం కాగలరో చూద్దాం. గుండె పోటు తగ్గడానికి ఏం చెయ్యాలి,గుండెపోటు తగ్గడానికి ఉన్న అవకాశాలు చూద్దాం. ఏం చెయ్యాలి... గుండెపోటు తగ్గే అవకాశాలు... పొగ తాగడం మానాలి... పొగ తాగుతున్న వాళ్ళ కంటే పొగతాగడం మానేసి 5 సంవత్సరాలు అయిన వాళ్ళకు 5౦-నుండి 7౦% దాకా హార్ట్ అట్టాక్ రిస్కు తగ్గుతుంది. ఎక్సర్ సైజులు చేయడం...  ఏ ఎక్సర్ సైజులూ చేయని వాళ్ళకంటే రెగ్యులర్ గా ఎక్సర్ సైజు లు చేసే వాళ్ళకు హార్ట్ అట్టాక్ రిస్క్ 45%  ఉండవచ్చు. శరీరానికి తగ్గ బరువు మెయిన్... ఎత్తుకు తగ్గ బరువు వున్నా వాళ్ళు ఉండాల్సిన మీద 2౦ % టైన్ చేయాలి ఎక్కువ బరువున్న వాళ్ళకంటే 35% నుంచి 55%తక్కువ రిస్క్ కలిగి ఉంటారు. రోజుకో యస్ప్రిన్ తీసుకోవడం... ఆస్ప్రిన్ తీసుకొని వాళ్ళ కంటే రోజుకో ఆస్ప్రిన్ ని తీసుకునే వాళ్ళు 35%రిస్క్ ఉంటుంది. హై బిపి కి చికిత్స తీసుకునే వాళ్ళు--- డయాస్టాలిక్ ప్రెషర్ ని తగ్గించుకున్న ప్రతిసారీ వీళ్ళు హార్ట్ అట్టాక్ రిస్క్ ను  2 -3 % తగ్గించుకున్నవాళ్ళు అవుతారు. డయాబెటిస్ఎక్కువగా ఉన్నవాళ్లు... డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళ కంటే చక్కెర శాతం ఎక్కువగా ఉండే వాళ్ళకు  గుండె పోటు  అవకాశాలు  బాగా తక్కువ.   ఒచ్చే సంచికలో గుండె నొప్పి రకాలు శాస్త్ర చికిత్సలు తడి తర ఆంశాల పై పూర్తి వ్యాసం ప్రచురిస్తాం.

ఇన్ఫెక్షన్లు శరీరానికి హానికరం...

శరీరానికి అపకారాన్ని కలగ జేసే సూక్ష్మ క్రిములు మనశారీరంలోకి ప్రవే సించి నప్పుడు. వచ్చే క్రిములను పతోజేన్స్ అంటారు.వీటి ప్రవేశం తో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. పాతోజెన్స్ లో ఈ క్రింది రకాలు ఉంటాయి. బాక్టీరియా వైరస్ లు  ప్రోటోజోవా  రికెట్సి యే   ఫంగి  పురుగులు. ఇలాంటి రకరకాల క్రిములు కూడా ఒక మనిషి నుంచి మరొక మనిషికి అనేక మార్గాల ద్వారా సోకు తూ ఉంటాయి. 1) ఒక వ్యక్తి దగ్గినప్పుడు.గాలి లోకి వ్యాపించే తుంపర అవతలి వ్యక్తి పీల్చడం ద్వారా వేరొకరికి  సోకుతుంది. 2)కొన్ని రకాల క్రిములు ముద్దు ద్వారా,సంభోగం ద్వారా,ఒకరినుంచి మరొకరికి సోకుతుంది. 3)దోమల ద్వారా ప్రోటోజోవా రకానికి చెందిన ప్లాస్మోడియం అనబడే మలేరియా క్రిములు ఒకరి  నుండి మరొకరికి వ్యాప్తి చెందు తాయి. 4)పక్షుల ద్వారా, చిలకల ద్వారా ప్సిట్టకాసిస్ అణా బడే బ్యాక్టీరియా సోకుతుంది. 5)కలుషితమైన ఆహారం,నీరు,మట్టిలో కొన్ని విష క్రిములు.ఇవి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేసిస్తాయి. 6)కొన్ని విష క్రిములు తల్లి ద్వారా, గర్భదారణ సమయంలో ప్రసవ సమయంలో ను బిడ్డకు  సోకు తాయి. క్రిములు ఎలా ఎప్పుడు పోడుగుతాయి.... 1)మనకు అపకారాన్ని కలగ జేసే విష క్రిములు ఒక సారి శరీరంలోకి ప్రవేశించాక అవి తమ ఉత్పత్తిని  వృద్ధి చేసుకుంటూ పోతాయి.అవి మన శరీరం పై ప్రభావాన్ని చూపుతూ తమ లక్షణాలను ప్రదేసించడానికి  కొంత సమయం పడు తుంది.  2)క్రిములు శరీరం లోకి ప్రవేశించి లక్షణాల్ని ప్రదర్సుంచే దాకా ఉండే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే పొడగాబడే కాలం అని అంటారు. 3)ఇంక్యు బేషన్ కాలం అనేది కలరా లాంటి వ్యాధికి కొన్ని గంటల సమయమే పడితే  కాలేయం మీద ప్రభావాన్ని చూపడానికి 5 నెలల సమయం పడుతుంది.ఈ వ్యాధిని హేపటైటిస్ వ్యాధి అని అంటారు. 4)ఒక వ్యక్తికి అంటూ వ్యాధి వచ్చినప్పుడు అతని శరీరం ఆ ఇన్ఫెక్షన్ మీద పోరాడడానికి కొన్ని యాంటీ బాడీస్ కావాలి వాటి అభివృధి చేసుకుంటుంది. 5)ఆ వ్యాధి తగ్గిన తరువాత కూడా యాంటి బాడీస్ అతని శరీరంలో నిలవ ఉండి మళ్ళీ అలంటి క్రిములు సోకి నప్పుడు దానిని నివారించ గలిగే స్థితిలో ఉండి ఆ క్రిమికి సంబందించినంత మేర అతడిలో సహజసిద్ధ నిరోధక శక్తిని ఏర్పరుస్తాయి. 6)శరీరంలో వివిధ రకాల రోగాలతో పోరాడే యాంటీ బాడీస్ తాయారు అయ్యేటట్లు టీకాలు అంటే వ్యాక్సిన్ల ద్వారా శరీరానికి కృత్రిమంగా ప్రేరే పిస్తారు డాక్టర్లు. అసలు వ్యాక్సిన్ లోని సూత్రం ఏమిటి?... 1)ఫలానా వ్యాధి కి సంబందించిన పదార్ధాన్ని తగిన మోతాదు లో వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశ పెట్టినప్పుడు. వ్యాధి ఏర్పడ కుండానే  ఆ వ్యాధితో పోరాడ గలిగే యంటి బాడీస్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి.ఇక అప్పటినుంచి ఆ వ్యక్తిని ఆ వ్యాదిక్రిములు ఏమీ చేయలేవు. 2)అంటే అతడి శరీరం అప్పటి నుంచి ఆ వ్యాధి క్రిములను నివారించాగలిగే స్థితికి చేరుకుంతుంది అంటే మరో మాట చెప్పాలంటే అతడికి వ్యాధి రాదని ఆర్ధం. 3)అంటే అన్నిరకాల ఇన్ఫెక్షన్ లకు వ్యాక్సిన్ ఇంకారాలేదు.కాని ఇప్పటికీ లభ్యమౌతున్న వ్యాక్సిన్స్ తో మనం కొన్ని భయంకర మైన వ్యాధులను నివారించుకో గలిగాం అయితే కోవిడ్ లాంటి మహమ్మారికి ఇంకా పూర్తిగా పరిశోదన చేస్తేగాని మరిన్ని వ్యాక్సిన్లు మందులు వస్తే తప్ప కోరోనాపై పూర్తిగా అదుపు చేయలేము. అందుకే ప్రపంచం యావత్తు మహమ్మారి పై యుద్ధం చేసేందుకు ఎవరికీ ఉన్న పరిజ్ఞానం మేరకు వారి వారి స్థాయిని  బట్టి  ఇంకా పరిశోదనలు చేస్తూనే ఉన్నారు. మానవుడు ఆశాజీవి వివిధ రూపాలలో మారుతున్న కోరోనా  వైరస్ ను కనుక్కో వాలంటే వైద్యులు ఎన్ని ఏళ్ళు తపస్సు చేయాలో  కాలమే సమాధానం చెప్పాలి. ప్రాకృతికంగా సహజ సిద్ధమైన ఔషదాలు,ఆధునిక చికిత్సలు అవసరమైన మేర ఉన్నప్పటికీ పూర్తిగా వైరస్ పోయే వరకు విస్రమించాల్సిందే. గతంలో వచ్చిన వైరస్ లను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఎలా ఉపయోగ పడిందో అలాగే  వైరస్ పై పోరాడాలంటే వ్యాక్సిన్ తోనే సాధ్యమని నిరూపించారు. వ్యాక్సిన్ వేసుకోండివైరస్ ను తప్పించు కొండి.వ్యాధి పై పోరాడండి.

5000 సంవత్సరాల కాలం నాటి బ్యాక్టీరియా ఇంకా బతికే ఉంది

5౦౦౦ సంవత్సరాల కాలం నాదు ప్రాణాలను కబళించిన ప్లేగు వ్యాధికి సంబందించిన బ్యాక్టీరియా మనిషిలో ఇంకా బతికే ఉందని తెలిపారు.బ్రిటన్ లోని బి జి ఎ ఇ యు డామ్నిక్ గోద్నార్ చనిపోయిన వ్యక్తిలో ఇంకా ప్లేగు వ్యాధి కి సంబందించిన బ్యాక్తీరియాను పరిశోదనలో కనుగొన్నట్లు తెలిపారు. ప్లేగు వ్యాధికి కారణమైన యేర్సినియా అనబడే  స్ట్రైన్  చాలా పురాతన మైన స్ట్రైన్ ను 5౦౦౦ సంవత్సరాల తరువాత కనుగొన్నారు.వీరి పరిశోదనలో వై పెస్టిన్ 2,౦౦౦ సంవత్సరాల అంతకు పూర్వం అయి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల అంచనా. జనటిక్ ఏనాలసిస్ట్ల పరిశోధనల ప్రకారం దీనిప్రభావం తక్కువగానే ఉండవచ్చని,అయితే బ్యాక్టీరియా పూర్తిగా చనిపోలేదని ఇది మధ్యస్థం గా  హ్యండల్ సేకరించిన సమాచారం ప్రకారం ప్ప్లేగు వ్యాధి ఇద్దరిలో ఉందనివారి ఆస్తి పంజరాలను తవ్వి వెలికి తీసినట్లు సమాచారం.అప్పుడు 18౦౦ సంవత్సరాలు ఇప్పుడు ఆప్రాంతం పేరు ల్రేట్ నియా ఇద్దరు వ్యక్తులు 2౦ సంవత్సరాల వరకు కనిపించకుండా పోయారని వారిని జర్మన్లు సమీకరించిన ఫిజిషియన్ అంత్రోపాలజిస్ట్ రుడాల్ఫ్ విర్చో పాతకాలం నాటి స్ట్రైన్ ను బ్యాక్తీరియను కనుగొన్నారు. వీరు చేసిన పరిశోధన సెల్ రిపోర్ట్ లో ప్రచురించారు. ఇది 2౦౦ సంవత్సరాల పూర్వం నాటి దై ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు క్రానియా ను జర్మన్ ఫిజీషియన్ రుడాల్ఫ్ విర్చన్ సెల్ తీరీ లో నిపుణులు కావడం వల్లే ఈ తీరీ ద్వారా ఈ వ్యాధి ప్రభావం పై ఆంత్రో పాలజీ ద్వారా దీనిని అభివ్రుది చేసినట్లు పేర్కొన్నారు.1875 లో ఆర్కియాలజిస్ట్ కార్ల్ జార్జ్ కౌంట్ స్లేవేర్స్ క్రమ పద్దతిలో రిన్ను కలన్స్ల్ లో తవ్వకాలు జరిపారు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని లేత్వియా సైవర్స్ తమ పరిశోదనలో ఒక స్త్గ్రీ ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న స్త్రీ ఆస్తిపంజరాన్ని కనుగొన్నారు.అలాగే 2౦-3౦ సంవత్సరాల మధ్యఉండే పురుషుని ఆస్తి పంజరాన్ని జర్మన్ ఫిజీషియన్ రుడాల్ఫ్ విర్చో కను గోన్నారు.రెండవ  ప్రపంచ యుద్ధ్సం తరువాత ఈ ఇద్దరు కనపడకుండా పోయారని 2౦ సంవత్సరాల వరకు అడాల్ఫ్ విర్చే కలక్షన్లో కనుగొన్నారని ఆప్రచురణలో పేర్కొన్నారు. దీనిని బట్టి ఎన్ని సంవత్సరాల కాలం నాటి బ్యాక్టీరియా ఐనా బతికే ఉంటుందని ఈ పరిశోదన వెల్లడిస్తోంది.ఇక ప్రస్తుతం వేదిస్తున్న కోరోనా వైరస్ కూడా మనం చనిపోయినా అల్లాగే సజీవంగా నే ఉంటుందా అన్న అనూమనాలు కలిగిస్తున్నాయి. పూర్గ్టిగా వైరస్లను శాస్వతంగా నసింప చేస్తే తప్ప వైరస్ లు నసిన్చావని ఈ దిశగా వైరస్ల నివారణకు పూర్త్గిగా పరిశోదనలు చెప్పట్టాలని  శాస్త్రజ్ఞులు ఆలోచిస్తున్నారు.

భారత్ లో మూడో వేవ్ ముంచుకొస్తోందా?

కోవిడ్ 19 లో భాగంగా భారాత్లో మూడో వేవ్ ప్రభావాన్ని రానున్న రోజుల్లో  చూడ నున్నా మా ? మూడబ విడత పిల్లల పై ప్రభావం చూపుతుందని శాస్త్రజ్ఞులు  అంచనా వేస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తుంది.భరత్ లో వచ్చిన రెండవ వేవ్ వైరస్ మ్యుతేట్ కావడాన్ని గుర్తించారు.ఈ సందర్భంగా రెండు విడతల లో జరిగిన పరిశీలనలో ముఖ్యంగా ఆర్ధికంగా చితుకి పోయిన రోజువారీ కూలీలు నిస్సహాయులుగా ఏమి చేయలేక కుంగిపోయారు.వైద్య రంగంలో సేవలు అందించే నిపుణుల కొరత ను యూర్కోన్నాము. రోగులకు మందుల కొరత,ఆసుపత్రిలో బెడల కొరత,ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేదించింది. ఇప్పటికీ రెండవ వేవ్ ప్రభావం నుండి పూర్తిగా కోలుకోమి స్థితిలో ఉన్నారు సామాన్యులు.రెండవ విడత ప్రభావం తగ్గిందని మనం ఊపిరి పీల్చుకోలేము కోవిడ్ మూడవ వేవ్ ప్రభావం కోరలు చాస్తే తట్టుకోవడం ఎలా? అందుకు తగ్గ ప్రణాళిక సంసిద్దత ఉన్నాయా అని మనల్ని మనం ప్రస్నిన్చుకోవాల్సి వస్తుంది? రానున్న రోజుల్లో మూడవ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. పెద్ద వాళ్ళ కంటే చిన్న పిల్లల్లో నే ఇమ్యునితీ తక్కువగా ఉంటుందని దీని ప్రభావం పిల్లలపైనే ఉంటుందని అంచనా. ఆరోగ్య రంగం మూడవ  విడత ను ఎదుర్కునేందుకు సమాయత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతోంది ఎందుజు అంటే ప్రపంచంలో ని జనాభాలో 17. 7 శాతం ప్రజలు భారాత్లోనే ఉన్నారని ఇప్పటికీ భారత్ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బ తిన్న నేపధ్యంలో మూడవ వ విడతలో ఈ తీవ్రతను ఎదుర్కోడానికి ఎలా సమాయత్త మౌతుందని ప్రపంచదేశాలు భారాత్ ను చూస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడ్డారు.ప్రస్తుతం వ్యాక్సిన్ డ్రైవ్ లో ఉన్న భారాత్ జూన్ నాటికి 32,91,58,139 వ్యాక్సిన్ తీసుకున్నారని పిల్లల కోసం నిర్దేశించిన  వ్యాక్సిన్ మూడవ విడత క్లినికల్ ట్రైల్స్ అయ్యాయి ఇక పిల్లల వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారు? పిల్లల టీకా ఎలా పనిచేస్తోంది? అలంటి ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. థర్డ్ వేవ్ మిన్చుకోస్తున్న వేల అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు రమి చేద్దామని అనుకుంటున్నాయి. రాజకీయం ముఖ్యమా పిల్లల ప్రాణాలు ముఖ్యమా? ఆగష్టు రెండవ వరం లో వచ్చేస్తోందని చెపుతున్న నేపధ్యంలో  ప్రజలు అప్రమత్తంగా  ఉండాలి అంటున్నారు వైద్యులు.

జలుబు ఎవరికి వస్తుంది... తగ్గించుకునే సులువైన మార్గాలు

జలుబు వీలాకి మాత్రమే వస్తుంది. వాళ్ళకి రాదు అన్నది కాదు. అందరికీ వస్తుంది ముఖ్యంగా స్చూల్ కి వెళ్ళే పిల్లలకి సంవత్సరానికి 1౦ సార్లు రావచ్చు యుక్త వయస్సులో ఉండే వాళ్ళకి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు రావచ్చు నని వైద్యులు పేర్కొన్నారు. స్కూలు కు వెళ్ళే పిల్లలకి జలుబు అధికంగా రావడానికి కారణం ఏమిటి అంటే స్కూల్ లో పిల్లలు ఒక్కొకరు ఒక్కో వైరస్ లకు ఎక్స్పోజ్ అవుతారు పైగా అప్పటికీ వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఇంకా ఉంటుంది.పెరుగు తున్నకొద్ది రోగనిరోదక శక్తి పరి పక్వానికి వచ్చి వాళ్ళు జలుబు వైరస్ ల దాడి ని తట్టుకోగలిగే స్థితికి వస్తారు. అసలు తేలికగా జలుబు బారిన పడే వాళ్ళు వ్యక్తులు వీళ్ళే.... తాగుబోతులు.పొగతాగే అలవాటు ఉన్నవాళ్లు. వృద్ధులు. బలహీనులు. ఉబ్బసం,బ్రోన్కైల్ ఆస్తమా ఉన్నవాళ్లు. మొదలైన వాళ్ళు అని వైద్యులు గుర్తించారు. అసలు జలుబు ఎంతకాలం ఉంటుంది?... జలుబు ఎంతకాలం ఉంటుందనేది,మనిషినుంచి మనిషికి అంటుకున్న వైరస్ ని బట్టి రోగ నిరోధక శక్తిని బట్టి.మారుతూ ఉంటుంది సాధారణంగా జలుబు 2 నుంచి 5 రోజులు ఉంటుంది. కాంప్లికేట్  అయితే వారం లేదా రెండు వారాల దాకా ఉండ వచ్చు.  జలుబు లక్షణాలు... మనకు సోకే జలుబులో అధిక భాగపు జలుబు హెడ్ కొల్డ్స్ అంటే ముక్కులోకి,గొంతులోకి అంటి పెట్టుజకుని ఉంటాయి. ఇలాంటి జలుబుప్రధమ లక్షణం గొంతులోనో ముక్కులోనో చిన్నగా తిక్ల్ చేసినట్లు ఉంటుంది. తరు వాత తుమ్ములు,తరువాత ముక్కునుంచి నీళ్ళు కారడం ఉంటుంది. సాధారణంగా జలుబు వైరస్ మనకు సోకిన 1-2 రోజులకే ప్రారంభ మౌతుంది. ముక్కు లోపల తుమ్ము రాబోతున్న ఇమాజినేషన్,తుమ్ములు,నీరు కారడం,వగైరాలతో,ముక్కు లోపలికి బాక్టీరియా కూడా ప్రవేశించి వుండే పసుపు పచ్చగా చీమిడి కూడా మొదలౌతుంది. ఆ తరువాత నుంచి ఒళ్ళు నొప్పులు,జ్వరం,తలనొప్పి,ఉండోచ్చు.ఇన్ఫెక్షన్ గొంతునుంచి లోపలి ప్రవేశిస్తే గొంతులో,చాతిలో,నొప్పి బరువుగా అనిపిస్తుంది.గొంతు బొంగురు పోవడం పొడి దగ్గు మొదలైనవి ఉంటాయని సాధారణ వైద్యులు చెపుతున్నారు. దగ్గు ప్రారంభంలో పొడిగానే ఉన్న  రోజులు గడుస్తున్న కొద్ది ఇబ్బందికి గురిచేస్తుంది.ముఖ్యంగా రాత్రివేళ మిమ్మల్ని రాత్రివేళ నిద్ర పోనివ్వదు.అంతే కాక మీకు రుచి వాసన తేలీ కుండా పోతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో జలుబు మరే తీవ్రమై మధ్య చెవి ఇన్ఫెక్ట్ కావడం జరుగుతుంది. సైను సైటిస్,బ్రాన్ కైటిస్,వాటికీ దారు తీయవచ్చు. అంతకు ముందు ఆస్తమా,క్రానిక్ బ్రాంకైటిస్,చెవిపోటు ఉన్న వాళ్ళు జలుబు వస్తే అంతకు ముందు ఉన్న సమస్యలు ఎక్కువ చేసి  రోగిని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా జలుబు వల్ల మధ్య చెవి ఇన్ఫెక్ట్ అయినప్పుడుఅది మేనిన్గితిస్ ఎంసిఫిలిటిస్ కు దారి తీయ వచ్చు.దీని వల్ల పరిస్థితి మరింత తీవ్రమై సీరియస్ కండిషన్ ఏర్పడవచ్చు.ఒక్కోసారి అచుట్టుపక్కల భాగాలు ఇన్వొల్వె అయ్యి తల నొప్పి వంతులు మెడ పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి. జలుబు కొన్ని అపోహలు... వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది.వర్షంలో తడిస్తే జలుబు రావాలని లేదు.మీరు ఇంట్లో ఉన్న జలుబు చేస్తుంది. ఇంలో ఏమాత్రం తేమ ఉన్న జలుబు వస్తుంది వర్షం కురిసినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారుమీ ఇంట్లో  చెమ్మ వాతావరణం వేడి వాళ్ళ వైరస్ ముక్కును అంటి పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుజుంటే జలుబు చేస్తుంది... ముద్దు పెట్టుజుంటే జలుబు చేస్తుంది అన్నది 1౦ % కేసులలో ఉండవచ్చు.లాలా జాలం ద్వారా ఒకరినుంచి ఒకరికి జలుబు సోకవచ్చు. ముద్దు పెట్టుకున్నప్పుడు ముక్కులు రెండు దగ్గర అవుతాయి. చలిలో తెరిగితే జలుబు చేస్తుంది.... మనం చలిలో తరిగితే జలుబు చేస్తుంది అని అనుకుంటాం కాని నిత్యం మంచు ప్రదేసాలలో వుండే వాళ్ళకు జలుబు అంతగా సోకదు. వేడి ప్రదేశాలలో ఉండే వాళ్ళకి జలుబు బాద.  జలుబును తగ్గించుకునే మార్గాలు... విటమిన్ సి,పెన్సిలిన్,యాన్తి బాయిటిక్స్ లాంటివి జలుబును తగ్గిస్తాయి.అనుకోడం భ్రమ మాత్రమే. యాంటి బాయిటిక్స్ బాక్టీరియా మూలంగా ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి ఉపక రిస్తాయి.తప్ప వైరస్ మూలంగా వచ్చే జలుబు లాంటి అస్వస్థత వద్ద యంటి బాయిటిక్స్ పప్పులు ఏవి ఉడకవు. వ్వితమింక్ మన శరీరంలో ఉండే చెత్తని బయటికి తోలే పని చేస్తుంది.జలుబును పూర్తిగా తొలగించాడు కాని  వరం రోజులు ఉండే జలుబును రెండు మూడు రోజులు ఉంటుంది. వితమింక్ దగ్గడం,చీదడం లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది.ఇందుకోసం మీరు విటమిన్ సి కల టాబ్లెట్స్ వాడడం కంటే ఆరంజి, ద్రాక్ష, పళ్ళ రసాలను,తాగడం మంచిది. ఆహారం... జలుబు చేసినప్పుడు కొవ్వుగల ఆహార పదార్ధం,మాంసం,పాల ఉత్పత్తులు,తక్కువగా తీసుకోండి, తాజా పళ్ళ రసాలు కయాగూరలు ఎక్కువగా తీసుకోండి. చికెన్ సూప్... జలుబు చేస్తే కోడి కూర తినమంటూ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.వైద్య పరంగా అది సరైనదే అని అనిపిస్తుంది. ఒక కప్పు వేడి వేడి చికన్ పులుసు మీ ముకు బిరడాని తొలగించి ముక్కులో ముక్కునుంచి పలుచగా నీరు కారడం గమనించ వచ్చు. అది బహుశా కోడి కూరలో వేసిన మూలికలు నషాళానికి చేరి మీ ముక్కును శుభ్రం చేసి ఉంటాయి. ముక్కు కారడం వల్ల మీరు మాటి మాటికీ మీ ముక్కు చీదడం వల్ల మీ శరీరంలోని  సూక్ష్మక్రిములు బయటకు వెళ్లి పోతాయి. ఉప్పు నీటితో పిక్కిలించండి... జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం ఉప్పునీతిని గొంతులోపోసి పుక్కులించండి.దీనివల్ల కొంత రిలీఫ్ వస్తుంది. ఆవిరి పట్టడం... ఇది మన పూర్వీకుల నుంచి ఆచరిస్తూ అస్తున్న పద్ధతి ఒక గిన్నెలో బాగా మరగ బెట్టిన నీటిని తీసుకుని అందులో కొంత విక్స్ అమృతాంజనం గాని తీసుకుని తలమీద దుప్పటి లేక టవల్ ను కప్పుకుని ఆవిరిని గట్టిగా పీల్చండి జలుబు తాలూకు ముక్కు దిబ్బడ తగ్గుతాయి. ముక్కుకు వెస్లిన్... ఇక ఆఖరుగా చీదగా చీదగా ముక్కు వొరుసుకు పోయి మంట పుడుతూ ఉంటుంది పెట్రోలియం జెల్లి ని గని వెస్లిన్ గని ముక్కు చివర పట్టించి కొంచం ముక్కు లోపలి భాగం రాసుకుంటే ఈ బాధ తప్పు తుంది. బ్రాంది,వైన్.... చాలా మందికి కొంచం జలుబు చేయగానే 3 టీ స్పూన్ల బ్రన్దీని వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే కొంత రిలీఫ్ ఇస్తుంది అంటారు మందు బాబులు.

ఫ్లు వస్తే ఏం చేయాలి ఎలాంటి మందులు వాడాలి...

అసలు  ఫ్లు వస్తే ఎలా ఉంటుంది ఎలాంటి బాధ పడతారు అన్న విషయాలు తెలుసుకుందాం. జరీ కింద పది నలిగి పోయినట్టు గా బాధ పడుతున్నారా?జ్వరం వచ్చి ఇక చచ్చిపోతనేమో అన్నంత గా భయ పడిపోతున్నారా?ఇప్పుడు పడుతున్న బాధకంటే చచ్చిపోయినా బాగుండు నని అనుకుంటున్నారా? తల పోటుగా ఉండడం కండరాలు గుంజుతున్నట్టుగా ఉందా?నుదురు మంటల్లో కాలిపోతున్నట్టుగా ఉంటుందా? అయితే అది ఫ్లు వైరస్ అని మీరు గ్రహించాలి.తగ్గి పోయే అంతవరకూ అది మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అమెరికాలో సంవత్సరానికి 1౦3మిలియన్ల ప్రజలు ఫ్లు బారిన పడుతూ ఉంటారు.72 వేల మంది రోగులు ఉండడం ఆసుపత్రిలో చేరుతూ  ఉండడం గమనించవచ్చు అలాగే అమెరికాలో ఫ్లు,నిమోనియా తో 69,౦౦౦ మంది  మరనిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫ్లూ చాలా నెమ్మదిగా అమ్మయకంగా వస్త్ఝుంది.ఒళ్ళంతా కొద్దిపాటి నొప్పులు ప్రారంభమై,కొద్దిగా తల నొప్పి,గొంతునొప్పి  వస్తుంది.కొన్ని గంటల తరువాత చలి ప్రారంభమై జ్వరం,దగ్గు,శరీరం లాగుతున్నట్లు అంటే గుంజినట్లుగా,కీళ్ళ నొప్పులు  వచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే అది ఫ్లూ అని చెప్పవచ్చు.. అసలు ఫ్లూ ని ఎలా చూడాలి ఫ్లూ ని వెయ్యి తలలు ఉన్న  రాక్షసిగా చూడాలని అంటున్నారు వైద్యులు. ఇంఫ్లూయేన్  జా లో మూడు రకాల వైరస్లు ఉన్నా ప్రధమికం గా ఎ,బి,సి అనే మూడు రకాలే ఉన్న అవి ఒకదానికి ఒకటి కలగలిపి అనేక రూపాల కింద రూపాంతరం చెందుతుంది.అలాగని ఈఏడు  వైరస్ ల కంటూ టీకా తీసుకున్నప్పటికీ ఫ్లూ వచ్చి  మీమీద దాడి చేసే మిమ్మల్ని మీ శరీరాన్ని బలహీనం చేసే అవకాసం ఉంది. ఫ్లూ వచ్చినప్పుడు యాంటీ బాయిటిక్స్ తీసుకున్న లాభంలేదు.వైరస్ మూలంగా వచ్చే ఫ్లూ యాన్టి బాయిటిక్స్ పనిచేయవు. ఫ్లూ కు మీరు వేరే మందులు వాడాల్సిందే. ఫ్లూ వచ్చినప్పుడు ఎలాంటి జగత్తలు తీసుకోవాలి... ఫ్లూ వచ్చి నప్పుడు ఇంట్లో ఉండండి.ఫ్లూ ఒకళ్ళ నుండి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి.ఫ్లూ వచ్చినప్పుడు ఆఫీసుకి వెళ్లి పనిచేసే ప్రయత్నం చేయకండి.మీవల్ల మిగతా వాళ్ళకు సోకే ప్రమాదం ఉంది.  ఫ్లూ తగ్గే దాకా ఇంట్లోనే ఉండండి.జ్వర, సాధారణ స్థితికి వచ్చేదాకా కొన్ని రోజులు ఆగండి.ఒక వేళ మీపిల్లలకు ఫ్లూ వస్తే  ఫ్లూ పూర్తిగా తగ్గే దాకా వాళ్ళను స్చూలుకు పంపకండి. ఫ్లూ వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకోండి... ఫ్లో వచ్చిన వ్వల్లలో పూర్తిగా జ్వరం అలసట నీరసం ఉంటుంది కాబట్టి.మంచం మీదే రెస్ట్ తీసుకోండి.శరీరానికి రెస్ట్ ఇవ్వడం వల్ల మీ శరీరం తన శక్తిని కూడా గట్టుజుని ఫ్లూ ఇన్ఫెక్షన్ పై పోరాడేందుకు వినియోగిస్తుంది మీరు కదులుతూ మీరు ఎదో ఒక వ్యాపకం లోకి వెళ్ళారంటే మీరు పూర్తిగా నీరసించిపోయి ఉండడం వల్ల  మీశరీరంలో  డిఫెన్స్ మెకానిజం బలహీనపడి తీవ్ర సమస్యలకు దారి  తీయవచ్చు. ఆహారం లో ఏమితీసుకోవాలి... ఫ్లూ జ్వరం తో బాధ పడేవారు డీ హైడ్రేషన్ కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి.మీరు ఘన ఆహారాని తీసుకున్న సహించదు.ద్రవ ఆహారం మీకు పోషక శక్తిని ఇస్తుంది. ఆహారంలో పల్చటి సూపులు,పళ్ళు,వెజిటేబుల్ రసాలు,అంటే ముఖ్యంగా బీట్రూట్,క్యారెట్ రసాలు,విటమిన్లు,ఖనిజ లవణాలు ఉండే ద్రవాలు తీసుకోవాలి. సగం జ్యుస్ కి అంతే నీళ్ళు కలిపి రుచికోసం కొంచం పంచదార కలుపుకోవచ్చు.పంచదారను ఎక్కువగా కలిపితే జ్వరంలో అది విరేచనాలకు దారి తీస్తుందిపంచదారను కొంచం గా మాత్రమే తీసుకోవాలి. శరీరం పూర్తిగా బలహీన పడి ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే... ఆస్ప్రిన్,నైస్,ఇబుప్రోఫెన్,లాంటి మందులుఫ్లూ తో పాటు వచ్చే మందులు తలనొప్పి,ఒల్లునోప్పులను తగ్గిస్తాయి.అది డాక్టర్ సూచన మేరకే వాడాలి. ఫ్లూ లక్షణాలు మధ్యాహ్నం,సాయంత్రము,ఎక్కువగా కనిపిస్తాయి.అందుకు డాక్టర్లు ఈ మందులను నాలుగు ఘంటలకి  ఒకసారి వేయమని చెబుతారు.సొంత వైద్యం చేసుకోడం అనర్ధం. గమనిక అస్ప్రిన్ మందును పిల్లలకు ఇవ్వకూడదు.దీ ని వల్ల నరాల సంబందిత వ్యాధితో బాధ పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఇష్టమొచ్చిన మందులు వాడవద్దు... ఫ్లూ తో బాధ పడుతున్నప్పుడు జలుబుకు సంబందించి మనకు తెలిసిన  టాబ్లెట్స్ ను వాడవద్దు.లేక మందుల షాపు లో వాళ్ళు ఇచ్చిన మందులు వాడవద్దు.అలాంటి మందు వల్ల  కొన్ని లక్షణాలు తొలగి పోయి,తాత్కాలికంగా ఫ్లూ తగ్గినట్టు అనిపిస్తుంది.కానీ మళ్ళీ తిరగ బెట్టి సీరియస్ సీరియస్ అయ్యే అవకాసం ఉంది  ఉప్పు నీటిన్ పుక్కిలించండి... ఫ్లూ సోకినప్పుడు గొంతు పొడి ఆరి పోయి నట్లు ఉంటుంది.స్పూను ఉప్పునునీళ్ళలో కలిపి గార్లింగ్ చేస్తే కొంత రిలీఫ్ ఉండవచ్చు. అయితే ఆనీటిని మింగకూడదు. ఉప్పు లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మింగాక పోవడమే మంచిది. వేడి కాపడం పెట్టుకోవాలి... ఫ్లూ తో వచ్చే ఒళ్ళు నొప్పులకు అలసట అధికంగా ఉంటుంది.ఈ నొప్పులనుంచి కాస్త ఉపసమనం కోసం వేడి కాపడం ఉపయోగ పడుతుంది. తాజా  గాలి తీసుకో డం ముఖ్యం... రోగి ఉన్న గదిలోకి తాజా గాలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసికోవాలి.అయితే చలివేయకుండా వెచ్చటి పక్క బట్టలను అమర్చుకోవాలి. వెన్ను నిమరడం చేయాలి... ఫ్లూ తో బాధ పడే వ్యక్తులు ఎవరైనా మృదువుగా మసాజ్ చేయించుకున్నట్లుగా ఎవరితో ఐనా వెన్ను నిమిరించుకుంటే ఆవ్యక్తిలో రోగ నిరోధక యంత్రాంగం యాక్టివ్ అయ్యి ఫ్లూతో పోరాడేందుకు తయారు అవుతుంది. తేలిక పాటి ఆహారం తీసుకోవాలి... ఫ్లూ రోగులకు ఆకలి ఉండదు కాని ఫ్లూ తగ్గు ముఖం పడుతూ ద్రవ ఆహారం నుంచి ఘన ఆహారం తీసుకుంటునప్పుడు పేషంట్ తీసుకునే ఆహారం చాలా తేలికగా జీర్ణ మయ్యేడిగా ఉండాలి.బ్రెడ్ పాలు మెత్తటి వరిడాక్టర్ సూచించిన విధంగా తీసుకోవాలి.

కోవిడ్ కేసుల పెరుగుదలతో భయం పట్టు కుందా?

కోవిడ్ కేసులు పెర్గుతూ ఉండడంతో ఆసుపత్రులకు భయం పట్టుకుంది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్యాన్డమిక్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కోవిడ్ రోగుల శాతం గణనీయంగా పెర్గుతూ ఉండడం తో శరీరంలో ఒళ్ళు నెప్పులు, జ్వరం,లంగ్ ఫైబ్రోసిస్,పల్మనరీ ఎంబాలిజం,బ్రెయిన్ ఫాగింగ్ వంటిసమస్యలతో అవుట్ పేషెంట్ రోగులుగా వస్తున్నారని డాక్టర్స్ తెలిపారు. చాలామందిలో మానసిక సంబందమైన సమస్యలు యాంక్జైటీ,ఒత్తిడి,కంఫ్యుషన్. హై బిపి,జ్ఞాపక శక్తినికోల్పోడం,కొత్తగా డయాబెటిస్,వంటి సమస్యలతో రోగులు వస్తున్నట్లు తెలిపారు.మూడునెలల కాలంలో 99౦ రోగులలో 31.8%రోగులు పోస్ట్ కోవిడ్ రోగులు కావడం విశేషం.11% మందిలో కోవిడ్ లక్షణాలు ఇంకా ఉన్నాయని,9-నుండి12 నెలలలో అలసట 12.5%మైలోరియా 9.3%ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్న రోగులు ఉన్నారు.డిల్లి లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సాకేత్ తెలిపారు. కోవిడ్ లక్షనాలు లేని వారు కూడా దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలు గుర్తించామని.మాక్స్ సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రికి డైరెక్టర్ డాక్టర్ వివేక్ నంజియా అన్నారు. వీరు ఎక్కువగా కళ్ళు, ఇతర అవయవాలపై ప్రభావం ఉందని తేల్చారు.చాలా కేసులను పరిశీలించిన మీదట వైరస్ దీర్ఘకాలంగా కొనసాగే అవకాసం ఉందని. వైరస్ నుండి బయట పడ్డ తరువాత కూడా సమస్యలు వస్తున్నాయని పూనా జూపిటర్ ఆసుపత్రికి చెందిన మహేంద్ర డడ్కే అన్నారు.పోస్ట్ కోవిడ్ లో న్యూరో వైడైటరీ లక్షణాలు డిప్రెషన్,ఒత్తిడి,యాంక్జైటీ,బ్రెయిన్ ఫాగ్,నిద్రలేమీ. ఊపిరి పీల్చుకోలేక పోవడం వంటి సమస్యలతో వస్తున్నారనిముఖ్యంగా వారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తరువాత వచ్చిన సమస్యలుగా పేర్కొన్నారు.ఏది ఏమైనా ఇతర అవయవాల ను నాశనం చేయలేదని ఐ సి యు లో ఉన్నవారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నవారే నని తేల్చారు. ఒక్కోసారి కోవిడ్ నెగెటివ్ వచ్చిన ఐ సి యు లో ఉండేవారని నిమోనియా తదితర సమస్యలు వారిని వేదిస్తున్నట్లు గుర్తించామన్నారు.

తల నొప్పికి మసాజ్ దేరఫీ...

మసాజ్ చేయడం మూలంగా టెన్క్షణ్ తో ఉన్న కండరాలు వదులు అవుతాయి. తల వెన్నెముక భాగంలో మసాజ్ చేస్తే మిమ్మల్ని వేదిస్తున్న తల నొప్పి పోతుంది. 1 ఈ మసాజ్ ని మీకు మీరు కాకుండా వేరే వాళ్ళు చేస్తే మీరు రిలాక్స్ కాగలుగు తారు. 2 మసాజ్ చాలా మృదువుగా చిన్న చిన్న వర్తులకారపు పద్దతిలో మాజ్ చేస్తూ పోవాలి. ఒక్కో పాయింట్ వద్ద కనీసం 7 సెకండ్ల పాటు ఉండాలి.వేళ్ళ కొనలతో నుదురు పై భాగాన మధ్య పాపిడి ప్రారంభ భాగాన ముందు మసాజ్ చేయాలి.మధ్య పాపిడి పొడవునా దాకా మస్సాజ్ చేస్తూ పోవాలి. నుదుటికి ఇరు వైపులా పక్క పాపిడి భాగంలో మధ్య పపిడికి సమాంతరంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత చిన్న చిన్న వర్తులాకార పద్దతితో మీ అరచేతులతో తలకు రెండు వైపులా మసాజ్ చేయాలి.ఇప్పుడురెండు  బొటన వేళ్ళ తోను తలకు రెండు వైపులా మెడ  పైన మాడుకు కింది భాగాన మసాజ్ చేయాలి. ఆతరువాత రెండు చూపుడు వేళ్ళ తోనూ తలకు అటు ఇటూ వైపు భాగాలలో మసాజ్ చేయాలి. ఇపుడు మొహాన్ని నెమ్మదిగా పైకి ఎత్తి బొటన వేళ్ళతో గానీ లేదా నాలుగు వేళ్ళతో గాని రెండు చేతులతో మసాజ్ చేయాలి.ఇక చివరికి వీపు భాగంలో వద్ద మసాజ్ చేయడం ద్వారా మీరు చేస్తున్న మసాజ్ కార్యక్రమం పూర్త్గి అవుతుంది.అది మీ తల నొప్పికి మసాజ్ ట్రై చేయండి మీనోప్పి గాయప్.

పక్షవాతంతో జీవితం ముగిసినట్టేనా?

కన్ను మూసి తెరిచే లోగా జరిగి పోతుంది.క్షణ కాలంలో మీ జీవితం మారిపోతుంది. అసలు పక్షవాతం అంటే--మెదడు లోపలి ధమనుల ద్వారా మెదడుకు వెళ్ళే రక్త  ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే పక్ష వాతం అని అంటారు. మీరు మాట్లాడే శక్తినికోల్పో వచ్చు,ఆలోచించగలిగే శక్తిని కోల్పో వచ్చు.కాలు చెయ్యి  పడిపోవచ్చు అదేపక్షవాతం  పక్ష వాతాన్ని వైద్య పరిభాషలో అపోప్లేక్టిక్ స్ట్రోక్ అంటారు. అమెరికాలో మనుష్యుల్ని మృత్యువు దగ్గరికి చేరుస్తున్న ప్రమాద కర జబ్బులలో  గుండె జబ్బులు క్యాన్సర్,తరువాత పక్ష వాతం మూడో స్థానం లోకి వస్తుంది. అమెరికాలో ప్రతిసంవత్సరం షుమారు అరమిలియను మందికి పక్షవాతం బారిన  పడుతున్నారని ఒక అంచనా.వాళ్ళలో లక్షా యాభై వేలమంది కి పైగా మృత్యు వాత  పడుతున్నారు.బతికి ఉన్నవాళ్ళు కూడా ఎదో ఒక శారీరక లోపంతోజీవిస్తున్నారని తెలుస్తోంది. మాటపడిపోవడం.దృష్టిలోపం,జ్ఞాపకశక్తి,లేకపోవడం లేదా శరీరలో ఒక పక్క ఎదో ఒక భాగం  చచ్చుబదిపోవడం లాంటి ఎదో ఒక అవలక్షణం తో జీవితాన్ని వెళ్ళ దీస్తున్నారు. పక్షవాతం అంటే ఏమిటి? డాక్టర్స్ దీనిని సెలబ్రెల్ ఎమర్జెన్సీ కింద చెబుతారు. సెలేబ్రెల్ అంటే మెదడు అర్ధం ఏమర్గెంచి అంటే ఆకస్మికం అని అర్ధం లేదా అకస్మాత్తుగా వచ్చిందని అర్ధం. మెదలోపలి ధమనుల ద్వారా మెదడుజు వెళ్ళే రక్త ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే స్ట్రోక్ పక్షవాతం. రక్త ప్రవాహానికి ఆటంకం కలగాదమనేది ధమనిలోని ఎదో భాగాన రక్తం  గడ్డకట్టడం బ్లడ్ క్లోట్ మూలంగా కావచ్చు. లేక దమని చిట్లడం మూలంగా ను కావచ్చు. దమని ద్వారా మెదడుకు వెళ్ళే రక్తం మెదడుకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను అందిస్తుంది.మెడకు రక్త సరఫరా  ఆగిపోగానే ఆక్సిజన్ సరఫరా కూడా ఆగిపోతుంది.ఆక్సిజన్ సరఫరా లేక పోయేసరికి మెడకు ఉక్కిరి బిక్కిరి  అవుతుంది.అపుడు మెడకు చెందిన విలువైన కణజాలం నసిన్చిపోతాయి.లేక సీరియస్ గా డ్యామేజ్ అవుతాయి. ఈ డామేజ్ జరగడానికి కేవలం నాలుగు లేదా ఐదు నిమిషాలు చాలు అంతే. మెడకు వెళ్ళేసరఫరా కి నాలుగు  ఐదు నిమిషాలు అవరోధం ఏర్పడితే చాలు పక్ష వాతం వచ్చేస్తుందన్న మాట. ఇలా డామేజ్ అయిన మెదడు కణాలు మీ ఎడమ చేతిని పని చేయించేవి అయితే మీ ఎడమ చేయి పడిపోతుంది. జ్ఞాపక శక్తిని కొంత్రోల్ చేసేవి అయితే జ్ఞాపక శక్తిని కోల్పోతారు.ఒకవేళ  మెదడు తాలూకు అత్యధిక కణజాలం నశిస్తే అమనిశే చనిపోతాడు. ఆకస్మికంగా రక్త సరఫరా ఆగిపోవడం స్ట్రోక్ అనేది అప్పటికిఅప్పుడు ఆరోగ్యంగా ఉన్న దమనుల లో ఏమి ఆగదు. ఏళ్ల తరబడి డ్యామేజ్ అయిన ధమనులలో మాత్రమే జరుగుతుంది. స్ట్రోక్/లేదా పక్షవాతం ఎలా ఏర్పడుతుంది.--ఎన్నిరకాలు ---- సేలేబ్రెల్  త్రంబోసిస్---- మెడకు వెళ్ళే రక్త నాళాలలో ఎక్కడో ఒక చోట రక్తం గడ్డ కడుతుంది.ఇలా రక్తం గడ్డకట్టడాన్ని బ్లడ్ క్లోట్ అంటారు దీనిని వైద్య పరిభాషలో త్రోమ్బోస్ అంటారు.క్రమేణా ఈ క్లోట్ పెద్దదై రక్తాన్ని పూర్తిగా మూసేస్తుంది. --- రక్తనాళాలలో ఏర్పడ్డ త్రోమ్బోస్ ని ప్రారంభంలోనేగుర్తిస్తే  రక్తనాళాన్ని పూర్తిగా మూసేయకుండా ఉండే విధంగా ఉండడానికి తగిన మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. సెలబ్రల్ ఏమ్బాలిజం... మరేదో శరీరం నుండి కొట్టుకు వచ్చిన రక్తపు గడ్డ లేదా నరేదైనా ముక్క గాని ఉంటె దానిని ఎమోలుస్ అంటారు.మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనిలో ఇరుక్కుపోయి రక్త సరఫరాకి ఆటంకాన్ని కలిగిస్తుంది. సెలేబ్రల్ హేమరేజ్... మెదడుకు రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్తనాళం ఏదైనా చిట్లి నప్పుడు ఆ ప్రాంతం నుండి రక్తం బయటకు చిమ్మి లీక్ అవుతుంది. ఏదైనా ట్యూమర్ లాంటిది  మెదడుకు రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్త నాళాన్ని అదిమి పెట్టి నప్పుడు ఆ నాళం మూసుకుపోయి మెడకు వెళ్ళే రక్తం  ఆగిపోతుంది.ఈ నాలుగు సందర్భాలలోనూ వ్యక్తికి పక్ష వాతం వచ్చే అవకాసం ఉంది.

యాంటీ బాయిటిక్స్‌తో జాగ్రత్త...

యాంటీ బాయిటిక్స్ తో కొలట్రాల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం నిపుణుల హెచ్చరిక. యాంటి బాయిటిక్స్ వల్ల కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాసం ఉందని నిపుణులు  హెచ్చరిస్తునారు. 5౦ సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు.ఇటీవలి కాలం లో యాంటీ బాయిటిక్ మందుల వాడకం విపరీతంగా పెరిగింది. యాంటీ బాయిటిక్స్ అదే పనిగా వాడారో ఆరోగ్యసమస్యలు తప్పవని అవి మరింత తీవ్రంగా ఉంటాయని.అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటి బాయిటిక్స్ సహాయ పడతాయి.ఏది ఏమైనా అనారోగ్య సమస్యల పైన శాస్త్రజ్ఞులు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. ఒక నూతన పరిశోదన ప్రకారం యురోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ వరల్డ్ కాంగ్రెస్ 2౦21 గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ క్యాన్ సర్ పై నిర్వహించిన సదస్సులో ఈ అంశం చర్చించారు. ప్రత్యేకంగా 5౦ సంవత్సరాలలోపు కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అనవసరమైన యాంటి బాయిటిక్స్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని పరిశోదన వెల్లడించింది. యాంటి బాయిటిక్స్ ఇన్ఫెక్షన్  చికిత్సకు ఉపయోగ పడతాయి.ఏది ఏమైనా యాంటీ బాయిటిక్స్ అతిగా  వాడితే దీనిఫలితం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యాంటీ బాయిటిక్స్ అనవసర వాడకం... సిడి సి ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ఇన్ఫెక్షన్లకు యాంటీ బాయిటిక్స్ ఉపయోగ పడతాయి,కాని  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు వాడడాన్ని గమనించవచ్చు.ఇన్ఫెక్షన్స్ పై ప్రభావ వంతంగా పనిచేసిన  యాంటి బాయిటిక్స్ వైరస్ ల పై పని చేయవని నిపుణులు తేల్చి చెప్పారు. యాంటీ బాయిటిక్స్ ఎల్లప్పుడూ తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదు.కొన్ని సందర్భాలాలో మాత్రమే వాడాల్సి ఉంటుంది కొన్ని సర్ర్లు శరీరం దానికదే ఇన్ఫెక్షన్ ను తగ్గించుకుంటుంది.అనవసరంగా యాంటీ బాయిటిక్స్ జాతీయ,అంతార్జాతీయ స్థాయిలో యాంటీ బాయిటిక్స్ వాడకం పెరగడం పై సి డి సి తీవ్రంగా పరిగణించింది. యాంటీబాయిటిక్స్ ను చాలా జాగ్రత్తగా వాడాలని,యాంటీ బాయిటిక్స్ వాడకం నివారించడం ద్వారా దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దుష్పరిణామాలు నివారించవచ్చు.నని సిడి సి తెలిపింది. ప్రజాలు విచ్చల విడిగా వాడడం వల్ల క్లోస్టిదిఒ దీఫ్ఫిసిల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఇన్ఫెక్షన్ల రకాలను యాంటి బాయిటిక్స్ నియంత్రిస్తుంది.నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ హెల్త్ యాంటి బాయిటిక్స్ బ్యాక్తీరియాను చంపడానికి ఉపయోగ పడుతుంది. గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ ట్రాక్ సమస్యలు తీవ్రత ఉన్నందున యాంటి బాయిటిక్స్ వాడకంలో సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేసారు.అవసరం లేని యాంటీ బాయిటిక్స్ ఓపి లోనే 3౦%ఉంటున్నాయని యు ఎస్ వెల్లడించింది.ఎమొరీ విశ్వ విద్యాలయానికి స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ మైఖేల్ వుడ్ వర్త్  సహాయ ప్రొఫెసర్ ఇన్ఫెక్షియస్ దిసేఅజేస్ అట్లాంటా మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. ఆరోగ్యాన్ని అందించేవారికి యాంటీ బాయిటిక్స్ వాడకం  పెద్ద సవాలుగా నిలిచింది.యాంటి బాయిటిక్స్ వాడకం  పై లాభాలు,నష్టాలు దుష్పరిణామాలు ఉన్నాయని యన్టీ బాయిటిక్స్ అంతార్జాతీయ ప్రాధాన్యత వల్ల టాక్సీ కేంట్స్ తగ్గి పోతాయి.ఎంపిక చేసిన యాంటీ బాయిటిక్స్ తట్టుకోగలిగిన యాంటీ బాయిటిక్స్ వాడాలి. కొలట్రాల్ క్యాన్సర్ పై ప్రభావం... అమెరికన్ క్యాన్సర్ సొసైటి చర్మ సంబంద క్యాన్సర్ను నిరోదించింది.అమెరికాలో అతి పెద్ద క్యాన్సార్లలో  కొలట్రాల్ క్యాన్సర్ గా గుర్తించింది.కొలట్రాల్ క్యాన్సర్ ఇటీవలి కాలంలో తగ్గు ముఖం పట్టాయి. 64 సంవత్సరాల్ లోపు వారిలో కొలట్రాల్ క్యాన్సర్లు పెరిగి నట్టు గుర్తించారు.అయి తే ముఖ్యంగా యువతీ యువకులలో కొలట్రాల్ క్యాన్సర్ వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.ఈ విషయాన్ని క్యాన్సర్ జర్నల్ లో ప్రచురించారు. కోలాట్రాల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ను 45-5౦ సంవత్సరాల మధ్య తప్పనిసరిగా చేయించాలని సూచించింది. కొలట్రాల్ క్యాన్సర్ను ప్రాధమిక స్థాయిలో గుర్తించిన పక్షంలో నివారించవచ్చని అభిప్రాయ పడింది. క్యాన్సర్ నివారణ పై దృష్టి పెట్టాలి... కొలట్రాల్ క్యాన్సర్ మరణాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.క్యాన్సర్ మరణాలలో కొలట్రాల్ క్యాన్సర్ 2 వ స్థానం లో ఉంది. శరీర వ్యాయామంలేకపోవడం,అతిగా మద్యం సేవించడం,పొగాకు వాడకంవల్ల కొలట్రాల్ క్యాన్సర్ కు కారణాలుగా గుర్తించారు.కొలట్రాల్ క్యాన్సర్ లో వైద్యం లో లేని మరో జబ్బు అతని వయస్సు,లేదా కుటుంబ చరిత్ర,జనటిక్స్ వల్ల ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్,వంటి కారణాలు గా చెప్పారు ఈలక్షణాలు ఉన్నవారు సత్వరం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తేల్చారు.కొలట్రాల్ క్యాన్సర్ పై ఇంకా పోర్తిగా తెలియాల్సి ఉంది.కోలాన్ క్యాన్సర్ యాంటి బాయిటిక్స్ పై పూర్తి పరిశోదనలు చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.

ఇన్సులిన్ వాడకంలో జాగ్రత్తలు

డయాబెటిస్ మందులతో కట్టడి చేయలేక పోతే డాక్టర్ సూచించిన విద్జంగా ఇంసూలిన్  తప్పనిసరిగా వాడాల్సిందే ఇంసూలిన్ ఇంజక్షన్న్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ఆయా రోగుల లక్షణాలు వ్యక్తిగత అవసరాన్ని బట్టి  ఉంటుంది.ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న అంశాన్ని డాక్టర్స్ సూచిస్తారు. రక్తంలో చక్కెర శాతం పడిపోయి హై పో గ్లై సీమియా రాకుండా రాకుండా ఉండటానికి అంటే బ్లడ్ షుగర్ ను తగిన విధంగా నియంత్రణలో ఉంచుకోడం కోసం మే ఇంసూలిన్ ఇంజక్షన్ తీసుకుంటారు. వీటిలో మూడురకాల ఇంసూలిన్ లు ఉన్నాయి.1)సోలుబ్లె2 )ప్రోటామిన్3)ఇన్సులిన్ జింక్ సస్పెంసాస్  ఇంజక్షన్ ద్వారా ఇంసూలిన్ ని ప్రవేశ పెట్టినప్పుడు అది శరీర కాణా లలోకి గ్లూకోజ్  ద్వారా శరీరానికి అవసరమైన శక్తి అందే విధంగా చేస్తుంది.చాలా మందికి పేషంట్ లకు రోజుకు ఒక ఇంజక్షన్ సరిపోతుంది. ఇంకొందరికి రోజుకు రెండు తీవ్రతను బట్టి రోజుకు 3నుండి 4 డోసులు కూడా ఆహారానికి ముందు అవసర మౌతాయి.ఎన్నిసార్లు తీసుకోవాలి ఎంతతీసుకోవాలనే దానిని డాక్టర్స్ నిర్ధారిస్తారు. ఇన్సూలిన్ ఇన్జేక్షన్  వాడకంలో జాగ్రత్తలు----- ఇన్సూలిన్ ని చల్లటి ప్రదేశంలో ఉంచాలి.రేఫ్రేజి రేటర్ లో మంచు తయారయ్యే డీప్ గ్రీజేర్ లో మాత్రం ఉంచకూడదు. ముఖ్యంగా పలుకులు,పలుకులు గా కనిపించే మకిలి పట్టిన ఇంసూలిన్ ను కొనవద్దు. శరీరంలో ఇంజక్షన్ చేసే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇంజక్షన్ భోజనానికి  2౦-3౦ నిమిషాలు ముందు తీసుకోవాలి.ఇంజక్షన్ బాటిల్ పైన లేబుల్ ని చెక్ చేయాలి.ఇంసూలిన్ బోటిల్  పైన ఎక్స్ పైరీ డేట్ ను కూడా గమనించాలి. స్వంతంగా ఇంజక్షన్ చేసుకోడానికి నేర్చుకోవాలి.వివిధ సమయాలలో మీ బ్లడ్ షుగర్ ను పరీక్ష చేసుకునే విధానాని కూడా నేర్చుకోవాలి. మీరు తీసుకునే  ఇన్సూలిన్ డోసేజ్ షెడ్యుల్ ని బట్టి మీరు ఎప్పుడు భోజనం చేయాలి,ఇతరా లేదా శారీరక పనులు మొదలైన వాటి మధ్య సమన్వయం ఉండాలి.ఒక చిన్న డైరీ ని రాయడం అలవాటు చేసుకోవాలి అందులోమీరు ఇంజక్షన్ చేసుకున్న తేది,టైం,బ్లడ్ గ్లూకోజ్,ఎమన్నా రీయక్షన్ వచ్చిందా అయితే అది ఎ రకమైన రియాక్షన్ గురించిన వివరాలు ఉండడం మంచిది. ఇంజక్షన్ ని ఎలా చేయాలి------ మీరు తీసుకునే పరిణామం లో డాక్టర్ సూచించిన విధంగా సిరంజ్ లోకి తీసుకోవాలి. ఇంజక్షన్ ని మీ శరీరంలో కండరం లోకి లేక కొవ్వు ఉన్న భాగానికి ఇంజక్ట్ చేసుకోవాలి. సామాన్యంగా కొవ్వు ఉన్న భాగాలలో కి చేసుకోడం సులువుగా ఉంటుంది. చాలా మంది భుజాలు, తొడలు, పొత్తికడుపు, పిర్రలు, మొదలైన భాగాలలో చేసుకోవాలి ఆభాగం చర్మం  మొద్దు బారిపోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఇంజక్షన్ చేసే ప్రాంతాన్ని మ్సరుస్తూ ఉండాలి. ఇంజక్షన్ చేయబోయేభాగాన ఆల్కాహాల్ లో ముంచిన దూదితో శుభ్రం చేయాలి. బొటన వేలు మిగతా వ్రేళ్ళ మధ్య ఇంజక్షన్ చేయబోయే భాగాన్ని పట్టుకుని  పెన్సిల్ ను పట్టుకునే విధంగా సిరంజిని రెండు చేతి వేళ్ళ మధ్య పట్టుకుని సూదిని నిటారుగా చర్మంలోకి గుచ్చాలి. తర్వాత సిరంజి పలున్గేర్ ని కిందకి నొక్కాలి ఇప్పుడు వెల్ల మధ్యా పట్టుకున్న చర్మాన్ని వదిలేసి సిరంజిని పైకి లాగాలి.

భారత్‌లో ప్రతిఏటా 7 లక్షల మరణాలు లాన్ సెట్ జర్నల్ లో వెల్లడి...

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణలో చోటుచేసుకుంటున్న వాతవరణ మార్పులు వాళ్ళ అసమాన ఉష్ణోగ్రతలు పెరగడం,అలాగే అతిశీతల వాతవారంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని లన్సేట్ హెచ్చరించింది. 2౦౦౦ -2౦19  సంవత్సరంలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరిగి పోయాయని ఇది గ్లోబల్ వార్మింగ్ గా నిపుణులు పేర్కొన్నారు. సంవత్స రంలో 7,4౦,౦౦౦ మరణాలు కేవలం భారాత్లో చోటు చేసుకోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని  నిపుణులు స్పష్టం చేసారు. వాతావరణంలో మార్పుల వల్ల వేడి,అతి సీతలం గా ఉండడం వల్లే  మరణాలు పెర్గుతున్నాయని లాసెట్ ప్లానెట్ హెల్త్ జర్నల్ లో ప్రచురించిన నివేదికలో వెల్లడించింది. మొనాష్ విశ్వ విద్యాలయం,ఆస్ట్రేలియాలో ప్రపంచ వ్యాప్తంగా 5 మిలియన్ల ప్రజలు మరణించారని  వాతావరణంలో మార్పుల వాళ్ళ భారత్ లో6,55,4౦౦ అధిక ఉస్నోగ్రతాల వల్ల83,7౦౦ గా ఉన్నాయని  పరిశోధకులు వెల్లడించారు.2౦౦౦ నుండి 2౦19 ప్రపంచంలోని వాతావరం లో మార్పులు వచ్చాయని  ఒక దశాబ్దం లో ౦.26 డిగ్రీ ల సెల్సియస్ గా నమోదు కావడాన్ని అధయన బృందం పరిశీలించింది. ప్రపంచ వ్యాప్తంగా 9.43  మరణించారని ఆధ్యనంలో లో వెల్లడించారు.అంటే ప్రతి1౦,౦౦౦ మంది ప్రజలలో 74 మంది అదనంగా ఉంటున్నారని అది అతి చల్లదనం వల్ల చనిపోవాదాన్ని మనం గమనించవచ్చు. దీర్ఘ కాలంలో వాతావరణంలో మార్పులు మరణాలు మరింత పెరగవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు యూరప్,సహారా ఆఫ్రికా,అత్యధిక వేడి,శీతల ప్రాంతాలు ఉండడం వల్ల అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని లాస్ సెట్ జర్నల్ లో ప్రచురించారు. ఆశియలో ముఖ్యంగా తూర్పి దక్షిణ యూరప్ లో 1౦,౦౦౦ మంది అధిక ఉష్ణోగ్రతల మరణించారు. సహారా ఆఫ్రికాలో 1౦,౦౦౦ మంది అధిక శీతల వాతావరణంవల్ల మరణించారు.43 దేశాల నుండి సేకారించిన  డాటా ఆధారంగా వివిధ రకాల వాతావరణాలు,సామాజిక,ఆర్ధిక,భౌగోళిక అంశాల ఆధారంగా వివిదరకాల మౌలిక వసతుల కల్పన ప్రజా ఆరోగ్యం సేవలు పర్గానలోకి తీసుకున్నామని నిపుణులు లా సెట్ జర్నల్ లో పేర్కొన్నారు.             

జికా వైరస్ అత్యంత ప్రమాదకరం అప్రమతంగా ఉండాలని హెచ్చరిక...

డెల్టావేరియంట్ కన్నా,డెల్టా ప్లస్ కన్నా అత్యంత ప్రమాదకరమైన వైరస్ గా జికా వైరస్ ను  పేర్కొన్నారు.తొలుతభారత్ లో కనుగొన్న జికా వైరస్ లోకల్ వైరస్ గా పేర్కొన్నారు.జికా వైరస్ ల కన్నా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తునారు.ప్రస్తుతం వర్షాకాలం ఉన్నందున జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉబ్తుందని న్నిపునులు అంచనా వేస్తున్నారు.కేవలం వెక్టర్ దోమ వల్ల  వ్యాపిస్తుందని,అందుకే దీన్ని వెక్టర్ జోన్ డిసీజ్ గా పేర్కొన్నారు.దీని లక్షణాలలో ముఖ్యంగా జ్వరం,శరీరమంతా దద్దుర్లు,జాయింట్స్ కీళ్లలో నొప్పులు కండరాలలో నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు.ఒకరకంగా చెప్పాలంటే చుకున్ గునియా,డెంగ్యు,ఇపుడు జికా ముఖ్యంగా కాళ్ళు కీళ్లలో నిసత్తువ వచ్చి కీళ్లలో ముణుకులు,మోచిప్పలలో తీవ్రమైన నొప్పి,అనొప్పి శాశ్వతంగా మారిపోయే అవకాసం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జికా ఎయిడిన్ ఈజిప్ట్ దోమ వల్ల వచ్చే డెంగ్యు కు కారణమైనా దోమ వల్లే జికా వ్యాపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాగా ఈజిప్ట్ దోమ మూడు రోజుల్లో పెర్గుతుందని రెండు వారాల తరువాత దీని లక్షణాలు బయట పడతాయని ఈలక్షనాలు 2 ,లేదా 3 రోజులు ఉంటాయని, అలాగే ఈ లక్షనాలు కనపడవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా జ్వరం,కండరాల నొప్పులు,జాయింట్స్ లలో నొప్పులు తల నొప్పి కాళ్ళ కలక,దద్దుర్లు వస్తాయని వైద్యులు తెలిపారు. చుకున్ గునియా గర్భిణీలకు ఆత్యంత ప్రమాదకరమని దీనివల్ల పుట్టిన పిల్లలు కొన్నిరకాల్ అంగ వైకల్యంతో పుట్టవచ్చని ఈ అంశాన్ని గమనించాలని పేర్కొన్నారు దీనికి ప్రత్యేకంగా మందులు లభ్యం కాలేదని,డీ హై ద్రేషణ్ రాకుండా చూసుకోవాలని జ్వరం వస్తే tyenole(r) లేదా acetominophin,వాడవచ్చునని స్తేరాయిడ్స్ కు దూరంగా ఉండాలని,ఇతర సమస్యలతో బాధ పడే వారు డాక్టర్ను ను  సంప్రదించాలని  డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. పైన పేర్కొన్న లక్షణాలు ఉన్న వారు లేదాఅనుమానితుల  కోవిడ్ లక్షణాలు ఉన్న వారినుండి స్యాంపుల్ సేకరించాలని వీటిని వైరాలజీ ల్యాబ్ కు పంపాలని,ముఖ్యంగా గర్భిణీలు,అప్పుడే పుట్టిన పిల్లల సీరం నమూనాలు వైరాలజీ ల్యాబ్ కు పంపాలని సూచించారు. కేరళా లో ఇప్పటికే 24 సంవత్సరాల గర్భిణిలో జికా కనిపించిందని,త్రివేండ్రంలో మరో 13 మంది లో ముగ్గురికి జికా ఉందన్న అనుమానం వ్యక్తం చేసారు.ఈమేరకు రోగుల నమూనాలను పూనా వైరాలజీ కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈమేరకు కేరళలో జికా వైరస్ కేసులు వెలుగు చూడడం తో కర్ణాటకా ప్రభుత్వం అప్రతమైంది ఈమేరకు కర్ణాటకా రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది దక్షిణ కర్నాటకలోని ఉడిపి,చామ రాజ నగరం కర్ణాటక సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేసాలలో పేర్కొంది.జికా వైరస్ విస్తరించే అవకాసం ఉన్నందున ఆశా,హెల్త్ వర్కర్స్ గ్రామీణ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని,యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కర్ణాటకా రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా కమీషనర్డాక్టర్ త్రిలోక్ ఒక ప్రకటనలోఆదేశాలు జరీ చేసినట్లు సమాచారం.

పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఏవి?

పిల్లలు కొందరు ఆరోగ్యంగా పుడితే ఇం కొందరు ఎదో ఒక వైకల్యం తో పుడతారు. వాటిలో ముఖ్య మైనది కాంజేనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే గుండె కవాతలకు వచ్చే జబ్బు. కోరోనరీ ధామానికి వచ్చే జబ్బు. మెడికల్ ట్రీట్మెంట్ కోసం గాని,సర్జరీ కోసం గాని డాక్టర్ల వద్దకు వచ్చే రోగుల ను గమనించినప్పుడు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు సంబందించిన వాళ్ళు 25% ఉంటె గుండె కవాటాల రోగులు 35%ఇతర కోరోనరీ ధామానికి సంబందించిన వాళ్ళూ ఉండడం గమనించ వచ్చు. పుట్టుకతో వచ్చే గుందేలోపాలకు అంతగా తెలీదు.పూర్వ కాలంలో అవి వారసత్వంగా  వచ్చే జబ్బుగా అనుకునే వాళ్ళు.అది సరైన అభిప్రాయం కాదని,బహుశా గర్భంలో ఉండగా ఇన్ఫెక్షన్ కావడం వల్ల,,లేదా మేనరికపు వివాహాల వల్ల కావచ్చనేది మరో అభిప్రాయం. లేదా గర్భంలో ఉండే లోపాలు సరిగా ఎదుగుదల లేకపోవడం వంటిలోపాల మూలంగా కావచ్చునని  అభిప్రాయ పడ్డారు. వైద్యులు శాస్త్రజ్ఞులు చేపుతునా ఆమ్సాల ప్రాతిపదికన ఏ ఇన్ఫెక్షన్ మూలంగా నైనా సరే శరీరంలో  లోపల యన్టీ బాడీ తయారైతే అది గుండెను కూడా డ్యామేజ్ చేస్తుంది.అన్డుజే గొంతు ఇన్ఫెక్షన్  ను నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు వైద్యులు. గుందేకవాటాల జబ్బులో 9౦ %రుమాటిక్ గుండె జబ్బులే ఇవి ఎక్కువగా  గొంతు ఇన్ఫెక్షన్ కావటం మూలంగా వస్తాయని నిపుణుల అంచనా. గొంతు మాటిమాటికీ ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంటే ఆక్రమంలో కొన్నాళ్ళకి గుండె తీవ్రంగా దెబ్బతినే అవకాసం ఉంది. ఈ సమస్య ముఖ్యంగా మధ్య తరగతి,కింది మధ్య తరగతి కుటుంబాల వాళ్ళుఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కీళ్ళ నొప్పులు జ్వరం ఇన్ఫెక్షన్ కూడా ఈ వ్యాధిని కలగ జేసే అవకాసం ఉంది. కోరోనరీ ధమనికి వచ్చే వ్యాధుల గురించి మరింత వివరంగా చూద్దాం.

కొలస్ట్రాల్ ను నిర్లక్ష్యం చేస్తే సమస్యలే ?

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బిపి,గుండె జబ్బులు,స్తూల కాయం అన్న మాట  వింటూ ఉంటున్నాం.ముఖ్యంగా కో లేస్త్రాల్ ను గురించిన వాళ్ళు తెలియని వాళ్ళు అది ఎదో భూతం లాగా మనిషికి ప్రజలకి శత్రువు గా మాట్లాడం మనం చూడచ్చు. కొలస్ట్రాల్  ఈ ఆహార పదార్ధంలో ఉంది ఆ ఆహార  పదార్ధంలో లేదు.దీనిని త్తినాలి దీనిని తినకూడదు అంటూ క్లాస్ పీకడానికి రెడీ అయిపోతారు. నిజానికి అసలు కొలస్ట్రాల్ అంటే ఏమిటి? అది ఎలా మన ఆరోగ్యం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది? మనిషికి కొలస్ట్రాల్ ఎంతమేరకు అవసరం? ఎంతుంటే ఎక్కువ ఎంతుంటే తక్కువ? అన్న ప్రాస్న్లకు సమాధానాలు చూద్దాం. కొలస్ట్రాల్ అనేది ఒక మెత్తటి మైనం లాంటి పదార్ధం.లివర్ చేత తయారు కాబడే ఈపదార్ధం రక్తంలో కలిసి మన శరీర మంత ప్రవహిస్తూ వివిధ హార్మోన్లు పిత్తరసం విటమిన్ డి ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కొలస్ట్రాల్ మనశరీరంలో ఎక్కువ ఉత్పత్తి అయితే అది రక్త నాళాల లో పేరుకు పోయి రక్త ప్రసరణకు అవరోధంగా మారుతుంది.ఎదిరో స్క్లేరో సిస్ అనే సమస్యకు దారితీస్తుంది.దీని వాళ్ళ గుండె పోటు,ఆకస్మిక మరణం సంభవించవచ్చు. కొలస్ట్రాల్ ని రకరకాల్ పర్యాయ పదాలతో పిలుస్తారు.బ్లడ్ కొలస్ట్రాల్,ఆహార సంబంద కొలస్ట్రాల్,అని ఫ్యాట్,అనికోవ్వు అని ఇందులోనే స్యచురేటేడ్ ఫ్యాట్ అని అన్ స్యచురేటేడ్ఫ్యాట్ అని హాయ్ డెన్సిటి లైపో ప్రోటీన్లు అని ఈరకంగా పేర్కొన్నారు. బ్లడ్ కొలస్ట్రాల్... రక్తం ద్వారా  ప్రవహించే కొలస్ట్రాల్ ను బ్లడ్ కొలస్ట్రాల్ అని అంటారు. ఇది లివేర్లో ప్రవహిస్తుంది.మనం తిన్న ఆహారం నుంచి ప్రేవుల ద్వారా అరిగి రక్తంలో కలుస్తుంది. రక్తంలో ఉండాల్సిన దానికన్నా అధికంగా కొలస్ట్రాల్ ప్రవహిస్తున్నప్పుడు.అది ఇతర కొవ్వు పదార్శాలతో పాటు రక్త నాళాల  లోపలి గోడమీద పేరుకు పోతుంది.కొన్ని సంవత్సరాలకు పెరికిపోయిన ఆకోలస్త్రాల్ రక్త నాళా లలో అడ్డుపడి గుండెపోటుకు దారి తీస్తుంది. మేడలు రక్త ప్రసరణకు ఆటంకం కలిగి తల తిప్పడం కళ్ళు తిరగడం లాంటివి ఏర్పడి పక్షవాతానికి దారి తీయవచ్చు. ఆహార సంబంధ కొలస్ట్రాల్... జంతువుల రక్త ప్రవాహంలో ప్రయాణించిన కొలస్ట్రాల్ వారి శరీర కణాలలో ఇరుక్కుపోయి.కొవ్వుగా ఏర్పడుతుంది.మాంసం తో పాటు కొవ్వును మనం భుజించినప్పుడు మనశరీరంలో చేరి కొవ్వుగా ఏర్పడుతుంది.దీనిని ఆహార కొలస్ట్రాల్ అని అంటారు. మనం తినే ఆహారం గుడ్లు,మాంసం మొదలైన వాటిలో ఈ రకమైన దైటరీ కొలస్ట్రాల్ ఉంటుందని వైద్యులు అంటున్నారు. కొవ్వు ఫ్యాట్ కొలస్ట్రాల్... కొవ్వు మనశరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.శరీరంలో విటమిన్లు అరగడానికి కూడా కొవ్వు దోహదం చేస్తుంది. ఇందులో శారేరానికి రెండురకాల ఫ్యాట్ ను ఇచ్చేవి ఉనాయి ఒకటి శ్యాచురేటెడ్,అన్ శ్యాచురేటేడ్ ఫ్యాట్ గా పేర్కొన్నారు. శాచురేటెడ్ ఫ్యాట్... స్యచు రేటెడ్ ఫ్యాట్ మనరక్తం లో కొలస్ట్రాల్ ను పెంచుతుంది.ఈ కొలస్ట్రాల్ మాంసం లో,చికెన్ లో,పాలు,వెన్న,లాంటి పాల ఉత్పత్తుల్లో,గుడ్లు,కొబ్బరి నూనె,పామాయిల్,వంటి వాటిలో ఉంటాయి.సాధారణంగా రెఫ్రిజిరేటర్  టెంపరేచర్లో ఇవి గడ్డ కట్టుకు పోతాయి. అన్ శాచు రేటెడ్ కొవ్వు ఫ్యాట్... అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ర్రేఫ్రిజేరేటెడ్ టెంప రేచర్లో కూడా గడ్డకట్టకుండా ద్రవ స్థితిలోనే వుంటుంది.శాచు రేటెడ్ ఫ్యాట్ కన్నా ఇది కాస్త బెటర్ దీనిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి.పోలి అన్ శాచు రేటెడ్ ఫ్యాట్,మోనో అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ గా విభజించారు. సన్ ఫ్లవర్ ఆయిల్,సా ఫ్లవర్ ఆయిల్,సోయాబీన్ ఆయిల్,పోలి అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుందని నిపుణులు తేల్చారు. వేరుసెనగ,నువ్వులనూనె,అలీవ్ ఆయిల్,,ఓడలైన వాటిలో మోనో అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. నిత్య జీవితంలో శాచు రేటెడ్  ఫ్యాట్స్ ను వాడుతూ ఉంటె మన రక్తం లో కొలస్ట్రాల్ అధికంగా ఉన్నా కూడా అది తగ్గు ముఖం పడుతుంది. లైపో ప్రోటీన్స్... ప్రోటీన్ కోటింగ్ ఉన్న ప్యాకేజీలు మన రక్తం లో కొలస్ట్రాల్ ని నోసుకుంటూ ప్రవహిస్తాయి.ఇందులో హై డేన్సిటి,లైపో ప్రోటీన్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్ అని విభజించారు. హై డెన్సిటి లైపో ప్రోటీన్ మనరక్తంలో కొలెస్ట్రాల్ ని లివరుకు పంపుతుంది దానిని శరీరం నుండి బయటికి పంపుతుంది.మీశరీరంలో హెచ్ డి ఎల్ ఎంత ఎక్కువగా ఉండే గుండె జబ్బుకు దూరంగా ఉంటారు. లో డెన్సిటి లైపో ప్రోటీన్స్ అంటే ఎల్ డిఎల్ రక్తంలో ఎక్కువగా ఉంటె రక్తంలో ని అధిక భాగాన్ని మీరే స్వయంగా మోస్తూ తీసుకు పోతాయి. అలా తీసుకు పోతున్నప్పుడు అక్కడక్కడా రక్త నాళాల్లో కొంతభాగం కొలస్ట్రాల్ ని వదిలి వేస్తాయి.అలా వదిలేసిన కొలస్ట్రాల్ ఆయా భాగాలలో రక్త ప్రవాహానికి అడ్డుపడి గుండె జబ్బులకి పక్షవాతానికి దారి తీస్తుంది.మీ శరీరంలో రక్తంలో లో డెన్సిటి ఎంత ఎక్కువగా ఉంటె అంతగా మీరు గుండె జబ్బులకు దగ్గరైనట్లు చెప్పవచ్చు.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హై బిపి షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి

ఫోర్టిస్ సి డాక్ సెంటర్ డయాబెటిస్,మేటాబా లిక్ డిసీజ్,సమస్యలు వస్తున్నట్లు ఎన్దొక్రేనలజీ ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి' ఈ మధ్య కాలంలో 7 నుండి 8 కేసులు చూసినట్లు వివరించారు.58 సంవత్సరాల స్త్రీలో టైప్ 2 డయాబెటిస్ వచ్చిందని ప్ర్త్కొన్నారు.కోవిడ్ 19 వ్యాక్సిన్ వల్ల అనుకోకుండా రక్తం లో బ్లడ్ షుగర్ శాతం పెరుగు తున్నట్లు గుర్తించారు. ఈ అంసాల పై మెడికల్ జర్నల్ డయాబెటిస్ లో ప్రచురించారు.కోవిడ్ 19 మొదటి వ్యాక్సిన్ కోవిషీల్డ్ మార్చ్ 4 న తీసుకున్నారు.వ్యాక్సిన్ కు మిందు వారిలో ఎటువంటి షుగర్ సమస్యలు లేవని షుగర్ లెవెల్స్ పూర్తిగా ఆడుపులోనే ఉన్నాయని రోజూ మందులు వాడుతున్నట్లు ఆత్రువాతే వ్యాక్సిన్ తరువాతే షుగర్ లెవెల్స్ ఒకే నెలలో పెరగడాన్ని గమనించి నట్లు గమనించమన్నారు.మెటః ఫామిన్ డోస్ పెంచుతున్నట్లు వీటితో పాటు యాంటిబాయిటిక్ డ్రగ్స్ ఇస్తున్నట్లుఫోర్టిస్ సిడాక్ చైర్మన్  డాక్టర్ అనూప్ మిశ్రావెల్ల డిం చారు. మరో వ్యక్తికి 64 సంవత్సరాల పురుషుడు.కాగా జనవరి 18 న కోవిషీల్డ్ నోదటి డోస్ తీసుకున్నప్పుడు బిపి పెరిగిందని 13౦ /8౦ ,16౦ /9౦ గా ఉందని గుండె నొప్పి చమట పట్టడం కొన్ని గంటల పాటు,రక్త ప్రసారంలో హెచ్చు తగ్గులు ఉన్నాయని అన్నారు. 65 సంవత్సరాల్ వృద్దునికి రక్తంలో గ్లుకోజ్ శాతం ఉందని దీనిని 15 రోజుల్లో నివారించగలిగామని అనూప్ తెలిపారు. కోవి షీల్డ్ వల్ల సహజమ్జానే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అలసట,తలనొప్పి,జ్వరం ఫ్లూ,లక్షణాలు ఉంటాయని కడుపు నొప్పి చర్మం దురద,బిపి ,షుగర్ లెవెల్స్ పెరగడం,డయాబెటిస్ నాన్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ కు ముందు ఆహారం వ్యాయామం సరిగానే ఉన్నాయని సహజంగా వ్యాక్సిన్ వల్ల బ్లడ్ షుగర్ పెరగవచ్చు అని జర్నల్ లో పేర్కొన్నారు. డాక్టర్ మిశ్రా మాట్లాడుతూ ఈ సమస్యకు పెద్దగా మార్పులు అవసర, లేదని వ్యాక్సినేషన్ తరువాత బ్లడ్ షుగర్ పెరగడం పై రోగి గత చరిత్రను చూడాల్సి ఉంటుందని మిశ్రా అభిప్రాయ పడ్డారు.

ప్రోస్టేట్ క్యాన్సర్‌కు వాడే మందుతో కోవిడ్ కు చికిత్స

ప్రోస్టేట్ క్యాన్సర్కు వాడే మందు కోవిడ్ కు వడ వచ్చు అంటున్నారు శాస్త్ర  వే త్తలు. ఎస్సెక్స్ విశ్వ విద్యాలయానికి చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ నిర్వహించిన పరిశోదనలో భాగంగా అందుబాటులో ఉన్న మందుల ద్వారా ఇన్న్ఫెక్షన్ ను తగ్గించవచ్చ? అన్న కోణంలో పరిశీలించారు. వైరస్ కణాలను చేరకుండా నియంత్రించ గలదా? అనే కోణంలో పరిశోదనలు నిర్వహించారు. వైరస్ ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుందా శరీరంలోకి వైరస్ రాకుండా నివారించ వచ్చా?అయితే వైరస్ సత్వరం ఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతున్న విషయాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.శాస్త్రజ్ఞులు జరిపిన పరిశీలనలో ప్రోటీన్ ద్వారా ఊపిరితిత్తులలో కి వైరస్ చేరఫ్దాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.TMPRSS2 ప్రోటీన్ లెవెల్స్ తగ్గించడం ద్వారా చికిత్స చేయవచ్చ?పురుఉశులలో ఉండే సెక్స్ హార్మోన్లు అన్ద్రోజన్స్ వల్ల TMPRSS2శాతం  పెరుగుతోందనిదీనివల్లే చాలా కణాల పై ప్రభావం చూపుతోందని నిర్ధారించారు.శాస్త్రజ్ఞుల పరిశీలనలో ప్రోస్టేట్ పై పరిశోదనలు చేస్తున్న డాక్టర్ గ్రెగ్ బ్రూక్ లైఫ్ సైన్సెస్ కు చెందిన డాక్టర్ బ్రూక్ ఎంద్రోజన్ బ్లాకింగ్ డ్రగ్ ద్వారా ఎంజాలుతోమిదే అనే మందు ప్రోస్టేట్  క్యాన్సర్ లో వాడే మందు వైరస్ ను తట్టుకో గలదని పేర్కొన్నారు.TMPRSS ను తగ్గిస్తుంది.మానవులలో ఉన్న ఊపిరి తిత్తుల కణాలను యాంటి అన్ద్రోజన్ గా గణ నీయంగా తగ్గాయి.సార్క్ కోవిడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ ను న్నిరోదించింది.పరిశోధకులు మాట్లాడుతూ వారి పరిశీలన లో శరీరం పై జరుగుతున్న సజీవ సాక్ష్యంగా మని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్లినికల్ ట్రైల్స్ లో దీనిని సమర్ధ వంతంగా పని చేస్తోందని యాంటి ఆన్ద్రోజన్స్కోవిడ్19 కు ప్రభావ వంతమైన చికిత్స గాతేల్చారు.క్యాన్సర్ కు ప్రత్యామ్నాయ చికిత్స పై దృష్టి సారించారు.వారి ప్రతిభా అనుభవాణ్ణి వినియోగించినైపుణ్యంతో వైరస్ కు వ్యతిరేకంగా పోరాదగలిగే మందులు మరిన్ని ఉంటె వాటిని వినియోగించడం ద్వారా ప్రత్యామ్నాయ మందులు వినియోగించే వీలుగా పరిశోదనలు చేస్తున్నారు. అయితే కోవిడ్ వైరస్ పురుషుల పైతీవ్ర ప్రభావం చూపుతున్నదాని మరణాలు శాతం ఎక్కువగా ఉన నేపధ్యంలో పురుషుల హార్మోన్లు అన్ద్రోజన్లు క్యాన్సర్ పై కొన్ని ఏళ్లుగా చేస్తున్న పరిశోదనలు ప్రోస్టేట్ క్యాన్సర్కు వాడుతున్నామని ఇప్పుడు సార్క్ వైరస్ ఇన్ఫెక్షన్ పై ఈ మందును ప్రయోగాత్మకంగా పరిసీలించినట్లు చెప్పారు.ఈసందర్భంగా డాక్టర్ బివెన్ మాట్లాడుతూ మా పరిశోదన ఇతర మందుల వాడకం పై కూడా పరిశోదనలు చేయనున్నట్లు తెలిపారు.ఆర్మోన్లకు సంబంధించి కొన్ని ఔశాఫాలు అందుబాటులో ఉన్నాయని ఇతర దీర్ఘకాలిక సమస్యలు వాటికీ అందుబాటులో ఉన్న వైద్య పద్దతులు పై పూర్తిగా దృష్టి సారించనున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కు చేసే చికిత్స తో కోవిడ్ కు ను కట్టడి చేయవచ్చు.                         

అందుకే డాక్టర్ ప్రజలకు దేముడయ్యాడు

యముడు ప్రాణం తీస్తాడు డాక్టర్ ప్రాణం పోస్తాడు.అందుకే డాక్టర్ ప్రజలకు దేముడయ్యాడు అత్యవసర సమయంలో రోగికి సేవల నందించే ప్రాణ దాత లందరికీ తెలుగు వన్ హెల్త్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇక తనకు జీవితం అయిపోయిందన్న నిరాశలో ఉన్న రోగికి భరోసా ఆసరా డాక్టర్. సమస్య ఏదైనా సరే దాని మూలాన్ని కనుకుని మిణుకు,మినుకు మంటున్న ఆశాదేపాన్ని ఆరనీకుండా  శరీరంలో ఎక్కడ సమస్య ఉన్న సరే సెలైన్ఇచ్చిమళ్ళి ప్రాణం పోస్తాడు. ఇక విషయా ని కి వస్తే ప్రతియేటా జూలై 1 న జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జూలై 1  డాక్టర్స్ కు ప్రత్యేకమైన రోజు అంటే డాక్టర్స్ చేసిన చేస్తున్న గుర్తింపు నివ్వడమే.ఈ రోజును బెంగాల్ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ స్మృతికి చిహ్నంగా ఈ రోజును జరుపుకోడం డాక్టర్స్ కు స్ఫూర్తినిస్తుంది. జాతీయ డాక్టర్ల దినోత్సవం ప్రాముఖ్యత తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతిదేశంలో కొన్ని కొన్ని వేరు వేరు తేదిలలో జరుపు కుంటారు.మొట్ట మొదట199౩ లో యు ఎస్ లో జాతీయ డాక్టర్ల దినోత్సవం జరుపుకున్నారు. జార్జియా,ఫైల్లిప్పిన్స్,లో మరణించిన వారి స్మారకార్ధం డాక్టర్స్ డే  నిర్వహించారు.క్యూబాలో మార్చ్ ౩౦ న జరుపు కుంటారు. డాక్టర్స్ డే ను  కేంద్రం 1991 లో గుర్తించింది.బిసి రాయ్ ఆరోగ్య రంగంలో చేసిన సేవలకు గాను వారి స్మారకార్ధం జరుపుకుంటారు. చిత్తరంజన్ సేవాసదన్,కమలా నెహ్రు మెమోరియల్ ఆసుపత్రి,విక్టోరియా ఇన్స్తిటూట్,చిత్తరంజన్ క్యాన్సర్ ఆసుపత్రి.చిత్తరంజన్ సేవా సదన్. స్త్రీలు పిల్లల కోసం ఏర్పాటు చేసారు. ఆరోగ్య రంగం లో ప్రజా ఆరోగ్యం కోసం తన జీవితాన్ని ఆస్థి పాస్తులను పూర్తిగా త్యాగం చేసి ప్రజా ఆరోగ్య రంగానికి జవసత్వాలు ఇచ్చిన డాక్టర్ రాయ్ చిరస్మరణీయుడు.కొన్ని అత్యవసర సమయంలో శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే ఎక్కడున్నా అప్పటికప్పుడు  సర్జరీ చేసేందుకు తన సుఖాలను సైతం వదిలి ముందుకు వచ్చే డాక్టర్స్ చాలానే ఉన్నారు అటు ఇల్లు వదిలి వ్రుత్హినే పూర్తిగా నమ్ముకుని అహరహం శ్రమిస్తున్నడాక్టర్స్ కు సెల్యుట్ చేస్తుంది. డాక్టర్స్ మానవుల ఆరోగ్య సంరక్షణ-ఆహారం-వ్యాధి కరక మైన వాటిని నిర్మూలించడం ---ధామస్ ఎడిసన్  మందు వ్యాధిని నయం చేస్తుంది-డాక్టర్స్ రోగులకు నయం చేస్తారు.--ప్రపంచానికి మీరు తల మానికం ముఖ్యంగా కోవిడ్ ప్యాన్దమికి సమయంలో తమకు కోవిడ్ వస్తుందని తెలిసినా రోగులకు సేవచేస్తూనే మరణించిన డాక్టర్స్ సేవనిరాతికి వారికి తెలుగు వన్ శ్రద్దాంజలి గతిస్తూ వారి సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోడం సముచితమని భావిస్తున్నాం.కోవిడ్ తీవ్రత ముప్పు ఉందని తెలిసినా డాక్టర్స్ హెల్త్ వర్కర్స్ 24 ఘంటలు సేవలు అందిస్తు దేశానికీ సేవ చేస్తున్న చేసిన ప్రత్యేకంగా ఆరోగ్యరంగం కష్ట  సమయంలో సేవలు అందించిన నర్సింగ్ సిబ్బందికి వారిని ప్రత్యేకంగా గౌరవిద్దాం,గ్రామీణ ప్రాంతాలలో మిఖ్యంగా మారుమూల ప్రాంతాలలో పేదలకు నిరుపేదలకు ఉచితంగా మందులు సేవలు అందించిన డాక్టర్స్ కు అభినందనలు అందిస్తోంది మీసేవకు విలువ కట్టేలేనిది. అయితే అందరికీ ఆరోగ్యనిధిని ఇద్దాం ధైర్యం చెపుదాం అందరూ ఆతోగ్యంగా ఉండేలా చూద్దాం. కోరోనలు ఎన్నివచ్చిన మనలను ఏమి చేయలేదన్న ఆత్మస్ఫ్ధైర్యాన్ని ఇద్దాం మనలను య్హోతివారిని కాపాడుకుందాం.డాక్టర్స్ అందరికీ పేరు పేరు నా శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్ హెల్త్ చనం టీం. 

ఊబకాయానికి ప్రమాద కారకాలు మీకు తెలుసా?

ఊబ కాయం వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేదిస్తోంది. ఊబా కాయం పై నిర్వహించిన పరిశోదనలో ర్యాండం గా ఊబ కాయాన్ని  తగ్గించేందుకు వీలున్న సప్లి మెంట్స్- ప్రత్యామ్నాయ తెరఫీ పద్ధతులపై పరిశోదనలు చేసారు.ఉన్నత ప్రమాణాలాతో కూడిన ఉత్పత్తుల పై సమీక్షించారు.సప్లి మెంట్స్ ఉత్పత్తుల రంగానికి బద్రత ఉత్పత్తులపై దాడులు మరియు ఉత్పత్తుల ప్రచారం అంశం పై సమీక్షించారు.సప్లి మెంట్స్ కొన్ని సందర్భాలలో పక్క దారి పట్టడం పై సమీక్షించారు. కౌన్సిల్ ఫర్ రేస్పొంసిబుల్ న్యూట్రిషి యన్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశ్రమకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.అసలు ఈ నూతన పరిశోదనకు ఉన్న విలువ ఏమిటి? అన్న అంశం ప్రశ్నించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆధునిక పద్దతుల ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకుంటారు. అమెరికాలో 1/3 వంతు మంది దైటేరీ సప్లి మెంట్స్ వాడినట్లు తెలిపారు.దీతో వారి లక్ష్యం  పూర్తి చేసినట్లు చెపుతారు. నూతన సమీక్ష తరువాత ఉన్నత ప్రమాణాలు నాణ్యతతో కూడిన సాక్ష్యం ఆధారంగా బరువును తగ్గించేందుకు నిర్దేశించిన ఉత్పత్తులు ప్రత్యామ్నాయ తెరఫీలు లేవని తేలింది. క్లినికల్ ట్రైల్స్ లో ఒక ర్యాండం ప్రకారం నిర్వహించి గోల్డ్ స్టాండర్డ్ క్లినికల్ రీసెర్చ్ గురించిన వివరాలు  ఒబేసిటీ జర్నల్ లో ప్రచురించింది. పరిశోదనలో క్లినిషి యన్స్,శాస్త్ర వేత్తలు,ఉత్పత్తి దారులు ఊబకాయం తగ్గించే ఉత్పత్తుల పై పూర్తి స్థాయిలో మూల్యాంకనం జరగాలని అన్నారు.నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ చాపెల్ హిల్ కు చెందిన ఎం డి బట్సిస్ క్లినిషియన్స్ ఇచ్చిన వివరాల ప్రకారం రోగులకు అత్యవసరమైన పక్షం లో రోగులకు సూచిస్తా మని అన్నారు.అయితే అనుమతి పొందిన తెరఫీలు లేవు.గతంలో స్థూల కాయులు అమెరికాలో లేరని ఈ మధ్య కాలం లో స్థూల కాయులు బాగా పెర్గిపోయరని పేర్కొన్నారు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2౦౦7 -2౦౦8 లో33.7%2౦15-2౦16 లో39.6%పెరిగింది.డయాబెటిస్,గుండె సమస్యలు,క్యాన్సర్ త్వరగా చనిపోవడం వంటి సమస్యలు జరుగుతున్నాయనిపరిశోదనలో తేల్చారు. తరచుగా బరువు తగ్గేందుకు తీవ్ర ప్రయాత్న్సాలు చేస్తున్నారనివీటికి చేసే చికిత్సలు ఎఫ్ డి ఏ అనుమతులు లేవని తెలిపారు. సరైన ఆరోగ్య నిపుణులు పెద్దగా లేరని యాంటీ ఒబెసిటీ థెరపీ నిపుణులు లేరని చాలా మంది ప్రజలు ప్రిస్కిప్షన్ లేకుండానే బరువు తగ్గే సహజంగా ఉండే సప్లి మెంట్స్ ను నమ్ముతారు.సహజమైన లేదా క్లినికల్ గా నిరూపితమైన ప్రొడక్ట్స్ లేవు. వినియోగ దారులు ఎఫ్ డి ఏ అనుమతించిన ఉత్పత్తులను నమ్ముతారు. వైద్య వృత్తి చేసే నిపుణుల వద్ద సరైన సమగ్ర సమాచారం ఉండదని తెరపీల పై శాస్త్రీయమైన క్లెయిమ్ లేవని ప్రచారం చేసే వారికి సైతం పూర్తిగా అవగాహన ఉండదని సమీక్షించారు. అక్యుపంక్చర్. గ్రీన్ టీ  ఎఫేద్ర-కఫ్ఫే గువర్గం  కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్  చాక్లెట్ -కోకా చరోమ్లుం  పి రు వటే  మైండ్ బాడీ తెరపీస్ 315 అంశాల పై ట్రైల్స్ నిర్వహించగా అందులో 52మాత్రం తక్కువ ప్రమాదం ఉందని వాటి ప్రభావం ఆధారం గా క్లెయిమ్ చేయవచ్చు.16 సంతృప్తికరంగా బరువు తగ్గారని ౦.3నుంచి 4.93 కిగ్ర తగ్గినట్లు నిరూపించారు. సప్లిమెంట్ల పై చేసిన పరిశోదనలో చాలా తక్కువ మందికి ఊబాకయం తగ్గినట్లు గుర్తించారు. కొన్ని పౌన్లు కూడా తగ్గ లేదు.ఆరోగ్యం పై ప్రభావం చూప లేక పోయాయని అన్నారు. డైటీ సప్లిమెంట్ల పై మరిన్ని అంశాలు మూల్యాంకనం చేయాల్సి ఉంది.ఇఊబాకాయం  తగ్గడానికి ప్రత్యామ్నాయ తెరఫీలు నాణ్యత లేనివని ఉత్పాదనలను సూచించ బోమని కాబ్బట్టి నాణ్యతా ప్రమాణాలు లేని సప్లిమేన్ట్లను వాడకండి.