మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఆరోగ్యానికి రోగనిరోదక శక్తికి సంబంధం ఏమిటి? అసలు రోగ నిరోధక వ్యవస్థ గురించి కొన్ని కీలక అంశాలు  తెలుసుకుందాం రోగ నిరోధక శక్తి తగ్గితే  శరీరంలో ఏ ఏ అవయవాలు ప్రభావిత మౌతాయి? అన్న విషయం తెలుసుకుందాం. అసలు రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తిన డానికి కారణం ఏమిటి? ఏ దైనా పత్రికను తిరగేస్తూ ఉండగా పొరపాటున మధ్య పెజిలో పిన్ను మీ వేలుకు గీసుకుని గాయమతే మీరు ఏమి చేస్తారు?చివ్వుమన్న నొప్పి వస్తే అబ్బ అని వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించ కుండా మీ వేలును నోట్లో పెట్టుకుంటారు. అసలు పిన్ను గ్గుచ్చుకున్న వంటనే మీ శరీరంలో వచ్చే మార్పు ఏమిటో మీకు తెలుసా? పిన్ను గుచ్చుకోగానే చాలా సూక్ష్మ క్రిములు మీ శరీరం లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. వెంటనే మీ శరీరంలో రోగ నిరోధక యంత్రాంగం అలెర్ట్ అయి ఆ బ్యాక్టీరియాను నాశనం చేయడానికి చేసే ప్రయత్నంలో,గాయాన్ని మాన్పించే ప్రయత్నం లో తల మునక లై పోతుంది. ఆ పోరాటంలో రోగ క్రిములు నశించ వచ్చు.లేదా శరీర కణజాలమునశించ వచ్చు. గుండె ఊపిరి తిత్తులు లాగే రోగ నిరోధక వ్యవస్థను.కూడా మన శరీర మంతా వ్యాపించి ఉంటుంది. బయటి నుంచి మన శరీరం మీద దాడి చేసే మిలియన్ల కొద్ది రసాయనాలు సూక్ష్మ క్రిముల నుంచి జీవితంతాం కాపాడు తూనే ఉంటుంది. మనలోని రోగ నిరోధక వ్యవస్థను మన శరీరానికి సంబందించిన కాణా లేవో స్పష్టం గా తెలిసి ఉంటుంది. శరీరానికి సంబందించిన కణ జాలం(బ్యాక్టీరియా లాంటిది) ఏ దైనా లోపలికి ప్రవేశించి నప్పుడు.రోగనిరోదక వ్యవస్థ వెంటనే  స్పందించి వాటి పైన దాడి చేస్తుంది.శరీరం లోపల యాంటీబాడీస్ ని సృష్టించుకుని బ్యాక్తీరియాతో పోరాడించ వచ్చు.లేదా బ్యాక్టీరియాతో నేరుగా పోరాడే కాణ జలాన్ని ప్రేరేపించిరోగ క్రిములను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ క్రింది అవయవాల ద్వారా పని చస్తుంది. 1)థైమస్ గ్రంది. 2)ఎముకలలోని మూలుగ  3)లీంఫ్ గ్రందులు. 4)లింఫ్ నాళాలు. 5)ప్లీహము. ఇప్పుడు వీటిలో ఒకదాని గురించి ఒకటి తెలుసు కుందాము. 1)ఛాతి ఎముకకు వెనుక వైపున వుండే గ్రంధి ఉత్పత్తి చేసే తెల్ల రక్త కణాలు టి -లింఫసైట్స్  గా పరిణతిచెంది.శరీరం లోపలి ప్రవేసించిన వైరస్ లతో పోరాడతాయి. 2)టి- సెల్స్ గా పిలవబడే ఈ కణాలకు మరి కొన్ని కణాలు తోడై అన్నీ కలిసి వైరస్ మీద మొత్తంగా పోరాటంకి దిగుతాయి.  3)టి- సెల్ల్స్ తో కూడె మిగతా కణాలు... సహాయక టి-సెల్ల్స్.... ఈ కణాలు బి-లింప సైట్ అనబడే మరో రకపు  కణాలతో యాంటీ బాడీస్ వృద్ధి కావడానికి దోహదం చేస్తాయి. (ఎయిడ్స్ వ్యాధిలో ఎయిడ్స్ వైరస్ ఈ హెల్పర్ టి-సెల్స్ నే నాశనం చేసి మనిషని నిర్వీర్యం చేస్తాయి.) 4) కిల్లర్ టి సెల్స్... మన శరీరానికి సంబందించిన బయటి కాణ జాలం లోపలి ప్రవేశించి నప్పుడు ఇవి త్వరిత గతిన వరూధి చెంది వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి.మన శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లను నాశనం చేసేది ఈ కిల్లర్ టి సెల్ల్స్ అని నిపుణులు పేర్కొన్నారు. 5) సశ్రేసర్ టి -సెల్స్.... మన శరీరంలోకి ప్రవేశించిన శత్రువు ఇన్ఫెక్షన్ ఒడి పోగానే ఇక యుద్ధాన్ని ఆపమంటూ.ఈ కణాలు యుద్ధ విరమణ సూచన ను అదేసిస్తాయిసశ్రేటర్-టి సెల్ల్స్ కనుక బలహీన పడ్డ లేక పనిచేయక పోయినా రోగ నిరోధక వ్యవస్థకు చెందిన మిగతా కణాలు పోరాటాన్ని ఆపవు. అలంటి సందర్భంలో ఇన్ఫెక్షన్  అనబడే శత్రువు లేకపోతే అవి మన శరీర కణజాలం మీదే పోరాటాన్ని సాగించి రోమటైద్ ఆర్త్రైటిస్ వంటి కీళ్ళ  వ్యాధులకు కారణం అవుతుంది. 6)ఎముకలలో మూలుగ... మన ఎముకలలో ఉండే మూలుగ అనే పదార్ధం తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.ఈ తెల్ల రక్త కణాలుశరీరం లోపలి ప్రవేశించిన స్సూక్ష్మ క్రిములతో పోరాడు తాయి. 7)లింఫ్ గ్రంధులు..... లింఫ్ గ్రంధులు బి-లింఫో అనబడే ఒక రకమైన తెల్ల రక్త కణాలను తయారు చేస్తాయి. ఈ బి సెల్స్ పై భాగాన ఇమ్యునో గ్లోబులిన్ అనే ఒక  ప్రోటీన్ పదార్ధం ఉంటుంది.ఈ బి సెల్ల్స్ ఇన్ఫెక్షన్ తో పోరాడే యంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. 8 )లింఫ్ నాళాలు.... ఈ నాళాలు మన శరీరంలో ఇన్ఫెక్ట్ అయిన భాగాన్నుంచి సూక్ష్మ క్రిములను లింఫ్ గ్రంధుల వద్దకు చేరుస్తాయి.అక్కడ లింఫ్ గ్రంధులు తయారు చేసే యాంటీ బాడీస్ ఆ సోక్ష్మాల పైన దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. 9)ప్లీహము..... రక్త ప్రవాహము ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములుఇక్కడ తెల్ల రక్తకణాలతో ముంచెత్త బడి నాశనం చేయబడతాయి. రక్త నాళాలు.... రక్త నాళాల ద్వారా తెల్ల రక్త కణాలు,యాంటీ బాడీస్,శరీరమంతా ప్రయాణిస్తూ శరీరానికి అపకారం కలిగించే బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతూ మన ఆరోగ్యానికి పహారా కాస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ రెండు రకాలు.... 1) ఇన్నేట్  ఇమ్మ్యునిటి 2 )అడప్టివ్ ఇమ్మ్యునిటి. ఇన్నేట్ ఇమ్యునిటిలో చర్మం కొంత ప్రాముఖ్యత వహిస్త్గుంది.నోరు,గొంతు,కళ్ళు,ప్రేవులు,యోని, మూత్రనాళాలలో తయారయ్యే ఎంజైములు అనబడే పదార్దాలు మిగతా ప్రాముఖ్యత వహిస్తాయి. 2) ఇవన్నీ మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తూ ఉంటాయి.పసి పిల్లలు తల్లి గర్భంలో వుండగాతల్లి శరీరం నుంచి లభించే యాంటీ బాడీస్ ద్వారా రక్షణను పొందితే ఆ తరువాత తల్లి అందించే స్తన్యం ద్వారా రక్షణను పొందుతారు. 3)మనిషి పెరిగి పెద్ద పెద్ద అవుతూ వివిధ రకాల సూక్ష్మ క్రిములు దాడికి గురి అవుతున్నా కొద్ది అతని శరీరం తనకు తాను రోగ నిరోధక చర్యలను సంతరించుకుంటుంది.దీనిని అడప్టివ్ ఇమ్మ్యునిటీ అంటారు.దీని మూలంగా శరీరం లోకి  ప్రవేశించిన  సూక్ష్మ క్రిములను తెల్ల రక్తకణాలను గుర్తుంచుకుని మల్లె అలాంటి క్రిములు లోపలి ప్రవేశించినప్పుడు పూర్వంలో ఉండే యాంటీ బాడీస్ తిరిగి సృష్టించి విజయాన్ని సాధిస్తాయి. ఈ సిద్దాంతం ఆధారం గానే కృత్రిమంగా టీకాలను తయారు చేసుకుని వాటితో రోగ నిరోధక  వ్యవస్థను పటిష్ట పరుచుకుని పోలియో లాంటి కొన్ని వ్యాధులను దగ్గరికి రాకుండా అడ్డుకట్ట వేయగాలిగాం అయితే అదే పద్దతిని అవలంబించ్గడం ద్వారా  టీకా తోనే కోవిడ్ వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమని అనుకోవచ్చ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ఫెక్షన్ నిరోదించే ఇతర చర్యలు... ---లాలాజలం ----నోటి ద్వారా లోపలి ప్రవేసించే సూక్ష్మ క్రిములను లాలాజలం తో ఉండే ఎంజైమ్ లు నాశనం చేస్తాయి. కనీరు ----కంటిలోపలికి ప్రవేసించే సూక్ష్మ క్రిములు కన్నీటి ద్వారా బయటికి పంపడం జరుగుతుంది.ఇంకా ఎమన్నా  సూక్ష్మ క్రిములు కంట్లో మిగిలి ఉంటె  కన్నీటి తాలూకు ఎంజైమ్లు వాటిని నసింప చేస్తాయి. ముక్కు ---- దుమ్ము ధూళి ద్వారా ముక్కు లోకి ప్రవేసించే సూక్ష్మ క్రిములను ముక్కులోపల ఉండే కేస నాళికలుబందించి చీమిడి  ద్వారా ఎమన్నా లోపలి వెళితే దగ్గటం ద్వారా మనం వాటిని మనం బయటకి నెయ్యేస్తాయి. ప్రేవులు ----- కడుపులో తయారయ్యే యాసిడ్ అక్కడికి చేరుకున్నాక సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.ప్రేవులలోకి ప్రవేశించిన సూక్ష్మ క్రిములను ప్రేవులలోనే  నిలువరించే సహాయక బ్యాక్టీరియా నసింప చ్గేస్తాయి. మూత్ర నాళాలు---- మూత్రనాళాలలోని సహాయ బ్యాక్టీరియా అక్కడికి ప్రవేసించే  సూక్ష్మ క్రిములను నసింప చేస్తాయి.స్త్రీలకు యోనిలో ఉంటె మ్యుకస్ లైనింగ్  కూడా అక్కడ ప్రవేసించే సూక్ష్మ క్రిములను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. చర్మం ----- చర్మ గ్రంధులలో ఉత్పత్తి అయ్యే స్వేద గ్రంధులలో ఉత్పత్తి అయ్యే నూనె స్వేదం చర్మం ద్వారా లోపలి కి ప్రవేసింపచేసే సూక్ష్మ క్రిములను  నసింప చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలా మనశరీరంలోని ప్రతి భాగము బయటి నుంచి వచ్చి దాడి చేసే సూక్ష్మ క్రిములను నాశనం చేయడంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ ఉంటాయి. మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయ్యా లంటే సూత్రాలు----- విటమిన్లు ,ఖనిజలవణాలు,సమృద్ధిగా లభించే సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ శరీర వ్యాయామం చేయాలి. అయితే ఆతిగా వ్యాయామం వద్దు. ఒత్తిడులకు దూరంగా ఉండాలి.పొగ తాగడం మద్యం సేవించడం మానుకోవాలి. అప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి  వైరస్పై పోరాదగలం.                                

భీమా – ధీమా

మీరు భీమా కట్టరా? అయితే మీరు ధీమా గా ఉన్నారన్న మాట. అయితే మరీ అంతా ధీమాగా ఉండకంటి, ఇందులో కూడా  కొన్ని నష్టాలు కష్టాలు ఉన్నాయి అవి ఏమిటో సమస్యకు పరిష్కారానికి ప్రయత్నమే  చేయడమే   మా భీమా – ధీమా కార్యక్రమం. సొ వెల్కంటు  భీమా ధీమా కార్యక్రమం... మొంటేజ...                                                                                                      మనిషికి భీమా ఉంటే ధీమా ఏ వేరని అని అనుకుంటున్నారు సామాన్యులు.  కొందరికి భీమా భారంగా మారిందని. ప్రతి సంవత్సరం మనం పెట్టె పెట్టుబడికి మనకు వచ్చే  ఆదాయం ఎంత అన్న ప్రశ్న వేదిస్తోంది. ఇది నిజం అయితే సంవత్సరం వచ్చిందటే  ఇన్సూరెన్స్ పోలసీ కోసం కంపెనీలు పడరాని పాట్లుపడతారు. మీకు 80 సి ప్రకారం   ట్యాక్స్ ఎగ్జంషన్  వస్తుంది అంటూ అసలు ఒప్పంద పాత్రల  చూడ కుండానే సంతకం చేసి ఇచ్చేస్తున్నారు పోలసీ దారులు. అసలు పాలసీ అంటే ఏమిటి? పాలసీ విలువ ఎంత? ఏ పాలసీ కి ఎంత కట్టాలి ? పాలసీ మెశ్చురి టీ ఎన్నాళ్లు?  భీమా మధ్యలో పాలసీ దారుకు జరిగే నష్టాన్ని ఎలా లెక్క కడతారు? కాష్ లెస్ పాలసీ ఏ ఇన్సూరెన్స్ పరిధి లోకి వస్తుంది? రీ ఎంబర్స్ మెంట్ పాలసీ అంటే ఏ మిటి?  ఇన్వెస్ట్ మెంట్ పాలసీ అంటే  ఏమిటి ? లైఫ్ ఇన్సూరెన్స్.నాన్ లైఫ్  ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి అన సందేహాల కు మానిపుణులు ఇచ్చే సమ ధానాలు , సలహాలు సూచనలు మీకోసం అందిస్తోంది రాజ్ న్యూస్  అసలు ఇన్సూరెన్స్ లో ఉన్న నిజాలు,  ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు, క్లెయిమ్ లు  ఇవ్వడం లో ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం చేస్తే ఎవరిని సంప్రదించాలి? కోర్టుకు వెళ్తే సమస్య మరింతజటిలం అయ్యే అవకాశం ఉన్నదున అంబుట్స్ మెన్ కమిటీ ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అన్న సందేహాలకు  సమాధానం    భీమా – ధీమా . అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటో ఈ ఏ . వి  చూద్దాం.                                                                                                                          ఇన్సూరెన్స్ ఈ పదం గురించి తెలియని వాళ్ళు ఈ మధ్య కాలం లో లేరంటే అతిశయోక్తి లేదు నిజానికి తెలిసో తెలియక ఎప్పుడో ఎక్కడో ఏ స్నేహితుడి ప్రోత్సాహంతోనో  భీమా అస్దే ఇన్సూరెన్స్ కట్టేఉంటారు. దానిని వినియోగించుకునే ఉంటారు. లేదా మధ్యలోనే ప్రీమియం కట్ట లేక ఆపేసి ఉంటారు.  అయితే ఇన్సూరెన్స్ ఈ రోజు నిత్య  అవసరంగా మారింది. ముఖ్యంగా దిగువా మధ్య త్రాగతి ప్రజలకి , ఉద్యోగులకి ఇన్సూరెన్స్ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి గా చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు  ఊ దర కొట్టే ప్రకటనలు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ల కు  భారీ కమీషన్లు ముడుతూ  ఉండడం తో  సంవత్సరానికి 7000/ రూపాయలు కట్టండి ఇన్సూరెన్స్ మీకు నెల రోజుల్లో ఆక్టివేట్ అవుతుంది. మీరు ఒకవేళ  అనారోగ్య సంస్య వస్స్థే మీకు దగ్గరలో ఉన్న అసు పత్రి  లో  ఐనా చేరండి. ఇది క్యాష్ లెస్ పాలసీ అంటూ చెప్పగానే ఏజెంట్ల మాటలను నమ్మి డబ్బు కడుతున్నారు పాలసీదారులు. మీ పాలసీ కి సం అస్సుర్డ్ అమౌంట్ 50000/ ఆక్షరాలా ఐదు లక్షలు వస్తుంది అని అనగానే అయితే తీసుకుందాం డబ్బు ఉన్న రోజు ఉంటుంది లేని రోజూ ఉంటుంది. అత్యవసర సమయంలో ఆడుకునే బీమా ఉందిగా అనుకుని ధీమా గా  ఉంటారు అసలు భీమలు ఎన్నిరకాలు  ఏ పాలసీ పెట్టుబడి దారుకు లాభ దాయకం అన్న అంశాలు నిపుణులు చెప్తారు లెట్స్ గో  ఫోర్ ఫాక్టర్స్ -.అసలు ఇన్సూరెన్స్ భారత్ లో ఎలా పుట్టింది దానిచరిత్ర పూర్వోత్తరాలు  తెలుసు కోడం అవసరం  ఏమంటారు. ఇన్సూరెన్స్ ఆక్ట్ 1938 ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ ను భారత దేశంలో 19జనవరి 1956  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం అప్పటికే 245 కంపనీలు  పని చేస్తున్నాయని వీటి అన్నిటి ఒక గొడుగుకిందకు తీసుకు వచ్చేందుకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ను ప్రారంభించింది.  అయితే అన్నీ ప్రధాన కంపెనీలే ఇవి నాలుగు రాష్ట్రాలలో మెట్రోపాలిటన్  నగ రాలలో అంటే 19999 నాటికి ప్రైవేట్ రంగం లో ఇన్సు రెన్స్ లేదని పరిశోదనలో వెల్లడి అయ్యింది. వాటి పూర్వాపరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది నాన్  లైఫ్ ఇన్సూరెన్స్,,గా కేటగిరీ లుగా  విభాగించారు  అయితే  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ని జనరల్ ఇన్సూరెన్స్ గా పరిగణిస్తారు. ఈ రెండు ఇన్సూరెన్స్ లు ఐ ఆర్ డి ఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యు లేటరీ ఆథారిటీ అండ్ దవలప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. ఇర్ డా ఇన్సూరెన్స్ రంగాన్ని పర్య వేక్షిస్తుంది. ఇన్సూరెన్స్ కు కస్టోడియన్ గా  ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్ల హక్కుల పరి రక్షణకు ఇరిడా  క స్టో డియన్ అని చెప్పాలి. భారతదేశంలో 57 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 24 ఇరవై నాలుగు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు కాగా 33 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలుఉన్నాయి. అందులో కొన్ని 7 పబ్లిక్ రంగం విభాగంలో పనిచేస్తున్నాయి. గతంలో కొన్నిదశాబ్దాలుగా ఇన్సూరెన్స్ అంటే ఠక్కున గుర్తికు వచ్చేది ఎల్ ఐ సి మాత్రమే అంటే జీవిత భీమా సంస్థ, అదే పెద్ద వ్యవస్థ గా పేరెన్నిక గన్న ఏకైక సంస్థ అంటే అతిశయోక్ఠీ  కాదేమో. లేదా కొన్ని పేరెన్నిక సంస్థలుగా చెప్పుకునే సంస్థలలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్  ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, మాత్రమే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా జనరల్ ఇన్సూరెన్స్, రంగం గా పేర్కొన్నారు.దీనిగురించిన  మరిన్ని వివరాలు.                                తెలుసుకుందాం...  ప్రభుత్వ రంగంలో కొనసాగిన ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో విస్తరించింది. ఇరిడా  ఇన్సూరెన్స్  రెగ్యు లేటరీ  ఆధారిటీ ఆఫ్  ఇండియా లో ఎన్నో మార్పులు చేర్పులు చేసిన తరువాత ఇన్సూరెన్స్ రెగ్యులే టరి  ఛత్రం 1999 ప్రకారం. ప్రైవేట్ రంగంలో ఎఫ్ డి ఏ అంటే  ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ను ఆహ్వానించింది భారతప్రభుత్వం. అయితే చట్ట ప్రకారం ఎఫ్ డి ఐ లను 26% పరిమితి విదిస్తూ 2016 లో చట్టం  తీసుకు  వచ్చింది. ఇక ప్రైవేట్ రంగం లోకి ఇన్సు రెన్స్ ఎప్పుడైతే పెట్టుబడులకు ఆహ్వానం పలికిందో 2000 సంవత్సరానికి, ఇన్సూరెన్స్ రంగం రూపు రేఖలు మారిపోయాయని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపనీలు 30 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ రాగాన్ని శాశిస్తు న్నాయని నిపుణులు విశ్లేషించారు. ఇంకా మరెన్నో కంపెనీలు ఇరిడా అనుమతికోసం నిరీక్షిస్తున్నట్లు సమాచారం.                                                                                                                                                 ప్రైవేట్ రంగంలో దూసుకు పోతున్న ఇన్సూరెన్స్ రంగం లో 19 జనరల్ ఇన్సురేయన్స్ కంపెనీలు, 5 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు , విదేశీ కంపెనీలు కలిసి ఇన్సూరెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసి నట్లు  అయ్యిందని నిపుణులు తమ పరిశోధనలో వెల్లడించారు. భారత దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో  విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం కావడంతో ఎఫ్ డి ఐ ని 2000 సంవత్సరానికి 26% పరిమితి  విదించింది. తరువాత 2014 లో ఎఫ్ డి ఐ ను 49% పరిమితి  ని విదిస్తూ ఇరిడా ఇన్సూరెన్స్ చట్టం 2015 లో మార్పులు చేసిందని విశ్లేషకులు వివరించారు. అయితే ఇప్పటికీ ఎల్ ఐ సీ ఇన్సూరెన్స్ రంగం పై తన ఆది పత్యాన్ని కొనసాగించడం విశేషం ప్రవైట్ రంగంలో వచ్చిన హెచ్ డీ ఎఫ్ సీ, ఐ సి ఐసి ఐ , ఎస్ బి ఐ, బ్యాంకులు సైతం ఇప్పటికీ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఇన్సూరెన్స్  కంపెనీలువచ్చి చేరడం తో 2017 నాటికి ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం లో  విస్తరణ గణనీయంగా పెరిగింది. ఇన్సు రెన్స్ కంపెనీలు ఆతి తక్కువ ప్రీమియం, తో పాటు, అధిక మొత్తంలో క్లైమ్ ఆఫర్ చేస్తున్నప్పుడు. సహజంగానే డోమెస్టిక్ ఎకానమీ ని నియంత్రించ గలిగింది. చదువు కున్న వాళ్ళకి సామాన్యుడికి అర్ధం కాని అంశం  అసలు తాము తీసుకున్న పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా? లేక, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నా? అనే ది ఆర్ధం కాక అదేపనిగా ఇన్సూరెన్స్ సిబ్బంది ని తప్పించుకోలేక తప్పని స్థితి లో ఇన్సూరెన్స్ తీసుకున్నామని అంటారు అసలు లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, మధ్య ఉన్న తేడాను ఎలా గమనించాలి. వీటి ప్రీమియం వివరాలు నిపుణులని అడిగి తెలు సుకుందాం.                                                                                                            లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఒప్పందం అని నిబందనలు చెపుతున్నాయి. ఒప్పందం ప్రకారం వ్యక్తికినామినీ కి ఇస్తామన్న వాగ్దానం ప్రకారం నగదు చెల్లించడమ్ అని నిపుణులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్  ప్రకారం  ప్రీమియం చెల్లిస్తున్నంత  వరకు ఇన్సూరెన్స్ అమలులో ఉంటుంది.  ఎగ్రిమెంట్ జరిగిన నాటినుంచి లేదా చెప్పిన   తేదీ నుండి నిర్దేశిత తేదీ ప్రకారం. లేదా అనుకోకుండా, మరణించినా, విరమించినా అనారోగ్యం పాలైనా  పాలసీదారు ఒప్పందం ప్రకారం ప్రీమియం చెల్లింపు ఇన్సూరెన్స్ – నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన                                                 యాంకర్ 5)  నానాటికీ  భారీ రంగం గా ఎదుగుతున్న ఇన్సూరెన్స్ రంగం లో అసలు ఇన్సూరెన్స్ ఎన్నిరకాలు అన్న విష యం ముందుగా  తెలుసు కుందాం ఒకటి లైఫ్ ఇసురేన్స్ ,రెండోది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు తేల్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ ను జీవన భీమా, అని  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సాధారణ భీమా  అని పేర్కొన్నారు. అటు వ్యక్తి లేదా ఇంటి పెద్ద లేదా అయింటి  పెద్ద పైనా  ఆధారపడి జీవిస్తున్నకుటుంబానికి ఇచ్చే భీమా ని జీవన భీమా అని అంటారు. సాధారణ భీమా ని జనరల్ ఇన్సూరెన్స్ గా పేర్కొన్నారు వాహనము  ఇల్లు, పశువులు, పంటలు, వాహనాలు, ఆరోగ్య భీమా శాతం సాధారణ భీమా పరిధి లోకి వస్తుంది.  ఆవివరాలు అన్నీ  పూర్తిగా స్పస్టం గా వివరంగా తెలుసుకుందాం.                                                                                                                                                   ఒక్క మాటలో చెప్పా లంటే  ప్రజలకు అత్యంత విలువైన ది  ప్రాణం ,జీవన భీమా పరిధిలోకి పాలసీదారు ఏదైనా అనుకోని పరిస్థితిలో  చనిపోయిన వ్యక్తికి, లేదా అతని పై ఆధార పడే వారికి భీమా కంపెనీలు కొంత నగదును పాలసీ కొనుగోలు దారు కుటుంబానికి ఇస్తారు. ఇంటి పెద్ద లేనందు వల్ల ఆ ఇంటిని నడపడం కష్ట  ఆ సాధ్యం, అలాటి ఆర్ధిక సమస్యలనుండి బయట పడేందుకు జీవిత భీమా తీసుకోడం  అవసరం అని ఇన్సూరెన్స్ నిపుణులు తెలియ జేస్తారు. రెండవది సాధారణ భీమా, దీనిని జనరల్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ పరిభాషలో పేర్కొన్నారు. ఈ పరిధిలో     ఆ రోగ్య భీమా , చికిత్స,  వాహనం, పంట లు, ఇల్లు అన్నీ ఈ పరిధిలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ముందుగా ఇంటి భీమా సాధారణ భీమా పరిధిలో ఉందని గ్రహించాలి. దీని వల్ల మీయింటిని భూకంపం, షార్ట్ సర్క్యూట్, వరద వల్ల మునిగి పోయినా, ఇన్సూరెన్స్ నుండి    సంరక్షించు కోవచ్చని   అలాగే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఈ పాలసీ కింద నసఃతపరిహారం పొందవచ్చని, అదీ మీరు తీసుకున్న పాలసీ విలువ పైన ఆధార పడిఉంటుందని నిపుణులు వివరించారు.                                                                            సాధారణ భీమా పధకం పరిదిలో వచ్చే  అంశం ఆరోగ్య భీమా అదే హెల్త్  ఇన్సూరెన్స్ నేటి కాలంలో వైద్య ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి ఆరోగ్య భీమా తీసుకోడం వల్ల భీమా కంపనీలు. ఇచ్చే వైద్య ఖర్చులనుండి  కొంత మేర బయట పడవచ్చునని అంటున్నారు ఇన్సూరెన్స్ నిపుణులు. ఈ ఆరోగ్య భీమా పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ కంపనీ  ఏ రకమైన వ్యాధి వచ్చినా , వైద్యానికి అయ్యే ఖర్చును ఆ కంపనీ  ఇస్తుంది.అయితే మీరు తీసుకునే పాలసీ విలువపైనే మీకు ఇవ్వాల్సిన క్లైమ్  ఆధార పడిఉంటుందని,  అని నిపుణులు తెలిపారు. సాధారణ భీమా పరిధిలోకి వచ్చే మరో  అంశం వాహనభీమా దేశంలో ఎక్కడైనా రోడ్డు పై వాహనం నడపినా వాహనాన్ని భీమా చేయడం తప్పనిసరి ఒక వేళ మీ వాహనానికి భీమా చేయకుండా రోడ్డు పై నడిపితే ట్రాఫిక్ పోలీసు జరిమానా విధిస్తారు వాహన చట్టం నిబంధనల ప్రకారం వాహనం వల్ల మీద్వారా మరొకరికి ప్రమాదం సంభవిస్త్గే వ్యక్తి గతంగా   మీరు ప్రమాదానికి గురి ఐనా పక్షం లో భీమా కంపనీ కొంత నగదు నష్ట పరిహారంగా ఇస్తుంది. ఒక వేళా మీవాహనం దొంగతనానికి గురి ఐనా, అదైనా ప్రమాదం జరిగినా  మీ     భీమా  పాలసీ  మీకు సహాయ పడుతుంది                                                                                                                                                           ఈ భీమా పరిధిలోకి వచ్చిన మరో పధకం ప్రయాణ భీమా  ఈ భీమా ద్వారా మీరు యాత్ర చేస్తున్న సమయంలో వచ్చే నష్టం, నుంచి మిమ్మల్ల్ని కాపాడు తుంది. విహార యాత్రకు విదేశాలకు వెళ్ళి నప్పుడు ఒక వేళ ఏ దైనా ప్రమాదం జరిగితే మీ వస్తువులు చోరీకి గురి అయినప్పుడు, భీమా సంస్థ నష్ట పరిహారం చెల్లిస్తుంది. ప్రయాణ భీమా పాలసీ మీ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ప్రయాణ భీమా  కు సంబందించి ఒక్క కంపనీ  వీధి విధానాలను రూపొందించిందని కంప నీల షరతులకు లోబడి  పలాసీ లు వేరు వేరు గా ఉంటాయని నిపుణులు తెలిపారు.                                                                                 సాధారణ పరిధిలోకి వచ్చే మరో ఇన్సూరెన్స్ పాలసీ పంట భీమా పధకం క్రాప్ ఇన్సూరెన్స్ పధకంగా పేర్కొన్నారు. ఈ భీమా నియమ  నిబందనల ప్రకారం వ్యవసాయ రుణం తీసుకునే ప్రతి రైతు పంట భీమా తీసుకోడం తప్పనిసరి. పంట భీమా పాలసీ నిబందనల ప్రకారం పంటకు ఏ విధమైన నాష్టం కలిగినా, వ్భీమ కంపనీలు రైతుకు నష్ట పరిహారం చెల్లిస్తాయి. భీమా నిబందనల్ ప్రకారం పంట అగినికి అంటుకోవడం, పంట వరదలో చిక్కుకు పోవడం, పంటకు ఇతర తెగులు సోకి నస్గ్తపోయినా , కోతకు వచ్చిన పంట కోల్పోయినా పంట ఏ కారణం చేతైన పాడై పోయినా నష్ట పరి హరామ్ పొండా వచ్చని త్గెలియా చేస్తోంది. పంట భీమా పాలసీ లో ఖటి న మైన నియమ నిబంధనలవల్ల పాలసీ నగదు కన్నా తక్కువ నష్ట పరిహారం లభించనందు వల్ల రైతులలో పంట భీమా పట్ల ఆసక్తి  చూపక పోవడం గమనించాలి. వాస్తవానికి పంటచెడిపోయి నప్పుడు, పాడై పోయి నప్పుడు నష్ట పరిహారం ఇచ్చే సమయంలో భీమా కంపేనీలు ఆపంట పొలం పరిసరాలలో దగ్గర దగ్ఫ్గర గా ఉన్న పంటల నన్నిటిని సర్వే చేస్తారు ఎక్కువ మండి రైతులు నష్ట పోయి నప్పుడు మాత్రమే ఈ భీమా ఇస్తున్నారని దీని వల్ల భీమా తీసుకున్న తమకు పెద్దగా ఉపయోగం లేదని  రైతులు వాపోతున్నారు.                                                                                     భీమారంగాన్ని సవివరంగా ప్రజలకు తెలపాలన్న లక్ష్యంగా మేము మాపతి సోదనలో తెలిసిన మరో భీమా వ్యాపార భీమా. నిజానికి ఏ కంపనీ ఉత్పాదక లేదా అమ్మకం జరిగే పరిశ్రమలు లేదా పెద్ద మొత్తంలో చేసే వ్యాపార్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నది వాస్తవం. పెద పెద్ద  పరిశ్రమలలో ఉండే యంత్ర సామగ్రి, వల్ల ఏసీడ్ వల్ల బాయిలర్లు పేలడం,ప్లాస్టిక్, రసాయన, టైర్ల పరిశ్రమ, ఇలా పెద్ద పెద్ద పర్శ్రమలలో ఆగ్ని ప్రమాదాలు సహజంగా  జరుగుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇన్సూరెన్స్ లేని పరిశ్రమలకు భారీ మొత్తం జరిమానాలు కట్టాల్సి వస్తుంది. చట్ట ప్రకారం జరిగే చర్యలతో పాటు అందుకు అయ్యి ఖర్చు ను సైతం అటు భీమా సంస్థ కంపనీలు చెల్లించాల్సి ఉంటుంది ఇది కూలం కషమ్ గా లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉండే భీమా లు వాటివల్ల కలిగే లాభం, నష్టం. ----- నిపులతో వీటికి సంబందించిన ఆంశాల పై చర్చ -------.                                                                                       యాంకర్ 6) ఇప్పుడు ఇన్సూరెన్స్ లు వాటిలో రకాలు ఏ ఇన్సూరెన్స్ ఏ పరిధిలో ఉంది నిపుణులు చెప్పిన సమాధానం చూశాంకదా ఇప్పుడు అసలు చిత్రమైనవిచిత్రమైన కదలు ఇన్సూరెన్స్ లో చోటు చేసుకున్న  దుష్టాంతరాలు  ఇప్పుడు చూద్దాం. అందులో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబందించిన కొన్ని వాస్తవాలని చూద్దాం. ఆసుపత్రులలో మీకు ఇన్సూరెన్స్ ఉందని అంటే రమ్మంటారు. ఆత్రువాత మనకి  ఇన్సూరెన్స్ మొత్తంలో ఉన్న పూర్తి క్లెయిమ్ ను ఎలా రాబట్టాలో రాబడతారు.  ఆచిత్రాలు ఒకసారి చూద్దామా.                                                                                                                                                                       వాయిస్ ఓవర్ 6) మీకు  మీకుఇన్సూరెన్స్ ఉందా అంటారు ఉందని అన్నారో మీరు బుక్ అయి పోయరన్న మాటే. అసలు ఇన్సూరెన్స్ పోలసీ ఎంత వరకు ఆంచనా వేస్తారు. దానిని బట్టి మీ సమస్య  పెద్దది మీకు సర్జరీ అవసరం అంటారు. వెంటనే ఎప్పుడు జాయిన్ అవుతారు. వెంటనే జాయిన్ అవ్వాలి లేదంటే మీ సమస్య   సీరియస్ ఇష్యూ ముందు అడ్మిట్ అవ్వండి టెస్ట్ చేశాక సమస్య పూర్తిగా ఇన్వెస్టిగేట్ చెయ్యాలి.  అప్పుడు ట్రీట్ మెంట్ ట్  ఇవ్వాలి అంటూ రూమ్ ఆలో కేట్  చేస్తారు. సె లైన్ కామన్, టాబ్లెట్స్ కామన్,  పేటెంట్ కి భోజనం మేమే పెడతాం మీరు తీసుకు రావద్దు అంటూ అమ్మో పరవాలేదు అమ్మో ఇంటినుంచి తెచ్చుకునే బదులు ఇక్కడే ఇస్తారు కదా అనుకుని భీమా కదా ధీమా గావుంటారు.  తీరా చూస్తే రూమ్ రెంట్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ రెంట్, మనం వాడినా వాడక పోయినా టవల్ సబ్బులు, న్యాప్ కీన్లు, నర్సింగ్ సేవలు. ఆపరేషన్ థియేటర్ ఖర్చులు వాళ్ళు వాడిన థియేటర్ సరంజామా,సూదులు, వగైరా, టిష్యూ పేపర్ లు సైతం వాడినా వా డక పోయినా వాటి కీ బిల్లులో అసలు బిల్లు కంటే కాస్త ఎక్కువే వడ్డిస్తా రని బాదితులు వాపోతున్నారు. చివరన డిశ్చార్జ్ బిల్లు చూస్తే గుండె  ఘుబెల్  మంటుంది ఆంతా మీ ఇన్సూరెన్స్ కు తగ్గట్టు గానే మొత్తం బిల్లు క్లెయిమ్ చేస్తారు అప్ప్రూవల్ కు ఇన్సూరెన్స్ కంపనీకి పంపి అప్రూవల్ రాగానే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. ఒక్కోసారి మీ ఇన్సూరెన్స్ బిల్లు కన్నా కొంత అదనం గా వచ్చిన్నా ఆశ్చర్యం లేకపోలేదు. సొ మీరు ఇలాంటి సమస్య ఎదురయ్యిందా, అయితే కాస్త  జాగ్రత్తగా వినండి.  మీరు పెట్టిన క్లెయిమ్ ఇవ్వక పోయినా అదనంగా వచ్చే స్మస్యలకు ఎవరు పరిష్కరిస్తారు వాళ్ళు ఎవరు అన్న సమ ధనం మానిపుణులు మీకు వివరిస్తారు.                                                            ------ఈ అం శం లోనే అసలు  ఆసుపత్రుల పై వస్తున్న ఆరోపణలు  వాస్తవమా కాదా ,అన్న విష యాన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యజ మన్యాల సంఘం ప్రతినిధులు చెప్పాలి----  బైట్---                                                                                                                                  సమస్య  వచ్చిందంటే ఆసమయంలో ఎవరు దగ్గర లేకున్నా నిర్ణయం తీసుకోడం కష్టం దగ్గరలౌన్న నర్సింగ్ హోం కి వెళ్లలా లేక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాల అన్నదే మీమాంస ఆసమయంలో నే తక్షణం చేయాల్సిన పరిస్తితి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్తితి అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రికి వేలాడమన్నా నిర్ణయం తీసుకుంటే మాత్రం మీకు రోగం బెత్తెడు బిల్లు  జా నేడు అన్నట్టుగా ఉంటుంది. అసలు సమస్య కు ట్రీట్మెంట్ ఇచ్చాం అంటారు. వాడినా వాడని వస్తువు బిల్లు నానా నెత్తి మీద రుద్ది బిల్లు తడిపి మోపెడు చేసి బిల్లీ కత్తి వెల్ల మంటూ సలహా ఇస్తార్. జర  జాగ్థే రహో అంటున్నాయి స్వీయ  అనుభవం వింటే మీకే ఆర్ధం అవుతుంది  ఆసుపత్రుల ఇన్సూరెన్స్ మాయ.                                                                                          వాయిస్ ఓవర్ 7) మాయా మయా మాయా ఇదేంటి మాయ అనుకుంటున్నారు క దూ. ఒక్క సారి ఈమాయలో పడ్డారో మీకు లేనిరోగం తో పాటు అన్నీ గుర్తుకు వస్తాయి. .  ఇవిగో ఇవన్నీ నగరంలో పేరెన్నిక గన్న ఆసుపత్రు లే ఇక్కడ కాళ్ళు, కీళ్ళు, తల, వెన్నెముఖ, గుండె, కిడ్నీ, పురీషనాళం, ఊపిరి తిత్తులు, ఇలా ఒకటి పన్ను ,కన్నువెన్ను, ఆన్ని టికి ప్లాంట్లు, ఇన్ ప్లాంట్లు , చేయడంలో ప్రపంచంలో పేరు ఎన్నిక గన్న డాక్టర్ లే ఉంటారు. సేవలు అందిస్తారు. ఒక డాక్టర్ కన్సల్టెన్సీ 300/ నుంచి 800/ కు తక్కువగా ఉండదు.  అసలు వచ్చిన  సమస్య  ఏమిటి అంటే దబ్భు పెడితే    ట్రీట్ మెంట్ కాస్ట్ తక్కువ,  ఇన్సూరెన్స్ తో అయితే ఎక్కువ ఇదేమి లాజిక్ అని అనుకుంటున్నారు? పాలసీ దారులు. ఇంకొందరు ఏదో ఒకటి ముందు  బయట పడ్డాం  కదా ఈ మీమాంస అవసరమా? అని అనుకుంటున్నారు. యెస్ అవసరమే ఎందుకంటే పాలసీ దారుల రక్షణ అవసరం కనుక  ఇరిడా నిర్దేశించిన ప్రమాణం ప్రకారం ఇన్సూరెన్స్ పెట్టుబడికి మనకు దక్కే లాభం ఎంత అని పెట్టుబడి దారులు అనుకుంటే పెట్టుబడి దారులు ఆలోచించేవాళ్లు. అటు ప్రైవేట్ , ఇటు ప్రభుత్వ రంగం లో పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా ఒస్తోంటే ఇంకా  ప్రైవెట్ రంగంలో మరిన్ని విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తే ఆసుపత్రు లకు పండగ మాకు ఎందుకు ఇన్సూరెన్స్ దండగా అని సామాన్యుడు ఫీల్ అవుతున్నాడు. ఆడండి మనం కడుతున్న ఇన్సూరెన్స్లు మనకు కలిగే లాభం. మీ ఇన్సూరెన్స్ సంస్యలగురించి మాకు రాయండి  నేరుగా మా నిపుణులతో మాట్లా డండి . ఇన్సూరెన్లు క్లైములు వాటి పరిష్కారాలు వివిధ ర కా ల కేసులు ఇన్సూరెన్స్ పరిష్కారంలో అంబుట్స్మెన్ ఇచ్చే తీర్పులు న్యాయనిపుణుల   సలహా లు తదితర ఆంశాలు మరో ఎపిసోడ్ లో చర్చిద్దాం   అంటిల్ దేన్ కీప్  వాచింగ్ రాజ్ న్యూస్. 

లివర్ సమస్యలకు కాఫీ మంచిదే...

ప్రపంచ వ్యాప్తంగా లివర్ సమస్యల పై పరిశోదన జరగాలి.ప్రతి ఏటా 2 మిలియన్ల ప్రజలు లివర్ సమస్యలతో  బాధ పడుతున్నట్లు హేపటా లజీ జర్నల్ లో ప్రచురించారు.36౦౦ మంది క్రానిక్ లివర్ డిసీజ్ వస్తే 3౦1 మంది మరనిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.5,4౦౦ మంది పైగా ప్రజలు ఫుఅటీ లివర్ సమస్యతో బాధ పడుతున్నట్లు కాగా 18౦ మంది లివర్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. దీర్ఘకాలంగా వివద రకాల లివర్, ఫ్యాటి లివర్ సమస్యల నివారించడానికి కాఫీ మంచిదే అని పరిశోధకులు వెల్లడించారు.మీ లివర్ బాగుండాలంటే ఏం చెయ్యాలి రోజుకు 3 నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగండిఅని అని సూచిస్తున్నారు శాస్త్రజ్ఞులు. లివర్ సమస్యతో బాధ పడే వారు  ముఖ్యంగా ట్రాన్స్ ప్లాంట్ లిస్ట్ లో  లేని వారికి  అంటే ప్రాదమిక స్థాయిలో లివర్ సమస్యతో బాధ పడేవారు దీనిని అనుసరించ వచ్చని పేర్కొన్నారు. బ్రిటష్ పరిసోదకులు ఇచ్చిన సమాచారం ప్రకారం దీర్ఘకాలిక సమస్యలకు కాఫీ చక్కగా పని చేస్తుంది.ఒక రిపోర్ట్ ప్రకారం మీరు కాఫీ తాగక ముందు కాఫీ తాగిన తరువాత లివర్ ఎలా ఉందొ పని చేస్తుంది.రోజుకు 3,లేదా 4 సార్లు కాఫీ తాగితే చాలు అని సూచించారు.మీ లివర్ ను సంరక్షించేది కాఫీ మాత్రమే పబ్లిక్ హెల్త్ యూని వర్సిటిఆఫ్ సౌత్ అమ్ప్టన్ కు చెందిన డాక్టర్ పౌల్ రోడ్రిక్స్ మాట్లాడుతూ మీరు కాఫీ తాగితే మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.ఇది నిజం అసలు మీశరీరంలో  అతి పెద్ద కీలకమైన అంగం లివర్ మాత్రమే, లివర్ సమస్యను సకాలంలో గుర్తిస్తే డికాక్షిన్ ను తీసుకుంటే బయట పడవచ్చునని లివర్  ట్రాన్స్ ప్లాంట్ ను నివారించ వచ్చని  రోడ్రేక్స్ అన్నారు. ఇది నిరూపించగలరా అన్న ప్రశ్నకు రొడ్రేక్స్ సమాధానమిస్తూ మిరూపితం కాలేదు కానీ లివర్ ఆరోగ్యానికి సంబంధం ఉందని పేర్కొన్నారు. మేము చేసిన పరిశీలనలో చాలా సహజ మైన కాఫీకి లివర్ కు సంబంధం ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనిని వివిధ రకాల కంపోనేన్ట్స్  ఉన్నందు వల్లే కవోచ్చునని పేర్కొన్నారు.కోఫీ కాంప్లెక్స్  సబ్స్తాన్స్ ఉన్నందుకే మీ లివర్ రక్షింప బ్స్డుతోందని రోడ్రేక్స్ అభిప్రాయపడ్డారు.కోఫీ తాగని వారి తో పోలిస్తే కోఫీ  తాగిన వారిలో 21 %మందిక్రానిక్ లివర్ రిస్క్ తక్కువే అని పేర్కొన్నారు. క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల 49 %మంది సమస్య తో బాధపద్య్ర్హున్నారని పేర్కొన్నారు.కాహ్వూల్ అండ్ కాఫెస్తోల్ సహజమైన కోవేండ్ వీటి పై చాలా పరిశోదనలు జరగాల్సి ఉందని అన్నారు.కోఫీ లివేర్కు మంచిదే సండ్రా అట్లాస్ బాస్ సెంటర్ ఫర్ లివర్ డిసీజ్ మాన్హోసేట్ డాక్టర్ డేవిడ్ బెరోన్స్టెయిన్ అన్నారు.కోఫీని పోటేన్శియాల్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ గా పేర్కొన్నారు.ఈ అంశం పై మరిన్ని పరిశోదనలు జరగాలి. కోఫీ పరిశ్రమ నుంచి ఆర్ధిక సహాయం బయో బ్యాంక్ ప్రస్తుతం 5 లక్షలకు పైగా నే కోఫీని వినియోగిస్తున్నట్లు సమాచారం. 78 %  ఇన్స్టాంట్  కోఫీ తాగుతారు.డి కోఫీ నేటేడ్ కోఫీ ని 22 % వినియో గిస్తున్నారు. దీనికి అను బందం గానే హైదరాబాద్ లోమి యునాని హెర్బల్ క్లినిక్ లో వాడే మూలికల కషాయం తో లివర్ డిసీజేస్ నియంత్రించ వచ్చని జోషాందా పేరుతో ఇచ్చే మూలిక ఔషదం ఒక డికాక్షిన్లా పనిచేస్తుందనిడాక్టర్ సత్య యు నాని హెల్త్ కేర్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ సత్యదృవీక రించారు.  చేసారు. ఈ మేరకు తమ క్లినిక్ చేసిన పలు పరిశోదనలు తమ వద్ద ఉన్నాయని లివర్ ట్రాన్స్ ప్లాంట్ అవసరం లేదని  ఆమె తెలుగు వన్ కు తెలిపారు.

శాస్త్రీయత లేని మందులవల్లే కోవిడ్ మరణాలకు కారణమా ?

కోవిడ్ 19 తీవ్రంగా విజ్రుమ్భిస్తున్న వేళ ఆ ఏముంది కోవిడ్ కు ఒక పరాసిట్ మాల్, బ్లీచింగ్ వేస్తే సరి పోతుందని  చేసిన ప్రకటన వల్ల చాలామంది ప్రాణాలు పోయేందుకు కరనమనదని తెలుస్తోంది.అసలు ముఖ్య మంత్రులు  బాధ్యతను విస్మరించి ప్రకటన చేస్తే,మేము తక్కువ తిన్నామా అన్నట్లు కొంతమంది ప్రభుత్వ వైద్యులు,ప్రైవేట్ వైద్యులు  తమ రోగులకు పేరాసిటమాల్ ను ప్రిస్కిప్షన్ లో చేర్చారు.అలా అవి వాట్స్ అప్ ద్వారా త్చేరి చాలా మంది నిజమని భావించి తీసుకుని ప్రణాల మీదకు తెచ్చుకున్నారని దిల్లికి చెందిన నారాయణా ఫౌండేషన్ చేసిన పరిశోదనలో కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వెలుగు లోకి వచ్చాయి. కోవిడ్ మరణాలకు కారణం ఏమిటి ?అన్న అంశాల పై పరిశోదనలు జరుగు తున్నాయి. సహజంగా స్పందించాల్సిన శరీరం వైరస్ కారణంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తోందని పరిశోధకులు వెల్లడించారు.సైటోకిన్ స్ట్రోం ఊపిరి తిత్తులలో ఇంఫ్లా మేషన్, గడ్డ కట్టడం వల్లే మరణిస్తున్నారని తేల్చారు.కోవిడ్ సమయంలో రోగులు మరమించడానికి గల కారణాలను న్యుడిల్లి లో ఒక పరిశోదన చేపట్టారు. అశాస్త్రీయమైన,ఏమాత్రం శాస్త్ర ప్రమాణాలు లేని మందులు వాడడం వల్ల వచ్చే ప్రభావం,మందులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల కూడా మరణించారని తేల్చారు. కోవిడ్ ప్రభావం అతి తక్కువగా ఉన్నవారిలో ప్రాధమిక స్థాయిలో వైరస్ వల్ల కాదని న్యుడిల్లి కి చెందిన నిరామయా రీసెర్చ్ ఫౌండేషన్ చేసిన పరిశోదన వివరాలను ప్రపంచం లోని 1౦ జర్నల్స్ లో ప్రచురించారు. వీరి పరిశోదనలో సహజంగా స్పందించాల్సిన శారీరం పేరా సిట్ మాల్ కు ఎలా స్పందిస్తుంది.అని ప్రశ్నించారు. ప్యారాసిట్ మాల్ వల్ల తీవ్ర పరిస్థితులకు చేరు కుంటున్నారని. అత్యవసర చికిత్స ఎమర్జెన్సీ కి చేరుతున్నారని వివరించారు.సైతికిన్ సైటో కిన్ స్ట్రాం ఊప్రి తిత్తులలో ఇంఫ్లామేషణ్ గడ్డ కట్టడం వల్ల కోవిడ్ రోగులు మరణిస్తున్నారని ఇటీవలి పరిశోదనలు వెల్లడించారు నారాయణా రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మెన్ వివేక్ షీల్ అగర్వాల్  మాట్లాడుతూ తమ సంస్థ కేవ లం స్వచ్చంద సేవాసంస్థ మాత్రమే అని అన్నారు. ప్యారా సిట్ మాల్ వంటి ప్రిస్కేఫ్షణ్ వంటి మందులు ప్రాధమిక స్థాయిలో ఇవ్వడం పూర్తిగా  వైద్య శాస్త్రానికి విరుద్దమని అన్నారు. ఇందుకు సంబంధించి ఏ వైద్య శాస్త్రంలోనూ ప్రచురించలేదని అగర్వాల్ అన్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ కు జ్వరం మాత్రం ఇవ్వడం సబబు కాదని చేసిన పరిశోదనలో యంటి పైరటిక్స్ ఉన్నట్లు గుర్తించామని దీనివల్ల ఇతర సమస్యలే కాక ప్రాణాంతకంగా మారిందని ఇలాంటి అశాస్త్రీయ వైద్యం తోనే మరణిస్తున్నారని అగర్వాల్ పేర్కొన్నారు. 7౦ సంవత్సరాలుగా  మానవులపై జరిగిన  ట్రైల్స్ లో వైరస్ ఇంఫెక్షన్లకు ప్యరీసిట్మాల్ ఇచ్చిన ఘటనలు లేవని అన్నారు. పైగా జంతువుల పై చేసిన పరిశోదనలో ఫెయిల్ అయ్యిందని.అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోదనలో స్వల్పంగా వైరస్ ఇన్ఫెక్షన్ కి కారణం వైరస్ రూపాంతరం హొమియోస్తేర్టిసిస్ బాలన్స్ డిస్టబ్అయ్యి ఇమ్యూన్ సిస్టం తప్పుతోందని బి సెల్ల్స్, టిసెల్స్ యంటిబాడీలు వైరస్ కు వ్యతిరేకంగా  య్జయారు చేయలేక పోతున్నారని తేల్చారు. ఇక వ్యాక్సి నేషన్ తరువాత యని పైరటిక్స్ తక్కువ స్థాయిలో అసలు యాంటీ  బాడీలు తయారు కాక పోవడానికి పెరసిట్ మాల్ టాబ్లెట్ కారణమని తేల్చారు. ఇదే తరహా ఫలితాలు కింగ్ జార్జ్ మేదికాల్ కాలేజీ లక్నో చేసిన పరిశోదనలో 71% ప్రజలు పూర్తిగా వ్యాక్సినేషన్ వేసుకున్న వారిలో వైరస్ కు వ్యతిరేకంగా యంటిబాడీలు తయారు కావాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాతకూడా పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వారి వివరాల దాటాను పరిశీలిస్తే ఆరోగులు పరాసిట్మాల్ తీసుకోవడం వల్ల  యాంటిబయోటిక్స్ ,స్తేరాయిడ్స్ కూడా వ్యాక్సిన్ తరువాత తీసుకున్నట్లు సమాచారం ఐ సి ఎం ఆర్ అంగీకరిస్తే పూర్తి పరిశోదనలు తమ సేవాసంస్థ సిద్ధమే అని అగర్వాల్ అన్నారు. అశాస్త్రీయ మైన మందుల వాడకాన్ని నిలుపుదల చేయాలని.మైల్డ్ కోవిడ్ ఉన్నరోగికి లేని రోగికి సైతం తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారని ప్రజలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఆక్సిజన్ అవసరం లేదని అగర్వాల్ స్పష్టం చేసారు.ఈ పరిశోదనలో డైరెక్టర్ జనరల్ ఐ సి ఎం ఆర్  డాక్టర్ వి బలరాం బార్ఘవ, డాక్టర్ వినోద్ కే పౌల్,నేషనల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ డాక్టర్ దీప్ గులేరియా ఏ ఐ ఎం ఎస్ లు పాల్గొన్నట్లు అగర్వాల్ తెలిపారు. ఇప్పుడు చెప్పండి ముఖ్యమంత్రులు పరా సిట్ మాల్, యాంటీ బాయిటిక్స్ వేసుకోవాలో వద్దు చెప్పండి. శాస్త్రీయతలేని వైద్యం వల్ల పోయిన ప్రాణాలకు కారణం మీ ప్రకటనలు కావా అని సామాన్యుడిగా ప్రస్నిస్తున్నాం. ఇకనైనా  సరైన అవగాహనతో మాట్లాడాలని  అరకొర సమాచారంతో ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టవద్దని కోరుకుంటున్నారు సామాన్యులు.

డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం?

కోవిడ్19 ఇన్ఫెక్షన్ కు కారణ మౌతున్న  వైరస్  అనేక రూపాలు మారుతోంది. దీని రూపాలు  అసలు ఎలాఉంటుందో కూడా శాస్త్రజ్ఞుల అంచనాలకు అనడంలేదు. ఒక్కో దగ్గర ఒక్కో రూపంలో రూపాంతరం  చెందడాన్ని బట్టి దీనికి ఎలాంటి చికిత్స చేయాలా అన్న దర్మసంకటంలో ఉన్నారు వైద్యులు. గతంలో వాతావరణం లో మార్పులను బట్టి ఎండాకాలంలో పెద్దగా ప్రభావం చూపదని  సహజంగా అతి చల్లగా ఉండే శీతల ప్రాంతలాలో ముప్పు ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేసినప్పటికీ శీతకాలం లో దీనిప్రభావం పెద్దగా లేకపోవడం తో అమ్మయ్యా అని ఊపిరి పీల్చు కున్నారు. అంతే కాస్త ఆదమరిచామా చావు దెబ్బ కొట్టినట్టుగా మార్చ్,ఏప్రిల్ నెలలో  విజ్రుంబించింది. లక్షల్లో మరణాలు జరిగి పోయాయి.కొట్లలో కోవిడ్ బారిన పడ్డారు.  రానున్న మూడు వారాలలో వచ్చే  థర్డ్ వేవ్ కోరోనా వైరస్ కు డెల్టా వైరస్ గా శాస్త్రజ్ఞులు పేరు పెట్ట్సారు.అసలు డెల్టా అంటే ఏమిటి శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు.సార్క్ కోవిడ్ వైరస్ ను డెల్టా వైరస్ అని అంటున్నారు శాస్త్రజ్ఞులు డెల్టా వైరస్ ను శాస్త్రీయంగా B.1.617.2lineage 2021 గా గుర్తించారు. ఏప్రిల్2౦21సహజంగానే వైరస్ విస్తరిస్తుంది. దీనిని వేరియంట్ గా మాత్రమే గుర్తించారు.దేని ప్రభావం ఇప్పటికే 8 దేశాలు ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. 8౦ దేశాలలో ఈ వేరియంట్ ను డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది.ఇటీవల యునితే కింగ్ డం లో మరో వేవ్ వచ్చే అవకాసం ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు .పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఇచ్చిన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.యు కే లో డోమినేంట్  వేరియంట్ గా పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ లో74 % సీక్వెల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు.వేరియంట్ ప్రభావం వల్ల 96% ఇన్ఫెక్షన్ లో జీనో టైప్ కేసులు కు కారణంగా  తేల్చారు.సి డి సి సెంటర్ డిసీజ్ కంట్రోల్ ఇచ్చిన నివేదిక ప్రకారం.కొత్త కోవిడ్ కేసులు 19 గా ఉనాయని అంటే 2 .71 గా ఉన్నాయని. రెండు వారాల్లో జీనోమిక్ కేసులకు కారణం డెల్టా వైరస్ గా ఫుడ్ కమిషనర్ స్కాట్ గొట్టిలేబ్ 1 ౦ % గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏ దేశం లో ఐనా డెల్టా వైరస్ ఉంటె ఇన్ఫెక్షన్ వైరస్ త్వరాగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ శరీరంలో త్వరాగా చేరుతుందనిహెచ్చరించారు. ప్రజలు వ్యాక్సిన్ వేసుకొని వారిలో ప్రభావ వంతంగా ఉండ వచ్చని వ్యాక్సిన్ వేసుకున్న వరలో డెల్టా వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని వివరించారు. అంటే డెల్టా వైరస్ వ్యాక్సిన్ వ్ర్సుకున్న వారిని విడిచి పెట్టె అవకాసాన్ని తోసి పుచ్చలేమని నిపుణులు అంటునారు. నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ ఎలర్జీ ఇన్ఫెక్షన్ డిసీజ్  డైరెక్టర్ డాక్టర్ అంటోనీ మాట్లాడుతూ డెల్టా వేరియంట్ గతంలో వచిన్న వేరియంట్ల కన్నా త్వరగా విస్తరిస్తుందనిఆరోగ్యంగా ఉన్న కణాలలో త్వరగా విస్తరిస్తుంది.డెల్టా వేరియంట్ రెండురకాలుగా మ్యుటేట్ అవుతుంది. స్పైక్ మ్యుటేషన్లేదా అసలు ఎన్ని రకాలుగా రూపాంతరం చెందు తుందో కూడా అంచనాకు చిక్కడం లేదని శాస్త్రజ్ఞులు స్పష్టం చేసారు. అల్ట్రా వేరియంట్ లేదా ఒకటి లేదా రెండుమ్యుటేషన్లు కావచ్చునని అంచనా.డెల్టా వైరస్ రెండవ రూపు తీసుకుందని నిర్ధారణకు వచ్చారు. డెల్టా వైరస్ ప్రవేసించిందో వచ్చే కోవిడ్ లక్షణా లలో తలనొప్పి,గొంతునొప్పి,లేదా సోర్ త్రోట్,తీవ్రమైన జలుబు రన్నింగ్ నోసే ఉంటుంది. సార్క్ ఇన్ఫెక్షన్ ప్రవర్తిస్తుందని నిపుణుల కు సైతం అర్ధం కాని దీని ప్రవర్తన సమాయుడికి ఏమి తెలుస్తుంది.రానున్న చలికాలానికి అంటే శీతాకాలంలో ఇది కనక విజ్రుం భిస్తే దీని లక్షణాన్ని గుర్తిన్చాలేమని మచ్చు కైనా కనబడక పోవచ్చునని దీని ప్రభావం అక్తోబెర్ లేదా నవంబర్ లో  ఉంటుందా అన్నది ప్రశ్నార్ధకం. మొత్తానికి ఇప్పటికే రకరకాల వేరియంట్ల తో బాధ పడుతున్న ప్రపంచానికి డెల్టా వైరస్ ప్రమాదకారి కాగలదని అంచనా? 

కొత్త వ్యాక్సిన్ కావాలా?

ప్రపంచాన్ని వణికిస్తున్న  కోవిడ్ 19. తో  నిత్యం పోరాడాల్సిందేనా ? 2019 లో ప్రపంచంలో  విస్తరించిన కోవిడ్ వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్థోంది? విభిన్న మైన వాతావరణం  వైరస్   2019 నాటి పరిస్థితులు పరిశోదనల ఆధారంగా తయారు  చేసిన వ్యాక్సిన్ ,నిర్వహించిన ట్రైల్స్ ఫలితాలు ఏమిటి ? ఎంతమంది కోవిడ్ బాధితులకు వ్యాక్సిన్ ట్రైల్స్ నిర్వహించారు.? ట్రైల్స్ లో రెగ్యులేటరి ఆధారిటీ తో కలిసి పని చేస్తూనే ఉన్నారు . అందులో ఎంతవరకు వెరియంట్స్ కు తగ్గటుగా వ్యాక్సిన్ పని చేస్తున్నాయి ? పని చేస్తాయి? అన్నది మరో ప్రశ్న? అయితే మన ప్రశ్నలకు ఉత్పాదక సంస్థలు వీటి పై సమాధానం ఇవ్వగలవా ? నిపుణులు మాత్రం  తమకు సంబందం లేనట్లు ఎఫ్ డి ఏ అంటే ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కొన్ని కీలక మైన సమస్యలకు జవాబు చెప్పగలదు అని అంటున్నారు. కోవిడ్ పై చేసిన ప్రాధమిక  పరిశోదనలో వ్యాక్సిన్   ప్రాధమిక స్థాయిలో చేసిన పరిశోలనలో చివరి పాయింట్స్ లో ఎన్నో సందేహాలు ఉన్నాయి.కోవిడ్ 1 9 ను ఈ పరిశోదనలు నివారించగలవా ?కోవిడ్ కేసులను ఎస్సెస్ చేశారా? కనీసం వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి ? ఈ ఫలితాలు ఎలా మదించారు. అన్నది మరో ప్రశ్న? మొడ్రేట్  కేసులలో  వ్యాక్సిన్ వ్యక్తులపై ఎలా పనిచేసింది?అన్న  ఆంశం  పై ఎలా ఫలితాలు లెక్కించారు  వ్యాక్సిన్ పని తీరు పై ఎదుకు గోఫ్యత వహిస్తున్నారు? అన్నది మరో సందేహం? ఉదా బయో టెక్ కు చెందిన ఫైజర్ ను అత్యవసర సమయం లో వాడేందుకు ఎఫ్ డి ఏ అనుమతించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 మందిలో కోవిడ్ సమయంలో 162 మందికి ఫ్లాసిబో వృద్ధి చెందింది. వ్యాక్సిన్ ప్రభావం. 95% ఉందని ఎలా నిర్దారిస్తారు. క్లినికల్ ట్రైల్స్లో గ్రూప్ వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో మరణాలు సంభవించలేదు.కోవిడ్ 19 సమయంలో వచ్చిన డాటా వివరాలను డిసెంబర్ 31-20 20 న ఇంగ్లండ్ జనరల్ మెడిసిన్ ప్రచురించింది.ఇటీ వల జరిపిన పరిశోదనలో ఇజ్రాయిల్ లో  దొరికిన డాటా ప్రకారం వ్యాక్సిన్ చాలా ప్రభావ వంతం గా పనిచేస్తుందని. కోవిడ్19 నివారిస్తుందని. కోవిడ్ 19 వ్యాధి తీవ్రత ఉన్నవారిలో వ్యాక్సిన్ పని చేస్తుందా? సార్క్ కోవిడ్ బి.1.7 వేరియంట్ ను  వ్యాక్సిన్  పని చేస్తుంది ? మొత్తం మీద వేరియంట్ పై ప్రభావ వంతంగా పని చేస్తుంది.బి .1.1.7  సార్క్ కోవిడ్ 2 వేరియంట్ ను యు కె లో కాను గొన్నారు. ఇప్పుడు మరో  వేరియంట్ 31.351 ను సౌత్ ఆఫ్రికాలో కాను గొన్నారు.పి.1 బ్రెజిల్ లో పుట్టింది. కోవిడ్ 19  వేరియంట్ల కన్నా కొత్త వేరియంట్లు. తీవ్ర ప్రభావామ్ చూపుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఎన్ని రకాల వేరియంట్లు పుట్టుకొస్తాయి. వాటిని సమర్ధ వంతంగా ఎదుర్కునే చికిత్స పద్దతులు, లేదా మందులపై పరిశోధన చేయాల్సి ఉంది. ఇప్పటికీ సరైన మందులు లేక పోగా వ్యాక్సిన్ తోనే మ్శాశ్వతంగా ఎదుర్కోగలమా అన్నది ప్రశ్నగానే మిగిలి పోతుంది. కొత్తగా పుట్టుకొచ్చే వెరియంట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి. వాటి తీవ్రత ఎంత? ఇంకా ఎన్ని    వేరియంట్స్ ఉన్నాయి?  ఇంకా ఎన్నాళ్లు కనపడని  శత్రువు తో మనం పోరాడాలి ఇంకా ఎన్ని పోరాటాలు చేయాలి? కొత్త వ్యాక్సిన్ లు ఎన్నికవాలి? సాధారణ ప్రజలకు  వైద్య సౌకర్యాలు కల్పించాలి.రెండవ జనేరేషన్ కోసం మరిన్ని వ్యాక్సిన్లు అవసరమా ? వైరస్ ఎందుకు మ్యూటెట్ అవుతుంది /దీర్ఘ  కాలం శాస్త్రజ్ఞులు పరిశోదనలు చేయాలా ? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.  కొత్త వెరియంట్స్ కు కొత్త వ్యాక్సిన్ అవసరమా ? 

యోగ సాధనతోనే ఆరోగ్యం?

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నియు ఎన్ ఓ పిలుపు మేరకుజరుపుకోడం అంతర్జాతీయంగా  మన యోగకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.యోగ,యోగసాధన, యోగ అంటే వాటిగురించి చెప్పిన ఆధారాలను చారిత్రిక ఆధారాలను తెలుసుకుందాం. యోగా అంటే ? వ్యాయామం అని అనుకుంటారు కొందరు దీనిని లోతుగా పరిశీలిస్తే ఇంకొందరు అధ్యాత్మిక సాధనలో  యోగ ఒక భాగమని అంటారు కొందరు. మోక్ష సాధనకు మార్గం యోగా అని కొందరు పేర్కొన్నారు. యోగా సాధన ద్వారా అంతః దృష్టి ద్వారా పరమానంద ప్రాప్తి పోడే వీలు న్న  సాధన క్రియ యోగసాధన అంటారు. యోగా సాధన చేసేవారిని యోగులని అంటారు.వీరిని సన్యాసులు గాను, మునులుగా ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ అందరి చేత యోగా సాధన చేయిస్తున్నారు మహా యోగులు.ఆశ్రమాలాలో హట యోగము  శారీరక  ఆసనాలు వేయడం ద్వారా  ఔషదాలు వాడకాన్ని తగ్గించ వచ్చని తద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.  యోగ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాం... పురానాలలో యోగ సాధనానికి అధ్యుడు పతంజలి అంటారు. 100- 500  శకం లోనే యోగా ప్రారంభమైనదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.వేదం ,పురాణాలు,ఉపని షత్తుల లో రామాయణ, మహాభారతం లోనూ యోగా ప్రస్తావన ఉంది. యోగ సాధనా పద్దతుల గురించి సూత్రాలు, ముద్రలు, సాధన ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండచ్చు అని పేర్కొన్నారు. యోగాలో కర్మయోగం, జ్ఞాన యోగ, రాజ యోగం, బక్తి యోగం గా విశ్లేషించారు. వ్యాసముని రచించిన భగవత్ గాతను 18 భాగాలుగా విభాజించారు. యోగము అంటే ఏమిటి? యోగము అంటే కలయిక యూజ్ అంటే కలయిక అనే సంస్కృత ధాతువు నుండి యోగము అనే పదం ఉత్పన్న మైంది.యజ్యతే అనేన ఏతా ధితి యోగః  యోగము అంటే ఇంద్రియాలను వశపరచు కోవడము అని అర్ధము.మానవుని శక్తి ని ఏక తాటి పైకి తెచ్చి సమాన స్థితికి తెచ్చేది యోగ ఏకా గ్రతను సాధించడం యోగాలో మాత్రమే. సాధ్యం. మానవులలో వచ్చే ఆలోచనలను భగ్నం చేసే  పరమార్ధ తత్వానికి మార్గం చూపేది యోగమే. వ్యక్తిలో నిడ్రాణ మైన మేల్కొలిపేది జాగృతం చేసేది యోగ మార్గం. అంతర్గతంగా  ఇంద్రియ నిగ్రహం,చేయడం, మనో నిగ్రహం, మనో నేత్రం తో రాబోయే ఘటనలను,జరుగుతున్న సత్యా లను చెప్పగల ఇంద్రియ జ్ఞానాన్నిమనకు అందించేది యోగమే. యోగము అంటే అదృష్టమని మరో పేరు. యోగము అంటే సాధన, భగవద్గీత లో అధ్యా యాలను యోగములని పేర్కొన్నారు.దీనిలో,యోగాలో మరికొన్ని పేర్లు ఉన్నాయి  ఆష్టాంగ యోగం,పతంజలి యోగ, రాజయోగ అని పేర్కొన్నారు.యోగ సాధన తోనే సమాధి పద,సాధనపద, కర్మయోగ, రాజ యోగం. విభూతి యోగా-జాగరూకత సాధన,ద్వారా నిపునుత సాధన గురించి వివరించారు.కైవల్య పదయోగం -మోక్ష సాధన యోగా శాస్త్రంలో ఆఖరి గమ్యం. పురాణాలలో యోగసాధన సాక్ష్యాధారాలు... ఈశ్వరుడు తపస్సు చేసి నపుడు పద్మాసనంలో ధ్యాన యోగంలో ఉన్నదని పురాణాలలో పేర్కొన్నారు. పద్మాసినీయే - మహావిష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడింది.సింధు నాగరికతలో ని చిత్రాల ఆధారంగా యోగా నాగరికతలో నే ఉందని విశ్వసిస్తున్నారు.యోగాలో ప్రాణాయామాలు 8.యోగా ముద్రలు 3 రకాలు,ఇందులో ప్రాణాయామల ద్వారా పరకాయ ప్రవేస్శాలు చేయడం అంటే యోగ విద్యాతో క్రీడించడం కొన్ని కధాలలో వర్ణించారు. యోగా ద్వారా శారీరక  డ్డారుడ్యం, ముఖ వచ్చస్సు పెరుగు తుంది. మానసికంగా దృదంగా ఉండాలంటే యోగా,అవసరమని మానసిక సంకల్పన్ని పెంచేది విజయ పదం లో నడిపింఛేది యోగా అన్నమాట నూటికి నూరు పళ్ళు నిజం.యోగని ప్రపంచానికి అందించిన ఘనత మన పోర్వీకులదే యోగా మనదేశంలో పుట్టిన యోగా పట్ల మనం గౌరవ సూచకంగా యోగా మహాత్ములు మనకు ఇచ్చిన బహుమతి. మనాజీవితాన్ని ప్రభావితం చేసేది యోగా.ఒక మిలియన్ ప్రజలకు అయినా యోగా అందించాలన్నదే ముఖ్యం.1400 స్త్రీలు బాలబాలికలు,  భారత్ లో సహకరించడం మనకు గర్వకారణం.ఇక మనలను పట్టి పీడిస్తున్న కోవిడ్ 19 సమయంలో  మన ఇమ్యూన్ బూస్ట్ ను పెంచేది యోగాతోనే.ఉదాహరణకు కోవిడ్ వల్ల ఒక పక్క అనారోగ్యం మరోపక్క మానసికంగా ఎదుర్కొ వాలంటే యోగా ఒక్కటే మార్గం. ప్రస్తుతం యువత పోటీని తట్టుకోలేక ఆత్మ హత్యకు పాల్పడడం మానసిక ద్రుడత్వం లేకపోవడం.మనలను అనారోగ్యం పాలు చేస్తుంది.మానసిక అనారోగ్యానికి మందు లేదు అయితే యోగాతో మానసిక అనారోగ్యాన్ని జయించే శక్తి యోగాకే ఉంది.కోవిడ్ నుండి ఉపసమనానికి యోగా తరగతుల వల్ల జీవితంలో మార్పు  తీసుకు రావచ్చు.  ఒక దీపం తో వెలును నింపవచ్చు యోగ సాధన చేసేకొద్ది మనజీవితం మరింత ప్రభావవంతంగా వెలుగులు నింపు తాయి .అందుకే యోగ సాధన నిత్యం మనాజీవితంలో భాగమైతే అందరం ఆరోగ్యంగా ఉండవచ్చు.ఇదే మనం యోగాడే సందర్భంగా మనము యోగా ను గౌరవించాలి.                   

కంటి చూపు సమస్యలు నివారణ...

సర్వేద్రి యానాం నయనం ప్రధానం. అన్ని  అవయవలోకి ప్రధాన మైన అవయవం. కన్నుమానవులలో ఉండే కన్ను ఒక కెమెరా లా  పనిచేస్తుంది.మన కళ్ళు కెమెరా లెన్స్  లా పని చేస్తాయి. కేరా ను పోలిన కళ్ళు కామేరా లెన్స్ పై లైట్   ఫోకస్ కెమెరా ఫిల్మ్ పై ఫోకస్  పడగానే ఎలా పని చేస్తుందో.మన కంటిలో  కొర్నియా పై లైట్ లైట్ పడగానే మనకు కనిపిస్తుంది.లైట్ చాలా  సెన్సిటివ్ గా ఉంటుంది.రెటీనా లో కొన్ని మిలియన్ల సెన్సిటివ్ సెల్స్ అవి రెండు ప్రధాన మైన వెరైటీస్ రోడ్స్ కొన్స్ ఉంటాయి.పెద్దవాళ్లలో 75% ప్రజలు కంటి చూపు లో దృస్తి లోపాలతో బాధ పడతారు. అయితే కంటి చూపుకు సంబందించి చిన్న పిల్లలు.ముఖ్యంగా స్కూల్ పిల్లలు  తీవ్ర సమస్యలు  ఎదుర్కుంటున్నారు.సహజంగా పిల్లల్లో వచ్చే కంటి చూపు కు సంబండిచిన సమస్యలలో రిఫ్రాక్టివ్  ఎర్రర్స్ అంటే అందరికీ తెలిసిన దగ్గర చూపు, లేదా దగ్గరి చూపు, లేదా ఆస్తిగ్మాటిస్మ్ , ప్రెస్ బ్యోపియా, రిఫ్రెక్టివ్ ఎర్రర్ కు కారణం కన్ను యొక్క పరిమాణం కంటి షేప్ లో మార్పు రావడమే అని పేర్కొన్నారు.రెటీనా పై లైట్ ఫోకస్ పై నేరుగా దీని వల్ల ఐ బాల్ యొక్క లెంగ్త్,కొర్నియా  పెద్దదిగా లేదా చిన్నదిగా  మారుతుంది.వయస్సు వల్ల  కొర్నియా ఐ బాల్ లో మార్పు వస్తుంది.  వాడే లెన్స్ వల్ల  రెఫ్రాక్టివ్ ఎర్రర్ కు కారణం కావచ్చు. చాలా మందిలో ఈ రకమైన సమస్యలు వస్తూనే ఉంటాయి.కంటి  అనారోగ్యానికి సంబందించి. కొన్ని  పోషక ఆహారం   సరిగ్గా తీసుకుంటే అది ప్రత్యేకంగా కంటికి మంచిది. దీనివల్ల కన్ను సరిగా పని చేస్తుంది.కాంతిని రక్షిస్తుంది.  ఆహారం అరుగు దల కు సంబందించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే విటమిన్ ఏ,  విటమిన్ సి,జింక్, కంటి ఆరోగ్యానికి ,కంటి చూపు సరిగా పని చేయడానికి తప్పనిసరి అని ఆప్తమాలజీస్ట్లు పేర్కొన్నారు. కంటి చూపు సమస్యలు నివారణ రెమెడిస్... *పంచ సూత్ర సిద్ధాంతాన్ని పాటించండి. *గ్రీన్ సలాడ్స్ మరియు పచ్చి కూరగాయలు. *పిత్త దోషాన్ని నివారించే  స్పైసి అంటే మాంసాహారము గుడ్లు. నివారించండి. *గోధుమ ఉత్పత్తులు ముఖ్యంగా గ్లూటెన్ ఉన్న  పిండిని వాడరాదు దీనికి బదులు మిల్లెట్స్, రెడ్ రైస్ ను వాడా లని సూచించారు. *గానుగ నుండి తీసిన రీ ఫైన్ద్ నూనెను సఫ్ఫ్లౌఏర్,సెసమే,కొబ్బరి నూనె ను వాడాలి. *రాగి జావ మజ్జిగతో తీసుకోవాలి.నాన పెట్టిన మొలకలు తీసుకో వాలి. *నెయ్యి ఆవు పాలు, జీల కర్ర ,లేద మిరియాల పొడి.ఆహారంలో తీసుకోవాలి. *రీ ఫైన్ద్ చేసిన ప్రొసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను నివారించండి *అప్పుడే తీసిన గానుగ నూనె కొబ్బరి నూనె శరీరానికి స్కాల్ప్ కు పట్టించండీ. *గోధుమ తో తయారు చేసిన స్వీట్స్,ఆరటి పండు ను నివారించాలి. *నిమ్మరసం ఫాలుదా తీసుకోవాలి. *నట్స్ మరియు విత్తనాలు. *డ్రై ఫ్రూట్స్  తీసుకోవాలి. ఆహారం సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.... *మల్టీ విటమిన్ ,బి కొంప్లెక్స్ *ఒమేగా 3 ఫ్యాట్టి యాసిడ్స్. *మామూలు తెల్లటి ఉప్పుకు బదులు హిమాలయా ఉప్పును వాడండి. *సుగంధి పాల, శతావరి. *ఆలోవెరా ,ఆవుపాలు ఆవు నెయ్యి  య్హీసుకోవాలి. *ఆల్కలైసింగ్ హెర్బల్ టీ 

ఫ్యాటి లివర్ డిసీజ్..

ఆల్కహాల్ లేకుండా వచ్చే వ్యాధి అల్కోహోలిక్ ఫ్యాట్టి లివర్ వ్యాధి. nafld  లివర్ లో అసహజమైన సంఖ్యలో కొవ్వు చేరడమే. అది చాలా సహజమై పోయింది. 50% పెద్దలలో అంటే 30 సంవత్సరాలు దాటిన వారిలో ఫ్యాటి లివర్  ఉందన్న విషయం చాలా మందికి  తెలియదు. ఎవరైతే  డయాబెటిస్, ఊబకాయం. ఉన్న వారిలో ఫ్యాటి లివర్ కొంత స్థాయిలో  వచ్చే అవకాశం ఉంది.ఫ్యాటి లివర్ ను రెండు తరగతులు లేదా గ్రేడ్ లుగా  విభజించారు. ఐ సో లేటెడ్ ఫ్యాటీ లివర్ ,ఇందులో కొవ్వు పేరుకు పోతుంది.లేదా నోన్ అల్కోహోలిక్ స్టేయటో హెపటైటీస్ ఫ్యాట్ తో పాటు ఇన్ఫ్లామేషన్  వల్ల డామేజ్ కాకుండా లివర్ సెల్స్ లో స్కారింగ్ లేదా శిరోసిస్ వల్ల తీవ్ర సమస్యలు  వస్తాయి. ఉదాహరణకు  గ్యాస్ట్రో పేగులలో రక్త స్రావం,లేదా లివర్ డీసీజ్, లేదా లివర్ ఫైల్యూర్,లివర్ కాన్సర్, వంటి సమస్యలు రావచ్చు. నోన్ ఆల్కహోలిక్ ఫ్యాటి వ్యాధీ కి కారణం ఊబ కాయం ,డయబెటిస్, మెటబాలిక్  సింగ్డ్రోమ్ దీనికి కారణం రీఫైండ్ ఆయిల్ హై కార్బో హైడ్రేడ్స్ మరియు చక్కెర తో కూడుకున్న ఆహారం. ప్రధాన కారణం.మరో పక్క సెడెంటరీ లైఫ్ స్టయిల్ ఫ్యాటి లివర్ సమస్యకు   ప్రధాన కారణం గా పేర్కొనచ్చు.దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు  వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి.లేదా ఇతర అవయవాలు తీవ్ర ప్రభావం పడు తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.    ఫ్యాటీలివర్ నివారణ రెమిడిస్.. పంచ సూత్ర  సిద్ధాన్ తాన్ని సాధన చేయండి. *గ్రీన్ సలాడ్స్ పచ్చి కూర గాయాలు. *మాంసా హారము గుడ్లు,పాలు   తీసుకోకండి నివారించండి. *గోధుమ ఉత్పత్తులకు బదులు మిల్లెట్స్ చిరు ధాన్యాలు,రెడ్ రైస్ తీసుకోండి. *రీ ఫైన్ద్ చేయని అప్పుడే  తీసిన గానుగ నూనెను సఫ్ఫ్లౌఏర్ ,సెసమే వంటి నూనెలు వాడాలి. *రాగి జావ ను మజ్జిగతో తీసుకోవాలి.అలాగే నాన పెట్టిన మొలకలు తీసుకోవాలి. *ఆవు నెయ్యి ఆవు పాలు జీల కర్ర, మిరియాల పొడి ప్రతి రోజూ తీసుకోండి. *రీఫైన్ద్ చేసిన ప్రొసెస్ చేసిన ఫ్రైడ్ రైస్,నూనె తో నిండిన ఫాస్ట్ ఫుడ్ నివారించాలి . *కఫాన్ని పెంచే ఆహారం ముఖ్యంగా స్వీట్స్ తీసుకో రాదని పేర్కొన్నారు. *నిమ్మరసం లో తేనెను కలిపి తీసుకోవాలి. *నట్స్,సీడ్స్ తీసుకోవాలి. *డ్రై ఫ్రూట్స్. *ఆరటి పండు, పోప్పాయా, దానిమ్మ గింజలు .తీసుకోవాలి. *ఆహారం లో సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.--- *తప్పని సరిగా విటమిన్ డి లెవెల్స్ ను  మెయిన్ టైన్ చేయాలి. *ఒమేగా 3 ఫ్యాటి  యాసిడ్స్.  *సాధారణ తెల్లని ఉప్పు కు బదులు హిమాలయా రోక్ సాల్ట్ ను వాడాలి. *త్రిఫలా చూర్ణం.మందులు రోజు కు 1 లేదా 2 టాబ్లెట్స్ తీసుకో వాలి. *ఆవు పాలు ఆవు నెయ్యి, ఆలోవీరా తీసుకోవాలి. *జింజీర్, నల్ల మిరియాలు,హెర్బల్ టీ.

మైగ్రేన్ నివారణకు మూలికా వైద్యం..

అయితే సాధారణ తలనొప్పితో బాధ పాడుతూ ఉంటారు.అయితే పార్శ్వపు నొప్పి థ్హెరమైన  తలనొప్పి తో బాధ పడుతూ ఉంటారు .ఇలా తీవ్రమైన తలనొప్పి వేటాడుతూ ఉంటుంది.తలకు ఒక వైపు మాత్రమే తలనొప్పి ఉండడం మైగ్రైన్ లక్షణం మెదడులో తీవ్రమైన ఒత్తిడికి గురై వంతుల తో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు . మెదడులో ఏదో పట్టి వదిలి నట్టు అని పిస్తూ ఉంటుంది.తీవ్ర మైన తలనొప్పి భరించలేక ఆత్మ హత్య చేసుకున్న సందర్భం ఉంది.తల నొప్పి తలకు ఇరువైపులా నొప్పి ఉంటుంది ముఖ్యంగా కేవలం నుదుటి పై నే తల నొప్పి ,లేదా తల వెనుక భాగం లో తల నొప్పి  ఉంటుంది.లేదా మెడ వెనుక వైపు నొప్పి ఉండవచ్చు. దీనికి కారణం సరైన ఆహారం లేక పోవడం,ఆహారం తీసుకోక పోవడం. ఆయా కాలాలలో వచ్చే వాతావరణ మార్పులు ,నిద్ర లేమి ,స్త్రీలలో వచ్చే హార్మోనల్ మార్పుల వల్ల తల నొప్పి వస్తుంది.ఆయుర్ వేదం లో మై గ్రైన్ ను గురించి మాట్లాడుతూ మైగ్రైన్ కు మూలం శరీరం లో పిత్త దోషమే కారణం గా తేల్చారు.మూడు రకాల దోషాలలో పిత్త దోషం వల్లే రక్త నాళాల లో డైలేషన్ జరగడం వల్లే మైగ్రేన్ కు కారణం గా చెప్పవచ్చు. తలనొప్పి తక్కువగా లేదా  తరచుగా అతి తీవ్రంగా ఉంటాయి.తల నొప్పి తో పాటు కన్ను నొప్పి  ముక్కు లో చెవిలో నొప్పి ఉంటుంది. కళ్ళు  బైర్లు కమ్మి నట్లు, వెలుతురు చూడలేక పోవడం,శబ్దం వింటే చికాకుగా ఉండడం. వాంతి వచ్చినట్లుగా ఉంటుంది. లైఫ్ స్టయిల్ లో చిన్న మార్పు చేసుకుంటే చాలు మైగ్రైన్  కు గల కారణాలను తెలుసు కుంటె దీర్ఘ కాలం గా ఎదుర్కునే  మైగ్రేన్ ను  నివారించేందుకు  చికిత్స అందుబాటులో ఉంది. మైగ్రేన్ నివారణ రెమిడిఎస్... *పంచ సూత్ర సిద్దాంతన్ని పాటించండి. *గ్రీన్ సలాడ్స్ మరియు పచ్చ్హి కూరగాయలు. *పిత్త  దోషాన్ని పెంచే ఆహారాన్ని, అంటే  స్పైసి గా ఉన్న మాంసా హారము,గుడ్లు ను నివారించండి. *గోధుమ  ఉత్పత్తుల కు బదులు , మిల్లెట్స్ రెడ్ రైస్ తీసుకోండి.  *అప్పుడే గానుగ నుండి తీసిన రీ ఫైన్ద్ నూనెలు సఫ్ఫ్లౌఏర్,సెసమే కొబ్బరి నూనెను వాడండి. *పచ్చి మొలకలు,రాగి జావ, మజ్జిగ కలిపి తీసుకోవాలి. *ఎంజైమ్స్ లో పచ్చటి ఆకు కూరాలు, కాలీఫ్లవర్ ను వాడాలి. *నెయ్యి ఆవు పాలు జీలకర్ర, మిరియాల పొడి మొర్సెల్  ఆఫ్ ఫుడ్.ను వాడండి. *ప్రొసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను  నివారించండి. *మీ శరీరానికి స్కల్ప్ కు  రీ ఫైన్ద్ చేయని కొబ్బరి నూనె  వాడాలి. *గోధుమ పిండితో చేసిన స్వీట్స్, ఆరటి పండును నివారించండి. *దోస కాయ,, పుచ్చ కాయను తీసుకోవాలి. *పెప్పర్ మింట్,  యూకలిప్తుస్,లెవెండర్ నూనె. తో తల నొప్పి ని నివారించ వచ్చు. *రోజు మూడు లీటర్ల వేడి నీళ్ళు కోఫీ వల్ల  డీ హైడ్రేషన్ ఎఫ్ఫెక్ట్స్ తగ్గించు కోవాలి. చక్కెరతో చేసిన పానీయాలు తల నొప్పికి కారణం కాగలవు. ఆహారంసప్లిమెట్లు సంప్రదాయ మూలికలు.--- *మల్టీ విటమిన్, బి కొంప్లెక్స్.  *ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. *సాధారణ తెల్లటి ఉప్పుకి బదులు హిమా లయా రోక్ సాల్ట్ వాడాలి. *సుగాంధీ పాల, శతావరి, వేప నూనె. *ఆవు పాలు, ఏలో వీరా . *ఆల్కలైసింగ్ హెర్బల్ టీ             మూలిక తో  మై గ్రైన్ కు చెక్ పెట్టవచ్చు.  మై గ్రైన్ కు మూలికలతో చికిత్స

ప్రపంచ రక్త దాన దినోత్సవం.. అపోహలు...

అన్నీదానాలలోకి రక్త దానంచాలా గొప్పది.ఇది నిజం. మీరు చేసిన రక్త దానం ఒక ప్రాణాన్ని కాపాడు తుంది. ఇది నిజం అత్యవసర సమయంలో ముఖ్యంగా  రోడ్డు ప్రమాదం లో ఆసుపత్రిలో ఉన్నవారు, గుండెకు స్టన్టింగ్ బై పాస్ సర్జరి చేసుకునే వారికి ,లేదా ఇతర శస్త్ర చికిత్సలు చేసుకునే రోగులకు, అత్యవసరంగా రక్త దానం చేయడం అవసరం. కొన్ని సందర్భాల లో నేరుగా రోగికి రక్త దానం చేయడం వల్ల రోగి కోలుకుని మన ముందు బతికి వస్తే మనం చేసిన రక్త దానం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఒక సంతృప్తి ఉంటుంది. ప్రపంచ రక్త దాన దినోత్సవం- అపోహలు... జూన్ 14 న  ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని జరుపు కుంటారు.దీనికి గుర్తుగా ఈ వారం అంత దినోత్సవాన్ని జరుపు కుంటారు. అయితే రక్త దానం పై కొన్ని అపోహలు సందేహాలు ఉన్నాయి. రక్తదానం గురించి సరైన అవగాహన అర్ధం చేసుకోడం అవసరం. వైద్య రంగం గురించి చాలా రకాల అపోహలు ఉంటూనే ఉంటాయి.దీని పై పూర్తిగా పరిశోధన లు సరిగా జరగ లేదు.నేటికీ పూర్తిగా అవగాహన కల్పించ లేక పోతున్నారు .అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 13.2 మిలియన్ల రక్త దాతలు ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 1 0 0 మిలియన్ల ప్రజలు కొన్ని యూనిట్ల రక్తం ప్రతి సంవత్సరందానం చేస్తారు.  మీరు రక్తదానం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే... మీరు  చేసే రక్త దానం చేయాలన్న ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది.చాలా  మంది రక్తాన్ని వివిధ గ్రూపులుగా విభజిస్తారు. ఎర్ర రక్త కణాలు, ప్లాటి లెట్స్, ప్లాస్మా, ను రోగులకు వ్యక్తులకు ప్రత్యేక పరిస్థితులలో ఇవ్వచ్చు. ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన ఉపాద్యక్షుడు ఎమెర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ జేమ్స్ ఎఫ్ కెన్ని రక్తదానం గురించి న అభిప్రాయాలు వెలిబుచ్చారు.ఎవరైతే అత్యవసర సమయం లో తీవ్రమైన గాయాలు  లేదా సర్జరీ చేసుకునే రోగులు,లేదా కీమో థెరఫీ.లేదా బోన్ మ్యారో  సహజంగా అవసరం  అవుతుందో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రతి రెండు సెకండ్ల కు రక్తం అవసరం.ఇలా  ప్రతి సంవత్సరం రక్తం ఎక్కించడం, లేదా రక్త మార్పిడి చేస్తూ ఉంటారు. 1) రక్త దానం చేస్తే అనారోగ్యం పాలౌతమా... ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు రక్త దానం చేయవచ్చు. రక్త దానం చేశాక అనారోగ్యం పలౌతారని అనడం కేవలం అపోహ అనారోగ్యం రావడం  తక్కువే., రక్త దానం చేసీన తరువాత వైద్యులు ఒకరోజు విరామం తీసుఓవలని సూచిస్తారు. విరామం తరువాత కొన్ని శక్తి నిచ్చే పానీయాలు తీసుకో వాలని సూచించారు. రక్త దానం చేసిన నాలుగు వారాలు లేదా మూడు నెలలలో మరలా మన శరీరంలో తిరిగి చేరుతుంది. ఆతరు వాడేప్లాస్మా పెరుగు తుంది.రక్తం నిల్వ చేసే కేంద్రాలలో బ్లడ్ బ్యాకు లలో ఇవ్వచ్చు. లేదా నేరుగా ఆసుపత్రుల లోని రక్త నిధి కేంద్రాలలో రక్తం దానం చేయవచ్చు. రక్త దానం చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్నాయన్నది వాస్తవం అని డాక్టర్ జాన్ రైమో అన్నారు.రక్త దానం చేయడం వల్ల  త్వరగా అలిసి పోవడం, శరీరం తేలిక గా ఉండడం., బలహీనంగా ఉన్నట్లు అనిపించడం సహజమని అన్నారు. కాగా ఈ సమస్య నుంచి బయట పాడాలంటే మంచి నీళ్ళు తీసుకుంటూ ఏదైనా స్నాక్స్ తీసుకోవాలని సూచించారు.చేయి ఎర్రగా అయినట్లు దద్దుర్లు ఉన్నట్లు  అని పిస్తుంది.. 2) వృద్ధులు పెద్దలు రక్త దానం చేయవచ్చా... ఇది నిజం కాదు. యు ఎస్ ప్రజలు 1 6 కంటే తక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు 50 కిలోలు -లేదా 110 పౌండ్లుఉన్న వాళ్ళు రక్త దానం చేయ వచ్చునని తెలిపారు.రక్తదానానికి వెల కట్టలేము. యునైటెడ్ కింగ్ డమ్ లో 17 సం --నుండి 6 0 సంవత్సరాల లోపు లేదా 70 సం లోపు వారు రక్త దానం చేయవచ్చు.అంతకు ముందు ఎవరైనా రక్త దానం చేసి ఉంటే మళ్ళీ రక్త దానం చేయవచ్చని తెలిపారు. 3) ఎవరైనా చికిత్సలో ఉంటే లేదా మందులు వాడు తుంటే వారు దానం చేయవచ్చా... ఇది ఒక రకంగా ఉండే అపోహ మాత్రమే యాంటీ కాగులెట్స్, యాంటీ ప్లాటీలెట్స్, చర్మం పై వచ్చే పింపుల్స్ కి చికిత్స తీసుకున్న వారు. రక్త దానం చేయకూడదు.ఏది ఏమైనా చాలా రకాల కేసులలో మందులు అంటే రక్త దానం చేయమని అడగరు. రక్త దానం చేయడానికి ముందు వ్యక్తి వైద్య వృత్తిలో ఉన్న వారు ప్రస్తుతం వాడుతున్న మందులు వాటి వివరాలు రక్త దాతకు వచ్చే ఇతర పరిణామాలు  వైద్యుడు మీకు మందులు సూచించి నట్లైతే ఆ మందులు రక్త దానం తీసుకో కూడదని అన్నది సరికాదు. 4)రక్త దానం చేయడం సమయం వృధా... రక్తదానం చేయదానికి  రిజిస్ట్రేషన్ ప్రొసెసింగ్ పరిశీలన సమయం  తీసుకోడం అనుకుంటారు.రక్త దానం చేయడానికి 8- 10 నిమిషాల సమయం  పడు తుంది అమెరికన్ రెడ్ క్రోస్ ప్రకారం 15 నిమిషాల నుంచి ఒక ఘంట సమయం పడు తుంది. 5)రక్త దానం చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందా ?... రక్త దానానికి ముందు కొంత ప్రిపరేషన్, ఉంటుంది. నీడిల్ ఇచ్చే ముందు రక్తం దానం చేసే దగ్గర  శరీరం గట్టిగా ఉండకూడదు.బిగ పట్టా కూడదు. కొత్త సూదిని లేదా స్టెర్లైస్ చేసిన సూదిని మాత్రమే వాడాలి. 6) రక్తం ఎక్కించు  కుంటె ఇన్ఫెక్షన్ వస్తుందా ? రక్త దానానికి దీనికి సంబందం లేదు,ఇది ఒక అపోహ మాత్రమే వేరొకరి రక్తం తీసుకుంటే ప్రమాదం. అన్నది భ్రమ మాత్రమే.అని అనుకుంటున్నారు. రక్తం తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ వస్తుందన్న అరుదైన సంఘటన గా పేర్కొన్నారు.రక్తంలో ఏమైనా వైరస్ లు బ్యాక్టీరియా ఉనయో లేదో స్క్రీన్  చేస్తారు. లేదా హెపటైటీస్ బి పరీక్ష అనంతరం రక్తం  తీసుకుంటారు.అలాంటి సమస్యలో 100 లో ఒకరికి వస్తుంది. 7) రక్త దానం చేయడం నొప్పి కలిగిస్తుందా.. ఇది ఒక అపోహ రక్తం తీసేందుకు లేదా ఇచ్చేందుకు ఇచ్చే ఇంజక్షన్ ఇది సహజంగా అంత ప్రమాద కరమైనది కాదు. రక్త దానం చేయడం సురక్షితం గానే ఉంటుంది. 8)సంవత్సరానికి ఒక్క సారె రక్త దానం చేయాలి... ఇది నిజం కాదు శరీరానికి రక్త దానం చేసిన తరువాత రక్తం తిరిగి పొందాలంటే 8 వరాల సమయం పడుతుంది.మరల సురక్షితంగా రక్త దానం  చేయవచ్చు.  9) టా టూ వేసుకునే వారు, లేదా పచ్చ బొట్టు వేసుకునే వారు రక్త దానం చేయవచ్చా.... ఇది దీర్ఘ  కాలం గా ఉన్న అపోహ ఇంకా అపోహ ఇలాగే కొనసాగు తుంది. అమెరికన్ రెడ్ క్రోస్ ఇచ్చిన సూచన మేరకు టాటు వేసుకున్న తరువాత  టాటు అందు బాటులో ఉండ కూడదు.అదే సింగల్ ఇన్స్తుమెంట్ లేదా వాడి పారేసిన నీడిల్ అలా పచ్చ బొట్టు లేదా టాటు తీసుకున్న వాళ్ళు 3 నెలలు రక్త దానం చేయడానికి  ఆగాలి. 10) బీపీ ఉంటే రక్త దానం చేయవచ్చా... మీకు హై బీపీ ఉంటే రక్తదానం చేయరాదు. ఇది నిజం కాదు. ఎవరైతే సిస్టోటిక్ బ్లడ్ ప్రెషర్ 180/100 ఉన్న వారు రక్త దానం చేయ వచ్చు.బిపికి వాడే మందుల వల్ల రక్త  దానం చేయకూడ దనేది లేదు. కొన్ని రకాల మందులు వాడడం లేదా డ్రగ్స్ వాడిన వాళ్ళు రక్త దానం చేయరాదు. 11) హై కొలస్ట్రాల్ ఉంటే రక్త దానం చేయవచ్చా... ఇది నిజం కాదు హై కొలస్ట్రాల్ ఉన్న వారు వాడే తక్కువ మోతాదులో తీసుకునే మందు రక్త దానం చేయడానికి అనర్హులు 12)వేజి తెరియన్స్ వెజాన్స్ రక్త దానం చేయకూడదు... ఇడీ మరో అపోహ ఆరోగ్యం పై హెల్త్ స్క్రీనింగ్ సాత్వికులు,రక్తంలో ఐరన్, రక్త హీనత తో    బాధ పడు తున్న వారికి  ప్రతి రక్త దాతను స్క్రీనింగ్ చేసి పరీక్షిస్తారు.కాగా రక్త హీనతతో ఉన్నవారు రక్త దానం చేయరాదు. ఇప్పటికే చాలా మంది రక్త దానం చేశారు .శరీరంలో  రక్తం ఉన్నంత కాలం మనిషి   జీవించి ఉంటారు. ఎర్ర రక్త కణాలను 42 రోజులలో ఉపయోగించాలో . ప్లాటి లెట్లను 5 రోజుల్లో వాడాలి. రక్త దానం చేసిన తరువాత మరింత మండి రక్త దాతల కోసం ఎదురు చూడాల్సిందే ఇంకా చాలా మంది రక్త దాతల కోసం ఎదురు చూడాల్సిందే. ఇంకా చాలా మంది రక్త దాతల అవసరం ఉంది. నాణ్యత అర్హులైన రక్త దాతల సంఖ్య తక్కువగా నే ఉంటుంది. ప్రక్తి రక్త దాత చాలా సురక్షితంగా  స్క్రీన్ చేయాలి. ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధులు ఇతర పరిస్థితులు ఉన్న వారిలో రక్తం సరి పడక పోవచ్చు. ఇతరులకు ఇవ్వలేక పోవచ్చు. రోగుల అవసరాలు తీర్చేందుకు మరింత ఎక్కువ మంది రక్త దాతలు అవసరం.యు ఎస్ లో 1/3 వంతు మంది  మాత్రమే అర్హులైన రక్త దాతలు ఉన్నారు. బ్లడ్ బ్యాంకుల నుండి ఆయా గ్రూపులకు సంబందించిన రక్తాన్ని పొందవచ్చు .ఒక్కో సారి రక్త నిధి కేంద్రాల లో సరి పడ రక్త నిధి ఉండచ్చు లేదా సరి పడా నిల్వ ఉండక పోవచ్చు. మానవ సేవే మాధవ సేవ ఒక వ్యక్తికి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన తృప్తి ఉంటుంది.మీరు రక్త దాతలు కండి ప్రాణాలు కాపాడండి.

ఆయుర్వేదంలో అశ్వగంధ...

అశ్వగంధ లో మరిన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి అంటున్నారు. నిపుణులు.అశ్వగంధ భారత దేశంలో  గింసెంగ్ గా పేర్కొంటారు. క్యాన్సర్ , డయబెటిస్, తో పాటు ఇన్ఫ్లామేషన్ ఆర్థ్ రైటిస్,  ఆస్త్మా, హైపర్ టెన్షన్, స్ట్రెస్, రుమటిస్మ్,వంటి సమస్యలు మున్ముందు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా రోగ నిరోదక శక్తి యాంటీ బాక్టీరియల్ గా యాంటీ కొన్వుల్సంట్ ప్రొపెర్టీ గా పేర్కొన్నారు.ఆయుర్వేద వైద్యులు భారత దేశం లోని అత్యంత పురాతన వైద్య విధానంలో ఆయుర్వేదం కొన్ని శతాబ్దాలుగా బోధిస్తున్నారు.అశ్వగంధకు కీలక ప్రాధాన్యత ను ఇచ్చారు. అమెరికన్లు, ఆఫ్రికన్లు, కొన్ని శతాబ్దాలుగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్,లకు మన ఋషులు ,మునులు అశ్వగంధ మొక్కాలోని ఔషద గుణాల ను గురించి సంప్రదాయ చైనా వైద్యంలోను, ఆయుర్వేదం లోనూ  చాలా శతాబ్దాలుగా సాధన చేస్తున్నప్పటికి  ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన అశ్వగంధ పై  ఆసక్తి పెరుగుతూనే ఉందిఈపాటికీ అశ్వగంధ మొక్కలలో ఉన్న ఔషద గుణాలపై శాస్త్రీయ  పరిశోదనల లో మొక్కలలో టో క్సిటీ రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు దీనిలోని ఔషద గుణాల తో  యాంటీ ఇన్ఫ్లా మేటరీ, యాంటీ  ఆక్సీ డైజింగ్,ఒత్తిడికి, తగ్గించేందుకు, నిద్ర యాంటీ డ్రగ్ గా అశ్వగంధ పనిచేస్తుంది.అశ్వగంధ కండరాల స్కేలిటల్ సమస్యలు ముఖ్యంగా ఆర్థ రైటిస్, రుమేటిజమ్ వంటి సమస్యలకు టోనిక్ గా పని చేస్తుంది.అది శరీరానికి పూర్తి శక్తి నిస్తుంది. దీని వల్ల సంపూర్ణ ఆరోగ్యం తో పాటు. దీర్ఘ కాలం జీవిస్తారని తెలుసు కున్నారు  కొత్తగా  జరుగుతున్న పరిశోదనలో  అశ్వగంధ పై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జపాన్ ఇచ్చిన రిపోర్ట్ లో అశ్వగంధలో ఎంపిక చేసుకున్న క్యాన్సర్ కణాలను, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే  అతి సునీత మైన అవయవం. అశ్వగంధ సప్లిమెంట్స్ దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు. ఒత్తిడి ని అధిగ మించవచ్చు. అశ్వగంధ వల్ల అనేక లాభాలు ఉన్నాయి యాంటీ కర్సీ నోగెనిక్, ఆంటీ ఇన్ఫ్లామేటరీ,, యాంటీ బాక్టీరియల్,కార్డియో ప్రొటెక్టివ్ యాంటీ డిప్రెస్సంట్, ప్రొపర్టీస్ గా పని చేస్తుంది. డయాబెటిస్,  తైరోయిడ్, గ్లాండ్స్ వంటి వాటికి కొంత ఒత్తిడిని తగ్గించి యాంటీ ఒక్సిడెంట్ గా ఇమ్మ్యునో మోడ్యూ లేటరీ  ప్రొపర్టీగా పని చేస్తుందని రక్తం ఉత్పత్తి చేయడం, రాబోయే వ్యాధులను తగ్గిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అశ్వగంధ తో మేలైన ఆరోగ్యం.

పచ్చి కూరలు పళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి

కోతి ఆరోగ్యంగా ఉండటానికి రహాస్యం ఏమిటి? సంవత్సారాల తరబడి  ఆరోగ్యంగా ఎలా ఉంటుంది. ఆ రహాస్యం ఏమిటి  అన్న సందేహం ఇప్పటికీ వస్తూనే ఉంది. ఇంకా మనం కోతి నుంచే నేర్చు కోవాలా ? అంటే అవును అని సమాధానం చెపుతున్నారు నిపుణులు. అటు మానవులపై ఇటు కోతులపై వేరువేరుగా జరిపిన పరిశోధనలో పలు అంశాలు వెలుగు చూశాయి. మానవులలో దీర్ఘకాలంగా ది జెనరేటీవ్ వ్యాధులతో బాధపడుతున్నట్లు డాక్టర్ హొవెల్ అన్నారు. దీనికి గల కారణం ఎంజయిమ్ లోపమే అని అన్నారు. అందుకు కారణం  బాగా వండిన ప్రాసెస్ చేసిన ఆహారమని దాని వల్ల డబ్ల్యు బి సి కౌంట్ పెరగడమే అన్నారు. దీనివల్ల శరీరం పై టాక్సిక్ కొన్నిరసాయనాలవల్ల రక్త హీనతతో బాధపడుతున్నారని అన్నారు. అయితే కోతి పై జరిగిన పరిశోధనలోభారత్ కు చెందిన సర్ రాబర్ట్ ఎం సి కార్రిసన్ చేసిన పరిశోధనలో కోతులు వాటి సహజ సిద్ధమైన ఆహరం తీసుకుంటాయి. వండిన ఆహారం తినడం వల్ల వాటికి పెద్ద పేగు, చిన్న పేగుల్లో పలు అనారోగ్య సమస్యలు వచ్చాయని అవి అల్సర్లుతో బాధపడ్డాయని కార్రిసన్ అన్నారు. సహాజ సిద్ధమైన ఆహారం పచ్చికూరగాయలు, పండ్లు, వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉన్నాయని, ఆహరం అరుగుదల సమస్యలు అవి అధిగామించాయని అన్నారు. నా వ్యక్తిగత అనుభవంలో వందలకొద్దీ రోగులను చూశానని వారిలో దీర్గకాలిక  degenerativ diseasesతో బాధపడుతున్నవారికి రివర్సల్ పద్దతిలో నాలుగు నుండి ఆరు నెలల పాటు  కొంతమంది రోగులులకు ఇచ్చామని వారిలో అరవై ఏళ్ళు పై బడ్డవారు  సైతం ఇపటికీ 52 కిలో మీటర్లు ఎండలో, చలిలో నడుస్తున్నారని ఆయన అన్నారు. వారు కైలాస్ గిరి మనస సరోవరా యాత్రలో వారు పూర్తిగా ఆరోగ్యవంతమైన సహజమైనా ఆహరం మాత్రమే తీసుకున్నారని ఇప్పటికీ వారు శరీరం దృడంగా ఉందని అన్నారు. వారు అలా ఉంటామని బహుశా ఊహించి ఉండకపోవచ్చు అని వారి ఆహరం లో కొత్తిమీర రసం, బీట్రూట్ రసం,పచ్చి మొలకలు ప్రతి రోజూ తీసుకున్నారని. మరిన్ని ఆహారపదార్ధాలు తీస్కోడం వల్లే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని సహాజంగా కోతులు వాటికీ ఇష్టమైన వన భోజనం పళ్ళు కూరలు తింటాయి కాబట్టే అవి వందల మైళ్ళు తిరుగుతూ, హాయిగా, ఆరోగ్యంగా  ఉండడానికి కారణమని అంటున్నారు పరిశోధకులు. మీరు పచ్చి కూరలు పళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి.

రక్త హీనత నివారణ రెమెడీస్

రక్త హీనత అత్యంత ప్రమాదకరం. జనాభాలో 30% మంది రక్త హీనతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జనాభాలో చాలా మంది స్త్రీలు, పిల్లలు అనీమియాతో బాధ పడుతున్నారు. అనీమియా శరీరాన్ని అంటి పెట్టుకునే అనారోగ్యం కాదు. అయితే దీనిని ఒక డిజార్డర్ గా పేర్కొన్నారు. తరచుగా ఇది ఇతర రోగాల వల్ల వస్తుంది. శరీరంలో ఉన్న శక్తి సామార్ధ్యాలు తెలియ చేస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరగక పోవడం లేదా తగ్గి పోయినప్పుడు పూర్తిగా ఎర్ర రక్తకణాలు తగ్గినప్పుడు అనీమియా వస్తుంది. ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిజన్ నిలువరిస్తుంది. మీ శరీరంలో హిమోగ్లోబిన్ రక్త కణాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు మీ శరీరానికి ఆక్సిజన్ అందదు. అనీమియా వచ్చినప్పుడు వచ్చే లక్షణాలలో త్వరగా అలిసిపోవడం సంభవిస్తుంది. ఆ సమయంలో శరీరంలోని అవయవాలకి  కావల్సిన లేదా సరిపడా ఆక్సిజన్ అందక పోయినా అంటే శరీరంలో కావాల్సిన ఐరన్ అందక విటమిన్ లోపం లేదా లక్షణాల లో భాగం గా శరీరంలో శక్తి లేకపోవడం నీరసం, నిసత్తువ, తల తిరగడం. శరీరం తేలికగా ఉండడం. సహజంగా  వచ్చే ఎనిమియా  మనం తీసుకునే ఆహారం పైనే ఆధార పడి ఉంది. పోషక ఆహారం లోపం వల్ల వచ్చే ఈ వ్యాధి ని నివారింకవచ్చ్హు దీనిని మళ్ళీ సరైన పోషక ఆహారంతో రివర్స్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. దీనిని గుర్తించ డానికి రకరకాల పద్దతుల్లో పరీక్షించవచ్చు. బ్లడ్ కౌంట్ సిబిసి అందులో రక్త కణాలు రోగుల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్, రక్తంలో ఎర్ర రక్త కణాలు మొత్తం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అనీమియా నివారణ రెమెడీస్.... *ఇన్ఫ్లా మేషన్ కు కారణ మయ్యే ఆహారం ఉదాహరణకు గోధుమ ,ఉత్పత్తులు ,గ్లూట్టెన్, యాసిడ్స్,ఆహారాలు. రీ ఫైన్ద్ ఆహారం, కార్బో   హైడ్రేడ్స్,, తాజా కూరాగాయాల వల్ల లాభం.- *పంచ సూత్ర పద్దతులను అనుసరించండి. *గ్రీన్ సలాడ్స్,బీట్రూట్, పచ్చి కూరాగాయలు తీసుకోండి. *రాగి మాల్ట్ మజ్జిగ తో గ్రీన్ గ్రామ్ అంటే పచ్చటి నాన పెట్టిన మొలకలు. *ఆవు పాలు, ఆవు నెయ్యి ఫస్ట్ మొర్సెల్ ఒఫ్ ఫుడ్. *ఆరటి పండు, గోధుమ ను పూర్తిగా నివారించండి. *ఫ్లక్స్ సీడ్స్, సీ సమే సీడ్స్, కొబ్బరి,జీలకర్ర, పొడిని వాడండి. *భోజనం తరువాత బీటిల్ లీఫ్స్ తో కలిపి ఫెన్నెల్  సీడ్స్ తో కలిపి తీసుకోవాలి. *డ్రై ఫ్రూట్స్ ను రైసిన్స్, డేట్స్,దానిమ్మగింజలు.మీరు భోజనం  తరువాత తీసుకోవాలి. *పాలు, పాల ఉత్పత్తులు, కు బదులు మజ్జిగ ను తీసుకోండి. *రీ ఫైన్ద్ చేసి ప్రొసెస్ ఫాస్ట్ ఫూడ్స్ ,రీ ఫైన్ద్ నూనెలు నివారించండి. *రీ ఫైన్ద్ చేయని నూనెలు సఫ్ఫ్లౌఏర్ ,సెసమే, కొబ్బరి నూనె. ఆహారం సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.---- *ముల్టీవీటమిన్ ,బి కాంప్లెక్స్. *ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్. *సాధారణ తెల్లటి ఉప్పుకు బదులు రోక్ సాల్ట్ ను వాడాలని సూచించారు. *బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్. *క్షీర బల, శిగృ, మొరింగా శలాకి. *హెర్బల్ టీ  అనీమియాతో ఎవరు బాధపడిన ఎర్ర రక్త కణాలు తగ్గా యని గుర్తించడం, డాక్టర్ సూచనల మేరకు పౌష్టిక ఆహారం తీసుకోవాలి. మీ అవయవాలను సరిగా పని చేయాలంటే ఎర్ర రక్త కణాలు ఎంత మొత్తంగా ఉన్నాయో చూసుకోవాలి.

థైరాయిడ్‌కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి

థైరాయిడ్‌కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి థైరాయిడ్ కొన్ని రకాల మెటబాలిక్ దిసోర్దేర్స్ లో ఒకటి. మీ శరీరంలోని మెడ వద్ద  సీతాకోక చిలుక  ఆకారం లో  ఉండే ఒక గ్లాండ్. మీ శక్తి నిచ్చే ప్రాధాన గ్లాండ్ మీ శరీరంలో మేటాబాలిజం ను నియంత్రించే కీలక అవయవం.మీ జీన్స్ అంటే మూల కణాలను వాటి పని చేసే విధంగా పని తీరును మెరుగు పరుస్తుంది.మీకు తెలుసు థైరాయిడ్  ప్రధానం గా ఎప్పటి కప్పుడు మెకానిజం చేసే యంత్రం ల పని చేస్తుంది.మీ శరీరం లోని ప్రతి కణాన్ని థైరాయిడ్ హార్మోన్ రేసుప్టర్ గా పని చేస్తుంది. సహజంగా థైరాయిడ్ ను రెండు రకాలుగా నిర్ధారించారు .ఒకటి హైపో  థైరాయిడ్, లో థైరాయిడ్ గ పనిచేస్తాయి. ఇది మన శారేరాన్ని చాలా సైలెంట్ గా ఎపిదమిక్ గా మారుస్తుంది. ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఉన్నట్లు గుర్తించారు అలా అది మన రోగ నిరోధక శక్తి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల చాలా తక్కువ స్థాయిలో ఇంఫ్లా మేషన్ తో పాటు ఆటో ఇమ్మ్యునిటీ సమస్యలకు దారి తీస్తుంది. దీనికి కారణం తక్కువ నాయతతో కూడిన ఆహారం.ఇందులో పూర్తిగా రీ ఫైండ్ చేసిన, ప్రాసెస్ చేసిన లేదా కొవ్వు పదార్ధాలు మీసెడెన్ట్రిక్ లైఫ్ లో ఒత్తిడి, వల్లథైరాయిడ్ వల్ల మరిన్ని తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ఏండో క్రినేలో గ్లంలో భాగం ఇది శరీరానికి అవసరనైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరాన్ని సమతౌల్యం లో ఉంచుతుంది. దీనిలో చాలా రకాల  థైరాయిడ్ లు ఉన్నాయి.  అందులో హషిమొటోస్, థైరాయిడో టిస్ వల్ల త్వరగా అలిసిపోవడం, ఒత్తిడికి గురికావడం, జలుబును తట్టుకో లేక పోవడం, బరువు పెరగడం, చర్మం,జుట్టు  ఎండి పోయి నట్లుగా ఉండడం, కండరాలలో నొప్పులు, మల బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం, నిద్రలేమి, కా ళ్ళలోవాపులు, తెల్లగా పాలిపోయిన కళ్ళు, గుండె చాలా నేమ్మడిగా కొట్టు కోవడం. శరీరంలో  ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం. ఒక్కోసారి హార్ట్ ఫైల్యూర్, లేదా కోమా లోకి వెళ్లి పోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు.దీనికి మనలో ఉన్న రోగనిరోదక శక్తి  మధ్యస్తంగా రెఅ ఆక్ట్ కావడం అని నిపుణులు తేల్చారు. థైరాయిడ్ నివారణ రెమిడీస్... * నిర్దేశించిన విధంగా పంచాసూత్రాలను పాటించండి. * ఒమేగా 3 కొవ్వు నిచ్చే మొక్కలనుండి తీసుకోండిఉదాహరణకు  ఫ్లాక్స్ సీడ్స్ ఫాలూదా సీడ్స్ విరివిగా తీసుకోండి. * ప్రాసెస్ చేసిన తెల్లని ఉప్పుకు బదులు హిమాలయా రొక్ సాల్ట్ ను తప్పని సరిగా వాడండి. * మీ శరీరంలో విటమిన్ డి శాతాన్ని సాధారణ స్థాయిలో ఉండే విదంగా చూసుకోండి.సరైన శాతంలో విటమిన్ డి ఉండడం వల్ల మీ ఆరోగ్యం సామాన స్థాయిలో ఉంటుంది. * గ్రీన్ సలాడ్స్, వెల్లుల్లి, కూరాగాయల లో ఎక్కువ స్థాయిలో కో ఎంజయిం లు ఉంటాయి. * మీరు మీ ఆహారంలో ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను రీ ఫైండ్ నూనెలను పూర్తిగా నివారించండి. * పీచు,లేదాతౌడు ఎక్కువగా ఉన్నగోధుమ ఉత్పత్తులను నివారించండి అందుకు బదులు మిల్లెట్స్రె రెడ్ రైస్ ను లేదా బ్రౌన్ రైస్ ని వినియోగించాలని నిపుణులు సూచించారు. మీ ఆహారం లో సుప్లిమెంట్లు సంప్ర్సదాయ మూలికలు... * ఒమేగా3 కొవ్వు తో కోడిన యాసిడ్లు. * మల్టీవిటమిన్ మినరల్స్ , బి కాంప్లెక్స్. * ప్రాసెస్ చేసిన తెల్లటి ఉప్పు కంటే హిమాలయన్ రొక్ సాల్ట్ ను వాడాలి. * అశ్వగంధ, తులసి,కంచనార్ గుగ్గులు షిలాజిత్. * వేప నూనె లేదా నీం,ఆయిల్ హైపర్ థైరాయిడిశం * గ్రీన్ అండ్ హెర్బల్ టీ          * రీ ఫైండ్ చేయని సాంప్రదాయ  పద్దతిలో తీసినసఫ్ఫ్లోవేర్, సేసమే, కొబ్బరి నూనెలను వినియోగించండి. * ఫ్లాక్స్ సీడ్స్, ఫాలూదా ను మీరు రోజూ తీసుకునే ఆహారంలో వినియోగించండి. * మీ ఆహారం లో బెటెల్ఆకులు ఫెన్నెల్ సీడ్స్ ప్రతిరోజూ తీసుకోండి. * నట్స్, సీడ్స్, డ్రైఫ్రూట్స్  వాడాలి. * ఫ్లాక్స్ సీడ్స్ మరియు రైసిన్స్ తీసుకోవాలి. * పాలు,పాలఉత్పాతులు,నివారించండి అందుకు బదులుగా మజ్జిగా లేదా నెయ్యి నివారించండి. * మీ ఆహారంలో ప్రో బిఒటిక్ ఆహారానికి బదులు మజ్జిగను తీసుకోండి. * మిమ్మల్ని వేదించే థైరాయిడ్, థైరాయిడిటిస్ నివారణకు  సూచనలు పాటించండి.   

ఊబకాయం నివారణకు ఆహారం

ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం ఒక సమస్యగా మారింది.1950 నుంచే ఊబకాయం తీవ్రంగా అభివృద్ధి అభివృద్ధిచెందుతున్న దేశాలలో  తీవ్రంగా పెరుగు తోంది. జనాభాలో ఊబకాయం చాలా సహజమని దీని ప్రభావం సామాజిక ఆర్ధిక, వాతావరణ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.మీ శరీరం లో ఉన్న బోడి మాస్ ఇండెక్స్ మీ ఎత్తు బరువు ఆధారంగా మీ శరీరంలో గుండె వ్యాధులు , ఆధిక రక్త పోటు,హై కొలస్ట్రాల్ల్ ,హై బ్లడ్ షుగర్, ఇతర అంటు వ్యాధులు వాటి వల్ల వచ్చే తీవ్ర ప్రభావాలు , ఊబకాయానికి మల్టిపుల్ సమస్యలు ఊబకాయ వ్యాధిగ్రస్తులు ఎదుర్కోక తప్పదు. ఆధునిక ఆహార విహారాలు పోషక విలువల్లేని ఆహారం. రెఫ్ఫైండ్, అధిక చక్కెర శాతం, గల ఆహారం అవసారానికి మించి ఆహారం తెసుకోవడం వల్ల ఊబకాయానికి కారకాలుగా పేర్కొన్నారు. దీనికి తోడు శారీరక వ్యాయామం లేకపోవడం, జీవన శైలిలో మార్పుల వల్ల వేళా పాళా లేని ఆహారం నిద్ర వల్ల మరిన్ని తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక వేళ మనం ఆహారం సరిగాలేకుంటే మెటాబాలిజం సరిగాలేని ఆహారం లేకపోయినా మెటాబాలిజం సరిగా లేని కారణంగా శారీరక  వ్యాయామం  ఊబకాయానికి కరణంగా చెప్పవచ్చు. మనం మనఆహారంలో తక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకొ నప్పుడు శరీరంలోని కణాలు  మెదడులోని కణాలకు ఆకలి అన్న సంకేతాన్ని పంపిస్తుంది. ఈ రకమైన సైకిల్ మెటాబాలిజం సరిగా  లేనందువల్లే మనకు ఊబాకాయం సమస్యలు వాస్తాయి. ఊబాకాయానికి నివారణ... ఊబాకాయం  తగ్గించడానికి  క్రాష్ దైట్స్ అంటూ చేసే  డైటింగ్ చేసే వారు తీవ్ర అనారోగ్యం పాలైనట్లు  తెలుస్తోంది. వాస్తవానికి క్రాష్ డైట్ ప్రోగ్రామ్స్ వల్ల బరువు పెర్గుతుంది. దీర్ఘకాలంగా బరువు పెరుగు తూనే ఉంటారు. మనం తీసుకునే ఆహారం క్రమపద్దతిలో లేకుంటే జీవనశైలి ఆహారం లో పూర్తి స్థాయిలో పోషక విలువలు లేకపోవడం,లేదా పైతో న్యూట్రియంట్స్, ఒమేగా 3, ఫ్యాటీ, తప్పనిసరిగా అమినో యాసిడ్స్, మినరల్స్, చాలా అవసరం. పంచసూత్ర పద్దతులు- సంప్రదాయ పద్దతిలో సప్లిమెంట్స్... *ఒమేగా -- ఫ్యాటీ యాసిడ్స్. *మల్టీ విటమీన్స్ . *వృక్షఆమ్లా /త్రిఫలా. *శతావరి. *అశ్వగంధ, ఈ మూలికలను కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేడమ్ లో ఉన్నాయి. *గ్రీన్ హెర్బల్ టీ *ప్రొసెస్ చేసిన తెల్లటి  ఉప్పు దీనికి బదులు హిమాలయన్  రాక్ సోల్ట్ తప్పని సరిగా వాడండి. *సమయానికి  ఆహారం  తీసుకోండి. రాత్రి డిన్నర్ ను స్కిప్ చేయన్డి . పళ్ళు ఫలాలు పచ్చటి రసాలు.లేదా గ్రీన్ సలాడ్ *ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయాన్దీ.  *పాలను పూర్తిగా వదలండి మజ్జిగను తీసుకోండి. *ఆయాకాళాలో వచ్చే నూనెలు రీఫైన్ద్ చేయని నూనెలు వాడండి. ఈ విధంగా చేస్తే మీరు ఎదుర్కుంటున్న ఊబకాయం సమస్యనుండి బయట పడవచ్చు.

కోవిడ్ చికిత్సలో పిల్లలకు రెమిడీసివిర్ ఉపయోగించద్దు.. కేంద్రం మార్గదర్శకాలు

కోవిడ్ 19 వైరస్ విషయంలో మూడవ విడత పిల్లల పై ప్రభావం చూపిస్తుందన్న శాస్త్రజ్ఞుల, నిపుణుల సూచన మేరకు కేంద్రం తగిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు చిన్న పిల్లలకు చేసే కోవిడ్ చికిత్స విషయం లో రెమిడీ సివిర్ ను వాడరాదని తెలిపింది. కోవిడ్ మేనేజ్ మెంట్ విషయంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. హెచ్ ఆర్ సి టి ఇమేజింగ్ ను కేంద్రం సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సెర్వీసెస్ సూచనల ప్రకారాం క్రిటికల్ కేర్ అత్యవసర సమయం లో ఆసుపత్రిలో చేరిన వారికి స్టెరాయిడ్స్  మాత్రమే వాడాలని మూడవ విడత కేసులపై పర్య వేక్షణ ఉండాలని సూచనలో పేర్కొంది. సరైన సమయంలో సరైన  డోసును స్టెరాయిడ్ వాడాలని  సొంత వైద్యం స్టెరాయిడ్స్ ను పూర్తిగా నివారించాలని  తెలిపింది. అయితే అత్యవసర సమయంలో వాడే రెమిడీ సివిర్ ను వాడరాదని. సూచింది. 18 సంవత్సరాల లోపు రెమిడీ సివిర్ సురక్షితం కాదని సి టి ,హెచ్ ఆర్ సి టి పరీక్ష ద్వారా ఊపిరి తిత్తుల లో వైరస్ లోడ్  ఏంత ఉందో నిర్ధారించాలని తేల్చి చెప్పింది. హెచ్ ఆర్ సి టి ద్వారా అదనపు సమాచారం చెస్ట్ పై ఎలాంటి ప్రభావం ఎలా ఉందో చికిత్సను నిర్ధారిస్తారు. క్లినికల్ గా  వ్యాధి తీవ్రత ఫిజియ్లాలజీ ఫిజీషియన్ తప్పని సరిగా హెచ్ ఆర్ సి టి ఇమేజింగ్ ను చెస్ట్ ఎంపిక చేయాలి. కోవిడ్ 19 రోగులకు చేయాలని కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ ను నిరోధించడంలో యాంటీ మైక్రో బయల్స్ థెరఫీ ప్రోక్సీ లాసిస్ మొడ్రేట్ లేదా సీవియర్ కేసులలో యాంటీ సుస్పెషన్ సూపరేడేట్  ఇన్ఫెక్షన్ ఆసుపత్రుల యజమాన్యం ఆరోగ్య సంరక్షణ ఇన్ఫెక్షన్ ను మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గనిజమ్స్. పిల్లల్లో ఆశింతమేటిక్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. వైద్యం తప్పనిసరిగా కోవిడ్ ఎలా ప్రవర్తిస్తుందో మాస్క్ హ్యాండ్ హై జీన్, సామాజిక  దూరం పాటించాలని సూచించారు.  పిల్లలకు పోషక  విలువలు ఉన్న  ఆహారం ఇవ్వాలి. కోవిడ్ తక్కువ గా ఉన్న ప్పుడు పరాసిట్ మాల్ 10- 15 ఎంజి, ప్రతి రోజు 4- నుండి 6 గంటలు ఇవ్వాలి గొంతు వాపు వేడిగా ఉండే సెలైన్  ను  పిల్లలో లేదా యుక్త వయస్సులో దగ్గు గైడ్ లైన్స్ ప్రకారం ఏది ఏమైనా మొడ్రేట్ ఇన్ఫెక్షన్ లేదా ఆక్సిజన్ ధేరఫీ లేదా తప్పని సరిగా చికిత్స చేయాలి. ఎక్యూట్ రెస్పిరేటరీ   డిస్ట్రెస్ సింగ్డ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.కోర్టికో స్టెరాయిడ్స్ అందరు పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొడ్రేట్ ఇల్ల్నెస్స్ వల్ల అనారోగ్యం పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉందన్న యాంటీ కొ ఆగులెంట్స్ గైడ్ లైన్స్ లో పేర్కొంది. ఒకవేళ షోక్ డవలోప్ అయితే తప్పనిసరిగా చేపట్టాలి. యాంటీ మైక్రో  డ యాలసీస్ ను నిర్వహించాలి ఒక వేళ సాక్ష్యం అనుమానం తో కూడిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆర్గాన్ డిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆర్గాన్ పనిచేయనట్లైతే మరో ఆర్గాన్ సహకారం అందించాలి. రీనాల్ రిప్లకెమెంట్ థెరఫీఅవసరం. గైడ్ లైన్స్ లో 12 సంవత్సరాల పై బడిన పిల్లలలో తప్పనిసరిగా 6 నిమిషాలు నడిపించాలని పేర్కొంది. దీనివల్ల తండ్రులు సంరక్షకుల సమక్ష్యంలో పర్యవేక్షణ లో కార్డియో పుల్మనరీ ఎక్సర్ సైజెస్ మాస్క్ హై పోక్సియా పల్సీ మీటర్ ను వేలుకి అమర్చాలి పిల్లల చేత నడిపించాలి వారి రూములో నడిపించాలి. 

మెటబాలిజం అంటే ఏమిటి ?

మెటాబాలిజం అంటే శరీరంలో రసాయనాల మార్పు-మూలకణాలు  అవయవాల పనితీరు లో మార్పులు వస్తాయి.శరీరంలో వచ్చిచేరే  ఎంజాయింల వల్ల కొన్ని చ్ర్యలు జరిగి ఆర్గన్లు పెరగడం,లేదా పునరుత్పత్తి జరుగుతూ ఉంటాయి. వారి వారి  శరీర తత్వాన్ని బట్టి శరీరంలో మార్పులు.అక్కడి వాతావరణాన్ని బట్టి శరీరంలో బయో కెమికల్ ప్రొసెస్ వల్ల శరీరం లో కొన్ని కణాలు  జీవిస్తూ ఉంటాయీ.దీనివల్ల శరీరంలో హార్మోన్స్, నర్వస్ సిస్టమ్ మన మెటాబాలిజం ను నియంత్రిస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం అరుగుదల సమయంలో ఏంజయింలు బ్రేక్ డౌన్ అయ్యి కార్బోహైడ్రేడ్స్, కొవ్వు, ప్రోటీన్లు శరీరం ఉపయోగించుకుంటుంది.మెటాబాలిజం సమయంలో రెండురాకాల చర్యలు ఒకేసారి జరుగుతాయి.శరీరాన్ని పెంచడం కణాలలో శక్తిని నిల్వచేసుకుంటుంది. అనాబాలిజం, కటాబాలిజం రెండింటినీ సమన్వయం చేయడం అవసరం ఈరెండు పద్దతులు ఒకేసారి జరుగుతాయి. మెటాబాలిజం  పోషకవివలకు సంబందం ఉంది. న్యూట్రియంట్స్  అందుబాటులో ఉంటాయి. బయో ఎనర్గిటిక్ , అంటే దాని ఆర్ధం బయో కెమికల్ లేదా మెటాబాలిక్ పాత్ వే కణాల వినియోగం వల్ల మరింత శక్తి పెరగడం మెటాబాలిజానికి ఒక కొంపోనెంట్స్  చాలా ఎక్కువగా ఉంటాయి. మెటాబాలిక్ పాత్వే బయో కె మిస్ట్రీ పై ఆధార పది ఉంటుంది.  మెటాబాలిజం బిఓలాజికల్ గా తప్పనిసరిగా భావించారు. ఇటీవల జరిగిన పరిశోదన లో కనుగొన్న  అంశాలలో మానవులలో వస్తున్న అనారోగ్యాలకు మెటా బాలిక్ డిజార్డర్స్ ఉన్నాయని తేలింది. ఫిజియాలజీ లో  టి ష్యూ సరిగా పని చేయకపోవడం. వల్లే అనారోగ్యానికి కరణంగా తేల్చారు. ఆయుర్వేదం లో మెటాబాలిజానికి పెద్దపీట వేశారు ఆదిక ప్రాధాన్యత ఇచ్చారు.మన శరీరంలో మెటబాలిజం సరిగా లేనిపక్షంలో టోక్సిన్స్ అంటే ఆమ్లాలు చెరీ అనారోగ్యానికి కారణం కావచ్చు. ఆయుర్వేదం లో మెటబాలిజం అంశం పై  అష్టాంగ హృదయ సంహితలో పెద్దపేగులు చిన్నపెగులలో  వచ్చే జటరాజ్ఞి వల్ల శరీరం  మంటకు గురి  కావడాన్ని గమనించవచ్చు. శరీరంలో పలురకాల సమస్యలకు దారి తీస్తుంది.  స్థూలంగా మెటాబాలిజం- అరుగుదల... శరీరంలో ముఖ్యంగా పొట్టలో చేరే గ్యాస్ రసాయానాలు దీనిలో  ఎంజైమ్లు విడుదల కావడం వల్ల ఆహారం అరుగుదల పద్దతి కేటా బాలిక్ మెటాబాలిజం తగ్గిన వెంటనే మొలిక్యుల్స్ ఫుడ్ మ్శాలిక్యుల్స్ ఆహారంలో కలిసి రక్తంలో, ప్లాస్మా లో చిన్న పేగుల్లో కలిసి పోతాయి.నీరు మినరల్స్ తిరిగి రక్తంలో కలిసి పోతాయి.కొన్ని విటమిన్లు బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అవుతాయి. కణాలు సెల్స్ లో మెటాబాలిజం-సూక్స్మ స్థాయిలో మెటాబాలిజం... మనం తీసుకునే ఆహారం మొదటఅరుగుదల తరువాత  రక్తంలోకి చేరుతుంది. ఇది శరీరంలో అన్నీ కణాలకు ఎగుమతి చేస్తుంది. దీనిద్వారా బయోకెమికల్ రసాయన చర్యజరిగి మెటాబలిజమ్ లెవెల్స్ మెటాబాలిక్ పాత్వే న్యూతృషియన్స్ నుంచి వివిధ పద్దతులలో క్రమపద్దతుల్లో ద్వారా కీలక మైన మెటాబాలిజం శరీరంలోని అవయవాలలో కొన్ని ప్రతిచర్యలు జరుగుతాయి. దీనివల్ల కాస్త శక్తి ని విడుదల చేస్తాయి.ఈ ప్రతిchaర్యను సత్వరం జరిగే విధంగా ప్రభావ వంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మెటాబాలిజం ఎందుకు ముఖ్యం... మెటాబాలిజం ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాంటిది మానవులలో ఎవరికైతే మెటబాలిజం సరిగా ఉండదో వారిలో టో క్సిన్స్ కు దారి తీస్తుంది. సహజంగా వచ్చే ఉత్పత్తి లో తక్కువ శక్తిని కలిగి ఉండడం వల్లే అనారోగ్యానికి కరణమౌతుంది.

గిరిజన మహిళల ఆరోగ్యానికి మీ గళం వినిపించండి

గిరిజన ప్రాంతాలలో మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. శరీరకంగా మానసికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పౌస్టిక ఆహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు .ప్రతి రోజూ వారు తీసుకునే ఆహారంలో పోషక లోపం ఉన్న ఆహారం తీసుకోడమే కారణం.జీవన ప్రమాణం తక్కువగా ఉండడం మరోసమస్య  గిరిజన ప్రాంతాలలో అత్యవసర  సమయంలో పెనుసవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది .వెనుక బడిన గ్రామీణ ప్రాంతాలలో మహిళల ఆరోగ్య సమస్యలే పెద్ద సవాల్ గా మారింది. ఇందులో కొన్ని యదార్ధాలు  గుర్తించారు. మహిళలకు ఆరోగ్యం పై కనీస  అవగాహన లేక పోవడం కనీస విద్య లేకపోవడం . ఆర్ధికంగా, సాంఘికంగా బలహీనంగా  ఉండడం. పౌష్టికాహార లోపం, కొన్ని సాంప్రదాయ మూడనమ్మకాలు తరచుగా అనారోగ్యం లో మార్పులు లైంగిక సమస్యలు ఆరోగ్య వృద్ధి సాధ్యం కావడం లేదనేది నిపుణుల ఆంచనా. ఆరోగ్యం విషయంలో స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం... స్త్రీపురుషుల ను వేరు వేరుగా చూడడం స్త్రీలలో పోష్టికాహార లోపం నేరుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారి సాంస్కృతిక కళా ప్రదర్శనల సాధనకు సాంఘిక, ఆర్ధిక ప్రభావం ఉంటుంది.పౌష్టికాహార  లోపం చాలామంది మహిళలో సంతాన ఉత్పత్తి వారు వాడే ఆహారం లో బలమైన పోషకాలు లేకపోవడం  తీవ్ర ఒత్తిడికి  అవుతున్నారు. పోషకాహార లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల పై అధ్యయనం చేశారు సరైన సంతాన ఉత్పతికి సరైన పోషక విలువలు ఉన్న ఆహారం వారి అలవాట్లు నిర్లక్ష్యం చేయడం వల్లే స్త్రీలను సంరక్షించడం సాధ్యం కాక పోవడాన్ని గమనించారు. అదనంగా సాంస్కృతిక ఉనికి తో పాటు సంతాన లేమి సమస్యలు ఎక్కువగా ఎదుర్కుంటున్నారు. దీనికి  కారణం శరీరంలో పోషకాహార లోపం మారోకారణం.గర్భిణిగా ఉన్నప్పుడూ సమస్యలు ఎదుర్కుంటున్నారు. పిల్లల పుట్టుకలోను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఒక పరిశోదన ప్రకారం 1 5 -24 సంవత్సరాల మధ్య ఉన్న  గ్రామీణ ప్రాంతాలలో శరీరకంగా లైంగిక అవగాహన లేనందు వల్లే 41% మండి మహిళలు పురిటి సమయంలో జన్మ నిచ్చే సమయంలో మరణిస్తున్నారు. అని అధ్యయనం వెల్లడించింది. అందుకే స్త్రీలు తప్పనిసరిగా పౌష్టిక ఆహారం, ఆరోగ్య కరమైన జీవన శైలి ముందునుంచే అలవరచుకోవాలి. సంతాన లేమి తో బాధ పడేవారు గర్భవతిగా ఉన్నప్పుడూ  ప్రసవించే సమయంలో ఆరోగ్యంగా ప్రసవించడం పుట్టిన బిడ్డల సంరక్షణ అవసరం. ఇందుకు ఉదాహరణగా శ్రీనివాసన్ ట్రస్ట్ సేవలు ఒక ద్విచక్రాల వాహన కంపెనీ ఇ కామ్ ఫౌండేషన్ సంస్థ సమన్వయంతో ఆరోగ్యం గా ఎలా ఉండాలో అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు. గర్భస్థ సమయంలో ప్రసవించిన అనంతరం ప్రశవానికి ముందు ప్రసవ అనంతరం తీసుకోవాల్సిన 23 గ్రామాలలో ని స్త్రీలలో నీల గిరిజనుల  స్వయం సహాయక బృందాలు, ఆశావర్కర్లు, అంగన్ వాడి, కార్యకర్తలు బాల బాలికలు యువతులకు సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు గర్భిణిగా ఉన్నసమయంలో ప్రసవ ఆనంతరం తీసుకోవాల్సిన అనారోగ్య సమస్యలపై అవగాహన  కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజా ఆరోగ్యం కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు గిరిజన ప్రాంతాలలో అవగాహన తీసుకోవాల్సిన మందులు దీని ఫలితంగానే  పలు సమస్యలు తెలుసుకోడం సాంప్రదాయ పద్దతుల నుండి బయటపడి ఇక ఆసుపత్రులకు వెళ్ళడం మొదలు పెట్టారు.అంగన్  వాడి ఐ సి డి ఎస్ ట్రస్ట్ ద్వారా వారిలో ఆర్ధికంగా, సామాజికంగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.శ్రీనివాస్ ట్రస్ట్ సేవలు గిరిజన మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత బాల బాలికలు విద్యార్ధులు సరిపడ  టాయిలెట్స్  స్కూళ్ళలో లేకపోవడాన్ని మూత్ర శాలలను రిపేర్ చేశారు.ఈ యజ్ఞంలో 100 పాటశాలలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు కల్పించింది. గత సంవత్సరం గిరిజనులు, మహిళలకు, విద్య, వైద్యం, పై దృష్టి పెట్టింది . దానివల్ల నాణ్యమైన జీవన శైలి పెంచేందుకు  తమిళ నాడుకు చెందిన గ్రామాలలో రాగి మాల్ట్, చృధాన్యాలు, తృణ ధాన్యాలు, సామలు, పల్లీలు, ఆయా కుటుంబ ఆరోగ్యం పై సమీక్షించారు.రక్త హీనత, సమాస్యలకు సౌకార్యాలను కల్పించి నూతన ఆహార పద్దతులు అలవారుచుకున్నారు. ఆరోగ్యం మెరుగు పడింది.స్వచ్ఛంద  సంస్థలు కొర్పోరేట్లు సంస్థలు పరిశోదనా సంస్థలు గిరిజాన ఆరోగ్యం సలహా మండలి ప్రభుత్వ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం ప్రణాళిక బద్దమైన పద్దతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యం పెంచవచ్చు. దీనివల్ల జిల్లా ఆసుపత్రి కేంద్రాలకు వెళ్ళేందుకు దోహదం చేస్తుంది. దీనివల్ల ప్రత్యేక వైద్యులు నిపుణుల వైద్యం, వైద్య సేవలు ఒకటే సమాధానం కాదు. గిరిజన  జనాభాలో మార్పుతో  పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలి. గిరిజనులు ఒక ఓటు బ్యాంకుగా చూడకండి వారికి అన్నిరంగాలలో సమాన అవకాశాలు ఇవ్వాలి గిరిజన మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టండి. అది ప్రభుత్వం బాద్యత.