అలర్ట్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఒడిషా నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడచిన రాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల చెదురుమదురు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురంలో 10, చోడవరం 9, తాడేపల్లిగూడెం 7, విజయనగరం, బాపట్ల 6, నర్సీపట్నం, పోలవరం, గూడురు, ఎమ్మిగనూరు, మదనపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. తెలంగాణలోని కొల్లాపూర్, అశ్వారావుపేటలో 4 సెంటీమీటర్లు, చిన్నారావుపేటలో 3 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.