మాయావతిపై దయాకర్ సింగ్ భార్య ఫిర్యాదు..
యూపీ బీజేపీ మాజీ నేత దయాశంకర్ సింగ్ బీఎస్పీ అధినేత మాయావతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఆయన ఫలితం అనుభవిస్తున్నాడనుకోండి. తనను ఆరెళ్లపాటు సస్పెండ్ చేశారు. ఇంకా పోలీసులు కూడా ఆయనను అరెస్ట్ చేయడానికి కూడా చూస్తున్నారు. ఇక యూపీలో బీఎస్పీ నేతలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. దయాకర్ సింగ్ దిష్టిబొమ్మలు తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అయితే ఇప్పుడు దయాకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీఎస్పీ నుంచి తమకు వేధింపులు ఎదురవుతున్నాయని..మాయావతితో పాటు బీఎస్పీ నేతలు తమ కుటుంబంపై బెదిరింపులకు దిగుతున్నారని, తమ కుటుంబానికి ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐపీసీ 120/బి, 153ఏ, 506, 509 సెక్షన్ల కింద మాయావతితో పాటు మరో ముగ్గురు బీఎస్పీ నేతలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.