ప్రధానిని సత్కరించిన సీఎం కేసీఆర్..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తలపెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ప్రధానిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించారు. పగిడి ధరింపజేసి, శాలువా కప్పి, అనంతరం జ్ఞాపికను అందజేశారు. ప్రధానితో పాటుగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్, అనంతకుమార్, గవర్నర్ నరసింహన్తో పాటు పలువురిని సీఎం సత్కరించారు.