తెలంగాణకు ప్రధాని మోడీ.. నేతల ఘనస్వాగతం
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్రాత్రేయతో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పద్మారావు, తలసాని, బీజేపీ రాష్ట్ర నేతలు లక్ష్మణ్, కిషన్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మోదీకి ఘనస్వాగం పలికారు. అనంతరం అక్కడి నుండి ప్రత్యేక విమానంలో మెదక్ జిల్లా గజ్వేల్ కు చేరుకున్నారు. అక్కడి నుండి కోమటి బండ చేరుకోనున్నారు.