పాక్ గడ్డపై నిల్చొని పాక్కే వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్
సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశాల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వెళ్లిన భారత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్..ఆ దేశ గడ్డపై నిల్చొని ఆ దేశానికే వార్నింగ్ ఇచ్చారు. సమావేశంలో భాగంగా ప్రసంగించిన రాజ్నాథ్ ఉగ్రవాదులకు సహకరిస్తూ..ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని చెప్పడం, ఉగ్రవాదులను కీర్తించడం, ఉగ్రసంస్థలను ప్రోత్సహించడం మానుకోవాలని పాక్కు రాజ్నాథ్ స్పష్టం చేశారు. మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అని విడిగా లేవని, ఉగ్ర చర్యల్ని కంటితుడుపు చర్యగా ఖండించకూడదని పేర్కొన్నారు. ఆతిథ్య దేశ ప్రధాని షరీఫ్, హోంమంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ ప్రసంగంలో ఉగ్రవాదాన్ని కేవలం ఖండించడాన్ని రాజ్నాథ్ తప్పుబట్టారు.