10 కోట్ల ఖర్చుకు ఆవు కథ చెప్పి వెళ్లిపోయారు..
posted on Aug 8, 2016 @ 11:28AM
ప్రధాని నరేంద్ర మోడీ తాను అధికారం చేపట్టిన తరువాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి వచ్చిన ఆయన ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని... అనంతరం పార్టీ సమావేశంలో పాల్గొని.. ఆతరువాత ఢిల్లీకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మోడీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఎద్దేవ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనవల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని.. ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలకు నిరాశ మిగిల్చారని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీకి ఘనస్వాగతం పలికి.. రూ. 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టి బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఒక్క పథకం కూడా ఇవ్వకుండా.. ఆవు కథ చెప్పి వెళ్లిపోయారని విమర్శించారు. మిషన్ భగీరథ లాంటి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా కల్పించలేదు. కేవలం మోడీని కేసీఆర్.. కేసీఆర్ ను మోడీ పొగడటానికి ఉన్నట్టు ఉంది అని అన్నారు.