షాద్ నగర్ లో కాల్పుల కలకలం.. గ్యాంగ్ స్టర్ మృతి..
posted on Aug 8, 2016 @ 10:53AM
ఇప్పటివరకూ దేశంలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిపి అందరిని వణికిస్తున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గతకొద్దిరోజుల క్రితమే ఎన్ఐఏ అధికారులు పలువురు ఉగ్రవాద అనుమానితులను పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ పట్టణంలోని భాషా అనే వ్యక్తి భవంతిలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని..భవంతిని చుట్టుముట్టారు. ఇంతలో భవంతి నుండి కాల్పులు రావడంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించారు. మరోవైపు పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. కాగా ఎంత మంది ఉగ్రవాదులు ఆ ఇంట్లో నక్కి ఉన్నారన్న విషయమై సమాచారం లేనప్పటికీ, గ్యాంగ్ స్టర్ నయూమ్ అనే ఉగ్రవాది హతమైనట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.