రంగంలోకి దిగనా... ములాయం కు అఖిలేశ్
posted on Oct 20, 2016 @ 1:00PM
వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అవి దగ్గర పడేకొద్ది ములాయం కుటుంబంలో కూడా విబేధాలు ముదురుతున్నాయి. ఇప్పటికే ములాయం వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా అఖిలేష్ ఉండడని చెప్పడం.. దానికి పార్టీ నేతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లేఖ రాసి అందులో విమర్శించడం జరిగింది.. తరువాత మళ్లీ ములాయం సీఎం అభ్యర్ధిగా అఖిలేషే ఉంటాడని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అఖిలేష్ కూడా తన తండ్రి ములాయం కు ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ములాయం రెండు సార్లు రెండు మాటలు చెప్పిన నేపథ్యంలో ప్రజలు అయోమయంలో పడి ఉంటారన్న కారణంగా.. తాను ప్రచారం ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ములాయం సింగ్ యాదవ్ కు లేఖ రాశారట. నవంబర్ 3 నుంచి ప్రచారం ప్రారంభించాలని భావిస్తున్న అఖిలేష్, రెండో దఫా సీఎం అభ్యర్థిగా తన పేరును ఖరారు చేస్తేనే, ప్రచారంలో దూసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే తాను రంగంలోకి దిగేముందు తండ్రి అనుమతి తీసుకోవాలని భావించి ఈ లేఖ రాసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.