English | Telugu

బాలయ్య క్రేజ్.. ఒకేసారి పది కోట్లు పెరిగిన రెమ్యూనరేషన్!

కొందరు హీరోలు ఒక్క హిట్ రాగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తారు. ఆ తర్వాత ఫ్లాప్ లు ఎదురైనా, నిర్మాతలకు నష్టాలు వచ్చినా అక్కడి నుంచి కిందకి దిగరు. అయితే ఇలాంటి కొందరు హీరోలున్న పరిశ్రమలో.. పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోని అరుదైన హీరో నందమూరి బాలకృష్ణ.

బాలకృష్ణను నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరో అంటారు. సినిమా హిట్ అవ్వగానే రెమ్యూనరేషన్ పెంచే రకం కాదు ఆయన. క్రేజ్ ని, మార్కెట్ ని పట్టించుకోకుండా రీజనబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ముందునుంచి బాలయ్యకి అలవాటు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు అంత ఆసక్తి చూపిస్తారు.

ప్రస్తుతం బాలకృష్ణ మరే ఇతర సీనియర్ స్టార్ లేనంత ఫామ్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు బాగా లాభాలు చూస్తున్నారు. అందుకే బాలయ్య అడగకుండానే నిర్మాతలు ఆయన పారితోషికం పెంచుకుంటూ పోతున్నారు.

'అఖండ' సినిమాకి బాలకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.10 కోట్లు మాత్రమే. ఆ సమయంలో బాలయ్య కంటే తక్కువ మార్కెట్ ఉన్నవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు. కానీ బాలయ్య ఎప్పుడూ ఆ లెక్కలు పట్టించుకోలేదు. 'అఖండ' ఘన విజయం సాధించడంతో.. 'వీరసింహారెడ్డి' నిర్మాతలు రూ.14 కోట్లు ఇచ్చారు. అది కూడా విజయం సాధించడంతో 'భగవంత్ కేసరి' నిర్మాతలు రూ.14 కోట్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు తదుపరి సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా రూ.28 కోట్లు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య తన తదుపరి సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్యకు రూ.28 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సితార సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో ఉన్నారు. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రూపంలో ఆయన సినిమాలు రూ.150 కోట్లకి పైగా బిజినెస్ చేస్తున్నాయి. అందుకే నిర్మాతలు బాలయ్య అడిగినా, అడగకపోయినా రెమ్యూనరేషన్ పెంచుతున్నారు. 2021 లో వచ్చిన 'అఖండ'కి రూ.10 కోట్ల పారితోషికం అందుకోగా, రెండేళ్లలోనే అది రూ.28 కోట్లకి చేరింది అంటే ప్రస్తుతం బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.