English | Telugu

బెడ్ రూమ్‌లో ప్రముఖ నటి ఆత్మహత్య!

సినిమా రంగానికి సంబంధించి ఇటీవలి కాలంలో విషాదవార్తలు బాగా వినిపిస్తున్నాయి. రకరకాల కారణాలతో ఎంతో మంది కన్ను మూశారు. ముఖ్యంగా సౌత్‌ ఇండియన్‌ సినిమాలో ఎక్కువ విషాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా తిరువనంతపురంలో ఒక హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మలయాళ సినిమాల్లో సహాయనటిగా, ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటిగా ఎంతో పాపులర్‌ అయిన రెంజుషా మీనన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. 35 ఏళ్ళ చిన్న వయసులోనే రెంజుషా చనిపోవడం మలయాళ ఇండస్ట్రీని కలచివేసింది. తిరువనంతపురం శ్రీకార్యంలోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది రెంజుషా. ఆమె భర్త మనోజ్‌ కూడా సినీ పరిశమ్రకు చెందినవాడే. రెంజుషా ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్త్రీ, నిజాలట్టం, మాగల్యూడ్‌ వంటి 20కు పైగా సీరియల్స్‌ చేసింది. సిటీ ఆఫ్‌ గాడ్‌, మెరిక్కుండోరు కుంజడు, ముంబై మార్ఛ్‌, కార్యస్థాన్‌, వన్‌ వే టికెట్‌, అద్బుత దీపు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించింది రెంజుషా. ఆనందరాగం ఆమె నటించిన చివరి సీరియల్‌గా చెప్పుకోవచ్చు. సినిమా, టీవీ సీరియల్స్‌లోనే కాదు పలు టీవీ షోల్లో కూడా ఆమె సందడి చేసింది. ఆమె మరణం పట్ల మలయాళ సినీ పరిశ్రమ, టీవీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.