English | Telugu

చంద్రబాబు పాత్రలో మహేష్

దివంగ‌త నాయకుడు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఐదేళ్ల ముందు అంటే 2019లో రిలీజైన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. అందులో వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వై.ఎస్‌.ఆర్ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌, 2009-2019 కాలం మ‌ధ్య‌లో జ‌రిగిన ఘ‌ట‌నల ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు మ‌హి వి.రాఘ‌వ‌. ఇందులో కోలీవుడ్ స్టార్, రంగం ఫేమ్ జీవా.. వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.