English | Telugu

30 ఏళ్ళ తర్వాత రెండు ఇంటెర్వెల్స్ తో సినిమా

అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన దర్శకత్వం వహించిన యానిమల్ అనే హిందీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1 న విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సంచలనం సృష్టిస్తుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, సౌత్ ఇండియన్ ముద్దుగుమ్మ రష్మిక హీరో హీరోయిన్లు గా నటిస్తున్న యానిమల్ మూవీ సినిమా నిడివి 3 గంటల 30 నిముషాలు కి సందీప్ లాక్ చేసాడని, అంతే నిడివితో మూవీ కాపీని సెన్సార్ కి పంపించాడని బాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది. సందీప్ అంత నిడివితో కాపీ పంపించడానికి రణబీర్ మద్దతు కూడా ఉందని అంటున్నారు. సందీప్ మీద రణబీర్ పూర్తి నమ్మకంతో ఉన్నాడని దీంతో ప్రొడ్యూసర్ లు కూడా నిడివి విషయం లో రాజీపడ్డారని అంటున్నారు. అంటే ఇప్పుడు యానిమల్ సినిమా రెండు ఇంటర్వెల్ లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే అధికారికంగా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడి చెయ్యలేదు. గతంలో అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ లు నటించిన లగాన్, హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలు కూడా డబుల్ ఇంటర్వెల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి

సందీప్ తన డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డిని కూడా మొదట నాలుగు గంటలకు పైగానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ కొత్త హీరోతో అంత సుదీర్ఘమైన నిడివి అంటే థియేటర్ వర్గాల నుంచి మద్దతు దక్కదనే అనుమానంతో అర్జున్ రెడ్డి మూవీని గంటకు పైగానే ఎడిట్ చేయించి విడుదల చేసాడు. కానీ ఇప్పుడు 3 గంటల 30 నిమిషాల నిడివితో సందీప్ యానిమల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. యానిమల్ చిత్రం మీద భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.