English | Telugu

బిగ్‌బాస్‌ పరమ చెత్త షో.. భానుశ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

చాలా కాలంగా బిగ్‌బాస్‌ షోకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడిరది. దేశంలోని పలు భాషల్లో ఈ బిగ్‌బాస్‌ షో రన్‌ అవుతోంది. తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడో సీజన్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. అయితే ఒక హీరోయిన్‌ మాత్రం బిగ్‌బాస్‌ అనేది పరమ చెత్త షో అని కామెంట్‌ చేసింది.

ఇంతకీ ఎవరా హీరోయిన్‌ ఆమధ్య అల్లు అర్జున్‌తో ఓ సినిమాలో నటించిన భాను శ్రీ మెహ్రా ఈ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన ‘వరుడు’ చిత్రంలో భానుశ్రీ హీరోయిన్‌గా నటించింది. సినిమాకి సంబంధించి ఏదో ఒక కొత్తదనం ఉండాలని భావించిన గుణశేఖర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనేది రివీల్‌ చెయ్యకుండా దాచాడు. ‘వరుడు’ సినిమాకి సంబంధించి జరిగిన ఒక వేడుకలో తమ సినిమాలోని హీరోయిన్‌ కూడా ఉందని వేదికపై ప్రకటించాడు. ఆమె ఎవరో కనిపెట్టండి అని క్లూ కూడా ఇచ్చాడు. కానీ, ఆ హీరోయిన్‌ ఎవరు అనేది ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత ‘వరుడు’ విడుదలై సూపర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయినా హీరోయిన్‌గా భానుశ్రీకి మంచి హైప్‌ వచ్చింది. కానీ, ఆ తర్వాత పెద్ద సినిమాల్లో ఎవరూ ఛాన్స్‌ ఇవ్వలేదు. చిన్నా చితకా సినిమాలు చేసిన భానుకి బ్రేక్‌ రాలేదు.

అయినా పాపులారిటీ కోసం సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ చేస్తూ లైమ్‌లైట్‌లో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు బిగ్‌బాస్‌ షో గురించి కామెంట్‌ చేసింది. బిగ్‌బాస్‌ లాంటి షోను జనం ఎలా చూస్తారో తనకు అర్థం కావడం లేదంటోంది. టీవీల్లో చాలా రకాల షోలు వస్తాయి. కానీ, అన్నింటిలో బిగ్‌బాస్‌ పరమ చెత్త షో, మైండ్‌ లెస్‌ షో అని ట్వీట్‌ చేసింది. అంతేకాదు, బిగ్‌బాస్‌ షోకి సంబంధించిన చెత్త అంతా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో కనిపిస్తోందని అంటోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.