'ఆదికేశవ' ఫస్ట్ సింగిల్ వచ్చేసిందిగా.. శ్రీలీలతో వైష్ణవ్ కెమిస్ట్రీ అదిరింది!
'ఉప్పెన' వంటి సంచలన చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా తొలి అడుగేశాడు పంజా వైష్ణవ్ తేజ్. మెగాబ్రదర్స్ మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు అనే ట్యాగ్స్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. మొదటి సినిమాలోనే నటుడిగా తనదైన ముద్ర వేశాడు వైష్ణవ్. అయితే ఆ తరువాత వచ్చిన 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో.. స్వల్ప విరామం అనంతరం 'ఆదికేశవ'గా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు మిస్టర్ తేజ్. క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ కావడంతో.. సినిమాపై చెప్పుకోదగ్గ అంచనాలు ఏర్పడ్డాయి.