English | Telugu

'ఆదికేశవ' ఫస్ట్ సింగిల్ వచ్చేసిందిగా.. శ్రీలీలతో వైష్ణవ్ కెమిస్ట్రీ అదిరింది!



'ఉప్పెన' వంటి సంచలన చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా తొలి అడుగేశాడు పంజా వైష్ణవ్ తేజ్. మెగాబ్రదర్స్ మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు అనే ట్యాగ్స్తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. మొదటి సినిమాలోనే నటుడిగా తనదైన ముద్ర వేశాడు వైష్ణవ్. అయితే ఆ తరువాత వచ్చిన 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో.. స్వల్ప విరామం అనంతరం 'ఆదికేశవ'గా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు మిస్టర్ తేజ్. క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ కావడంతో.. సినిమాపై చెప్పుకోదగ్గ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే.. శనివారం (సెప్టెంబర్ 9) ఆదికేశవ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. "సిత్తరాల సిత్రావతి.. ఉన్నపాటున పోయే మతి" అంటూ మొదలయ్యే ఈ పాటలో వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ ముచ్చటగా ఉంది. అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ బాణీకి రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా వాణి తోడై పాట మెలోడీయస్ గా సాగింది. ఇక రామజోగయ్య శాస్త్రి తనదైన సాహిత్యంతో ఇట్టే ఆకట్టేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పాటకి కలిసొచ్చే అంశమే. ఓవరాల్ గా.. ఆదికేశవ మొదటి లిరికల్ వీడియో బాగుందనే చెప్పొచ్చు.

దీపావళి కానుకగా నవంబర్ 10న ఆదికేశవ థియేటర్స్ లోకి రాబోతోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి రూపొందించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫోర్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.