విద్యార్దుల జీవితాలు బుగ్గిపాలు చేస్తున్న కిరణ్ సర్కార్

రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విషయంలోనైనా పరిజ్ఞానం తక్కువే అని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. అయితే ఆకస్మిక నిర్ణయాలతో విద్యార్దుల జీవితాలతో ఆడుకుంటారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇంజనీరింగ్ విద్యార్ధులతో ఆయన ఆడిన ఆటలవల్ల వారి విద్యాజీవితం నిర్వీర్యం అయ్యింది. ఒకే సారి ఫీజలు పెరుగుతాయని తెలియని తల్లి దండ్రులూ, విద్యార్ధులూ హతాశులౌతున్నారు. పది రోజుల క్రితం వరకు 44 వేలుగా ఫీజు నిర్ణయించాలని గొడవ చేసిన కాలేజీ ఒక్కసారిగా లక్షా ఐదువేల ఫీజును నిర్ణయించుకోవడానికి కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియటం లేదు. ఎందుకంత మొత్తాన్ని విద్యార్దులు చెల్లించాలి ఏ ప్రాతిపదికన ఫీజులు 68 కాలేజీలు పెంచాయో ప్రభుత్వం విద్యార్దులకు తెలియచేయాలి. కేవలం అఫడవిట్లు పొందుపరచినందువల్ల మాత్రమే అంత ఫీజుకు ఎలా ఒప్పుకున్నారు మార్కులు తెచ్చుకున్న మద్యతరగతి విద్యార్దుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.   ఫీజులను నిర్ణయించడానికి ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు ఉన్న ఆర్హతను  ప్రభుత్వం ఎందుకు పరీక్షించడంలేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడానికి ప్రభుత్వానికి ఎంత భారం అవుతుందో తల్లిదండ్రులకు కూడా అంతే భారం అని ముఖ్యమంత్రిగారికి తెలియదా ? రాష్ట్రంలో పేరెన్నికగన్న కాలేజీల్లో చదువు మద్యతరగతి  ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో ఉండదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మెరిట్విద్యార్ధులకు ఇక ఈ రాష్ట్రంలో చదువు కొససాగటం ప్రహసనమేనా. ముందు ముందు విషయాలు తెలియని విద్యార్దులు మంచి ర్యాంకులు తెచ్చుకుని ఎంతో ఆతృతతో మంచి కళాశాలల్లో చేరాలన్నా గత మూడు నెలలనుండి రాష్ట్ర ప్రభుత్వ సా....గ దీత కార్యక్రమాల ద్వారా సమస్యను జఠిలం చేసింది.   ఫీజు రీఎంబర్స్ మెంట్ ద్వారా చదువుకునే విద్యార్ధులకు  ఇప్పుడు తెచ్చిన ప్రతిపాదనలతో ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. ప్రభుత్వం ముందుగా ఫీజులు పెరిగే విషయం పైన కాని పెరిగిన ఫీజులను విద్యార్ధులే కట్టుకోవల్సి వస్తుందని గాని ముందుగా తెలియచేయలేదు. ఫీజుల భారం పెరిగేటట్లయితే ముందుగానే విద్యార్ది తల్లితండ్రులకు ఆ విషయాన్ని తెలియచేస్తే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటానికి లేదా వేరే ఏదైనా డిగ్రీలో చేరేందుకైనా వీలుండేది.ముందు చూపులేని మంత్రి వర్గంతో విద్యార్ధులు సమిధలవుతున్నారు. ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏకీకృత ఫీజు నిర్ణయించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.

సమైక్యాంధ్ర నినాదాన్ని నిద్రలేపిందెవరు?

గత మూడు సంవత్సరాలుగా సమైఖ్యాంద్ర ఉద్యమం యాక్జివ్గా లేదని అందరికీ తెలుసు అయితే గత కొద్ది దినాల ముందు సమైఖ్యాంద్ర ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో ఒకేసారి నిద్రలేచి సమైఖ్యాంద్ర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వచ్చింది. ఇంత హఠాత్తుగా సమైఖ్యాంద్ర నినాదం చేయాటానికి కారణం ఏమైందా అని లోతుగా వెళితే నిజాలు బయటకు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణవాదులు పార్లమెంటులో నినాదాలు ఇవ్వటం తెలిసిందే. దానికి తగ్గట్టే ఉప ఎన్నికల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యేక ప్రతిపత్తిని ఏర్పాటు చేయాలని, లేదా ప్రజలు నాయకులు అంతటితో సంతృప్తి చెందకపోతే ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది.   ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఢిల్లీకెళ్లి ప్రత్యేక ఆంధ్ర నినాదాన్ని మళ్లీ పైకితీసుకొచ్చారు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్న అర్థంవచ్చే మాటలతో తెలంగామ వాదులకు ఇష్టమయ్యేట్టు మాట్లాడిన ఆజాద్.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీల చెవినకూడా పడేశారు. వెంటనే స్పందించిన సీమాంధ్ర ఎంపీలు కావూరి ఇంట్లో మంతనాలు జరిపి తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి, లేక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని, అలా కాక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనుకుంటే మాత్రం కుదరదని ఓ తీర్మానం చేశారు. విషయాన్ని నాగార్జుల యూనివర్సిటీలో విద్యార్ధి సంఘాలకుకూడా చేరేశారు. అది అలా.. అలా.. అలా.. మొత్తం పాకిపోయింది. సమైక్యాంధ్ర నినాదం మళ్లీ విస్తృతంగా ప్రచారంలోకొచ్చేసింది.

రాజధానిలో బోసిపోతున్న పోలీస్ సబ్స్టేషన్లు

హైదరాబాద్ నగరంలో రోడ్డు మద్యలో సబ్స్టేషన్లని రాసి ఉన్న పెద్దసైజు పోలీస్ బాక్సులను చూసే వుంటారు. జనానికి, పోలీసులకు మధ్య దూరం తగ్గించాలన్న ఆలోచనతో వీటిని ఏర్పాటుచేశారు. హైదరాబాద్, సైబరాబాద్లకు కలిపి సుమారు 90 పోలీస్టే షన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్స్టేషన్కు రెండు సబ్స్టేషన్లను ఏర్పాటుచేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు వెంటనే సాయం చేసేందుకు, ఏ నిముషాన ఏం జరిగినా స్పందించేందుకు ఈ స్టేషన్లలో ఇద్దరు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్లు. చైన్ స్నాచింగ్, ఈవ్టీజింగ్, ట్రాఫిక్ లాంటి సమస్యలకు వారు వెంటనే స్పందించటానికి గానూ దూరంలో ఉండే పోలీస్ స్టేషన్కు వెళ్లనవసరం లేకుండా అందులోనే ఫిర్యాదులు తీసుకునే ఏర్పాటు చేశారు. కానీ.. ఏర్పాటు చేసిన 3 నెలల వరకు మాత్రమే ఇవి సక్రమంగా పని చేశాయి. తర్వాత నిరుపయోగంగా మారిపోయాయ్. కొన్నిచోట్ల అసాంఘిక శక్తులకు నిలయంగాకూడా మారాయన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. వెంటనే వీటిని బాగుచేసి మళ్లీ ఉపయోగంలోకి తీసుకురావాలని హైదరాబాదీలు గట్టిగా కోరుకుంటున్నారు.

రాజ్యాధికారంకోసం మందకృష్ణ కొత్త పార్టీ

యస్స్ వర్గీకరణ జరపాలంటూ ఉద్యమించిన మందాకృష్ట మాదిగ త్వరలో తమ జాతి రాజ్యాధికారం కోసం ఓ పార్టీని పెట్టబోతున్నారు. రాష్ట్రంలో యస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో నాలుగేళ్లపాటు ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ.. హక్కుల్ని సాధించుకున్నారు. పుట్టుకతోనే గుండెజబ్బులున్న పిల్లలకు ప్రభుత్వ సాయంతో పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేయించాలని డిమాండ్ చేసి వై.ఎస్ హయాంలో మరో ఉద్యమాన్ని నడిపి పంతాన్ని చెల్లించుకున్న గట్టి మనిషి మందకృష్ణ. ఆరోగ్యశ్రీకి ఇదే ప్రేరణ. ఆరోగ్య శ్రీ ద్వారా లభ్ది పొందుతున్న రోగులంతా ఓ రకంగా మందకృష్ణకి కృతజ్ఞతలు చెప్పుకుని తీరాల్సిందే. ప్రస్తుతం ఆయన.. వికలాగుల సంక్షేమంపై దృష్టిపెట్టారు. వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని, నెలకు పదిహేనొందల రూపాయల పించన్ చెల్లించాలని అధికార పార్టీ పై ఒత్తిడి తెస్తున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడంద్వారా ఎస్సీ వర్గీకరణను సాధించుకోవాలని మందకృష్ణ గట్టిగా అనుకుంటున్నారు. దీనికోసం డిసెంబర్ లో కొత్తపార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఎంతవారుకాని..

సినిమా హీరోలంటే కుర్రాళ్లకు యమా క్రేజ్.. అభిమాన హీరో ఏ చొక్కావేసుకుంటే ఆ చొక్కా కోనేయాల్సిందే. అభిమాన హీరో ఏ బ్రాండ్ వాడితే ఆ బ్రాండ్ వెంటనే ఒంటిమీదికి రావాల్సిందే. వాళ్లు సిగరెడ్లు తాగితే వీళ్లూ సిగరెట్లు తాగుతారు. వాళ్లేం చేస్తే వీళ్లూ అదే చేస్తారు. అందుకే హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు హీరోలు తెరమీదమాత్రమే హీరోయిజాన్ని ప్రదర్శిస్తారు. మరికొందరు నేతలు నిజజీవితంలోకూడా అంతే హుందాగా ప్రవర్తిస్తారు. ఓ సినిమా షూటింగ్ కోసం రణబీర్ కపూర్ రాజస్థాన్ కెళ్లాడు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగాడు. ఓ పర్యావరణ ప్రేమికుడు దీనిపై కోర్టులో కేసేశాడు. తప్పొప్పుకున్న రణబీర్ రెండొందల రూపాయల జరిమానా కూడా కట్టాడు. ఇలాంటి పెద్దపెద్ద హీరోలకు జరిమానాలు విధించేటప్పుడు కాస్త భారీగానే వడ్డించి ఆ డబ్బుల్ని లోకల్ డెవలప్ మెంట్ కోసం వినియోగిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనకూడా ఈ మధ్య చాలామందిక్కలుగుతోంది.

రూటుమార్చిన స్టువర్టుపురం దొంగలు

దొంగతనాల్లో ఆరితేరిన దొంగలు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తే రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా చూసేది స్టువర్టుపురంవైపే. ఈ స్టువర్టుపురం దొంగలు దారిదోపిడీల్లోనూ, ఇళ్లలో దోచుకోవడంలోనూ ఆరితేరారు. అలానే రాష్ట్రం మొత్తం భయపడే తెలకపాముల జాతికి కూడా ఈ స్టువర్టుపురమే కేంద్రం. తెలకపాముల వారి దొంగతనాలు పాత రోజుల నుంచి ఇప్పటికీ కథలుకథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. దొంగతనాలు చేయటానికి అమావాస్య మంచి శకునమని నమ్మే ఈ జాతి దొంగలు ముందు తూర్పుదిశగా బయలుదేరి ఆ తరువాత తమ లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాలకు వెడుతుంటారు.    అక్కడ కొన్ని రోజులు మకాం చేసి పెద్దపెద్ద ఇళ్లల్లో దొంగతనాలు చేసేందుకు ప్లాన్ సిద్ధంచేసుకుంటారు. మధ్యలో ఎదురయ్యే ఆటంకాలు అంచనా వేసుకుంటారు. కోళ్లు, మేకలు అమ్మేవాళ్లలా ఆ ఇళ్లలోకెళ్లి అదను చూసుకుని, ఆధారాలు దొరక్కుండా దొంగతనాలు చేశాక నేరుగా స్టూవర్ట్ పురానికెళ్లకుండా కొన్నాళ్లు ఇతరప్రాంతాల్లో గడపుతూ జల్సా చేసుకుంటారు. వీళ్లలో కొందరికి దారిదోపిడీలో అందెవేసిన చేయి. నెల్లూరు జిల్లాలో తెలకపాములవాళ్లు దారిదోపిడీలు చేస్తున్నారన్న వార్త రాష్ట్రంమొత్తం పాకిపోయింది. నెల్లురు మాగుంట లేఅవుట్ లో జరిగిన భారీ దొంగతనం ఆధారాల్నిబట్టిచూస్తే పూర్తిగా స్టూవర్ట్ పురం దొంగలపనేనని పోలీసులు చెబుతున్నారు.

గురివిందగింజకు కిందేముందో తెలీదు!

పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ తెలీదు. కానీ.. ఆయన నోరు విప్పితే సొంత భజనతో పాటు సోనియా భజనకూడా చేస్తూనే ఉంటారని కార్యకర్తలు ఖరాఖండిగా చెప్పేస్తారు. బీసీలపై ఉన్నట్టుండి ప్రేమపుట్టుకొచ్చిన బొత్స .. జనాభాప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తారా అంటూ టిడిపికి, వై.ఎస్.ఆర్ . సి.పికి సవాల్ విసిరారు. నిజంగా బొత్సకి బీసీలమీద అంత ప్రేముంటే సొంతపార్టీలోనే ఈ సమస్యను పరిష్కరించి చూపించొచ్చుగా.. మరెందుకని ముందుడుగు వేయడంలేదు.? అసలాయనకు తనెంతకాలం పీసీసీ పీఠంమీద కూర్చుంటారోకూడా తెలీని పరిస్థితి. అంజనం వేసి చూసినా అంతుచిక్కని పరిస్థితి.     నిజంగా బీసీలకోసం పాటుపడాల్సొస్తే క్రెడిట్టంతా పూర్తిగా కిరణ్ కే పోతుంది తప్ప తనకేమీ దక్కదన్న సత్యాన్ని సత్తిబాబు ఎప్పుడో కనిపెట్టేశాడు. అందుకే ఆయనకి ఈ విషయంగురించి ఆలోచించే ఓపికా, తీరికా రెండూ లేవు. తిలో ఉన్న పని చేసుకోవడం చాతకాదుగానీ, ఎదుటివాళ్లని విమర్శించడంమాత్రం బాగా తెలుసు.. అంటూ ప్రతిపక్షాలు సత్తిబాబుమీద మండిపడుతున్నాయ్. కుటుంబసభ్యులతో టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవులన్నీ నిండిపోతున్నాయంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు రెండుపార్టీలవాళ్లకూ అరికాలిమంట నెత్తికెక్కేలా చేశాయ్. సోనియా వారసుడిగా రాహుల్ పార్టీ పగ్గాల్ని చేపట్టడానికి ఉత్సాహం చూపించట్లేదా సత్తిబాబూ.. ముందు కింద ఏముందో చూసుకుని తర్వాత ఎదుటివాళ్ల గురించి విమర్శించడం నేర్చుకో అంటూ గురివిందగింజ సామెతను గుర్తుచేస్తున్నారు ప్రతిపక్షాల నేతలు.

రంగస్వామి మనీసర్కులేషన్ లీలలు?

మనీసర్కులేషన్ పేరిట పలురాష్ట్రాల్లో మోసాలు జరుగుతున్నాయి. బాధితులు రోడ్డున పడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు కోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి మోసపోతున్నారు. నాలుగువేలు కడితే ఏడు వేల రూపాయలు ఏడాది తిరగకుండా ఇస్తామని చెప్పే దొంగమాటల్ని నమ్మి బుట్టలో పడిపోతున్నారు. అసలు ఇలాంటి సంస్థల్లో డబ్బు పెట్టడమే పొరపాటు.. ఆ విషయం తెలిసినా తక్కువకాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చన్న ఆశతో చాలామంది వీటి ఆకర్షణలోపడి మోసపోతున్నారు. వినియోగదారులు అన్నీ తెలిసే మోసపోతున్నారుకాబట్టి మేమేం చేయలేమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేతులెత్తేసింది.     కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారంలో రంగస్వామి అనే ఓ పెద్దాయన జనానికి కుచ్చుటోపీపెట్టి కోట్లు వెంటేసుకుపోయిన ఘటన వెలుగులోకొచ్చింది. శ్రీనంది యువజన సమాఖ్య ప్రతినిధి రంగస్వామి.. నాలుగువేలు కట్టండి ఏడు వేలు పట్టుకెళ్లండి అనే స్లోగన్ తో ఎనిమిదినెలల్లోనే పాతికవేలమందితో డబ్బుకట్టించుకున్నాడు. చాలా మంది ఆడవాళ్లు టెంప్టైపోయి బంగారాన్ని బ్యాంక్ లో తాకట్టుపెట్టిమరీ డబ్బులు తీసుకొచ్చి రంగస్వామి చేతుల్లో పోశారు. చివరికి మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.

ఓఎన్జీసీని అమ్మేస్తారా?

ఒకప్పుడు గ్యాస్ ఉత్పాదక రంగంలో ఓఎన్ జీసీ నెంబర్ వన్. ఈ సంస్థ చేసిన పరిశోధనలన్నీ పూర్తిగా విజయం సాధించాయ్. కృష్ణా, గోదావరి డెల్టా బేసిన్ లో చమురు, గ్యాస్ నిక్షేపాల్ని మొట్టమొదటగా కనుక్కున్న ఈ సంస్థని పాలకులు, పై స్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేశారు. రిలయన్స్ లాంటి ప్రైవేట్ సంస్థలకు మేళ్లు చేసేందుకే ఓఎన్ జీసీని దెబ్బతీశారన్న విషయం సామాన్యులకు కూడా స్పష్టంగా తెలిసిన విషయమే. కాకినాడ తీరంలో బైటపడ్డ గ్యాస్ నిక్షేపాల్ని వెలికితీసే బాధ్యతల్ని చంద్రబాబు హయాంలో రిలయెన్స్ కి కట్టబెట్టారు. అప్పటికి మంచి ఫామ్ లో ఉన్న ఓఎన్ జీసీని కావాలనే పక్కనపెట్టారు.   ఒకప్పుడు గ్యాస్ ఉత్పాదక రంగంలో ఓఎన్ జీసీ నెంబర్ వన్. ఈ సంస్థ చేసిన పరిశోధనలన్నీ పూర్తిగా విజయం సాధించాయ్. కృష్ణా, గోదావరి డెల్టా బేసిన్ లో చమురు, గ్యాస్ నిక్షేపాల్ని మొట్టమొదటగా కనుక్కున్న ఈ సంస్థని పాలకులురిలయెన్స్ సంస్థకి, గుజరాత్ పెట్రోలియం అండ్ ఆయిల్ కంపెనీకీ పూర్తిగా అప్పజెప్పేసి రాష్ట్రానికి కనీస వాటాకూడా లేకుండా కేంద్రం అన్యాయం చేసింది. తర్వాత వై.ఎస్ హయాంలోకూడా ఇదే తీరు కొనసాగింది. ఇప్పుడు ఓఎన్ జీసీ పూర్తిగా నష్టాల్లో నడుస్తోందంటూ కాగ్ తో లెక్కలు కట్టించింది కేంద్ర ప్రభుత్వం. మెల్లగా ఈ సాకుతో దాన్ని అమ్మిపారేసి, మొత్తంగా గంపగుత్తగా వనరుల్ని ప్రైవేట్ పరం చేసేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విశ్లేషకుల అంచనా. భారీ లాభాల్లో ఉన్న సంస్థను బరువుగా మారిపోయిందనిపించే స్థితికి తీసుకురాగలిగిన ఘనత మన ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది మరి.  

మానిపోయిన గాయానికి మళ్లీ మందెందుకు?

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాలు కరెంట్ యుద్ధం చేశాయి. విద్యుత్ చార్జీలు తగ్గించాలని పట్టుబడుతూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిపాయి. బషీర్ బాగ్ దగ్గర చాలా పెద్ద రగడ జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమించిన ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నేరుగా ఉద్యమకారులమీద కాల్పులు జరిపారు. నలుగురి ప్రాణాలు పోయాయ్. ఈ ఘటన జరిగి పన్నెండేళ్లైంది. ప్రజలకోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళి అర్పించేందుకు వామపక్షనేతలు ఓ సభని ఏర్పాటుచేయడం తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం రుచించడంలేదు. అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలెందుకంటూ వామపక్షనేతలమీద టిడిపినేతలు మండిపడుతున్నారు. ప్రజల్లో తమ పార్టీమీద లేనిపోని ద్వేషాన్ని నూరిపోసేందుకే వామపక్షనేతలు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వై.ఎస్ హయాంలో జరిగిన ముదిగొండ కాల్పుల ఘటనను ఎందుకు తెరమీదికి తీసుకురావడంలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సీబీఐ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం

చేపచేప ఎందుకెండలేదంటే, నాకెవరో ఎండపడకుండా అడ్డమొచ్చారు అన్నట్టుగా ఉంది సీబీఐ అధికారుల తీరు. ఓబుళాపురం మైనింగ్ కేసు, ఎమార్ కేసుల్లో నిందితులైన శ్రీలక్ష్మి, విజయరాఘవలు తాము సీబీఐకి సమర్పించిన పత్రాల ప్రతులు కాపీలు కావాలని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. వాళ్లు కోరిన పత్రాల కాపీల్ని అందజేయమని న్యాయస్థానంకూడా ఆదేశించింది. కానీ.. ఇప్పటివరకూ కాయితాలు నిందితుల చేతికి అందలేదు. ఈ విషయమై న్యాయమూర్తి సీబీఐ న్యాయవాదిని మూడుసార్లు ప్రశ్నించారు. సీబీఐ తరఫు న్యాయవాది ఇచ్చిన సమాధానం విని జడ్జ్ గారికి చిర్రెత్తుకొచ్చింది. సీబీఐ లాయర్ జడ్జ్ గారికి చెప్పిన కారణమేంటో తెలుసా... జిరాక్స్ మెషీన్ పనిచేయని కారణంగా నిందితులకు పత్రాల కాపీల్ని ఇవ్వడానికి ఆలస్యమౌతోందట.

కడలిలో కలిసిపోతున్న వరదగోదారి

వర్షాలు పుష్కలంగా కురిసినప్పుడు నదుల్లోకి భారీగా వచ్చిచేరే నీటిని కాపాడుకునేందుకు ఇప్పటివరకూ మనకు సరైన వ్యవస్థ లేదు. ఉన్న కొన్ని డ్యాముల్లో స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ. ప్రవాహం స్థాయిని మించితే నీళ్లను కిందికి వదిలేక తప్పని పరిస్థితి. ఏఏటికాయేడు ఇలాగే బండిని లాగిస్తూ ముందుకెళ్లాల్సొస్తోంది. విలువైన నదీజలాలు సముద్రంలో కలిసిపోతున్నాయ్. గోదావరి నీళ్లతో సస్యశ్యామలం కావాల్సిన భూములు కేవలం నిర్లక్ష్యం కారణంగా బీడు భూములుగా మారుతున్నాయ్. తీవ్ర వర్షాభావం తర్వాత భారీగా కురిసిన వానలకు గోదావరిలోకి చేరిన 10వేల టీఎంసీల నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సొచ్చింది. సగటున 90 టియంసి ల నీటిని  ధవళేశ్వరం  దగ్గర సముద్రంలో వదిలేశారని తెలంగాణ రైతులు బాధపడుతున్నారు.  ఇలా ప్రతిసంవత్సరం వర్షాకాలంలో 1500 నుండి 2500 టియంసిల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ లు పూర్తయ్యుంటే నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందేదని, 2వేల మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేయడానికి వీలయ్యేదని నిపుణులు చెబుతున్నారు. గోదావరి నదిపై సరైన ఆనకట్టలు కట్టి ఉంటే పరిస్థితి ఇలాఉండేది కాదంటున్నారు. ఇప్పటివరకూ సముద్రంపాలైన నీటితో దాదాపు కోటి ఎకరాల్లో ఆరుతడిపంటలు పండేవని అంచనా. 60 లక్షల ఎకరాల్లో అనాయాసంగా వరిసాగుచేసుకోగలిగుండేవాళ్లమంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్ట్ ల్ని పూర్తిచేస్తే రాబోయే కాలంలో కురవబోయే వర్షాన్ని, వృథాగా కడలిలో కలిసిపోయే నదీ జలాల్నీ కాపాడుకోవచ్చని రైతులు అంటున్నారు.

ప్రచారం ఘనం ప్రజాహితం శూన్యం

ప్రజావైద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని ఊదరగొట్టే ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం ఉదారత్వం చూపటంలేదు. రాను రాను ప్రభుత్వవైద్యం బజారునపడుతోంది. ఆసుపత్రులకు రావాలంటేనే రోగులు భయపడే స్థితికొచ్చారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఎంపిక చేసిన వ్యాధులకు మాత్రమే ట్రీట్మెంట్ అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత.. ఎన్ని నోటిఫికేషన్లిచ్చినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడంలేదు. ఆరోగ్యశ్రీకి నిధులు కరవు.. రోగుల సంఖ్యమాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం బడ్జెట్ లో కనీసం ఏడుశాతం నిధుల్ని వైద్యరంగానికి కేటాయించాలన్న నియమాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు.   మనరాష్ట్రంలో కేటాయింపులు మొత్తం బడ్జెట్ లో నాలుగుశాతం కూడా ఉండడంలేదు. పోయినసారి బడ్జెట్ లో మందులకోసం 320 కోట్ల రూపాయలు కేటాయించారు. అవి లెక్కలకు మాత్రమే పరిమితం. చేతికొచ్చిందిమాత్రం 150 కోట్ల రూపాయలు మాత్రమే. పాతభవనాలు, తుప్పుపట్టిన పైకప్పు రేకులు, ఇనుపమంచాలు చాలా ఆసుపత్రుల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయ్. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లా ఆసుపత్రుల్లో 4400 పడకల సౌకర్యం మాత్రమే ఉంది. 58 ఏరియా ఆసుపత్రుల్లో 5,800 పడకలున్నాయ్. 122 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో  4,840 పడకలు, 10 స్పెషలిటీ ఆసుపత్రుల్లో 284 పడకలున్నాయి.  రాష్ట్రంలో మొత్తం 233 ఆసుపత్రులుంటే, వాటిలో 15,864 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పదికోట్లకు దగ్గరపడుతున్న జనాభాకి ఉన్న ఆసుపత్రులు పడకలు ఎలా సరిపోతాయన్న కనీస ఆలోచనకూడా ప్రభుత్వానికి రావడంలేదు. సామాన్యుల పాట్లు సర్కారుకి కనిపించడమే లేదు.

చెన్నైపొన్ను రియల్ లైఫ్ స్టోరీ ఇంగ్లిష్ వింగ్లిష్

ఇంగ్లిష్ వింగ్లిష్ తో మళ్లీ తెరమీదికొచ్చిన ముద్దుగుమ్మ శ్రీదేవి కొత్త సినిమాలో అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. శ్రీదేవి హిందీ చిత్రపరిశ్రమకు వెళ్లిన కొత్తలో భాష రాక ఆమె పడ్డ ఇబ్బందులమీదే ఈ స్టోరీని డిజైన్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. అప్పట్లో భాష అస్సలు అర్థంకాక శ్రీదేవి ఓ సహాయకుణ్ణికూడా నియమించుకుంది. ట్రైనర్ సాయంతో కొద్ది కాలంలోనే హిందీ తెగనేర్చేసుకుని ఆ తర్వాత బాలీవుడ్ ని ఏలేసిన సంగతి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్ లైఫ్ రెండో ఇన్నింగ్స్ లో రియల్ లైఫ్ స్టోరీని మిక్స్ చేసి చిలిపికళ్ల సోయగాలతో శ్రీదేవి మళ్లీ అభిమానుల్ని తెగ అలరించేసింది.

రసకందాయంలో ఖాకీల కుమ్ములాట

తూర్పుగోదావరి జిల్లాలో ఖాకీల మధ్య కుమ్ములాట మరింత ఉత్కంఠగా మారుతోంది. ఎస్పీ త్రివిక్రమ్ వర్మ గంజాయి స్మగ్లర్లదగ్గర్నుంచి లంచాలు తింటూ తనని వేధిస్తున్నారని బహింరంగ ఆరోపణలు చేసిన ఎఎస్పీ నవీన్ కుమార్ తను ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నానంటున్నారు. తాజాగా ఓ డిజి స్థాయి అధికారికికూడా ఇందులో భాగముందంటూ నవీన్ చేసిన ఆరోపణలు మరింత దుమారం రేపాయి. డిపార్ట్ మెంటర్ ఎంక్వయిరీమీద తనకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నఖాకీలు బాహాటంగా బాహాబాహీకి దిగడం, ఒకళ్లనొకళ్లు తిట్టుకోవడం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తలనొప్పి వ్యవహారంగా తయారయ్యింది. ఉన్న తలనొప్పులకుతోడు మరో కొత్త తలనొప్పిన భరించడానికి సిద్ధంగా లేని హోంమంత్రి జుట్లు పట్టుకుంటున్న ఖాకీలకు గట్టిమాటలతోనే బుద్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలిగానీ, ఇలా రోడ్డునపడి కొట్టుకోవడమేంటంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కవర్ పేజీపై బాలీవుడ్ సుందరి అందాల ఆరబోత

పాపులర్ కావడానికి ఈ తరం హీరోయిన్లు నగ్నంగా అందాలు ప్రదర్శించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా నగ్న సుందరిల జాబితాలో చేరింది బాలీవుడ్ హాట్ లేడీ మినీషా లాంబ. మాగ్జిమ్ మేగజైన్ కోసం ఇలా అర్ధ నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఇప్పటికే ఈ ఫోటో ఫేస్ బుక్, ట్విట్టర్లలో పాకి పోయింది. ఇందులో ఆమె అందాలు చూసి ముగ్దులైపోతున్నారు ఆమె అభిమానులు. ఈ మధ్య చాలా మంది తారలు ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ బట్టలిప్పి బరితెగించడం, తీరా ఫోటోపై విమర్శలు వచ్చిన తర్వాత తాము కాదు, మార్ఫింగ్ అంటూ బుకాయించడం కామన్ అయిపోయింది. ఆ మధ్య కాజల్ టాప్ లెస్ ఫోటోపై చెలరేగిన వివాదం అంతా ఇంత కాదు.   

తాగుబోతు తండ్రికోసం కొడుకు ఆత్మహత్య

ఖజానాని నింపుకోవడానికి సర్కారు సారాయి దుకాణాల్ని పెంచిపోషిస్తోంది. జనం బాగోగులు పట్టించుకోకుండా లిక్కర్ మీద సొమ్ముచేసుకోవడానికున్న దారులన్నింటినీ ఉపయోగించుకుంటోంది. కానీ.. దీనివల్ల చాలా కుటుంబాలు నాశనమైపోతున్నాయి. తాగుడుకు బానిసైపోయిన తండ్రి ఇక మారడన్న దిగులుతో ఓ కొడుకు ప్రాణం తీసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. వేములవాడలో తండ్రి తాగుడు మానడంలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూయిసైడ్ నోట్ లో తన చావుకి గల కారణాన్ని స్పష్టంగారాసి చచ్చిపోయాడు. ‘అమ్మా.. నన్ను క్షమించు.. నాన్న ఇక మందు మానడని భావించి నేను వెళ్ళిపోతున్నాను. నా చావుతోనైనా నాన్న మారతాడని ఆశిస్తున్నానని’ రాశాడు.

గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి తప్పనిసరి

హైదరాబాద్ లో గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు సంబంధిత ప్రాంత ఎసిపి అనుమతి విధిగా పొందాల్సిందేనని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. అలాగే గణేష్‌ ఉత్సవాల పేరిట ఏ రూపంలోనూ చందాలు వసూలు చేయ్యకూడదని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షించడం జరుగుతుందని సిపి హెచ్చరించారు. అయితే ` ఇప్పటికే ప్రారంభమైన వసూళ్ళ గురించి పోలీసులు ఆరాతీస్తే బావుంటుందని ప్రజలు అంటున్నారు. గణేష్‌ ఉత్సవాల సమయంలో చెవులు హోరెత్తించే మైకు శబ్దాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలనీ, అలాగే` పాఠశాలలు, వైద్యశాలల ప్రాంతంలో గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు అనుమతులు ఇవ్వవద్దని ప్రజలు విజ్ఞప్తి చూస్తున్నారు.