ఇది ప్రభుత్వ కుట్ర: అమరావతి జేఏసీ

అమరావతి భూములను పేదలకు దక్కకుండా చేయడంలో  ప్రభుత్వ కుట్రను  అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జే ఏ సీ) నేత పువ్వాడ సుధాకర్ రావు బయట పెట్టారు.  రాజకీయ స్వార్థంతో కూడినటువంటి నిర్ణయం వలన  ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రాజధాని అమరావతిలో ఉచితంగా ఇంటిని పొందే అవకాశాన్ని ఈ ప్రభుత్వం భూస్థాపితం చేస్తుందన్నారు.  వారికి శాశ్వతంగా రాజధానిలో నివాసాన్ని లేకుండా చేస్తుందని ఆయన ఆరోపించారు. ‘‘అమరావతి రాజధాని లో గత ప్రభుత్వ హయాంలో 44 ఎకరాలలో 5024 అత్యంత మన్నిక గల, గౌరవప్రదమైన టిడ్కో ఇళ్లను నిర్మించడం జరిగినది అనగా ఒక ఎకరమునకు 114 ఇళ్లను నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రస్తుతం 1134 ఎకరాలతో పాటు ఇప్పుడు అదనంగా కోరిన 268 ఎకరాలను కలుపుకొని మొత్తం 1402 ఎకరాలలో సుమారుగా 50వేల మందికి సెంటు భూమిని పంపిణీ చేస్తుంది. అనగా ఒక ఎకరం  35 కుటుంబాలకు కేటాయిస్తుంది, అదే 1402 ఎకరాలలో టిడ్కో ఇళ్ల నిర్మాణం తరహాలో ఎకరానికి పైన పేర్కొన్న విధంగా ఎకరం ఒక్కింటికి 114 ఇళ్ల  చొప్పున 160000 కుటుంబాలకు ఇళ్లను నిర్మించవచ్చు.ప్రభుత్వ స్వార్థపూరిత నిర్ణయం వలన, అమరావతి రాజధాని విధ్వంసకర కుట్రకు పాల్పడటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న సుమారుగా 110000 ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు అమరావతి రాజధాని లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉచితంగా ఇంటిని పొందే మహత్భాగ్యాన్ని, అమరావతి రైతుల త్యాగ ఫలితంగా ఏర్పడిన సువర్ణ అవకాశాన్ని ఈ ప్రభుత్వం సమూలంగా నాశనం చేయడం కాదా?  ఇది కాదా మోసం? ఇది కాదా దుర్మార్గం? ఇది కాదా ప్రభుత్వ దుందుడుకు చర్య?ఈ ప్రభుత్వం కాదా పేదల పాలిట శాపం?వాస్తవాలను నిర్భయంగా ప్రకటిద్దాం.పేదల పక్షాన నిలబడదాం.ఈ ప్రభుత్వ కుట్రలను చేదిద్దాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం పేదవాడిని గెలిపిద్దాం’’ అని పువ్వాడ సుధాకర్ పిలుపునిచ్చారు. 

నాగబాబు వాచాలత.. వాతావరణాన్ని చెడగొడుతోందా?

మెగా బ్రదర్ నాగబాబు.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఆయనకే అర్ధం కానట్లుంటుంది ఆయన తీరు. చాలా సార్లు ఆయన వ్యాఖ్యలు, మాటలు వివాదాలకు తావిచ్చేవిగానే ఉంటాయి. నటుడిగా, టీవీలలో  జబర్దస్త వంటి షోలకు జడ్జిగా ఆయన పాత్రను ఆయన బాగానే పోషించారు. అయితే రాజకీయాలలో మాత్రం ఆయన తప్పుటడుగులు వేస్తున్నారు. వాచాలత కారణంగా ఆయన సొంత పార్టీకే నష్టం చేకూరుస్తున్నారు. ప్రజారాజ్యంలో ఉన్నంత కాలం ఆయన ఏం మాట్లాడారు, ఏం చేశారు అన్నది పక్కన పెడితే.. చాలా కాలం తరువాత యిప్పుడు జనసేన పార్టీలో కీ రోల్ పోషిస్తున్న సమయంలో  ఏదైనా మాట్లాడే ముందు ఒకింత వెనకా ముందూ ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఆ పని నాగబాబుకు తెలియదన్న సంగతి ఆయనకు తప్ప అందరికీ తెలుసు. యింతకీ ఈ ఉపోద్ఘాతమెందుకంటే.. ఆయన తాజాగా జనసేన ఓట్ల శాతం గురించి ప్రకటన చేసి వివాదాల తుట్టె కదిపారు. జనసేనకు 35శాతం ఓట్లు ఉన్నాయని ఊరుకుంటే బాగానే ఉండేది. కానీ నాగబాబుకు ఎక్కడ ఆపాలో తెలియదు. అందుకే ఆయన పవన్ కల్యాణ్ సీఎం అవుతారంటూ చేసిన ప్రకటన జనసేన వర్గాలలోనే  భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణమైంది. జనసేన ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని సోదరుడు నాగబాబు వ్యాఖ్యలు జనసేన రాజకీయ లక్ష్యానికీ, ఆదర్శానికీ భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అంటూ పదే పదే చెబుతూ.. తెలుగుదేశంతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు యిస్తున్నారు. అలాగే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తుందన్న సంకేతాలు యిస్తున్నారు. ఈ సంకేతాల కారణంగానే క్షేత్ర స్థాయిలో జనసైనికులు తెలుగుదేశం శ్రేణులతో కలిసి పని చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్రలో కూడా జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. అయితే తెలుగుదేశం- జనసేన మధ్య పొత్తు వ్యవహారం అధికారికంగా ఖరారు అయిన దాఖలాలు లేవు. అందుకు అవసరమైన సానుకూల వాతావరణం అయితే ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆ సానుకూల వాతావరణాన్ని దెబ్బ కొట్టే విధంగా పవన్ కల్యాణ్ సీఎం అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పొత్తు లేకుండా జనసేన ఒక వేళ ఒంటరిగా రంగంలోకి దిగితే.. అప్పుడు నాగబాబు ఆ మాటలు అన్నా అర్ధం ఉండేది. కానీ పార్టీ అధినేత, పార్టీలో నంబర్ 2గా గుర్తింపు పొందిన నాయకుడు కూడా పోత్తులకు అనుకూలం అంటూ సంకేతాలు యిస్తుంటే.. నాగ బాబు మాత్రం ఆలూ లేదు చూలు లేదన్నట్లుగా ముఖ్యమంత్రి పవన్ అంటూ ప్రకటన చేయడంపై జనసేన శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. పవన్ సోదరుడు అన్న గుర్తింపు వినా జనసేనలో కానీ, రాజకీయంగా కానీ నాగబాబుకు ప్రత్యేక గుర్తింపు అన్నది లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మెగా బ్రదర్ కార్డుతో పొందుతున్న గౌరవాన్ని నిలుపుకోవాలంటే యిలాంటి తొందరపాటు ప్రకటనలు కూడదని సూచిస్తున్నారు.  ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న దానిపై యిప్పటికింకా సందిగ్ధతే నెలకొని ఉంది. అయితే ఒక జనరల్ ఫీలింగ్ మాత్రం బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా.. తెలుగుదేశం, జనసేనలు కలిసే సాగుతాయన్న సంకేతాలైతే స్పష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తెలుగుదేశంతో పొత్తు కుదిరితే.. జనసేన ఆ పార్టీతో సీట్లు పంచుకోవలసి ఉంటుంది. తెలుగుదేశం కచ్చితంగా అధిక స్ధానాలలో పోటీకి దిగుతుంది. అ విషయాన్ని జనసేనాని పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గౌరవానికి భంగం కలగని రీతిలో  పొత్తులు ఉంటాయనడం ద్వారా.. కొన్ని స్థానాలకు తమ పార్టీ పరిమితమౌతుందని ఆయన చెప్పకనే చెప్పేశారు. మరి అలాంటప్పుడు ఎక్కువ స్థానాలలో పోటీచేసే తెలుగుదేశం జనసేనకు సీఎం పదవి యివ్వడానికి అంగీకరిస్తుందా?  యిప్పటికిప్పుడు అయితే రాజకీయ అవసరాల దృష్ట్యా యిరు పార్టీలూ పరస్పర సహకారం గురించి మాట్లాడుకుంటున్నా.. గత అనుభవం దృష్ట్యా చూస్తే.. పొత్తు తెలుగుదేశం పార్టీకి కంటే జనసేన పార్టీకే ఎక్కు వ అవసరం. ఆ సంగతిని విస్మరించి పవన్ సీఎం అంటూ నాగబాబు ప్రకటనలు గుప్పించడం జనసేనకు ప్రయోజనం సంగతి పక్కన పెడితే నష్టం చేసే అవకాశాలే ఎక్కువ.   ఆయన వ్యాఖ్యలు క్షేత్ర స్థాయిలో జనసేన శ్రేణులను అయోమయానికి గురి చేయడం తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా.. వైసీపీకి తెలుగుదేశం.. జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీకి ఆయాచితంగా ఓ అస్త్రం అందించినట్లైందని విశ్లేషిస్తున్నారు. 

విజయసాయికి మెచ్చి మేకతోలు కప్పారా?

విజయసాయి రెడ్డి తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా, జగన్ అక్రమాస్తుల కేసులో సహ  నేరస్తుడిగా, ఏ2గా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంలోనూ.. జగన్ ముఖ్యమంత్రి కావడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయి. గత ఎన్నికలకు ముందు, పార్టీ అధికారంలోకి వచ్చాకా కూడా కుడి ఎడమ భుజాలు తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయసాయి.. ఆ తరువాత పార్టీలో కనీస గుర్తింపునకు కూడా నోచుకోకుండా మరుగున పడిపోయారు. రాజ్యసభ సభ్యుడు కనుక ఢిల్లీలో షెల్టర్ తీసుకున్నారు. అక్కడే దాదాపు ఒంటరిగా తిరుగుతున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు ఆయనను కలవడానికే యిష్టపడటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎలాగో.. అణిగిమణిగి ఒండి అత్యంత విశ్వాసపాత్రుడిగా యింత కాలం పని చేసిన విజయసాయి అలాగే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అనువుగాని చోట మౌనమే మేలు అన్నట్లుగా యిటీవలి కాలంలో విజయ సాయి పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విజయ సాయి యిప్పుడు అసలు దాని జోలికే పోవడం లేదు. ఏదో ఒకటీ రెండూ ట్వీట్లు చేసినా అవి ప్రధాని మోడీ కార్యక్రమాలను పొగడడానికో.. లేదా విపక్ష నేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికో పరిమితమైపోయారు.  అలాంటి విజయసాయికి పార్టీ అధినేత జగన్ హఠాత్తుగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో పార్టీలో విజయసాయికి మళ్లీ పూర్వ వైభవం వచ్చేసిందా అన్న చర్చ ప్రారంభమైంది.   అయితే.. పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు అంత సీన్ లేదంటున్నారు. యిప్పుడు జగన్ ఆయనను ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా నియమించారు సరే.. యింతకు ముందు వరకూ ఆ పోస్టులో బాలినేని ఉండేవారు. ఆయన దానిని తిరస్కరించిన తరువాతే  విజయసాయికి జగన్ ఆ బాధ్యతలు అప్పగించారు.   అంత మాత్రాన ఆయన నిజాయితీకి అదినేత మెచ్చి మేకతోలు కప్పారని కాదని పార్టీ శ్రేణులే ఉంటున్నారు. ఆ మూడు జిల్లాలకూ కోఆర్డినేటర్ అవసరం నిజానికి ఏ మాత్రం లేదని వారంటున్నారు. ఎందుకంటే ఆ మూడు జిల్లాలలోనూ యిప్పటికే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఆయన పెత్తనాన్నీ, ఆధిపత్యాన్ని తట్టుకోలేకే జగన్ కు సమీప బంధువు కూడా అయిన బాలినేని ఓ దడ్డం పెట్టి మరీ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ పదవి నుంచి వైదొలగారు. జగన్ స్వయంగా తన ప్రతినిథులను పంపి మరీ  బుజ్జగించినా బాలినేని దిగి రాలేదు.   యిక గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను జగన్  సుబ్బారెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచీ సుబ్బారెడ్డికీ, విజయసాయికీ పొసగడం లేదన్న భావన పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.  విజయసాకికి అప్పగించిన మూడు జిల్లాల్లో ప్రకాశం లో సుబ్బారెడ్డి వినా మరెవరూ వేలు పెట్టే అవకాశం లేదు.  చిత్తూరు జిల్లా వైసీపీ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నలలోనే మెలుగుతోంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే అక్కడ సమన్వయం చేయడానికి ఏమీ లేదు. అంటే జగన్ ఏరి కోరి మరీ విజయసాయిరెడ్డికి కట్టబెట్టిన మూడు జిల్లాల కోఆర్డినేటర్ పదవి అలంకార ప్రాయం తప్పితే అక్కడ చేయడానికి ఏమీ లేదు. దీంతో విజయసాయిని మరింతగా అవమానించేలాగే ఈ నియామకం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.   అన్నిటికీ మించి జగన్ తనకు కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టినట్టుగా వార్తలు వచ్చినా విజయసాయి స్పందించలేదు. అధినేతకు కృతజ్ణతలు చెప్పలేదు.దీనిని బట్టి చూస్తుంటే..  విజయసాయికి పార్టీలో ఉన్న గుర్తింపును మరింత పలుచన చేయడమే లక్ష్యంగా ఈ కొత్త పదవి కట్టబెట్టారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

జగన్ సహా మోడీకి 30 మంది దత్తపుత్రులు!

 మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారు. వారిలో జగన్ ఒకరు. అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను కాపాడేందకు ప్రధాని దేశ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే.. మోడీని గద్దె దింపడం ఒక్కటే మార్గం. అందుకే  దేశాన్నిరక్షించండి.. మోడీని ఓడించండి అన్ననినాదంతో  విపక్షాల ఐక్యత కోసం వామపక్షాలు నడుంబిగించాయి. అయితే ఏపీలో మాత్రం వారు తమ నినాదాన్ని ఒకింత సవరించుకున్నాయి. దేశానికి మోడీ ఎలాగో.. రాష్ట్రానికి జగన్ అలా తయారయ్యారనీ, సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని యిరువురూ దెబ్బతీస్తున్నారని వామపక్షాలు అంటున్నాయి. లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట చేరుతారన్నట్లుగా.. విధ్వంసం, విద్వేషమే స్వీయ సిద్ధాంతంగా వ్యవహరిస్తున్న మోడీ, జగన్ లు యిద్దరూ ఏపీలో కుమ్మక్కై పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. యిరువురి మధ్యా రహస్య సంబంధం ఉందంటున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శ నారాయణ ఓ అడుగు ముందుకు వేసి జగన్ ను దుర్యోధనుడితో పోల్చారు. మూడు పదులకు పైగా సలహాదారులను ఏర్పాటు చేసుకుని ఏపీలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.  బటన్‌ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి అంటే ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. వెూదీ  అండతో జగన్ విర్రవీగుతున్నారనీ, ఆ అండ పోయిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని నారాయణ అన్నారు.    వచ్చే ఎన్నికలలో బీజేపీతో సయోధ్య ఉన్న పార్టీలతో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. మణిపూర్‌ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే రూ.2500 ఉన్న టికెట్‌ ధరలను రూ.25 వేలు చేశారని మండిపడ్డారు.  ఎయిర్‌ పోర్టులు ప్రజల సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం పైవేట్‌ వాళ్లకు ఇవ్వటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పైవేట్‌ పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారని.. కేవలం పైవేట్‌ వాళ్ళకే ఇస్తారట అంటూ సీపీఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చిందన్నారు. ప్రధాని వెూదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారన్నారు. మోడీ దత్తపుత్రులు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు.   బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక బీజేపీ చొరవతో సినిమా తీయించారని విమర్శించారు. కర్ణాటకలో గెలుపు కోసం వెూడీ మతాల మధ్య చిచుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. అదానీ, వెూడీ బంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటు గురయ్యేలా చేశారని నారాయణ ఆరోపించారు. ఏపీలో అడుగడుగునా వెూడీకి సీఎం జగన్‌ అనుకూలంగా ఉన్నారన్నారు. రాష్టాన్రికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని నారాయణ అన్నారు.  కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్.. యిరువురూ తమ ప్రజా వ్యతిరేక విధానాలతో ఎక్కడిక్కడ జనాన్ని దోపిడీకి గురి చేస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో వీరిరువురినీ గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నారాయణ అన్నారు. 

జగనన్నకు చెబితే మాత్రం ఏం చేస్తారు?

జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం (మే 9) లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. సంతృప్తి స్థాయిలో వినతులను పరిష్కరించే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం  జగన్‌ మాట్లాడుతూ... వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వ పాలనలో లంచాలు, వివక్ష ఉండేవని, టిడిపి హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని దుయ్యబట్టారు, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించానని, పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని సిఎం చెప్పారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌-1902కు కాల్‌ చేస్తే సమస్యకు పరిష్కారం అందుతుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని సిఎం చెప్పారు. ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు జగనన్నకు చెబుదాం కార్యక్రమం మంచి పరిష్కార వేదిక అవుతుందని నమ్మబలికారు. ప్రజలకు సేవ అందించేందుకే తాను ఈ స్థానంలో ఉన్నానని, ఫిర్యాదు నవెూదు చేసిన వెంటనే వైఎస్సార్‌ ఐటీ కేటాయింపు చేస్తుందని, ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు స్టేటస్‌ అందుతుందని, ప్రత్యక్షంగా సిఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని తెలిపారు. స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. యిదంతా ఒకెత్తయితే.. ఈ నాలుగేళ్లలో జగన్ నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ బెబుతూ వస్తున్నదంతా  శుద్ధ అబద్ధమని జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జగన్ చేసిన ప్రసంగంతోనే తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల పాలన పూర్తయిన తరువాత జగన్ యింత కాలం ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేశారని స్వీయ విశ్లేషణ చేసుకుంటే ఏమీ చేయలేదని తేలడంతోనే.. తాజాగా జగనన్నకు చెబుదాం అన్న కార్యక్రమాన్ని ప్రారంభించి.. యింత కాలం మీరు చెప్పిందేమీ నేను వినలేదని తేటతెల్లం చేశారంటున్నారు. యింత కాలం ఆయన చేసిందేమిటయ్యా అంటే.. గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలకు నాలుగేళ్ల తరువాత మళ్లీ శంకుస్థాపనను చేయడం.. అలాగే గత ప్రభుత్వంలో ఆరంభమైన పనులను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసి.. యిప్పుడు వాటిని తిరిగి ఆరంభించడం.. అలా తిరిగి ఆరంభించిన పనులకు గతంలో ఉన్న పేర్లు తీసేసి తన పేరు పెట్టుకోవడం అంటూ విమర్శలు వినవస్తున్నాయి. యిక యిప్పుడు ఆయన తాజాగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కూడా కొత్త కార్యక్రమం ఏమీ కాదు.. గత చంద్రబాబు ప్రభుత్వం పీపుల్స్ ఫస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ విధానమే యిప్పుడు కొత్తగా జగనన్నకు చెబుదాం కార్యక్రమమని పరిశీలకులు చెబుతున్నారు.  యిప్పుడు కూడా ఈ కాల్ సెంటర్ కు అందే ఫిర్యాదులలో ఎక్కువ భాగం జగన్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పురగతికి నోచుకోని పనులు.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏయే సమస్యలపై అయితే  వైసీపీ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ ప్రజలు నిలదీశారో అవే సమస్యలు ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో  జనం ఫిర్యాదు చేస్తారని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకున్న సమస్యల పరిష్కారానికే దిక్కు లేదు. ఓ ఫోన్ నంబర్ కు జనం తమ సమస్యలు చెబితే ప్రభుత్వం స్పందిస్తుందనుకోవడం అపోహేనంటున్నారు. ఎన్నికల ముందు చేసే హడావుడిలో భాగమే యిదని విశ్లేషిస్తున్నారు. ప్రజల సమస్యలు ఏమిటి? నాలుగేళ్లలో తాము పరిష్కరించకుండా వదిలేసిన సమస్యలేమిటి? అన్నవి ఎవరో చెబితే తెలుసుకునే దుస్థితిలో జగన్ ఉన్నారా అని జనం కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగనన్నకు చెబుదాం  అన్న కార్యక్రమం వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్టు, ఆర్ జోన్ స్థలాల పంపిణీ వంటి అంశాల నుంచి జనం దృష్టి మరల్చేందుకు తీసుకువచ్చిన ప్రోగ్రామేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సీఎం ప్రధాన సలహాదారుగా సోమేష్.. తెలుగువన్ ఎప్పుడో చెప్పింది

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కు  ప్ర‌భుత్వం కీల‌క పోస్టు కేటాయించింది.  సీఎం కేసీఆర్ కు ప్ర‌ధాన స‌ల‌హాదారుగా ఆయనను నియ‌మిస్తూ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.   ఈ ప‌ద‌విలో సోమేశ్ కుమార్   మూడు సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగ‌నున్నారు. ప్ర‌ధాన స‌ల‌హాద‌రుగా ఆయ‌న‌కు కేబినెట్ హోదా క‌ల్పించింది.  సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ . ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌ని చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ గా ఉన్నారు. అనంత‌రం గిర‌జిన సంక్షేమ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా , 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. సోమేశ్ కుమార్ ప‌నితీరుకు మెచ్చిన సీఎం కేసీఆర్ 2019లో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. అయితే ఏపీ కి కేటాయించిన ఆయన వెంటనే అక్కడకు వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా   హైకోర్టు  ఆదేశించడంతో అక్క‌డికి వెళ్లి రిపోర్టు చేశారు.  ఆ తరువాత  స్వ‌చ్చంధ‌ ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.  ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బీఆర్ఎస్ స‌భ‌లో సీఎం ప‌క్క‌నే సోమేశ్ కుమార్ క‌నిపించారు. ఆలా ఉండగా సోమేష్ కుమార్ కు కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పదవి కట్టబట్టే అవకాశం ఉందని తెలుగువన్ ముందే చెప్పింది. ఆయనకు సలహాదారు పదవి దక్కే అవకాశం ఉందని కూడా పేర్కొంది.    సోమేష్ కుమార్ కోర్టు తీర్పు కారణంగా తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఆయన    అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన వెంటనే     స్వచ్చంద పదవీ విరమణ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది.   అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా సోమేష్ కుమార్ ఏపీలో రిపోర్టు చేసి ఆ తరువాత కొంత కాలానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.   ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంటనే   తెలంగాణ సర్కార్ ఏదో ఒక పదవి ఇచ్చి అకామిడేట్ చేస్తుందని తెలుగువన్ అప్పుడే చెప్పింది.  తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు  సలహాదారు వంటి పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అప్పట్లోనే తెలుగువన్ చెప్పింది.   తెలంగాణ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సయిజ్, కమర్షియల్ టాక్సెస్ కార్యదర్శిగానూ కొనసాగారు. ఇ ప్పుడు కూడా ఆయనకు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్‌కు అప్పగిస్తారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ.. సోమేష్ కుమార్ తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయిన తరువాత కూడా ఇప్పటి వరకూ ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఎవరికీ అప్పగించకపోవడంతో సోమేష్ అనుభవం దృష్ట్యా ఆయననే చూసుకోమనే అవకాశం ఉందని చెబుతున్నారు.   ఎన్నికల సంవత్సరం కావడం, కేంద్రం నుంచి సహకారం కరవైన నేపథ్యం, కారణంగా సొంత ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడాల్సిన పరిస్థితి.  దీంతో సోమేష్ కుమార్ కు రాష్ట్రానికి వనరులు సమకూర్చే బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు.  

ప్రభుత్వాల అప్పుల తిప్పలు

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ.. ప్రభుత్వ భూములు అమ్ముతూ జనాకర్షక పథకాలు, ఉచితాలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో తప్పు లేదు. కానీ అప్పులు చేసి, భూములు తెగ నమ్మి సంక్షేమ పథకాల పేరిట డబ్బులు పంచడం అంటే రాష్టాన్ని మరంతగా అప్పుుల ఊబిలోకి తీసుకుపోవడమే అవుతుంది. మితివిూరిన అప్పులు భవిష్యత్‌ తరాల వారికి గుదిబండగా తయారయ్యే ప్రమాదముంది. తెలుగు రాష్టాల్లో ఇప్పుడు అప్పులపైనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రానురాను ఇవి విపరీతంగా పెరుగుతున్నా పాలకులు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని సవరించి, ఆయా ప్రభుత్వాలు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రవేశపెట్టే ఉచితాలకు క్లళెం వేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు రెండు రకాలు.  మొదటి దాంట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, రోడ్లు వంటి వాటిని అభివృద్ధి చేస్తుంది. దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పేదలు చదువు అంది అభివృద్ధి చెందుతారు. ఉచిత వైద్యం పొంది ఆరోగ్యంగా ఉంటారు. ఇక రెండవ దాంట్లో వ్యక్తి(ఓటరు)ని దృష్టిలో పెట్టుకొని అమలు చేసే సంక్షేమ పథకాలు. ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్నట్లు కల్యాణలక్ష్మి, డబుల్‌బెడ్‌రూమ్‌ఇండ్లు, గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరెలు, రైతు బంధు, పింఛన్లు తదితరాలు. రెండవ రకంలో సమాజంతో సంబంధం లేకుండా లబ్దిదారులకు నేరుగా లాభం చేకూరుతోంది. కొన్ని దేశాలు మితివిూరిన సంక్షేమ పథకాలు, ఉచితాలు ప్రవేశపెట్టి కొద్దికాలంలోనే దివాలా తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న వెనిజులా దేశం సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి ఖర్చు చేసింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోవడంతో దివాల తీసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాంతో ప్రభుత్వాలు పడిపోయి దేశంలో అస్థిరత, అరాచకం చోటు చేసుకున్నాయి. గ్రీసు దేశం ప్రపంచానికి ప్రజాస్వామ్య జీవన విధానం, తత్వశాస్త్రం, రంగస్థలం, ఒలింపిక్ క్రీడలు వంటివి అందించిన ఒక అభివృద్ధి చెందిన రాజ్యం. మితివిూరిన సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ దేశం కూడా దివాలా తీసింది. శాంతి భద్రతల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మన పొరుగు దేశమైన శ్రీలంక పరిస్థితి వేరుగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం రెండు రకాలుగా అప్పులు చేస్తోంది. ఒకటి నేరుగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటోంది. ఇలా తీసుకున్న అప్పు రాష్ట్ర బడ్జెట్‌ పద్దుల్లో చూపిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌(ద్రవ్య వినిమయ చట్టం) ప్రకారం రాష్టాలు అప్పులు చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే కేంద్రం అనుమతి కూడా అవసరం. ఇక రెండవ రకం ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా. వీటి ద్వారా తీసుకుంటున్న అప్పులకు ప్రభుత్వం ప్రత్యక్షంగా పూచీ ఉండదు. పూచికత్తు మాత్రమే ఇస్తుంది. కార్పొరేషన్లు పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నా అవి ప్రభుత్వ లెక్కలోకి రావు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పు ఎంత అన్నది ప్రజలకు తెలియడం లేదు. పాలనలో వివిధ కార్యక్రమాలకు అప్పులు తీసుకోవడంలో తప్పు లేదు. అయితే అటువంటి అప్పు పెట్టుబడుల కింద ఖర్చు చేస్తే ఆదాయం వస్తుంది.   తిరిగి కట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రజాకర్షణ పథకాలకు అప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. ప్రభుత్వాలు పథకాల పేరిట ఖర్చులు తగ్గించి నాణ్యమైన విద్య, ఆరోగ్యం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్పాదక రంగం పైన ఖర్చు చేస్తే.. ఉపాధి అవకాశాలు పెరిగి పేదలకు మేలు జరుగుతుంది. ఎన్నికల్లో గెలుపు కోసం విచక్షణారహితంగా ఉచితాలు ప్రకటించడం, ఉద్యోగస్తుల జీతభత్యాలు పెద్ద ఎత్తున పెంచటం, మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఎన్నటికైనా ముప్పే. అలాంటి ముప్పును ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీదనే పూర్తిగా ఆధారపడిన పరిస్థితి. ఉత్పాదక రంగాలను నిర్వీర్యం చేసి ఆదాయ మార్గాలను పూర్తిగా విస్మరించి పూర్తిగా అప్పుల  మీదనే ఆధారపడి రోజులు గడిపేస్తోంది. ఆ అప్పులతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. వాటిని వచ్చే ఎన్నికలలో  మళ్లీ అధికారం కోసం  పెట్టుబడులుగా పరిగణిస్తున్నది. దీని వల్ల రాష్ట్రం  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగులు జీతాలు అందక ఉద్యమ బాట పడుతున్నారు. అన్ని వర్గాల వారీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అభివృద్ధి అడుగంటింది. పారిశ్రామిక ప్రగతి ఆనవాలే లేకుండా పోయింది. 

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

పాకిస్థాన్ తెహరీక్ -ఎ-ఇన్సాఫ్ అంటే పాకిస్థాన్ న్యాయపోరాటం అని అర్ధం. ఇలాంటి పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ప్రధాని పదవిని అధిష్టించిన ఇమ్రాన్ ఖాన్  ను అక్కడి ప్రభుత్వం  రేంజర్లు అరెస్టు చేశారు.  అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.  ఆ పనిలో ఇస్లామాబాద్ హైకోర్టుకు బయో మెట్రిక్ గుర్తింపును పరిశీలించుకోవడానికి వచ్చిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్థానీ రేంజర్లు అదుపులోనికి తీసుకున్నారు. ప్రధాని పదవి లోనుం స్వంత పార్టీ నేతలే  ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతుడిని చేశారు.  అపంతనం వందకు పైగా కేసులను ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కోవలసి వచ్చింది.  పాకిస్థాన్ జాతీయ జవాబుదారీ సంస్థ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది ఏప్రియల్ లో అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవిని ఇమ్రాన్ ఖాన్ వదలాల్సి వచ్చింది.  రష్యా , చైనా, ఆప్ఘనిస్థాన్ లపై ఇమ్రాన్ ఖాన్ అనుసరించిన విదేశాంగ విధానాల కారణంగా అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవలసి వచ్చింది.   ఈ విధానాలు నచ్చని అమెరికా తనపై కక్ష కట్టిందని ఇమ్రాన్ ఖాన్ వర్గం అప్పట్లో ఆరోపణలు చేసింది. రేంజర్లుగా అనుమానిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలు ధరించి ఇమ్రాన్ ఖాన్ ను అపహరించారని పీటీఐ అధికార ప్రతినిథి ఫహాద్ చౌదరి ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే కోర్టులో హాజరు పారచాల్సిందిగా ఇంటీరియర్ సెక్రటరీని, ఐజీ పోలీసులను ఆదేశించాలని ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఫహాద్ కోరారు. 2003లో ప్రజాస్వామిక దేశంగా అవతరించిన పాకిస్థాన్ అంతకు ముందు ఐదున్నర దశాబ్దాల పైనిక పాలన వాసనలను ఇంకా మరచిపోకపోవడం విషాదం. 

మోడీ హయాంలో పార్లమెంటు.. ది హౌస్ ఈజ్ ఎడ్జోర్డ్న్

కర్నాటక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారన్నది ..ఎవరిని గెలిపిస్తారన్నది 13న ఫలితాలతో తేలనుంది.  గత మూడేళ్లుగా అవినీతిలో కూరుకుని పోయిన బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోమారు అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్‌ విూడియా ప్రచారాలను బీజేపీ ఉధృతం చేస్తోంది. దేశంలో వెూడీని అవతారపురుషుడిగా కీర్తిస్తూ..గత పాలకులందరినీ పాపులుగా చిత్రీకరిస్తూ.. బిజెపి సోషల్‌ విూడియా కోడై కూస్తోంది. సోషల్‌ విూడియాలో నిత్యం ప్రధాని నరేంద్ర వెూడీ గురించి గొప్పలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఆయన తుమ్మినా దగ్గినా అదో విజయంగా ప్రచారం సాగుతోంది. ఆయన అనేక విజయాలు సాధించినట్లు చెబుతున్నారు. వెూడీ వచ్చిన తరవాత దేశం దశదిశ మారిందన్న ప్రచారం విపరీతంగా ఉంటోంది. అలాగే ఆయన మాత్రమే ఈ దేశాన్ని ఉద్దరించాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భారత్‌ కోసం పుట్టిన వరపుత్రుడని ప్రచారం చేస్తున్నారు. ఏ దేశం వెళ్లినా..ఏ దేశాధినేతతో మాట్లాడినా.. ఏదైనా శంకుస్థాపన చేసినా..ఏ ప్రారంభోత్సవం చేసినా ఆహా ఓహో అంటూ పుంఖానుపుఖాలుగా ప్రచారాలు వస్తున్నాయి. కర్నాటకలో ఇది మరింత శృతి మించింది. నిజానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. గడిచిన 9 ఏళ్లలో  ఏటా సగటున రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఫలితంగా 68 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకొన్న అప్పుల కన్నా 9 ఏండ్ల వెూడీ  పాలనలో తీసుకొన్న అప్పులే ఎక్కువయ్యాయి. ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్ర వెూడీదేనన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పై పన్నులు, సెస్సుల రూపంలో ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఎంతసేపు ఆదానీ అంబానీలకు దోచిపెట్టడం, వారిని మరింత సంపన్నులగా తీర్చిదిద్దే పనులు చేపట్టడం మినహా చేస్తున్న ఘనకార్యాలు ఏవీ లేవు. దేశవ్యాప్తంగా బుల్లెట్‌ టైన్‌ ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాదిరాళ్లు తమ పేర్లతో వేసుకొన్నారు. వాటికి పెట్టుకొన్న గడువు కూడా తీరిపోయింది. ఒక్క తట్టెడు మట్టి తీసిన పని కూడా జరగ లేదు. రూ.80 లక్షల కోట్ల అప్పుల సంగతి దేవుడెరుగు.. ఏటా రూ.3 లక్షల కోట్లు పెట్రో బాదుడుతోనే వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఏమయ్యాయంటే.. రాష్టాలు వ్యాట్‌ తగ్గించాలని సుద్దులు చెబుతారు. దారుణం గా అప్పులు చేస్తున్న తీరు ఒక వైపు అయితే... జిఎస్టీ పేరుతో  చేస్తున్న బాదుడు   మరోవైపు. అయినా మోడీ హయాంలో  సామాన్యలకు ఉపశమనం కలిగించే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే.. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పుంఖానుపుంఖాలుగా ప్రాచరం చేస్తున్నారు. సోషల్‌ విూడియా ప్రచారంలో బిజెపి నేతలు ఆరితేరారు. వెూదీ ప్రభుత్వం చేసిన 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యా లేంటో బీజేపీ నేతలు చెప్పగలరా అంటే సమాధానం రాదు. ఇంతకీ ఆ వసూళ్లతో, ఆ అప్పులతో ప్రభుత్వం చేసిన మంచి పని ఏమిటంటే.. యిదీ అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని కనిపించదు.   బ్రహ్మాండంగా దేశాన్ని నడిపిస్తున్నామని చెప్పుకుంటారు కానీ ప్రభుత్వం సాధించిన ఘనతలేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. ప్రజాసమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం ముందుకు రాదు.  రైతుల కోసం అంటూ ప్రవేశ పెట్టిన సాగు చట్టాలపై నా పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం ముందుకు రాలేదు.  పార్లమెంటు సమావేశాలు వాయిదాపడటానికే అని సామాన్యులు ఒక నిర్ణయానికి వచ్చేసిన పరిస్థితి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి రైతలను వంచించినా చర్చించరు. జిఎస్టీ పేరుతో పన్నులు బాదుడుపైనా చర్చించరు. నిజానికి వెూడీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో చర్చ అన్నది పక్కకు పోయింది. ఏ అంశమైనా సోషల్‌ విూడియా ప్రచారం తప్ప చట్ట సభల్లో చర్చకు కేంద్రం అవకాశం యివ్వడం లేదన్నది వాస్తవం. లక్షన్నర కోట్లకు పైగా జిఎస్టీ వసూళ్లు అవెూఘం అంటున్నారు.   చివరకు మనం పైసా పైసా కూడబెట్టుకుని చెమటోడ్చి సంపాదించిన డబ్బులతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌, జీవిత బీమా చేయించుకున్నా..జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. దీనిపై చర్చించడం లేదు. ఇకపోతే సామాన్యుల సొంతింటి కల నెరవేరడం లేదు. నిర్మాణరంగం కుదేలయ్యింది. వ్యవసాయరంగం కుదేలయ్యింది. ఆర్థికరంగం అంతకుమించి కుదేలయ్యింది. అయినా అదీ చర్చించరు. ఉద్యోగ ఉపాధి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిపైనా సోషల్‌ విూడయాలో ప్రచారం జరగదు. ఎడాపెడా పెట్రో ధరలు పెంచుతూ పోతున్నా.. దాని వల్ల కలుగుతున్న విపరిణామాలను చర్చించరు. గ్యాస్‌ ధరలు సామాన్యులకు భారంగా మారినా చర్చ చేయరు. అభూత కల్పనలను జోడించి చేస్తున్న చర్చల వల్ల బిజెపిని, వెూడీ అతిగా చూపిస్తూ భారత్‌ బ్రహ్మాండం అంటూ చూపుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. తిండిపెట్టి, దేశయువతకు ఉద్యోగ,ఉపాధి కల్పించి, రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా వ్యవసాయాన్ని చేసే ఆలోచన ఏదీ వెూడీ బృందానికి లేదు. ప్రస్తుతం పెంచిన పన్నులతో వచ్చిన డబ్బును గత పాలకులు చేసిన అపðలు తీర్చేందుకు వాడుతున్నా మంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నది. ఈ నకిలీ వార్తలను దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరేలా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ప్రధానిగా నరేంద్రవెూదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అపð రూ.55.87 లక్షల కోట్లు. ఈ లెక్కన ప్రతి నెల వెూదీ ప్రభుత్వం తీసుకొన్న సగటు రుణం రూ.83,341 కోట్లు. 2014లో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో పెట్రోల్‌, డీజిల్‌పై వచ్చిన పన్నుల వాటా 5.4 శాతంగా ఉండగా, 2020-21 నాటికి అది 12.2 శాతానికి పెరింగింది. నేడు ఒక్క వంటగ్యాస్‌ సిలిండర్‌కు పెడుతున్న ఖర్చుతో వెూదీ మొదటిసారి ప్రధాని అయినపðడు రెండు సిలిండర్లు వచ్చేవి. చమురు ధరల పెంపుతో కేంద్రం ఏటా రూ.3 లక్షల కోట్లను ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా..పట్టించుకోద్దన్న సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు. రాష్టాల్లో అభివృద్ది అంతా తమ చలువేనని చాటుకుంటున్నారు. సిగ్గూఎగ్గూ లేకుండా ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. దీనికి చరమగీతం పాడకుంటే నష్టపోయేది ప్రజలే. ప్రజలు దీనిని నిరసించాలి. ఎక్కడిక్కడ నిలదీయాలి. సోషల్‌ విూడియా విష ప్రచారాలను పసిగట్టాలి. ఎక్కడి కక్కడే ఎదురుదాడి ప్రారంభించాలి. తిప్పికొట్టాలి. అప్పుడే ప్రజలు విజయం సాధిస్తారు.

ది కేరళ స్టోరీ ప్రమోటర్ బీజేపీ!?

మత మార్పిళ్ళ వ్యవహారంపై నిర్మించిన 'ది కేరళ స్టోరి' సినిమా విడుదల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.   అయితే ఈ సినీమాకు బీజేపీ నేతలు ప్రమోటర్స్ గా  వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  మత మార్పిళ్ళ వ్యవహారంపై నిర్మించిన 'ది కేరళ స్టోరి' సినిమా విడుదల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.   అయితే ఈ సినీమాకు బీజేపీ నేతలు ప్రమోటర్స్ గా  వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   ఈ సినిమా ఉగ్ర వాదాన్ని బట్ట బయలు చేసిందని సాక్షాత్తు కేంద్ర సమాచార, ప్రసా ర క్రీడలు, యువత వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు.  ఈ చిత్రం ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి అంటున్నారు. ఉగ్రవాదం, మత మార్చిడి చేతులు కలిపి ఒకదానికి ఒకటి ఊతమిచ్చుకుంటున్న ఒక అనైతిక బంధాన్ని చిత్రం కళ్ళకు కట్టినట్టుగా చూపిందని చెబుతున్నారు. చిత్ర ప్రదర్శనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఖండిస్తూ.. ఈ నిషేధంతో   మమతా బెనర్జీ రాష్ట్రంలో మహిళా లోకానికి అన్యాయం చేస్తు న్నారని  విమర్శించారు. ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేసేవారితో అంటకాగుతున్నారా లేక వారికి వ్యతిరేకంగా ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధా నం మమతా బెనర్జీ చెప్పాలని  నిలదీశారు. ఉగ్రవాదం ప్రధా నాంశంగా వచ్చిన ఒక చిత్రాన్ని ఎందుకంత పెద్ద సమస్యగా భావిస్తున్నారంటూ యావత్ దేశం ఆమెను ముక్త కంఠంతో ప్రశ్నిస్తోందన్నారు. ది కేరళ స్టోరీ సిన్మాకు బీజేపీ ప్రమోషన్ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఆ విత్ర నిర్మతలకు ప్రమోషన్ ఖర్చు గణనీయంగా తగ్గిందని ఈ సినీమాను వ్యతిరేకించే వారు అంటున్నారు. గతంలో కూడా  బీజేపీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఇలాంటి సహకారాన్నే అందించిందని గుర్తు చేస్తున్నారు. 

మోడీపై విమర్శలతో శరద్ పవార్ యూటర్న్

ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో వ్యవహరించిన తీరు పట్ల రాజకీయవర్గాలలో ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఆయన తన ప్రచారంలో మత పరమైన అంశాలను ప్రస్తావించారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఆయన మత పరమైన అంశాలను ప్రస్తావించడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. అయినా ఒక ప్రధాని ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలను ప్రస్తావించడం ఎంత మాత్రం సరికాదని శరద్ పవార్ అన్నారు.   ఎన్నికల్లో ప్రజాస్వామ్య, లౌకికవాద విలువలు కాపాడతామని ప్రమాణం చేస్తాం. కానీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం నన్ను దిగ్భ్రమానికి గురి చేసిందన్నారు.  లౌకికవాదాన్ని మనమంతా అంగీకరించాం. ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో మతం గురించి, మతపరమైన అంశా గురించి మాట్లాడతామో.. అప్పుడు కొత్తరకం పరిస్థితులు ఏర్పడతాయి. అది ఏ మాత్రం మంచిది కాదని పవార్ అభిప్రాయపడ్డారు. యిక ఎన్సీపీ అధ్యక్ష పదవికి తన రాజీనామాను ఉపసంహరించుకోవడంపై కూడా  ఆయన వివరణ యిచ్చారు. ఆరోగ్యం సహకరించక రాజీనామా చేద్దామనుకున్నప్పటికీ.. తన కుమార్తె సుప్రియా సూలె అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి తన రాజీనామాను ఉపసంహరించుకున్నానని చెప్పారు.   నిన్నమొన్నటి వరకూ  శరద్ పవార్ బీజేపీకి దగ్గర అవుతున్నారనీ, అందులో భాగంగానే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా అనీ పెద్ద ఎత్తున  ప్రచారం జరిగింది.   శరద్ పవార్ కూడా విపక్షాల ఐక్యతా యత్నాలను పక్కన పెట్టి మరీ.. అదానికి మద్దతుగా, అదే విధంగా మోడీ విద్యార్హతలపై విపక్షాల విమర్శలకు ఖండిస్తూ చేసిన  వ్యాఖ్యలు.. ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారన్న ప్రచారానికి బలం చేకూర్చేదిలాగే ఉంది. అంతలోనే యిప్పుడు కర్నాటక ప్రచారంలో మోడీ  తీరును విమర్శిస్తూ శరద్ పవార్ గళమెత్తారు. ఈ మరాఠా యోధుడి స్వరం మారడానికి కారణాలేమిటన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. 

కొనుగోలు కేంద్రాలేవీ? అన్నదాతకు అండేదీ?

 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం  రైతులకు శాపంగా పరిణమించింది. కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. పంట దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి నప్పటికీ ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. 20 రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి కసరత్తు ప్రారంభించిన అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమైంది ఫలితంగా ఆరుగాలం శ్రమించి, అధిక వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేసిన వరి పంట మూడు రోజుల క్రితం గాలివాన బీభత్సానికి కకావికలం అయింది. ఇటీవలి  అకాల వర్షాలకు పంటంతా నీట మునగగా, రైతన్నకు తీరని నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా  వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడాయి. కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టగా, ప్రసక్తే లేదని కేంద్రం పేర్కొనడంతో వరి పండించిన రైతుల్లో ఒకింత ఆందోళన మొదలయింది. గతేడాది ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ సర్కారు ప్రత్యక్ష ఆందోళనలకు దిగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెపం వెూపుకుంటూ కాలం వెళ్లదీశారు. పంట కోసే సమయం వరకు ప్రభుత్వం నుంచి సూచనలు రాకపోవడంతో అధికారులు సైతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. పంట కోతకు వచ్చే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని ఉంటే తమకు అకాల నష్టం జరిగి ఉండేది కాదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సంవత్సరం లక్షా 54వేల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. యాసంగి సీజన్‌లో ముందుగా సాగు చేసిన చోట దాదాపు నెల రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభం కాగా దిగుబడి అంచనాకు సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తీరా పంట కోసి ఆరబెట్టిన తరువాత అ కాల వర్షం కురిసి ధాన్యం మొత్తం తడిసిపోయింది. కొంత మొత్తం వరదలకు కొట్టుకొని పోయింది. అధికారులు సకాలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఉంటే పంటను అమ్ముకొనే వారమని రైతులు వాపోతున్నారు. ఈ యేడాది పంట ఏపుగా ఎదగడంతో దిగ బడి లాభసాటిగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా తమ ఆశలు వమ్మయ్యాయని లబోదిబో మంటున్నారు. 

ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు.. అనుమానాలకు తావిస్తున్న నిర్ణయం

ఔటర్‌ రింగ్‌రోడ్డు అవినీతిపై అధికార బిఆర్‌ఎస్‌ నోరుమెదపడం లేదు. ఏదైనా ఆరోపణలు రాగానే అంతెత్తు ఎగిరిపడే నేతలు అసలు ఈ విషయంపై నోరెత్తడం లేదు.  మున్సిపల్‌ శౄఖ మంత్రికెటిఆర్‌ కూడా మౌనం వహిస్తున్నారు. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ తరువాత బీజేపీ నేతలు దానిని అందుకున్నారు.  అవినీతి జరిగివుంటే.. లేదా నిబంధనలకు విరుద్దంగా లీజ్‌ ఇచ్చివుంటే కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకోవాలి. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ, ఈడీ దర్యాప్తలకు ఆదేశించాలి.  కానీ బీజేపీ మాత్రం వాటి జోలికి వెళ్లకుండా   ఆరోపణలకే పరిమితం అవుతోంది. హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రభుత్వం లీజుకు ఇచ్చే విషయంలో విపరీతమైన వివాదాలు నెలకొంటున్న వేళ నిజాలు నిగ్గు తేలాలి.  విపక్షాల ఆరోపణలకు కేవలం మున్సినల్‌ అడ్మినిస్టేషన్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌   ముక్తసరి ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. నిజానికి ఓఆర్‌ఆర్‌ ను 30 ఏళ్ల పాటు పైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న దానికి అధికారపక్షం నుంచి సమాధానం రావడం లేదు. ఓఆర్‌ఆర్‌ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. హెచ్‌ఎండీఏ కు ఓఆర్‌ఆర్‌ పై టోల్స్‌ వసూలు చేయడం ద్వారా రాబోయే 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. లీజు ఏ కంపెనీకి టెండరు రావాలో ముందే సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని ఆరోపించారు. పైవేటీకరణకు తాము వ్యతిరేకమంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను ఎందుకు పైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిందని నిలదీస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం లీజు పక్రియ జరగడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఓఆర్‌ఆర్‌ను 30ఏళ్ళ వరకు లీజ్‌కు ఇవ్వాల్సిన అవసరం ఏంటన్న దానికి మంత్రి కెటిఆర్‌ నుంచి సమాధానం రావడంలేదు. ఏప్రిల్‌ నెల సగటు టోల్‌ గేట్స్‌ నుండి వచ్చిన ఆదాయం రోజుకు కోటి ఎనభై ఐదు లక్షలు దాటింది. ఏడాదికి సుమారుగా 720 కోట్లు ఆదాయం వస్తోంది. ముఫ్లై ఏళ్లపాటు లీజుకు ఇవ్వడమంటే సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కానీ పిసిసిచీప్‌ 30వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. మరి అంతలా ఆదాయం వస్తున్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ గేట్స్‌ లీజును అప్పనంగా ఓ కంపెనీకి కేవలం 7380 కోట్లకు 30 ఏళ్లపాటు ఎలా కేటాయిస్తారంటూ ఇటీవల ప్రశ్నించారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టోల్‌ గేట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ప్రభుత్వమే టోల్‌ గేట్‌ లను నిర్వహిస్తూ బ్యాంకుల నుండి నిధులు తెచ్చి బ్యాంక్ కు వడ్డీ చెల్లించినా మంచి లాభాలు వస్తాయని, అలాండిది ప్రజల సొమ్మును  ఐఆర్‌బి అనే సంస్థకు అప్పగించడం వెనుక ఉన్న గూడుపుఠాణి బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అందులోనూ డిఫాల్టర్‌ గా ఉన్న ఐఆర్‌బి కంపెనీకి తిరిగి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ గేట్‌ నిర్వహణ ఒప్పందం పక్రియ వెంటనే ఆపకపోతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. ఈ వ్యహారంపై సిబిఐ, ఈడిల కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ టోల్‌ గేట్‌ కుంభకోణంపై పోరాటం చేయనున్నట్లు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు. ఔటర్‌ వ్యవహిరంపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఇదేనా కేసీఆర్‌ చెప్పే గుణాత్మకమైన మార్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీజుతో కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్‌ కుటుంబం ఆరి తేరిందని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

సమస్యలపై పోరాటంలో ఐక్యత ఎక్కడ?

కర్నాటక ఎన్నికల్లో  విపక్షాలు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా సాగుతున్నారు. విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్న కెసిఆర్‌, బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లెఫ్ట్‌ నేతలు ఎవరూ కూడా ఇక్కడ బిజెపిని ఓడించేందుకు కలసికట్టుగా పోరాడుదామన్న సంకల్పాన్ని ప్రకటించలేదు. అంతుకు ముందు జరిగిన పలు రాష్టాల ఎన్నికల్లోనూ ఇదే తీరు కొనసాగింది. వెూడీ, బీజేపీ  కోరుకుంటున్న విధంగానే విపక్షాలు ఐక్యతకు దూరంగా ఉంటూ ప్రజలకు అదే సంకేతాన్ని యిస్తున్నాయి. అంతెందుకు ఢిల్లీ కేంద్రంగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా వారికి అండగా నిలిచి పోరాడాలన్న కనీస జ్ఞానం కూడా విపక్షాల్లో లోపించింది. ఈ ఒక్క విషయం చాలు బిజెపిని నిలదీయడానికి కానీ సమస్యలపై పోరాడేందుకు కానీ విపక్షాలకు చిత్తశుద్ధి కొరవడిందని జనం భావించడానికి. ఏదో వెళ్లామా అంటే వెళ్లామన్న తీరులో కొందరు వెళ్లి  రెజ్లర్లకు మద్దతు ప్రకటించారే తప్ప జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ కీర్తి పతాకను రెపరెపలాడించిన కుస్తీ వీరులకు అండగా ఉద్యమించడంలో మాత్రం పూర్తిగా విస్మరించారు. రెజ్లర్లపై  ఢిల్లీ పోలీసులు అమా నుషంగా ప్రవర్తించారు. జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై లాఠీ ఝుళిపిం చారు. పోలీసులు తప్ప తాగి విర్రవీగారని రెజ్లర్లు ఆరోపిస్తుండగా.. బీజేపీ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిం దంటూ విపక్షాలు దుమ్మెత్తి పోశాయి.  ఢిల్లీ మహిళా కమిషన్‌ కూడా ఈ ఘటనపై సీరియస్‌ అయ్యింది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మైనర్‌ సహా.. పలువురు మహిళా రెజ్లర్లు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఏప్రిల్‌ 23 నుంచి వారు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారికి దిగ్గజ కుస్తీవీరులు, మాజీ రెజ్లర్లు మద్దతు ప్రకటిస్తూ ఆందోళనలో పాల్గొంటున్నారు. అయినా ఆ బిజెపి ఎంపిపై చర్య తీసుకోవాలని, మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఉమ్మడిగా పోరాడాలన్న చలనం విపక్షాల్లో కానరావడం లేదు. ఈ విషయాన్ని అంతా కలసి మహిళా రాష్ట్రపతి ముందుకు తీసుకుని వెళ్లవచ్చు. నిజానిజాలను విచారించాలని కోరవచ్చు. బిజెపి ఎంపిపై చర్యలకు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉన్నా.. విపక్ష పార్టీలు పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. మహిళా రెజ్లర్లకు అండగా పోరాడాలన్న కనీస నైతికతను కూడా మహిళా ఎంపిలు కనబర్చడం లేదు. ఎందుకంటే వారికి రాజకీయాలను మించిన సమస్య మరోటి లేదు కనుక. అంతెందుకు..కర్నాటకలో బిజెపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని చెబుతున్నా విపక్ష నేతలు  కలసి పని చేయడానికి ముందుకు రాలేదు. కర్నాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎవరికి వారే అన్నట్లుగా పోటీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు బిజెపికి కలసివచ్చేదిగా ఉంది. అక్కడ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తున్నా...కర్నాటకలో నేతలు అవినీతి లో కూరుకుపోయారు. బిజెపి అవినీతిని ఎలుగెత్తాల్సిన పార్టీలు ఉమ్మడి కార్యాచరణ చేయడం లేదు. ఎందుకంటే అవినీతిలో అన్ని పార్టీల నేతలదీ ఒకటే దారి. మరోవైపు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న పాత్ర పోషించడాన్ని పలు ప్రాంతీయ పార్టీలు అంగీకరించే పరిస్థితిలో లేవు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో రాజీ ధోరణి అవలంబించడానికి సిద్ధంగానే ఉంది. కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం అంటూ కేసీఆర్‌, మమతా బెనర్జీ, కేజీవ్రాల్‌ వంటివారు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే రాహుల్‌ గాంధీకి సంఘీభావం తెలపడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ మూడు పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాలంటే జయప్రకాశ్‌ లాంటి అనుసంధానకర్త కావాలి. అంత నిజాయితీగా ఉండి విపక్షాలను నడిపించే  వ్యక్తి ఎవరూ లేరు. ఎందుకంటే ఐక్యత కోరుకుంటున్న వారంతా ప్రధాని పదవిని కోరుకుంటున్న వారే. కర్నాకటలో కూడా కుమారస్వామి, సిద్దరామయ్య, డికె శివకుమార్‌ తదితరులంతా సిఎం పదవిపై కన్నేసిన వారే. అందుకే విపక్షాల ఐక్యత అన్నది ఎండమావిగా మారుతోంది. నిజానికి కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదు. ఆ విషయం అన్ని పార్టీలకు తెలుసు. అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌ మద్దతుతో ప్రధాని గద్దెపై ఒక్కసారయినా ఎక్కాలని చూస్తున్నవే. ఇలా చేసే చరణ్‌ సింగ్‌, చంద్రశేఖర్‌, విపిసింగ్‌ లాంటి వారు ప్రధాని పదవిని అధిష్టించినా..దేశాన్ని పాలించే సత్తా లేదని నిరూపిం చుకున్నారు. ఒకవేళ కలిసినట్టు కనిపించినా ప్రస్తుతం వెూడీ నాయక్తంలో ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనే పరిస్థితి కానరావడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా నిస్వార్థంగా పోరాడాలన్న సంకల్పాన్ని మరింత గట్టిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. గాంధీ నెహ్రూకుటుంబం బయటి వ్యక్తిని పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ ఒక అడుగు వేసింది.  దానిని అందిపుచ్చుకుని బీజేపీయేతర పార్టీలు అడుగు కలపాల్సిన, కదపాల్సిన అవసరం ఉంది. అది జరగనంత వరకూ విపక్షాల ఐక్యత ఎండమావిగానే ఉంటుంది. 

జనంలో బీజేపీపై వ్యతిరేకత రాహుల్ కు కలిసొస్తుందా?

బిజెపి నిరంకుశ విధానాలపై ప్రజల్లో అసహనం రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలు వరుస దాడులు, కేసులతో వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నతీరు పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేరుగా మోడీనే తాకుతున్నదని అంటున్నారు.   వెూడీ, షా ద్వయం తమను గట్టిగా ఢీ కొంటున్న నేతలను కావాలనే వేధిస్తున్నారన్న భావన ప్రజల్లో  బలంగా ఏర్పడింది. కాగా కేంద్రం అనుసరిస్తున్న తీరు  , ఆ తీరును దీటుగా ఎదుర్కొంటున్నరాహుల్ ను జనం గమనిస్తున్నారు. యిప్పుడిప్పుడే రాహుల్ లోని నాయకత్వ లక్షణాలను  వారు గుర్తిస్తున్నారు.  తనపై అనర్హత వేటు వేసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ స్పందన పరిణితి చెందిన నేతగా ఉంది. అంతే కాకుండా అనర్హత వేటు పడిన వెంటనే ఎంపీగా   కేటాయించిన భవనాన్ని కూడా ఖాళీ చేయాలని రాహుల్ కు హుకుం జారీ చేయడం, అందుకు బదులుగా నిబంధనల ప్రకారం గడువులోపు ఖాళీ చేస్తానని ఆయన ప్రకటించడం ద్వారా రాహుల్‌ తన నిజాయితీ చాటుకున్నారు. గుజరాత్‌ కోర్టు తీర్పు, తరవాత పైకోర్టుల్లో లభించని ఊరట తదితర అంశాలన్నీ రాహుల్‌కు కలసి వస్తున్నాయి. ఎంపీగా అనర్హత వేటు పడిన తరువాత రాహుల్‌ పట్ల జనంలో అభిమానం పెరిగింది. అదే సమయంలో ప్రధాని వెూడీ ఇమేజ్‌ మసకబారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పైగా నెహ్రూ కుటుంబానికి చెందిన వారెవరినీ  పార్లమెంట్‌ గడప తొక్కకుండా చేయాలన్న పట్టుదలలో వెూడీ ఉన్నారని భావన కూడా ప్రజలలో విస్తృతంగా వ్యక్తం అవుతోంది.  ఒకప్పుడు తాను బీజేపీ అగ్రనాయకులైన వాజపేయి, ఎల్‌.కె.ఆద్వాణి వంటి వారికి అనుచరుడిగా, సహాయకుడిగా పరిచర్యలు చేసిన విషయం వెూదీ మరచిపోయాడు. అధికారంలోకి రాగానే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి లాంటి ఉద్దండులను పక్కన పెట్టారు. రాహుల్‌ గాంధీ విషయంలో వెూడీ హుందాగా వ్యవహరించి ఉంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు పునాదులు పడేవికావు. నిజానికి 2024 ఎన్నికల్లో కూడా ప్రధాని వెూదీ విజయానికి తిరుగుండదన్న అభిప్రాయం నిన్న మొన్నటి దాకా ఉంది. అయితే ఇందిరాగాంధీ లాంటి వారే మట్టి కరిచారు. ప్రాంతీయ పార్టీల నాయకులను నయానో భయానో దారిలోకి తెచ్చుకున్నందున సంతృప్తి చెంది ఉండాల్సింది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికే ఉండకూడదు అనుకోవడం మాత్రం సరికాదు. ఒకప్పుడు బీజేపీ ఉనికిని కాంగ్రెస్‌ సహించేది కాదు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది చూస్తున్నాం. రేపు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. సహజ న్యాయం అని ఒకటి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా పచ్చగానే కనిపిస్తుంది. కానీ ప్రజలు తలచుకుంటే ఏమైనా చేయవచ్చు. అధికధరలు, జిఎస్టీ వాయింపులు, పెట్రో ధరలు ప్రజలను సూదుల్లా పొడుస్తున్నాయి. వీటిని భరించే శక్తి లేనప్పుడు తిరుగుబాటు గురించి ఆలోచిస్తారు. దేశంలో పరిస్థితి యిప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది.  ప్రజల ఆగ్రహం ఓడలను బండ్లు, బండ్లను ఓడలు చేస్తుంది. కర్నాటక ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే!

ఒకప్పుడు కాంగ్రెస్‌ రాజకీయాల్లో భాగమైన అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బిజెపిలో కూడా సర్వసాధారణంగా మారిపోయాయి.  కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు బుధవారం మే (10)న జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని  తెలిసినా ఎలాగోలా రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపి పెద్దలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో ఏదో రకంగా గెలిచేందుకు లేదా కాంగ్రెస్‌ను సాధ్యమైనన్ని తక్కువ సీట్లకు పరిమితం చేసేం దుకు బిజెపి  వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది. బీజేపీకి కర్నాటకలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అత్యవసరం. ఎందుకంటే కర్నాటక ఫలితం యితర రాష్ట్రాలపై కచ్చితంగా పడుతుందన్నది పరిశీలకుల అంచనాయే కాకుండా బీజేపీ భావన కూడా. ఒక వేళ కర్ణాటకలో అధికారాన్ని కోల్పోతే ఇక దక్షిణాదిన  అడుగుపెట్టే  అవకాశాలు ఆ పార్టీకి దాదాపుగా మృగ్యమౌతాయి.  అలాగే ఉత్తరాది పార్టీగానే  బీజేపీ గుర్తింపు కొనసాగుతుంది. ఆ కారణంగానే బీజేపీ అగ్రనేతలు కర్ణాటక ఎన్నికలను అత్యంత  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.  దక్షిణాదిన తమ ప్రాబల్యం తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బిజెపి నేతలు పార్టీలో చేరికలకు తలుపులు బార్లా తెరిచేశారు.  కేరళలో ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్‌ కె ఆంటోనీ, తమిళనాడులో చక్రవర్తి రాజగోపాలాచారి మనుమడు సిఆర్‌ కేశవన్‌, ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా దక్షిణాదిలో తమకు ఇంకా ఉనికి ఉన్నదని చెప్పేందుకు బిజెపి అగ్రనేతలు తంటాలు పడుతున్నారు. తాను డిమాండ్‌ చేసిన విధంగా సీట్లు కేటాయించేందుకు అధిష్ఠానం అంగీకరించకపోవడంతో  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసంతృప్తి తో ఉన్నారు. కర్ణాటక బిజెపిలో అధికార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన అధికార కేంద్రమైన యడ్యూరప్ప పట్టు నుంచి బిజెపిని తప్పించేందుకు ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ సఫలీకృతమైయ్యాయనన సంగతి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు సఫలమయ్యాయన్నది తేలిపోతుంది. వెూడీ, అమిత్‌ షా కర్ణాటక రాజకీయాలను శాసించాలను కున్నా, శాసించగల పరిస్థితిలో లేరని స్థానిక రాజకీయాలు తెలిసిన వారు అంటున్నారు. కర్ణాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి మరో నేతకు అప్పగించడంలో వెూడీ, షాలు విజయం సాధించగలిగారు కాని పార్టీకి విజయం దిశగా నడిపించగలిగిన  మరో నాయకుడిని అయితే వారు గుర్తించలేకపోయారు. అలాగే యడ్యూరప్ప ఆధిపత్యాన్ని తగ్గించడంలో విఫలమయ్యారు. తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఫిబ్రవరిలో తన 80వ జన్మదినం సందర్భంగా యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రకటించారు. అయినప్పటికీ యడ్యూరప్పను విస్మరించి బిజెపి అధిష్ఠానం కర్ణాటకలో రాజకీయాలు చేయగలిగిన పరిస్థితిలో లేదు. ఉత్తరాదిన చక్రం తిప్పినట్లు దక్షిణాదిన చక్రం తిప్పడం అంత సులభం కాదని వెూదీ, షా లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నిజానికి ఉత్తరాదిన కూడా యోగి ఆదిత్యనాథ్‌, వసుంధరా రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ల ఆధిపత్యాన్ని వారు తగ్గించలేకపోతున్నారు. స్థానికంగా ఉన్న సెంటిమెంట్‌ను గౌరవించడం లేదు. అవినీతి నేతలను దూరం పెట్టడంలోనూ విఫలమయ్యారు. అయితే యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆలస్యంగా అయినా గుర్తించిన నేతలు.. ఎన్నికల తర్వాత యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న వాగ్దానంతో అమిత్‌ షా శాంతిప చేశారని ప్రచారం సాగుతోంది. మిగతా రాష్టాల్లో 75 ఏళ్లు దాటిన నేతల్ని ప్రక్కన పెట్టగలిగిన వెూడీ, షాలు కర్ణాటకలో యడ్యూరప్ప విషయంలో అంత సాహసం చేయలేకపోయారు. ఢిల్లీ ప్రమేయం లేకుండా తన కుమారుడికి, ఇతరులకు యడ్యూరప్ప సీట్లు ప్రకటించే స్థితిని అడ్డుకోవడానికి అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది. గత లోకసేభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ లాంటి నేతలు సైతం వెూడీ హవాలో ఓడిపోయారు. ఈ గెలుపులో యడ్యూరప్ప పాత్ర కన్నా వెూడీ పాత్రే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అంతకు ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పకు స్వేచ్ఛ నిచ్చినప్పటికీ, సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనపడినప్పటికీ బిజెపి మెజారిటీ సీట్లను సాధించలేకపోయింది. అయినప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ద్వారా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. యడ్యూరప్ప కాలంలో జరిగిన అవినీతి, ఆయనపై ఉన్న కేసుల గురించి తెలిసినా ఢిల్లీ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. అరాచక, అవినీతి పాలనను అరికట్టలేక పోయారు. కర్ణాటకలో వారసత్వ రాజకీయాలను, ఘోరంగా విస్తరించిన అవినీతిని అదుపు చేయలేని ప్రధానమంత్రి నరేంద్రవెూడీ తెలంగాణ వంటి ఇతర రాష్టాలకు వెళ్లి వారసత్వ పాలనను, అవినీతిని విమర్శించడాన్ని జనం గుర్తించడం లేదని భావించడం కమలనాథులు చేస్తున్న పొరపాటుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో తొమ్మిది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నా బిజెపికి దక్షిణాది నాడి తెలియదని చెప్పేందుకు మాత్రమే ఈ చేరికలు దోహదం చేస్తాయి.  బిజెపిలో చేరుతున్న వారిని, బిజెపి భావజాలాన్ని అభిమానిస్తున్న వారిని చూస్తుంటే రాజకీయాల్లో సైద్దాంతిక దృక్పథం కన్నా అవకాశవాదం, స్వప్రయోజనాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.  

ఇందిరమ్మను తలపించిన ప్రియాంక గాంధీ

ప్రియాంక వాద్రా తెలంగాణ పర్యటన విజయవంతమైంది. ఆమె మాట, ఆమె తీరు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని తలపించాయి. ప్రియాంక ప్రసంగం యావత్తూ సూటిగా సుత్తి లేకుండా సాగింది. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, తప్పిదాలను నిర్మొహమాటంగా ఎండగట్టారు. సోమవారం (మే 8) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు ప్రియాంక వాద్రా హాజరయ్యారు. ఆమె తన ప్రసంగాన్ని జై బోలో తెలంగాణ అంటూ ఆరంభించారు.   ఎండలు మండి పోతున్నా సభకు ప్రేమాభిమానాలతో సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు అని మొదలు పెట్టారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతా చారిని ప్రస్తావించి కీర్తించారు.  మిత్రులారా అంటూ తెలుగులో సంబోధించారు.  తెలంగాణ సాకారం కోసం అమరవీరులు, విద్యార్థుల త్యాగాలు ఎనలేనివని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇక్కడివారు ఉద్యమించారని తెలిపారు. ఈ సభలో ప్రియాంక కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.యువత బలిదానాల వల్లే తెలంగాణ సాకారమైందన్నారు. దేశం కోసం తన కుటుంబం కూడా త్యాగాలు చేఃసిందని చెప్పారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని చెప్పారు.  తమ కుటుంబానికి త్యాగాల విలువ తెలుసు అని ఆమె అన్నారు.  తెలంగాణ కోసం వేలాది మంది బలిదానం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వారి త్యాగాలను ఏ మాత్రం గుర్తించడం లేదు అని ఆమె అన్నారు. ఇక తన తల్లి సోనియా తెలంగాణ ఇచ్చారనీ, సోనియా గాంధీ అధికారం కోరుకోకుండా తెలంగాణా ఇచ్చారని అన్నారు.    సోనియా గాంధీకి తెలంగాణా పట్ల ఉన్న ప్రేమ అభిమానానికి ఇది నిదర్శనం అని అన్నారు.అందుకే ఆమెను ఇక్కడి వారు తల్లిగా భావిస్తున్నారనీ గుర్తు చేసుకున్నారు. అత్యంత కఠినమైన తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకుని సోనియా తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశారని ప్రియాంక వాద్రా చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుత కేసీఆర్ హయాంలో జాగీర్దార్ల పాలన సాగుతోందని విమర్శించారు.  ఇంటింటికీ ఉద్యోగం అన్న హామీని నెరవేర్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కాదని ప్రియాంకా వాద్రా అన్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. ఉద్యోగాల కల్పన అటకెక్కించారు... నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదంటూ విరుచుకుపడ్డారు.   రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పాటు కావడంలేదు కానీ, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులను దోచుకుంటున్నారని విమర్శించారు. జనం తనను నానమ్మ ఇందిరలా ఉన్నావంటున్నారనీ, ఆ మాటలు నాలో బాధ్యతను పెంచుతున్నాయనీ అన్నారు.  తెలంగాణ ప్రజలు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని చెప్పారు. ఈ సభలో ఆమె యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పిన ప్రియాంక గాంధీ.. అలా నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను పక్కన పెట్టేయండి.. తనతో ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరినీ నిలదీయండి అని ప్రియాంకా గాంధీ అన్నారు.  ఉద్యోగ నియామకాల కోసం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి అందిస్తాం, యువతీయువకుల కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామన్నారు. తెలంగాణా అన్నది నేల కాదని తల్లి అని ఆమె అన్నారు. తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చూసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రియాంకా గాంధీ అన్నారు. తాను ఇందిరమ్మ మనవరాలిననీ తప్పుడు హామీలు ఇవ్వనని  ప్రియాంక గాంధీ అన్నారు.  తన ప్రసంగంలో అనేకసార్లు ఇందిరమ్మను ప్రియాంక తలచుకున్నారు. ప్రియాంక ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన వచ్చింది.   మొత్తం మీద ప్రియాంక వాద్రా హైదరాబాద్ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.