రాజ్య‌స‌భ ‘చైర్’లో విజ‌య‌సాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కొత్త అవ‌తారం ఎత్తారు. ప్ర‌స్తుత పార్ల‌మెంటు సమావేశాల్లో ఆయ‌న రాజ్య‌స‌భ స్పీక‌ర్ వెంక‌య్య‌నాయుడు, డిప్యూటీస్పీక‌ర్ రాజ్య‌స‌భ స‌మావేశానికి  అందుబాటులో లేకపోవడంతో ఆ   స్థానాన్ని విజయసాయి రెడ్డి భ‌ర్తీ చేశారు. సాధారణంగా ఉప‌ రాష్ట్ర‌ప‌తే పెద్ద‌ల‌స‌భ స్పీక‌ర్‌గా ఉంటారు. ఆయ‌న లేని స‌మ‌యంలో డిప్యూటీ చైర్మన్  ఆ బాధ్య‌త‌లు నిర్వహిస్తారు.  కానీ   రాజ్య‌స‌భ స‌మావేశానికి స్పీక‌ర్‌, డిప్యూటీ ఇద్ద‌రూ అందుబాటులో లేకపోవడంతో  ఆ అవ‌కాశం అనూహ్యంగా  విజ‌య‌సాయిరెడ్డికి వ‌చ్చింది.  చైర్ లో విజయసాయి కూర్చున్న సమయంలో  విప‌క్ష నేత మ‌ల్లికార్జ‌న్ ఖ‌ర్గే మాట్లాడుతూ  ఒక ఎంపీనైన తనను పార్లమెంటు సెషన్ జరుగుతుండగా ఈడీ విచారణకు పిలిచిందనీ, ఇదేమి నైతికత అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  ఈడీ  స్వంతంత్ర‌ వ్య‌వ‌స్థ అనీ  ఎవరైనా సరే ఈడీ ఆదేశాలనుపాటించాల్సిందేననీ పేర్కొన్నారు.  అయితే గోయెల్ సమాధానం పట్ల విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. చైర్ లో కూర్చున్న విజయసాయి సభను నియంత్రించడంలో చాలా ఇబ్బంది పడ్డారు.   

చుండూరులో చ‌ర్చ‌కు సిద్ధ‌మా.. రాజ‌గోపాల్‌కు రేవంత్ స‌వాలు

 ప్ర‌స్తుతం కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య మునుగోడు రాజేసిన చిచ్చు మ‌రింత ర‌స‌వ‌త్త‌రం అవుతోంది.  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాజ‌గోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచ‌న చేరడంతో  కాంగ్రెస్‌లో ఆయ‌న ప‌ట్ల సీరియ‌స్‌గానే విమ‌ర్శ‌లు, చ‌ర్చ‌కు స‌వాళ్లు వచ్చాయి. ఇపుడు తాజాగా టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డితో ఎలాంటి చ‌ర్చ‌క‌యినా సిద్ధ‌మ‌ని స‌వాలు చేయ డం గ‌మ‌నార్హం. చుండూరు చౌరాస్తా వేదిక‌గా బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని, రాజ‌గోపాల్ రెడ్డి చ‌రిత్ర ను బ‌య‌ట‌పెట్ట‌గ‌ల‌న‌ని రేవంత్ స‌వాలు విసిరారు. రాజ‌గోపాల్ రెడ్డి కేవ‌లం త‌న ఆర్ధిక ప్ర‌యోజ‌నాల‌ను ఆశించే కాంగ్రెస్‌ను వ‌దిలి బీజేపీలోకి వెళ్లార‌ని రేవంత్ మీడియాతో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి పార్టీ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి సార‌ధ్యం వ‌హిస్తార‌ని తెలిపారు. రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు బీజేపీ అభ్య‌ర్ధిగా గెల‌వ‌డానికి అవ‌కాశాల గురించి మ‌రోవంక బీజేపీ సీనియ‌ర్లు సందిగ్ధంలో పడ్డారు. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ, ఆయ‌న వెంక‌ట‌రెడ్డి సోద‌రునిగా కాంగ్రెస్ వ్య‌తిరేకంగా పోటీకి నిలిస్తే ప్ర‌జ‌లు ఏమేర‌కు అంగీక‌రిస్తార‌న్నది బీజేపీ నాయ‌కుల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మ‌రోవంక మునుగోడును కాంగ్రెస్‌తోపాటు ఇటు టీఆర్ ఎస్ కూడా  కీల‌కంగా తీసుకుంది. కోమ‌టిరెడ్డి సోద‌రు లు మ‌నుగోడుపై పట్టు   కోల్పోయే విధంగా టీఆర్ ఎస్ గ‌ట్టి అభ్య‌ర్ధితో కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాల‌ని  వ్యూహాత్మ‌కంగా  అడుగులు వేస్తోంది.  కాగా కాంగ్రెస్‌లో త‌లెత్తిన కోమ‌టిరెడ్డి సోద‌రుల స‌మ‌స్య మ‌రింత ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశాలున్నాయ‌న్నది విశ్లేష‌కుల మాట‌. ఏమ‌యిన‌ప్ప‌టికీ స‌వాలు, ప్ర‌తి స‌వాలు తో రేవంత్ రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడుకు మరింత ప్రాధాన్యత తీసుకువచ్చారని పరిశీలకులు అంటున్నారు.  

ఏపీ టోల్ ప్రాజెక్టులు అదానీ వ‌శం

అదానీ గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ల్లో 972 కిలోమీటర్ల పొడవైన నాలుగు టోల్‌వే ప్రాజెక్టులను రూ.3,110 కోట్లతో కొనుగోలు చేస్తోంది. మక్వారీ ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ అనుబంధ సంస్థలైన.. గుజరాత్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ లిమిటెడ్‌ (జీఆర్‌ఐసీఎల్‌), స్వర్ణ టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌టీపీఎల్‌) నుంచి అదానీ గ్రూప్‌ ఈ నాలుగు టోల్‌వేలను కొనుగోలు చేస్తోంది. ఇందు లో ఎస్‌టీపీ ఎల్‌కు ఆంధ్రప్రదేశ్ లోని రెండు టోల్‌వే ప్రాజెక్టు ల్లో నూరు శాతం వాటా ఉంది.    ఆంధ్రప్రదేశ్‌లోని తడ-నెల్లూరు (110 కిలోమీటర్లు), నందిగామ-ఇబ్రహీంపట్నం-విజయవాడ (48 కిలోమీ టర్లు) ప్రాజెక్టులు అదానీ గ్రూప్‌నకు మరింత కీలకం కానున్నాయి.  రాష్ట్రంలోని ప్రధాన టోల్‌వే ప్రాజెక్టు లను చేజిక్కించుకుంది. ఈ 110 కిలోమీటర్ల పొడవైన టోల్‌వేలో మొత్తం మూడు టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. కృష్ణపట్నం రేవుకు వచ్చిపోయే వాహనాలతో పాటు ఏపీ నుంచి చెన్నై వచ్చిపోయే వాహ నాలతో ఈ రహదారి  టోల్‌వే ద్వారా వెళ్లే వాహనాల టోల్‌ కలెక్షన్లూ ఇక అదానీ గ్రూప్‌ ఖాతాలో పడ నున్నాయి. దక్షిణ భారత్‌లోని ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానం చేసే విజయవాడ సమీపంలోని నంది గామ-ఇబ్రహీంపట్నం-విజయవాడ టోల్‌ప్రాజెక్ట్‌ ద్వారానూ అదానీ గ్రూప్‌నకు మంచి ఆదాయమే వస్తుందని భావిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16) ట్రాఫిక్‌కు ప్రధాన ఊతం. రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతి లభిస్తే వచ్చే నెలాఖరు కల్లా ఏపీ, గుజరాత్‌ల్లోని ఈ నాలుగు టోల్‌వేలు అదానీ గ్రూప్‌ చేతికి వస్తాయి. 

దొంగ ఓట్ల కోసమే జగన్ వలంటీర్లు .. జ్యోతుల నెహ్రూ

వలంటీర్లపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచీ తెలుగు దేశం శ్రేణులు చెబుతున్న మాటలనే జ్యోతుల నెహ్రూ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం విజయం ఖాయమనీ, అయతే వలంటీర్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలనీ హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో వలంటీర్ల దొంగ ఓట్లేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం కార్యకర్తలను హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఆయమ మాట్లాడారు. జగన్ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వలంటీర్లను నియమించినదే ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయడానికీ, వారితో దొంగ ఓట్లు వేయించుకోవడానికీ అని ఆరోపించారు.   రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం మొదలైందన్న నెహ్రూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్టీ కార్యకర్తలు ఎవరూ అతి ధీమాతో ఉదాశీనంగా ఉండొద్దని హెచ్చరించారు. వలంటీర్లు దొంగ ఓట్లు వేయకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. వలంటీర్లపై తెలుగుదేశం కార్యకర్తలు ఓకన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ రాష్ట్రంలో ప్రజలందరిపై నిఘా ఉంచి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయరనుకునే వారిని ఓట్లేయనీయకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నదని జ్యోతుల నెహ్రూ అన్నారు. వలంటీర్లతో దొంగ ఓట్లు వేయించే ప్రమాదం ఉందన్నారు. దీనిని అడ్డుకోవడానికి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. అలాగే మరింత జోరుగా పార్టీ సభ్యత్వం చేయించాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. 

విజ‌య‌సాయి పై క‌ఠిన చ‌ర్య‌లకు వ‌ర్ల డిమాండ్‌

సామాజిక‌మాధ్య‌మాల‌ను అడ్డుపెట్టుకుని తెలుగు దేశం నాయ‌కుల‌పై  వైసీపీ నాయ‌కులు త‌ప్పుడు ప్ర‌చా రం చేస్తున్నార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య మండిప‌డ్డారు. వైసీపీ నేత‌లు గుర్రంపాటి దేవేంద‌ ర్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి ల‌పై సీఐడీ ఏడీజికి వ‌ర్ల ఫిర్యాదు చేశారు.  ఎన్టీఆర్ కుమార్తె మ‌ర‌ణాన్ని అనుమానిస్తూ వైసీపీ నేత‌లు టీడీపీ యువ‌నేత నారా లోకేష్‌పై  చేసిన ప్ర‌చా రం దారుణ‌మ‌న్నారు. ఏపీ అట‌వీ అభివృద్ధి కార్పోరేష‌న్ చైర్మ‌న్ హోదాలో ఉన్న వ్య‌క్తం ఆ విధంగా విమ ర్శ‌లు చేయ‌డం ప‌ట్ల వ‌ర్ల మండిప‌డ్డారు. వైసీపీవి అన్నీ త‌ప్పుడు ప్ర‌చారాల‌ని, వాటిలో వాస్త‌వ‌మే లేద‌ని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో దేవేంధర్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవన్నారు.  ఈ విధంగా త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్న దేవేంద్ర‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిల‌పై క‌ఠ‌న చర్య‌లు తీసుకో వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌మ నాయ‌కుల‌పై హ‌త్యారాజ‌కీయాలు అంట‌గ‌డుతున్నా ర‌ని ఆరోపిస్తూ న‌క్కా ఆనంద‌బాబ‌, ఆల‌పాటి రాజా, అశోక్ బాబు మంగ‌ళ‌గిరి రూర‌ల్ సీఐని సంప్ర‌దించ‌గా ఆయ‌న బాధ్య‌తా రాహి త్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల కూడా వ‌ర్ల మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నార‌న్నారు. 

చ‌రిత్ర సృష్టించిన పూజాఓజా

భారత పారా కనోయింగ్‌ అథ్లెట్‌ పూజా ఓజా సరికొత్త చరిత్ర సృష్టించింది. కెనడాలో జరిగిన ఐసీఎఫ్‌ కనోయి స్ప్రింట్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో రజతం సాధించి.. ఈ టోర్నీలో పతకం గెలిచిన తొలి భారత పారా అథ్లెట్‌గా రికార్డు కెక్కింది. మహిళల వీఎల్‌1 200 మీటర్ల ఫైనల్లో పూజ 1:34.18 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. కామన్వెల్త్‌ హాకీ లో ఇప్పటికే మహిళలు సెమీస్‌ చేరగా, పురుషుల జట్టు కూడా ఫైనల్‌కు చేరువ‌లో నిలి చింది. పూల్‌-బిలో భాగంగా గురువారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 4-1తో వేల్స్‌ జట్టును ఓడిం చింది. దీంతో తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచి భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. హర్మన్‌ప్రీత్‌ (19వ, 20వ, 40వ) హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగగా.. మరో గోల్‌ను గుర్జాంత్‌ సింగ్‌ (49వ) చేశాడు. వేల్స్‌ తరఫున ఏకైక గోల్‌ను గారెత్‌ ఫర్లాంగ్‌ (55వ) కొట్టాడు.  బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో సింధు, శ్రీకాంత్‌ బోణీబ్యాడ్మింటన్‌ మిక్స్ డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజతం సాధించిన  షట్లర్లు సింగిల్స్‌లో తమ సత్తా చాటారు. పీవీ సింధు, కిడాం బి శ్రీకాంత్‌ ఆరంభ రౌండ్లను అధిగమించి ప్రీ క్వార్టర్స్‌ చేరారు. మహిళల సింగిల్స్‌లో సింధు 21-4, 21-11తో ఫాతిమా (మాల్దీవులు)పై, పురుషుల సిం గిల్స్ లో శ్రీకాంత్‌ 21-9, 21-9తో డానియెల్‌ (ఉగాండ)పై గెలిచారు. స్క్వాష్‌ మిక్స్‌డ్‌ క్వార్టర్స్‌కు పళ్లికల్‌ జోడీ స్క్వాష్‌ సింగిల్స్‌ పోటీలకు దూరంగా ఉన్న స్టార్‌ దీపికా పళ్లికల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పతకం బాట‌లో ఉంది. ఈ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రీక్వార్టర్స్‌లో పళ్లికల్‌/సౌరవ్‌ ఘోషల్ జంట‌ 11-8, 11-4తో వేల్స్‌ జంట ఎమిలీ, పీటర్‌ క్రీడ్‌ను చిత్తుచేసింది.  మిక్స్‌డ్‌లో మరో జోడీ జోష్న చినప్ప/హరిందర్‌పాల్‌ సంధు 8-11, 9-11తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో టీనేజర్‌ అనహత్‌ సింగ్‌/సునయన కురువిల్లా జోడీ 11-9, 11-4తో శ్రీలంక ద్వయం యెహెని/చనిత్మపై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరింది.  టేబుల్ టెన్నిస్ శరత్‌, శ్రీజ లు శుభారంభం టీటీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ రౌండ్‌-32లో భారత జోడీ ఆచంట శరత్‌ కమల్‌/ఆకుల శ్రీజ 3-0తో ఓవెన్‌/సోఫీ (నార్తర్న్‌ ఐలాండ్‌)పై నెగ్గిం ది. మహిళల సింగిల్స్‌ రౌండ్‌-32లో రీత్‌ టెన్నిసన్‌ 4-1తో చార్లొటే (ఇంగ్లండ్‌)పై, శ్రీజ 4-1తో కారెన్‌ లిన్‌ (మలేసియా)పై గెలుపొందారు.  

ఉప రాష్ట్రపతి ఎన్నికలో అల్వాకే టీఆర్ఎస్ మద్దతు

ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ ఎంపీలు అందరూ మార్గరెట్ అల్వాకు ఓటు వేయాలని ఆదేశించారు. దీనితో ఉప రాష్ట్రపతి ఎన్నికలో టీఆర్ఎస్ ఎటువైపు అన్న సందిగ్ధతకు తెరపడింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ కు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం గత కొద్ది కాలంగా సాగుతున్న సంగతి విదితమే.  ఇప్పడు ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. కాగా తెరాస మార్గరెట్ అల్వాకు మద్దతు పలుకుతోందనీ, టీఆర్ఎస్ ఎంపీలంతా మార్గరెట్ అల్వాకే ఓటు వేస్తారంటూ కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు ప్రకటన విడుదల చేశారు. ఇలా ఉండగా కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష విషయంలో ఎటువైపు నుంచీ సానుకూలత వ్యక్తం కాని నేపథ్యంలో కేసీఆర్ అనివార్యంగా కాంగ్రెస్ కు చేరువ కావాలని ప్రయత్నిస్తున్న పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ స్పీడు పెంచడం. వరుస ఉప ఎన్నికలతో తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలంటే కాంగ్రెస్ తో కలిసి నడవడమే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే నిన్న రాష్ట్రపతి ఎన్నిక విషయంలోనూ, ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలోనూ కేసీఆర్ కాంగ్రెస్ కు అనుకూల వైఖరి తీసుకున్నారంటున్నారు. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలోనూ టీఆర్ఎస్ ఎంపీలు పాలు పంచుకోవడాన్ని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. చేశారు.

త‌దుప‌రి సీజేఐ యు.యు.ల‌లిత్‌

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా త‌ద‌నంత‌రం చేప‌ట్ట‌డానికి త‌గిన వ్య‌క్తిగా న్యాయ‌మూర్తి ఉద‌య్ ఉమేష్‌ ల‌లిత్ పేరును కేంద్ర న్యాయ‌శాఖ మంత్రికి సీజేఐ ఎన్‌.వి.ర‌మ‌ణ ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం త‌న ప్ర‌తిపాద‌న‌తో కూడిన లేఖ‌ను కేంద్ర మంత్రికి ఎన్‌.వి.ర‌మ‌ణ అంద‌చేశార‌ని సుప్రీం కోర్టు స‌మాచారం. ఆగ‌ష్టు 26వ తేదీన ర‌మ‌ణ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.  న్యాయశాఖ ఆ లేఖను ప్రధానమంత్రి  ఆమోదముద్ర పడితే.. ఆ ప్రతిపాదన రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్ర పతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌ బాధ్యతలు చేపడతారు.  రిటైర్‌ కానున్న సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయ మూర్తి పేరును సిఫారసు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తర్వాత జస్టిస్‌ యు.యు.లలిత్‌ సీనియర్‌గా ఉన్నారు. దేశంలోనే తీవ్రసంచలనం సృష్టించిన ట్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువ రించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ లలిత్‌ ఉన్నారు జస్టిస్‌ లలిత్‌ ఆగస్టు 27న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే, ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే(74 రోజులు) ముగుస్తుంది. నవంబరు 8న ఆయన రిటైర్‌ అవుతారు.

మహిళ ట్రాక్టర్ నడిపితే గ్రామ బహిష్కారమా?

ఆకాసంలో సగం.. అవకాశాలలో సగం అంటూ మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటికీ మహిళలపై వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. తాము వంటిళ్లకే పరిమితం కాదనీ, హద్దులు, సరిహద్దులూ లేకుండా మగవారితో సమానంగా అంతరిక్షంలోకి సైతం దూసుకుపోగలమని మహిళలు పదే పదే నిరూపిస్తున్నా.. ఇంకా వివక్ష భూతంలా వారిని వెంటాడుతూనే ఉంది.  అటువంటి వివక్షతో ఓ అమ్మాయికి గ్రామ బహిష్కరణ విక్ష విధించింది. ఇంతకీ విషయమేమిటంటే..కుటుంబాన్ని పోషించే బాధ్యతను భుజానికెత్తుకున్న ఓ 22 ఏళ్ల అమ్మాయి, వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. సొంతంగా ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయ పనులు చేసుకుంటోంది. అయితే అమ్మాయేమిటి.. ట్రాక్టర్ నడపడమేమిటన్న మగ దురహంకారం ఆమెకు గ్రామ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ సంఘటన జార్ఖండ్ లోని శివనాథ్ పురంలో జరిగింది.  మంజూ ఒరాన్ అనే యువతి తల్లిదండ్రులు సోదరులతో కలిసి జీవిస్తోంది. ఆమె బిఏ మొదటి సంవత్సరం చదువుతోంది. వారికి ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబం గడవడానికి సరిపోవడం లేదు. దీంతో మరో పదెకరాలు కౌలుకు తీసుకున్నారు. వ్యవసాయ పనుల కోసం ఆ కుటుంబం ట్రాక్టర్ కొనుగోలు చేసింది. మంజు కూడా కుటుంబ బాధ్యతలలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో ట్రాక్టర్ నడపడం నేర్చుకుని స్వయంగా పొలం దున్నుతోంది. అయితే దీనిని జీర్ణించుకోలేని కొందరు గ్రామస్థులు.. ఆడపిల్లలు ట్రాక్టర్ నడిపితే గ్రామానికి అరిష్టం అంటూ అడ్డుకున్నారు. అయితే వారిని లెక్క చేయని మంజు కుటుంబం ట్రాక్టర్ తో పొలంపనులు చేయడం మానలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆమెను గ్రామం నుంచి బహిష్కరించడమే కాకుండా జరిమానా కూడా విధించారు. అయితే గ్రామ పంచాయతీ తీర్పును ఖాతరు చేయని మంజు వారిని ఎదిరించింది. న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడింది.

అనారీ పాట .. కిలీ నోట‌!

కిసీ కి ముస్కురాహ‌టోంపే..అనారీ సినిమాలో పాట‌.. ఓ అద్భుతం. పాట వింటూంటే అలా ముఖేష్ గ‌ళం అలా మాయ‌చేస్తుంది. అస‌లు అనారీ పాట‌లే ఓ మాయ‌చేస్తాయి. ఆ మాట‌కు వ‌స్తే పాత పాట‌, పెద్ద‌ల మాట ఎప్ప‌టికీ బంగార‌మే. మంచిపాట‌, మంచి ట్యూన్ తో ఉన్న‌ది ఖండాంత‌రాల‌కీ వెళుతుంది.  కిలీ పాల్ ఈ పాట‌కు లిప్ సింక్ ఇచ్చి ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో మిలియ‌న్ల‌మంది అభిమానుల‌ను సంపాదించా డు. రాజ్‌కపూర్ న‌టించిన సినిమా అనారీలో ఆ  పాట‌ అత‌న్ని అంత‌గా ఆక‌ట్టుకుంది. వెంట‌నే దాన్ని కూనిరాగం నుంచి మెల్ల‌గా అదే ట్యూన్ కి లిప్ సింక్ ఇస్తూ పాత హిందీ సినిమా పాట మీద వీరాభిమానాన్ని ప్ర‌క‌టించాడు. అనురాగ్ క‌శ్య‌ప్‌, రిచా చ‌ద్దా వంటి సెల‌బ్రిటీలు కూడా కిలీ కి ఫిదా అయ్యారు.  పాత బంగారం పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ల‌క్ష‌మందికి పైగా నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న పాట‌కు శంక‌ర్ జైకిష‌న్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ముఖేష్ పాడారు. ఇలా మ‌రిన్ని పాడి వినిపించాల‌ని, మేమంతా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాం, భార‌త్ ఒక్క‌సారి వ‌చ్చిపోరాదా.. అంటూ  ఇపుడు నెటిజ‌న్లు కిలీకి మెసేజ్‌ల వ‌ర‌ద వ‌చ్చి ప‌డుతోంది.  గ‌తంలో టాంజానియా లో భార‌త హైక‌మీష‌న‌ర్ కార్యాల‌యం కిలీని స‌త్క‌రించింది. కిలీకి భార‌త్ ప‌ట్ల ఎంతో అభిమాన‌మ‌ని, భార‌తీయ సంస్కృతీ, సంగీత‌మ‌న్నా ఎంతో గౌర‌వ‌మ‌ని చెబుతూ ఆ కార్యాల‌యం ఆయ‌న‌కు  అవార్డు ప్ర‌దానం చేసింది. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌మ మ‌న్ కీ బాత్‌లోనూ కిలీ భార‌త అభిమానాన్ని ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.

పొత్తుపై వ్యూహాత్మ మౌనం- బాబు, పవన్ లలో ఫుల్ క్లారిటీ?

జోరు వానలు కురుస్తున్న సమయంలో కూడా ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఏపీలో మాత్రం రాజకీయ వేడి రోహిణీకార్తెను మించిపోయింది. అధికార విపక్షాలు రెండూ స్పీడ్ పెంచేశాయి. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ, వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రావాలని తెలుగుదేశం పట్టుదలతో ఉన్నాయి. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని తెలుగుదేశం విశ్వసిస్తోంది. జగన్ ఆర్థిక అరాచకత్వం, ఏ వర్గానికీ మేలు చేయని విధానాలు, అమరావతి నిర్వీర్యం. అప్పుల కుప్పలా రాష్ట్రాన్ని మార్చేసిన తీరుతో జనం వైసీపీ సర్కార్ అంటే విముఖతతో ఉన్నారని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఇక మరో పార్టీ జనసేన పార్టీ అధినేత వ్యూహాలేమిటో ఆయనకైనా తెలుసా అన్న అనుమానాలను సామాన్యులే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ సందర్బమూ లేకుండానే రాష్ట్రంలో విపక్ష ఓట్లను చీలనీయను అంటూ పొత్తల చర్చకు తెరతీసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో సొంతంగా బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇక రాష్ట్రంలో ఎన్నికల యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. చంద్రబాబు ఇప్పటికే జిల్లాల పర్యటనల్లో బిజీగా ఉండగా, ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నవంబర్ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. పవన్ కల్యాణ్ అయితే అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. అయితే పరిశీలకులు మాత్రం తెలుగుదేశం, జనసేన పార్టీలు పక్కా వ్యూహంతోనే ముందుకు సాగుతున్నాయనీ, వేటికి అవిగా ఎన్నికల రణరంగంలోనికి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు చేస్తున్నా,  ఏ పార్టీ కార్యక్రమాలు ఆ పార్టీ వేర్వేరుగా నిర్వహిస్తున్నా.. అంతిమంగా ఎన్నికల నాటికి రెండు పార్టీలూ పొత్తు పొడుపుతోనే ముందుకు సాగుతాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికిప్పుడే పొత్తుల ప్రకటనతో ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుందని ఇరు పార్టీలూ భావిస్తున్నాయని పేర్కొంటున్నారు. టికేట్ ఆశావహులలో పొత్తుల ప్రకటనతో నిరాశ, అసంతృప్తి ప్రబలే అవకాశం ఉందని, అది వారు వైసీపీ బాట పట్టేలా చేస్తుందని ఇరు పార్టీలూ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.  అందువల్లనే ఇరు పార్టీలూ కూడా పొత్తు మాటే ఎత్తకుండా గుట్టుగా, గుంభనంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలించి చూస్తే మాత్రం తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళితే ఇక వైసీపీ పని అయిపోయినట్లునని వివరిస్తున్నారు. జనసేన, తెలుగుదేశం పొత్తు పొడిస్తే ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకూ వైసీసీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం ఉండదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా వైసీసీకి సీట్లు, ఓట్లు కూడా గణనీయంగా తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఇరువురూ కూడా ఏపీలో మరోసారి అధికారంలోకి వైసీపీ రాకూడదు అన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆ లక్ష్యం నెరవేరాలంటే విడివిడిగా కాక.. కలిసికట్టుగా ఉండాలన్న విషయంలో ఇరువురు నేతలకూ పూర్తి క్లారిటీ ఉందని కూడా చేబుతున్నారు. అందుకే తెలుగుదేశం, జనసేనలు వేటికవిగా ఉంటూనూ పరస్పర విమర్శలకు తావీయకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని చెబుతున్నారు.  ఇక చాలా కాలం నుంచే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద పరిశీలకుల అంచనా మేరకు జనసేన పార్టీ పైకి ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీతో పొత్తుకే మొగ్గు చూపుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా జనసేన రాష్ట్రంలో సొంత బలం పెంచుకోవడానికి ప్రయత్నించడాన్ని పొత్తులకు వ్యతిరేకంగా సాగుతోందని భావించలేమని పేర్కొంటున్నారు. పొత్తుకు ఒకరి బలం మరొకరికి శక్తిగా మారుతుందని ఇరు పార్టీల అధినేతలూ భావిస్తున్నాయని పేర్కొంటున్నారు.

కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ

జనాన్ని కలుసుకుంటే నిరసనలు ఎదుర్కొనవలసి వస్తుందని భావిస్తున్న జగన్ జనంలోకి వెళ్లడం కంటే పార్టీ కార్యకర్తలను తన వద్దకు పిలిపించుకుని వారిని ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీ గెలుపునకు కెటలిస్టులుగా మార్చాలని యోచిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలకు శ్రీకారం చుట్టారు.   ఆయన కుప్పం కార్యకర్తలతోనే ఆయన ఈ భేటీలకు శ్రీకారం చుట్టారు. విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలను ఆయన తాడేపల్లి సీఎం కార్యాలయానికి పిలిపించుకుని వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. తెలుగుదేశం అధినేత సొంత నియోజకవర్గంలో ఆయనను ఓడించగలిగితే.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ అన్న లక్ష్యం సునాయసంగా సాధించగలమని జగన్ కార్యకర్తలకు తెలిపారు. స్థానిక ఎన్నికలలో కుప్పంలో వైసీపీ విజయంతో అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు ఓటమికి బీజాలు పడ్డాయని జగన్ వారితో అన్నారు. అదే ఉత్సాహంతో ముందుకు సాగి అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి పరాభవం ఎదురయ్యేలా చూడాలని పిలుపు నిచ్చారు. మరో సారి వచ్చే ఎన్నికలలో 175కు 175స్థానాలలోనూ మనదే విజయం అంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. గడపగడపకూ మన ప్రభుత్వం వైఫల్యం, మంత్రల బస్సుయాత్రకు ఎదురైన పరాభవం వీటిని వేటినీ ఆయన కనీసం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ సమస్యలే లేవని, జనం అంతా వైసీపీవైపే ఉన్నారనీ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నమే తప్ప, నియోజకవర్గ సమస్యల పరిష్కారం, జనాలను ఆకర్షించేందుకు తీసుకోవలసిన చర్యలు కానీ, హామీల అమలులో వైఫల్యాలు గానీ ఈ భేటీలో ఏ మాత్రం ప్రస్తావనకు రాలేదు. మనం గెలుస్తున్నాం.. గెలవాలంతే అన్న ధోరణిలోనే కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ సాగిందని విశ్వసనీయంగా తెలిసింది. 

భ‌య‌ప‌డం.. పారిపోము .. రాహుల్‌

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఈడీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ తాను మోదీ ప్ర‌భుత్వానికి ఏమాత్రం భ‌య‌ప‌డ‌టం లేద‌న్నారు. ఆయ‌న ఏది చేయాల‌నుకున్నా చేసుకోవ చ్చు, తాను ఎక్క‌డికి పారిపోను, భ‌య‌ప‌డే  ప్ర‌సక్తే లేద‌ని అని మోదీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై మండిప‌డ్డారు.  త‌మ నివాసం వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం త‌మను అణ‌గ‌దొక్కాల‌ను కుం టోంద‌ని అది వారివ‌ల్ల జ‌రిగేది కాద‌న్నారు. మోదీ, అమిత్ షా చ‌ర్య‌లు ప్ర‌జాస్వామ్య విరుద్ధ‌మ‌ని  దుయ్య బ‌ట్టారు. ఆగ‌ష్టు నాలుగో తేదీన పార్ల‌మెంటులో కాంగ్రెస్ ఎంపీల స‌మావేశానికి రాహుల్ గాంధీ హాజ‌రు కాలేదు. నేష న‌ల్ హెరాల్డ్ కార్యాలయాన్ని ఈడీ మూసివేసిన సంద‌ర్భంగా  పూర్వాప‌రాలు చ‌ర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీలు స‌మావేశ‌మయ్యారు. విప‌క్షనేత‌ల‌ను తీవ్ర‌వాదులుగా కేంద్రం ప‌రిగ‌ణించ‌డాన్ని కాంగ్రెస్ తీవ్రం గా ప‌రిగ‌ణించింది. దేశంలో ప్ర‌జాభిమానాన్ని చాలాకాలం నుంచి చూర‌గొన్న రాజ‌కీయ పార్టీ పై ఈడీ చేత దాడి చేయించ‌డం కేంద్ర ప్ర‌భుత్వ అనాలోచిత చ‌ర్య‌గా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ఇటీవ‌ల కాంగ్రెస్ అధి కార ప్ర‌తినిధి అభిషేక్ మ‌ను సింఘ్వి బీజేపీ స‌ర్కార్‌పై  ఆగ్రహించారు.    కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచార‌ణ, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాల‌యానికి తాళం వేయించిన  కొద్ది రోజుల త‌ర్వాత  మీడియాతో మాట్లాడుతూ,  భ‌య‌మ‌న్న‌ది కాంగ్రెస్ డిక్ష‌న‌రీలోనే లేద‌ని సింఘ్వీ అన్నా రు. బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌తో కాంగ్రెస్ నాయ‌క‌త్వాన్ని అణ‌చ‌లేర‌ని అన్నారు. 

ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా అంటూ.. పవన్ కు పాల్ ఆప్షన్లు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో సారి హాస్యం పండించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనదే హవా అని దర్జాగా చెప్పేశారు. తనతో కలిస్తే జగన్ ను మరో సారి ఏపీ సీఎంగా చేస్తానన్నారు. అంతేనా తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించి తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. తన మాట వింటే జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారనీ, తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏపీకి అన్ని విధాలుగా సహకరించి రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తానని చెప్పుకొచ్చారు. అయితే జగన్ తనతో కలవక పోతే తనకేం నష్టం లేదనీ, తాను తెలంగాణ సీఎం అవ్వడం ఖాయమనీ, కానీ జగన్ మాత్రం తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ సారి ఆయన హాస్య ప్రసంగానికి వేదిక అనంతపురం. అనంతపురంలో కేఏపాల్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంత వరకూ కొన్ని కుటుంబాలకే ఇప్పటి వరకూ అధికారం ఉందని, వాళ్లే సంపద దోచుకుంటున్నారని తాను ఆ పరిస్థితిని చిటికెలో మార్చేస్తాననీ చెప్పరు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా  రెండు ఆప్షన్షు ఇచ్చారు. తమ్ముడూ పవన్‌ నువ్వు ఆగట్టు నుంటావో..ఈ గట్టు నుంటావో తేల్చుకోవాలని సూచించారు. పులి లాంటి తనవైపో, పిల్లిలాంటి చంద్రబాబు వైపో తేల్చుకోవాలని పవన్ కు సూచించారు. తన వైపు ఉంటే ఏపీకి ముఖ్యమంత్రి కాలేకపోయినా అధికారంలో భాగస్వామ్యం ఉంటుందనీ, లేకుంటే రాజకీయ ఉనికే ఉండదనీ హెచ్చరించినంత పని చేశారు. ఇక తెలంగాణ విషయంలో అయితే ఆరు నూరైనా నూరు ఆరైనా కేసీఆర్ మరోసారి సీఎం కాలేరని తేల్చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావడం ఖాయమన్నారు. ఇన్నీ చెప్పిన ఆయన దేశంలో 18 పార్టీలు తాను ప్రధాని కావాలని కోరుకుంటున్నాయన్నారు. తాను ప్రధాన మంత్రి అయితే దేశం ముఖచిత్రాన్నే మార్చేస్తాననీ, అగ్రరాజ్యం అమెరికాను మించి అభివృద్ధి చేస్తాననీ చెప్పుకున్నారు. ఇంతకీ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? దేశ ప్రధాని పదవిపై కన్నేశారా అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో తన ప్రజాశాంతి పార్టీదే హవా అని తేల్చేశారు. 

ఏపీకి భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే ఏపీని మరో మారు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు శుక్రవారం (ఆగస్టు 5) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, పార్వతీపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ఇక కడప, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖ జిల్లాలలో సాధారణ వర్షపాతం ఉంటుందని పేర్కొంది.  భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వర్ష పాతం అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రాంతాలలో మోహరించింది.

మునుగోడులో కాల్పుల కలకలం

తెలంగాణలో కాల్పుల సంస్కృతి విస్తరిస్తోందా? వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఔనని అనిపించక మానదు. తాజాగా నల్గొండ జిల్లా మునుగోడులో కాల్పులు కలకలం సృష్టించాయి. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు, అసెంబ్లీ సభ్యత్వానికీ రాజీనామా చేయడంత వార్తలలోకి ఎక్కిన మునుగోడు తాజాగా కాల్పుల ఘటనతో మరోసారి సంచలనానికి వేదిక అయ్యింది. ఈ కాల్పులకూ, రాజకీయాలకూ ఏం సంబంధం లేదు. మునుగోడు మండలం సింగారం గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మండల పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన లింగు స్వామికి శీతల పానియాల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. గురువారం (ఆగస్టు 4) రాత్రి  తన దుకాణాన్ని మూసేసి బ్రాహ్మణ వెల్లం గ్రామానికి బయలు దేరాడు. అయితే మార్గ మధ్యంలో బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు  లింగస్వామిపై కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు లింగుస్వామి మరణించాడని బావించి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి    రక్తపు మడుగులో కుప్ప కూలిన లింగుస్వామిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగుస్వామి ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాపారంలో గొడవలే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు.

నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గేను విచారించిన ఈడీ

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేయడం, అంతకు ముందు రాహుల్ గాంధీ, సోనియాలను సుదీర్ఘంగా విచారించడం ముగిసిన తరువాత ఇదే కేసులో గతంలో విచారించిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ఆ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గేను గురువారం (ఆగస్టు 4) మరోసారి విచారించింది. అయితే మల్లిఖార్జున్ ఖర్గేను ఈడీ కార్యాలయంలో కాకుండా నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి పిలిపించుకుని విచారించడం గమనార్హం. కాగా ఈడీ సీజ్ చేసిన యంగ్ ఇండియా ఆఫీసు కూడా ఇక్కడే ఉన్న సంగతి విదితమే.  నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే గురువారం మ‌ధ్యాహ్నం హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఖ‌ర్గేను విచార‌ణ కోసం ఈడీ అధికారులు త‌మ కార్యాల‌యానికి కాకుండా నేష‌న‌ల్ హెరాల్డ్ కార్యాలయానికే పిలిచారు. ఈ కార్యాల‌యంలోనే ఈడీ బుధ‌వారం సీజ్ చేసిన యంగ్ ఇండియా కార్యాల‌యం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఒక పక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా మల్లి ఖార్జున్ ఖర్గే విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణ దాదాపు ఐదు గంటలకు పైగా సాగింది.  

బయటపడుతున్నపార్థా, అర్పిత భాగస్వామ్య డీల్స్

టీచర్స్ రిక్రూట్ మెంట్ కుంభకోణం కేసులో రోజుకో సంచలనం బయటపడుతోంది. అంతులేని దోపిడీ జరిగిందని తేటతెల్లమౌతోంది. ఈ కేసులో ఇప్పటికే పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితలను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఈ కుంభకోణం  దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోనికి వచ్చింది. అర్పిత ముఖర్జీ పేరిట ఏకంగా 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయని, ఆ అన్ని పాలసీలలోనూ నామినీగా అన్నింట్లోనూ పార్థ ఛటర్జీ పేరే ఉందనీ ఈడీ అధికారులు గుర్తించారు. పాఠశాలల ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసు కుంభకోణం  కేసుకు సంబంధించి బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అరెస్టయ్యారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన ప్లాట్ లో ఇటీవల ఈడీ సోదాలలో రూ.21.90 కోట్ల రూపాయలు కుప్పలుగా పోసి ఉండటాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రాజకీయంగా సృష్టించిన ప్రకంపనలు సద్దుమణగకముందే మళ్లీ పార్థా చటర్జీ అర్పిత ముఖర్జీకి చెందిన మరో ప్లాట్ లో ఈడీ నిర్వహించిన సోదాలలో కూడా భారీగా నగదు, బంగారం పట్టుబడింది. అలాగే పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండో సారి పట్టుబడిన సొమ్ము కూడా కొలువుల కుంభకోణానికి సంబంధించిన సొమ్మేనని చెబుతున్నారు. తొలుత తనిఖీల్లో  అర్పిత మొదటి ఫ్లాట్‌లో జరిపిన సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్ము  సొమ్ము మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదేనని విచారణలో అర్పిత ఈడీ అధికారులకు తెలిపారు.  విపక్షాల నాయకులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి వేధిస్తున్నదని పార్లమెంటులో ఒక పక్క విపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో ఇలా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నాయకుడు మంత్రి భారీ నగదుతో పట్టుబడటం విపక్షాలను డిఫెన్స్ లో పడేసినట్లైంది. తన కేబినెట్ సహచరుడి విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఆయన తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్ష అయినా వేయండి అంటూ ఓ ప్రకటన చేసేసి ఆ కుంభకోణంలో తన పాత్ర లేదని చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. అంతే కాకుండా ఆయనను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసేశారు. ఈ కేసుకు సంబంధించి.. ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎల్ఐసీ పాలసీలతో పాటు ఏపీఏ యూటిలిటీ సేవల కింద జనవరి 1, 2012 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలింది. కొన్ని ఆస్తులను నగదు రూపంలోనూ కొనుగోలు చేశారని, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది  తేలాల్సిఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అలాగే  అర్పిత   నివాసంలో బోల్పూర్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ పత్రాన్ని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ డీడ్ 2012 నాటిదని, దీన్నిబట్టి పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ మధ్య ఆర్థిక, భూ సంబంధ లావాదేవీలు గత పదేళ్లుగా సాగుతున్నాయని   ఈడీ  నిర్ధారణకు వచ్చింది.  కాగా, ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై జరిగిన కుట్రకు కాలమే సమాధానం చెబుతుందని టీఎంసీ బహిష్కృత నేత.. బెంగాల్‌ మాజీమంత్రి పార్థ ఛటర్జీ చెబుతున్నారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ మాత్రం తాను లేని టైమ్ లో తన ఇంట్లో ఆ డబ్బును పార్థా చటర్జీనే ఉంచారని, తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకున్నారని ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు.  

దగా..మోసం.. బయటపడిన జగన్ సర్కార్ మరో నయవంచన!

మూడు రాజధానులంటూ.. అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్.. అసలు మూడు రాజధానుల నిర్మాణానికి ఈ మూడేళ్లలో వేసిన అడుగు ఒక్కటీ లేదని పార్లమెంటు సాక్షిగా రుజువైపోయింది. అమరావతి అభివృద్ధిని ఆపేయడం.. విశాఖలో భూములను దోచేయడం అన్న లక్ష్యంతోనే జగన్ ఈ మూడేళ్లూ  గడిపేసిందన్న సంగతిని కేంద్రం పార్లమెంటులో తేటతెల్లం చేసేసింది. న్యాయ రాజధాని కర్నాలు అంటూ  వైకాపా ఇంత వరకూ చెబుతూ వస్తున్నదంతా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ మూడేళ్లలో ఒక్క ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి అందలేదు. ఈ విషయాన్నికేంద్రం పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. తెలుగుదేశం ఎంపీ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాత పూర్వక సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం అమరావతిలో ఏర్పాటైంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిలో ఏర్పాటైన హైకోర్టు వాస్తవానికి 2019 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తోంది. అయితే ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించడానికి ముఖ్యమంత్రి జగన్ 2020లో ఒక ప్రతిపాదనను తీసుకువచ్చారు. మూడు రాజధానులలో భాగంగా  న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్ారు. అయితే అందుకోసం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానాలు నిలువరించాయి. మూడు రాజథానులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో అసలు ఇప్పటి వరకూ హైకోర్టు తరలింపు ప్రతిపాదనలనే ప్రభుత్వం సిద్ధం చేయలేదు. వాస్తవానికి హైకోర్టు తరలింపునకు ఎటువంటి చట్టం చేయనవసరం లేదు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి .. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ముందుఅడుగు వేయవచ్చు. అయితే జగన్ సర్కార్ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.