ఆదిలాబాద్ జిల్లాలో పోటీలో వున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

1. సిర్పూర్ - ప్రేమసాగర్ రావు(కాంగ్రెస్/సీపీఐ) - కె.సమ్మయ్య(తెరాస) - రావి శ్రీనివాస్ (టీడీపీ/బీజేపీ) 2. చెన్నూర్ (ఎస్సీ) - జి.వినోద్ (కాంగ్రెస్/సీపీఐ) - ఎన్.ఓదెలు (తెరాస) - రాంవేణు (బీజేపీ) 3. బెల్లంపల్లి - జి.మల్లేష్(సీపీఐ) - చిన్నయ్య (తెరాస) - పాటి సుభద్ర (టీడీపీ/బీజేపీ) 4. మంచిర్యాల - గడ్డం అరవింద్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - దివాకర్ రావు (తెరాస) - మల్లారెడ్డి (బీజేపీ) 5. ఆసిఫాబాద్ (ఎస్టీ) - ఆత్రం సక్కు(కాంగ్రెస్/సీపీఐ) - కోవ లక్ష్మీ (తెరాస) - ఎం.సరస్వతి (టీడీపీ/బీజేపీ) 6. ఖానాపూర్ (ఎస్టీ) - అజ్మీరాహరి నాయక్(కాంగ్రెస్/సీపీఐ) - రేఖా నాయక్ (తెరాస) - రితేష్ రాథోడ్ (టీడీపీ/బీజేపీ) 7. ఆదిలాబాద్ - భార్గవ్ దేశ్ పాండే (కాంగ్రెస్/సీపీఐ) - జోగు రామన్న (తెరాస) - పి.శంకర్ (బీజేపీ) 8. బోథ్ (ఎస్టీ) - జాదవ్ అనీల్ (కాంగ్రెస్/సీపీఐ) - రాథోడ్ బాపూరావు (తెరాస) - సోయం బాబూరావు (టీడీపీ/బీజేపీ) 9. నిర్మల్ - ఎ.మహేశ్వర్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - కె.శ్రీహరిరావు (తెరాస) - మీర్జా యాసిన్ బేగ్ (టీడీపీ/బీజేపీ) 10. ముథోల్ - జి.విఠల్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - ఎస్. వేణుగోపాలాచారి (తెరాస) - డా.రమాదేవి (బీజేపీ)

నిజామాబాద్ జిల్లాలో పోటీలో వున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

  1. ఆర్మూర్ - కే ఆర్ సురేష్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - ఎ.జీవన్ రెడ్డి (తెరాస) - రాజారాం యాదవ్ (టీడీపీ/బీజేపీ) 2. బోధన్ - పి.సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - షకీల్ అహ్మద్ (తెరాస) - ప్రకాష్ రెడ్డి (టీడీపీ/బీజేపీ) 3. జుక్కల్ (ఎస్సీ) - గంగారాం (కాంగ్రెస్/సీపీఐ) - హన్మంతు షిండే (తెరాస) - మద్దెల నవీన్(టీడీపీ/బీజేపీ) 4. బాన్సువాడ - కె.బాలరాజు (కాంగ్రెస్/సీపీఐ) - పోచారం శ్రీనివాస రెడ్డి (తెరాస) -నీనావత్ బద్యానాయక్ (టీడీపీ/బీజేపీ) 5. ఎల్లారెడ్డి - జాజుల సురేందర్ (కాంగ్రెస్/సీపీఐ) - ఏనుగు రవీందర్ రెడ్డి (తెరాస) - బి.లక్ష్మారెడ్డి (బీజేపీ) 6. కామారెడ్డి - షబ్బీర్ అలీ (కాంగ్రెస్/సీపీఐ) - గంప గోవర్ధన్ (తెరాస) - ఇట్టం సిద్ధిరాములు (టీడీపీ/బీజేపీ) 7. నిజామాబాద్ అర్బన్ - బి.మహేశ్ గౌడ్ (కాంగ్రెస్/సీపీఐ) - బి.గణేష్ గుప్తా (తెరాస) - డి.సూర్యనారాయణగుప్త (బీజేపీ) 8. నిజామాబాద్ రూరల్ - డి.శ్రీనివాస్ (కాంగ్రెస్/సీపీఐ) - బాజిరెడ్డి గోవర్ధన్ (తెరాస) - గడ్డం ఆనందరెడ్డి (బీజేపీ) 9. బాల్కొండ - ఇ.అనిల్ (కాంగ్రెస్/సీపీఐ) - ప్రశాంత్ రెడ్డి (తెరాస) - ఏలేటి మల్లికార్జున రెడ్డి (టీడీపీ/బీజేపీ)

హైదరాబాద్ జిల్లాలో పోటీలో వున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

      1. ముషీరాబాద్ - డా.వినయ్ కుమార్ (కాంగ్రెస్/సీపీఐ) - ముఠా గోపాల్ (తెరాస) - డా.కె.లక్ష్మణ్ (బీజేపీ) 2. మలక్ పేట - వీఎన్. రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - సతీష్ కుమార్ యాదవ్ (తెరాస) - బి.వెంకట్ రెడ్డి వెంకట్ రెడ్డి (బీజేపీ) 3. అంబర్ పేట - వి.హనుమంతరావు (కాంగ్రెస్/సీపీఐ) - ఎ.సుధాకర్ రెడ్డి (తెరాస) - కిషన్ రెడ్డి (బీజేపీ) 4. ఖైరతాబాద్ - దానం నాగేందర్ (కాంగ్రెస్/సీపీఐ) - మన్నె గోవర్ధన్ రెడ్డి (తెరాస) - సీహెచ్.రామచంద్రారెడ్డి (బీజేపీ) 5. జూబ్లీహిల్స్ - పి.విష్ణువర్ధన్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - మురళీగౌడ్ (తెరాస) - మాగంటి గోపీనాధ్ (టీడీపీ/బీజేపీ) 6. సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - దండే విఠల్ (తెరాస) - తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ/బీజేపీ) 7. నాంపల్లి - ఇ.వినోద్ కుమార్ (కాంగ్రెస్/సీపీఐ) - కె.హనుమంతరావు (తెరాస) - ఫిరోజ్ ఖాన్ (టీడీపీ/బీజేపీ) 8. కార్వాన్ - రూప్ సింగ్ (కాంగ్రెస్/సీపీఐ) - జీవన్ సింగ్ (తెరాస) - బద్దం బాల్ రెడ్డి (బీజేపీ) 9. గోషామహల్ - ముఖేష్ గౌడ్ (కాంగ్రెస్/సీపీఐ) - ప్రేమ్ కుమార్ ధూత్ (తెరాస) - టి.రాజాసింగ్ (బీజేపీ) 10. చార్మినార్ - కె.వెంకటేశ్(కాంగ్రెస్/సీపీఐ) - అలీబాక్రీ(తెరాస) - ఎంఏ.బాసిత్ (టీడీపీ/బీజేపీ) 11. చాంద్రాయణగుట్ట - బీఆర్.సదానంద్ ముదిరాజ్(కాంగ్రెస్/సీపీఐ) - ఎం.సీతారంరెడ్డి (తెరాస) - ప్రకాష్ ముదిరాజ్ (టీడీపీ/బీజేపీ) 12. యాకుత్ పుర - ఎం.అశ్విన్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - షబ్బిర్ అహ్మద్ (తెరాస) - చార్మని రూప్ రాజా (బీజేపీ) 13. బహదూర్ పుర - సయ్యద్ అబ్దుల్ సమీ(కాంగ్రెస్/సీపీఐ) - జియావుద్దిన్ (తెరాస) - అబ్దుల్ రెహ్మాన్ (టీడీపీ/బీజేపీ) 14. సికింద్రాబాద్ - జయసుధ(కాంగ్రెస్/సీపీఐ) - పద్మారావు (తెరాస) - కూన వెంకటేశ్ గౌడ్ (టీడీపీ/బీజేపీ) 15. కంటోన్మెంట్ (ఎస్సీ) - గజ్జెల కాంతం (కాంగ్రెస్/సీపీఐ) - గజ్జల నగేష్ (తెరాస) - సాయన్న (టీడీపీ/బీజేపీ)

గూగుల్ ప్రజాస్వామ్య డూడుల్!

  ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సందర్భానుసారం తన హోమ్ పేజ్‌లోని డూడుల్‌ని మారుస్తూ వుంటుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో మే 16 అత్యంత కీలకమైన రోజు. ఈరోజు ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరగబోతోంది. ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని గూగుల్ సంస్థ తన హోమ్ ‌పేజీలోని డూడుల్‌ని ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా రూపొందించింది. google అనే పదంలో L స్థానంలో ఇంకు చుక్క వున్న చూపుడు వేలిని వుంచింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకలా వున్న ఈ డూడుల్ ఎంతో ఆకట్టుకునేలా వుంది.

సీపీఐ నారాయణ సోనియా నుంచి ఎన్నికోట్లు తీసుకున్నాడో

  ఖమ్మం పార్లమెంట్ స్థానంలో తనను ఓడించడానికి సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం జగన్ నుంచి 15 కోట్లు తీసుకున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన ఆరోపణని సీపీఎం నాయకులు ఖండించారు. నారాయణ చేసిన ఆరోపణలు జుగుప్సాకరం, నిరాధారమని సీపీఎంపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఊహాజనిత ఆరోపణలు చేయడం కమ్యూనిస్టు పార్టీ లక్షణం కాదని ఆయన చెప్పారు. తమ్మినేని వీరభద్రం జగన్ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్న నారాయణ దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నారాయణ చేసిన ఆరోపణలు నిజమని తేలితే తమ జాతీయ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా రాఘవులు నారాయణ విలువ రూ.15 కోట్లేనా? ఆయన విలువ రూ. 150 కోట్లదాకా ఉంటుంది అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని సీపీఐ నారాయణ కాంగ్రెస్, సోనియాగాంధీ నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నారో లెక్క చెప్పాలని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు.

అన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు సన్నాహాలు పూర్తి: భన్వర్‌లాల్

      సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఆరోజు రానే వచ్చింది. సుదీర్ఘంగా జరిగిన ఎన్నికల ప్రక్రియ తర్వాత దేశంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకుల, ప్రజల తలరాతను నిర్ణయించే కీలకమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం జరగబోతోంది. ఉదయం ఎనిమిది గంటలనుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అరగంట పాటు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభమవుతుంది. ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లు రాష్ట్ర వ్యా్ప్తంగా పూర్తయ్యాయని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు. గురువారం అర్ధరాత్రి నుంచి అన్ని మద్యం దుకాణాలు బంద్ చేయడానికి ఆదేశాలు జారీ చేశామని భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందించే ఏర్పాటు చేశామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని భావిస్తున్నామని భన్వర్ లాల్ చెప్పారు.

కిషన్‌బాగ్ అల్లర్లపై మెజిస్టీరియల్ దర్యాప్తు: గవర్నర్

      హైదరాబాద్‌లోని పాతబస్తీలోని కిషన్‌బాగ్‌లో జరిగిన అల్లర్లపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కిషన్ బాగ్‌లో జరిగిన అల్లర్లలో ముగ్గరు యువకులు పోలీసు కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. గవర్నర్ ఈ సంఘటనపై గురువారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లర్లలో మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 నష్ట పరిహారాన్ని గవర్నర్ ప్రకటించారు. అలాగే ఆస్తులు కోల్పోయినవారికి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లింపులు ఉంటాయని గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. అలాగే కిషన్‌బాగ్‌లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి గురువారం పర్యటించారు. ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా వారు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.

టెన్త్ లో టాప్‌లో తూర్పు గోదావరి.. లాస్ట్ ఆదిలాబాద్

      గురువారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 88.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో 96.26 శాతం ఉత్తీర్ణతతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కడప, మూడో స్థానంలో వరంగల్ జిల్లా నిలిచాయి. ఎప్పటి తరహాలోనే ఈసారి కూడా బాలికలు బాలుర మీద పైచేయి సాధించారు. బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 87.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,784 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 16 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం నుంచి పది రోజుల్లో టెన్త్ మార్కుల జాబితా ఆయా పాఠశాలలకు పంపనున్నామని వారు చెప్పారు. రీకౌంటింగ్, రీవాల్యూషన్‌లకు ఈనెల 30 వరకు చివరి తేదీ అని ప్రకటించారు.

చీపురుపల్లిలో బొత్స ఓడిపోవడం ఖాయం

      శుక్రవారం నాడు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఓట్ల కౌంటింగ్ జరగకముందే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఓడిపోతున్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే బొత్స హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు చూస్తుంటే చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స చీపురు ముక్కలు చెక్కలు అయిపోవడం ఖాయమనే ఫీలింగ్ రాజకీయ వర్గాల్లో కలిగింది. చాలా దీనంగా, కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయిందన్నట్టు మాట్లాడిన బొత్సని చూస్తుంటే తన ఓటమి ఖాయమైపోయినట్టు బొత్స చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి, టోటల్ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కన్న ఆయన ఈరోజు రాష్ట్రంలో టీడీపీ గెలవాలని, టీడీపీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టంగా చెప్పాడంటే అంతకంటే ఓటమిని అంగీకరించడం మరొకటి వుంటుందా? మొత్తమ్మీద ఈ ఎన్నికలలో సీమాంధ్రలో మొట్టమొదటి ఓటమిని నమోదు చేసుకుంది బొత్స సత్యనారాయణే.

మన్మోహన్ అంటే రాహుల్ గాంధీకి చిన్నచూపు

      ప్రధానిగా పదవీకాలం ముగిసిన ప్రధాని కాని ప్రధాని మన్మోహన్‌సింగ్ రెండుసార్లు దేశానికి ప్రధాని అయినప్పటికీ తన సొంతంగా ఒక్క నిర్ణయం తీసుకున్న పాపాన పోలేదు. సోనియా, రాహుల్ చెప్పినదానికల్లా తల ఊపడం మినహా ఆయన సాధించిందేమీ లేదు. ఇలా అన్నిటికీ తల ఊపే వ్యక్తి అంటే ఎవరికైనా చులకనభావం, చిన్నచూపు వుంటుంది. రాహుల్ గాంధీకి కూడా మన్మోహన్ అంటే అలాంటి చిన్నచూపేదో ఉన్నట్టుంది. అందుకే బుధవారం నాడు మన్మోహన్ ఢిల్లీలో వీడ్కోలు విందు ఏర్పాటు చేస్తే దానికి ప్రభుత్వంలోని వారు, కాంగ్రెస్ పార్టీలోని అందరూ హాజరయ్యారు. యువరాజు రాహుల్ గాంధీ మాత్రం హాజరు కాలేదు. ఇలా రాహుల్ గాంధీ విందుకు హాజరు కాకపోవడం మన్మోహన్‌ని చిన్నచూపు చూసి అవమానించడమేనని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ విమర్శించారు. మన్మోహన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందు కేవలం మన్మోహన్ సింగ్‌కి మాత్రమే కాదని.. అది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా వర్తి్స్తుందని, ఇక వీరిద్దరూ అధికారానికి దూరంగా వుండక తప్పదని సంజయ్ అన్నారు.

కేసీఆర్ పంచాగం చెప్పుకోవాల్సిందే: దానం నాగేందర్

      రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజకీయాలను వదిలిపెట్టి పంచాంగం చెప్పుకుంటూ టైమ్ పాస్ చేయాల్సిందేనని రాష్ట్ర మాజీ మంత్రి దానం నాగేందర్ పంచాగం చూడకుండానే జోస్యం చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీయేనని, ఇందులో తమకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. కొంతమంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భయపడుతూ కేసీఆర్‌ని మంచి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని దానం చెప్పారు.

తంతే బూర్లె గంపలో పడిన మజ్లిస్

      మజ్లిస్ పార్టీ పని తంతే ఎగిరి బూర్లె గంపలో పడినట్లయిందిపుడు. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలకు దేనికీ కూడా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనబడకపోవడంతో, కనీసం ఆరేడు సీట్లు గెలుచుకోగల మజ్లీస్ పార్టీ మీదనే వాటి కన్ను పడింది. రెండు పార్టీలు కూడా మజ్లిస్ మాకు దోస్త్ అంటే కాదు మాకే దోస్త్ అని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి.   రేపటి ఫలితాలను బట్టి, ఒకవేళ మజ్లిస్ పార్టీ  మద్దతు అవసరపడితే ఆయనకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చయినా సరే తమవైపుకి తిప్పుకోవాలని రెండు పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఆ పార్టీ మద్దతు అవసరం పడవచ్చు గనుకనే తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఈయదలచుకోలేదని, థర్డ్ ఫ్రంట్ కే మద్దతు ఇస్తామని తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కవిత చెప్పడం చూస్తే, వారు మజ్లిస్ కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్ధమవుతోంది. అందువల్ల ఇప్పుడు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్, తెరాసలలో దేనివైపు మొగ్గు చూపుతుందో తేలాలంటే రేపు ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  

అందరి కళ్ళూ హిందూపురం బాలకృష్ణ మీదే!

      శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ పండుగ అంగరంగ వైభవంగా మొదలు కానుంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ, దేశంలో  ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమనే విషయం తేలిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్న విషయం కూడా క్లియర్‌గా వుంది. తెలంగాణలో హంగ్ ఏర్పడి తెలుగుదేశం, బీజేపీ కూటమి కింగ్ మేకర్‌గా మారే అవకాశం వుందన్న విషయం కూడా స్పష్టంగా వుంది.   అయితే ఇప్పుడు రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గం కూడా వుంది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి ప్రచారం మాత్రమే చేసిన బాలక‌ృష్ణ ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల బరిలోకి కూడా దిగారు. ఇప్పుడు అందరి దృష్టి ఆయనమీదే వుంది. హిందూపురం నందమూరి వంశానికి పెట్టని కోటలా వుంది. ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేసి విజయాలు సాధించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తాన్న నమ్మకం అందరిలోనూ వుంది. అయితే ఇప్పుడు అందరూ బాలక‌ృష్ణ వైపు చూస్తున్నది అయన విజయం సాధిస్తారా.. లేదా అనే విషయం మీద కాదు.. బాలకృష్ణ ఎంతటి సంచలన విజయం సాధిస్తారన్న విషయం మీదే. బాలకృష్ణ సాధించబోయే మెజారిటీ మీదే ఇప్పుడు అందరి ద‌ృష్టీ కేంద్రీక‌‌ృతమై వుంది. బాలక‌‌ృష్ణ హిందూపురం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలుస్తారన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వారి నమ్మకం నిజం కావడానికి ఎంతో సమయం లేదు. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

లగడపాటివి ఉత్తుత్తి సర్వేలు: వైఎస్సార్సీపీ

      సర్వేల స్పెషలిస్టు లగడపాటి రాజగోపాల్ తాను చేయించిన సర్వేల ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సర్వేల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. ఆయన అలా చెప్పినప్పటి నుంచి జగన్ పార్టీ ఆయన మీద మాటల దాడి చేస్తూనే వుంది. తాజాగా జగన్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు లగడపాటి సర్వేలు ఉత్తుత్తి సర్వేలని తేల్చిచెప్పారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే ఏ సంస్థలో చేయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అంబటి చెప్పారు. లగడపాటి సర్వేను నమ్మి ఎవరూ పందాలు కాయొద్దని అంబటి సూచించారు. జాతీయ సంస్థలన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని వెల్లడించాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల మధ్య నెలరోజుల సమయం ఉందని, ఆ సమయంలో చాలా మార్పులు జరిగాయని అంబటి పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు తాము పోటీ చేయలేమంటూ చేతులెత్తేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 110కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

గెలుపు కలలు కంటున్న కేసీఆర్ కుమార్తె కవిత

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాను నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తానని కలలు కంటున్నారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని కూడా మరో కల కంటున్నారు. గురువారం కవిత మాట్లాడుతూ, తాను నిజామాబాద్ లోక్‌సభ ఎంపీగా విజయం సాధించడం ఖాయమని, అలాగే టీఆర్ఎస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. అలాగే కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా దానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని కవిత చెప్పారు. తమ పార్టీ మూడో కూటమికే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అయితే నిజామాబాద్‌లో కవిత గెలవటం కష్టమేనన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

టీడీపీ అధికారంలోకి రావాలి: బొత్స సంచలనం

      ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, చీపురుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విచిత్రంగా ప్లేటు ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే జగన్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని కూడా చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్స ఆ పదవి పోయిన తర్వాత తన చీపురుపల్లి నియోజకవర్గానికే పరిమితమైపోయారు. రాష్ట్ర స్థాయిలో మీడియా ముందుకు రావడం మానేశారు. తన చీపురుపల్లిలో తన చీపురు విరిగిపోకుండా చూసుకోవడంలో బిజీగా వున్నారు. రాష్ట్ర విభజన విషయంలో తెలుగు ప్రజలను మోసం చేసేలా వ్యవహరించిన బొత్స ఈసారి చీపురుపల్లిలో గెలవటం డౌటేనన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇలా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

89 ఏట పెళ్ళి చేసుకున్న ఎన్.డి.తివారీ తాతయ్య

  కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్ తివారీ తన 89వ యేట మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. ఒకప్పటి సహచారిణి, రోహిత్ శేఖర్ తల్లి అయిన ఉజ్వలా శర్మ(62)ను ఆయన గురువారం లక్నోలో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత ఉజ్వలా శర్మ మీడియాతో మాట్లాడుతూ, వివాహ ప్రతిపాదనను తివారీ తన ముందుకు తెచ్చారని, ఈ వేడుక కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే జరిగిందని తెలిపారు. ఇన్నాళ్ళకైనా తనను తివారీ పెళ్ళి చేసుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఉజ్వల కొడుకు రోహిత్ శేఖర్ 2008లో తనను కొడుకుగా గుర్తించాలని ఎన్డీ తివారీపై ఢిల్లీ హై కోర్టులో దావా వేశాడు. తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభియోగాన్ని ఖండించటమే గాక, డిఎన్ఏ పరీక్షకు కూడా మొదట అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ విజయం సాధించాడు. ఇటీవలే రోహిత్ శేఖర్ తన కుమారుడేనని తివారీ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతని తల్లి ఉజ్వలా శర్మను తివారీ వివాహం చేసున్నట్లు తెలుస్తోంది. ఎన్డీ తివారీ 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. ఆ సమయంలోనే కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తివారీ తరచూ వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో షేర్ సింగ్ కూతురు ఉజ్వలా శర్మకు తివారీకి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి రోహిత్ శేఖర్ జన్మించాడు. కాగా, ఎట్టకేలకు వీరిద్దరూ పెళ్లితో మళ్లీ ఒక్కటయ్యారు.

రోడ్డు ప్రమాదంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్‌‌కి గాయాలు

  ప్రఖ్యాత భారతీయ నటీమణి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కపూర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. బోనీకపూర్ తన మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ హీరోగా ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకుని బోనీ కపూర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ని ఢీకొంది. దాంతో బోనీ కపూర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. బోనీ కపూర్‌తోపాటు కారులోనే ప్రయాణిస్తున్న ఆయన సహాయకులు ఇద్దరికి, డ్రైవర్‌కి కూడా స్వల్ప గాయాలయ్యాయి. బోనీకపూర్ వీపు మీద స్వల్స గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది.