టెన్త్ లో టాప్లో తూర్పు గోదావరి.. లాస్ట్ ఆదిలాబాద్
posted on May 15, 2014 @ 6:01PM
గురువారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 88.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో 96.26 శాతం ఉత్తీర్ణతతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కడప, మూడో స్థానంలో వరంగల్ జిల్లా నిలిచాయి. ఎప్పటి తరహాలోనే ఈసారి కూడా బాలికలు బాలుర మీద పైచేయి సాధించారు. బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 87.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,784 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 16 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం నుంచి పది రోజుల్లో టెన్త్ మార్కుల జాబితా ఆయా పాఠశాలలకు పంపనున్నామని వారు చెప్పారు. రీకౌంటింగ్, రీవాల్యూషన్లకు ఈనెల 30 వరకు చివరి తేదీ అని ప్రకటించారు.