టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: సీమాంధ్ర, తెలంగాణ వివరాలు

      టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ కార్యక్రమంలో ఈ ఎన్నికలలో సీమాంధ్ర, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చన్న అంశం మీద చర్చ జరిగింది. ఈ సందర్భంగా టైమ్స్ నౌ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను కూడా ప్రకటించారు. టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుంది. లెఫ్ట్ పార్టీలు 2 స్థానాలు సొంతం చేసుకుంటాయి. అలాగే సీమాంధ్రలో ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకోబోతోంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంటుంది. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారు.

జనరల్ ఎలక్షన్స్ 2014: తుది దశ ముగిసింది

      తొమ్మిది దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం జరిగింది.. ఈ తుది దశలో ఉత్తరప్రదేశ్‌లోని 18 స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని 17, బీహార్‌లోని 6 స్థానాలతోకలిపి మొత్తం 41 స్థానాలకు ఓటింగ్ జరిగింది.. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాశి నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరిగింది. ఈ దశ ఎన్నికల బరిలో 606మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మోడీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంనుంచి ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆజంగఢ్‌నుంచి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఖుషీనగర్‌నుంచి కేంద్రమంత్రి ఆర్పీఎన్‌సింగ్, డొమారియాగంజ్‌నుంచి బీజేపీ సీనియర్‌నేత జగదాంబికాపాల్, పశ్చిమబెంగాల్‌లోని బెహ్రంపూర్ నుంచి కేంద్రమంత్రి ఆధిర్ రంజన్ చౌదరి, బారాసత్‌నుంచి బీజేపీ అభ్యర్థిగా మెజీషియన్ పీసీ సర్కార్ (జూనియర్), బీహార్‌లోని వైశాలినుంచి ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచారు. దీనితో రీపోలింగ్ జరిగే కొన్ని చోట్ల తప్ప దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: ఈశాన్యంలో పుంజుకున్న బీజేపీ

      దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ మీద పడింది. ఎన్నికలు ముగిసే వరకూ ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం వుండటంతో దేశ ప్రజలు 2014 ఎన్నికల తుదివిడత ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూశారు. ఆ ముహూర్తం రానే వచ్చింది. ప్రముఖ న్యూస్ ఛానల్‌ నిర్వహించే ఎగ్జిట్ పోల్ మీద అందరికీ ఎంతో ఆసక్తి వుంది. ఆర్నబ్ గోస్వామి నిర్వహిస్తున్న ఎగ్జిట్ పోల్ లైవ్ ప్రోగ్రామ్‌ని దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్నారు. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్‌ డిస్కషన్‌లో మొదట ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా వుంటుందో చర్చించారు. ఈశాన్య భారతదేశంలో బీజేపీ బాగా పుంజుకుంది. ఈ ఎన్నికలలో ఈశాన్య భారతంలో ఎన్.డి.ఎ.కి 49 పార్లమెంట్ సీట్లు,యు.పి.ఎ.కి 28 పార్లమెంట్ సీట్లు, ఇతరులకు 65 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.

టీఆర్ఎస్ జాణతనం

      మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణలో తుక్కుతుక్కుగా ఓడిపోయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో జాణతనం ఎంతమాత్రం తగ్గలేదు. దారుణంగా ఓడిపోయినా తనకు ఈ విషయం ముందే తెలుసన్నట్టు, ఈ ఓటమి అసలు ఓటమే కానట్టు బిల్డప్పులు ఇస్తోంది. మునిసిపల్ ఫలితాలు విడుదలైన తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఈటెల రాజేందర్ మాట్లాడిన తీరు చూస్తుంటే హమ్మా.. టీఆర్ఎస్‌ది ఎంత జాణతనమో అనిపించక మానదు.   ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటల సారాంశంమేంటంటే.. మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణ టీఆర్ఎస్ వైపే నిలిచారట. అందుకే తెలంగాణ ప్రజలకు బోలెడన్ని కృతజ్ఞతలట. మునిసిపల్ ఎన్నికలతో టీఆర్ఎస్ ఎంతమాత్రం ప్రచారం చేయకపోయినప్పటికీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కి బ్రహ్మరథం పట్టారట. సీమాంధ్ర పార్టీలు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా లొంగకుండా తెలంగాణ ప్రజలందరూ హోల్‌సేల్‌గా టీఆర్ఎస్‌కి అండగా వున్నారట. చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టు తమకే ఎక్కువ మునిసిపల్ ఛైర్మన్ స్థానాలు దక్కుతాయన్న నమ్మకం వుందట. మంగళవారం వెల్లడి కాబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందట. ఈ టీఆర్ఎస్ నాయకులు ఎప్పటికి మారతారో ఏంటో!  

వారణాశిలో కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పోటీ చేస్తున్న వారణాశిలో సోమవారం పోలింగ్ జరుగుతోంది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ పోటీలో వుంటే, కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ అనే వ్యక్తి పోటీలో వున్నాడు. స్థానిక ఎమ్మెల్యే అయిన అజయ్ రాయ్‌ని కాంగ్రెస్ పార్టీ మోడీ మీద పోటీకి దించింది. ఇదిలా వుంటే గుజరాత్‌లోని వదోదరలో కూడా పోటీ చేసిన నరేంద్రమోడీ పోలింగ్ ముగిసిన తర్వాత కమలం గుర్తు చూపించారని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం, దాంతో ఎన్నికల సంఘం మోడీ మీద కేసు పెట్టడం తెలిసిందే. తాజాగా సోమవారం నాడు వారణాశిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఇదే తరహా పని చేశాడు. వారణాశిలో ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకి వచ్చిన అజయ్ రాయ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘హస్తం’ ఓట్లు వేయడానికి క్యూలో వున్న అందరికీ చూపిస్తూ వెళ్ళడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. అజయ్ రాయ్ మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టింది.

తుది దశ పోలింగ్: బెంగాల్లో గొడవలు

      తొమ్మిది దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం జరుగుతోంది. ఈ తుది దశలో ఉత్తరప్రదేశ్‌లోని 18 స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని 17, బీహార్‌లోని 6 స్థానాలతోకలిపి మొత్తం 41 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాశి నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ దశ ఎన్నికల బరిలో 606మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 6.61కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మోడీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంనుంచి ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆజంగఢ్‌నుంచి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఖుషీనగర్‌నుంచి కేంద్రమంత్రి ఆర్పీఎన్‌సింగ్, డొమారియాగంజ్‌నుంచి బీజేపీ సీనియర్‌నేత జగదాంబికాపాల్, పశ్చిమబెంగాల్‌లోని బెహ్రంపూర్ నుంచి కేంద్రమంత్రి ఆధిర్ రంజన్ చౌదరి, బారాసత్‌నుంచి బీజేపీ అభ్యర్థిగా మెజీషియన్ పీసీ సర్కార్ (జూనియర్), బీహార్‌లోని వైశాలినుంచి ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం తుదివిడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం చాలా ప్రదేశాల్లో గొడవలు జరిగినట్టుగా సమాచారం అందుతోంది.

ఇది ప్రజా విజయం: ఫలితాలపై చంద్రబాబు స్పందన

  మునిసిపల్ ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, తెలంగాణలో కూడా గట్టి పోటీ ఇచ్చి ఎవరూ ఊహించని విధంగా మంచి ఫలితాలను సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజలు సాధించిన విజయమని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకంతో ఇంతటి విజయాన్నిచ్చిన ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ళుగా కాంగ్రెస్ పరిపాలనలో నరకం చూసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ని సీమాంధ్ర నుంచి తరిమికొట్టడంతోపాటు వైకాపా ప్రలోభాలకు లొంగకుండా ఓటేశారని చంద్రబాబు అన్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనేచోట్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తరిమికొట్టిన ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అండగా వున్న ప్రజలకు, కార్యకర్తలకు తమ పార్టీ వెన్నంటి వుంటుందని చంద్రబాబు చెప్పారు.

సూరత్‌లో పేలుడు: 30 మందికి గాయాలు

    గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 30 మందికి గాయాలయ్యాయి. సూరత్ నగరంలోని ఒక ఎంబ్రాయిడరీ యూనిట్‌లో ఈ పేలుడు సంభవించింది. మొదట ఈ పేలుడు వెనుక ఉగ్రవాద కోణం వుందా అని పోలీసులు అనుమానించారు. అయితే గ్యాస్ సిలెండర్ లీక్ కావడం వల్ల ఈ పేలుడు జరిగిందని తెలిసింది. పేలుడు సందర్భంగా చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. పేలుడు జరిగింది ఎంబ్రాయిడరీ యూనిట్ కావడంతో మంటలు త్వరితంగా వ్యాపించాయి. దాంతో ఆ యూనిట్‌లో పనిచేసే చాలామందికి కాలిన గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

టీడీపీకి బీజేపీ అభినందనలు: ప్రకాష్ జవదేకర్

      సీమాంధ్ర మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకులు ప్రకాష్ జవదేకర్ అభినందనలు తెలిపారు. టీడీపీ సాధించిన ఈ విజయం తాము సాధించిన విజయంగానే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇదే తరహా ఫలితాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోనూ, ఆ తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలోనూ టీడీపీ సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ కూటమి పోటీ చేసిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో తమ కూటమికి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 59 మునిసిపాలిటీలు టీడీపీ సొంతం

      ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 92 మునిసిపల్ స్థానాలకు గాను మొత్తం స్థానాల ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మునిసిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది. టీడీపి 59 మునిసిపాలిటీలను సొంతం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 మునిసిపాలిటీలను గెలుచుకుంది. అలాగే 16 మునిసిపల్ స్థానాల్లో హంగ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో మునిసిపల్ చైర్మన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అవుతాడన్నది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. ఈ 16 స్థానాలను గెలుచుకోవడానికి, మద్దతు సంపాదించడానికి టీడీపీ, వైసీపీ తమవంతు ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టాయి.

తెలంగాణలో 16 స్థానాలతో టాప్‌లో కాంగ్రెస్

      తెలంగాణ ఇచ్చిన ఫలితాన్ని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పొందుతోంది. మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 16 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో అగ్రస్థానంలో ఉన్నానని భావించిన టీఆర్ఎస్ మాత్రం 9 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎవరూఊహించని విధంగా టీడీపీ, బీజేపీ కూటమి తెలంగాణలో 7 స్థానాలు గెలుచుకుంది. రెండు స్థానాల్లో ఇతరులు గెలిచారు. ఏ పార్టీకి మెజారిటీ రాకుండా 19 స్థానాలు ‘హంగ్’లుగా మిగిలాయి. ఈ 19 స్థానాలలో ఏ పార్టీ ఎక్కువమంది కౌన్సిలర్ల మద్దతు పొందగలిగితే ఆ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశం వుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ టీడీపీ కూటమి దృష్టి ఈ 19 స్థానాల మీదే వుంది. వీటిలో తమ పార్టీ ఎన్ని స్థానాలను సొంతం చేసుకోగలదన్న దానిమీదే ఆలోచనలు జరుగుతున్నాయి.

ఈసారి ‘హంగ్’ల హంగామా ఎక్కువే!

      ఈసారి మునిసిపల్ ఎన్నికలలో ఫలితాన్ని ఎటూ తేల్చని ‘హంగ్’ల హంగామా ఎక్కువగానే వుంది. అటు సీమాంధ్రలోని, ఇటు తెలంగాణలోనూ హంగ్‌లు భారీ సంఖ్యలోనే ఏర్పడ్డాయి. తెలంగాణలో మొత్తం 19 హంగ్‌ మునిసిపాలిటీలు ఏర్పడ్డాయి. ఈ స్థానాల్లో ఎవరి మద్దతుతో ఎవరు ఛైర్మన్ పీఠాన్ని అధిష్ఠిస్తారో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకూ తిట్టుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి మునిసపల్ పీఠంపై ఛైర్మన్ ఎవరో నిర్ణయించుకోవాలసిన అవసరం కనిపిస్తోంది. అలాగే సీమాంధ్రలో 16 హంగ్‌లు వచ్చాయి. చాలాచోట్ల టీడీపీ, వైకాపా పోటాపోటీగా వున్నాయి. ఈ రెండు పార్టీలు కలసి ఛైర్మన్‌ని ఎంపిక చేసే అవకాశం లేదు. అలాగే కొన్ని స్థానాల్లో ఇతరులు కీలక వ్యక్తులుగా వున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మున్సిపల్ ఫలితాలు

      ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మునిసిపల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 92 మునిసిపల్ స్థానాలకు గాను మొత్తం స్థానాల ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మునిసిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది. టీడీపి 59 మునిసిపాలిటీలను సొంతం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 మునిసిపాలిటీలను గెలుచుకుంది. అలాగే 16 మునిసిపల్ స్థానాల్లో హంగ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో మునిసిపల్ చైర్మన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అవుతాడన్నది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. ఈ 16 స్థానాలను గెలుచుకోవడానికి, మద్దతు సంపాదించడానికి టీడీపీ, వైసీపీ తమవంతు ప్రయాత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే తెలంగాణలోని 53 మునిసిపాలిటీలకు సంబంధించిన అన్ని స్థానాల కౌంటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ 16 మునిసిపాలిటీలలో గెలుపొందింది. టీఆర్ఎస్ 9 స్థానాలలో గెలిచింది. టీడీపీ, బీజేపీ కూటమి 7 మునిసిపాలిటీలను సొంతం చేసుకుంది. 19 మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. రెండు స్థానాలలో ఇతరులు గెలిచారు.

చిత్తూరు జిల్లాలో తెదేపా, వైకాపా పోటాపోటీ

      చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటాపోటీ పోరు జరిగింది. ఎన్నికల ఫలితాలలో రెండు పార్టీలూ సమ స్థాయిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మదనపల్లిలోని 35 వార్డుల్లో 15 తెలుగుదేశం, 17 వైకాపా గెలిచింది. 3 స్థానాల్లో ఇతరులు గెలిచారు. శ్రీకాళహస్తిలోని 35 వార్డుల్లో 4 కాంగ్రెస్, 18 తెలుగుదేశం, 11 వైకాపా, 2 ఇతరులు గెలిచారు. పుంగనూరులోని 24 వార్డుల్లో 7 తెలుగుదేశం, 17 వైకాపా గెలిచాయి. పలమనేరులోని 24 వార్డుల్లో 6 తెలుగుదేశం, 17 వైకాపా సొంతం చేసుకున్న్నాయి. 1 ఇతరులు గెలిచారు. నగరిలోని 27 వార్డుల్లో 13 వార్డుల్లో తెలుగుదేశం, 11 వైకాపా గెలవగా, 3 వార్డుల్లో ఇతరులు గెలిచారు. పుత్తూరులోని 24 వార్డుల్లో 13 తెలుగుదేశం, 11 వైకాపా గెలిచాయి.

తెలంగాణలో కాంగ్రెస్, సీమాంధ్రలో తెలుగుదేశం... జీరో అయిన జగన్..

      సీమాంధ్ర పూర్తిగా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ముందు దిగదుడుపు అయిపోయింది. తెలంగాణ‌లో ఎక్కడికో వెళ్ళిపోతానని కలలు కన్న టీఆర్ఎస్ చతికలపడింది. అలాగే సీమాంధ్రలో తనదే హవా అని భావించిన వైకాపాకి అంతసీను లేదని సీమాంధ్ర ఓటర్లు తేల్చి చెప్పారు. మొత్తమ్మీద తెలంగాణలో కాంగ్రెస్ హీరో అయితే, సీమాంధ్రలో తెలుగుదేశం హీరో అయ్యింది. తెలంగాణలో టీఆర్ఎస్ జీరో అయితే, సీమాంధ్రలో జగన్ జీరో అయ్యాడు. అలాగే తెలంగాణలో హీరో అయిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో జీరో అని కూడా అనడానికి వీల్లేనంతగా అడ్రస్ గల్లంతైపోయింది.