ఓట్ల లెక్కింపు: వెనుకబడిన ప్రముఖులు
రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలలో మాజీ మంత్రులు అంతా వెనకబడిపోతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, డీకీ అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రఘువీరారెడ్డి తదితరులు వెనుకంజలో ఉన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, సంగారెడ్డిలో మాజీ విప్ జగ్గారెడ్డి, బాల్కొండలో అనిల్ తదితరులు వెనకబడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 53 స్థానాలలో ..కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో,టీడీనీ 15, బీజేపీ 8, ఎంఐఎం 1, బీస్పీ ఒకస్థానంలో, సీమాంధ్రలో టీడీపీ 80, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 66, బీజేపీ 3, జై సమైక్యాంధ్ర పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.