ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీల కౌంటింగ్ కూడా..
లోక్సభ ఎన్నికలతోపాటు దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కూడా ఓట్ల లెక్కింపు జరుగనుంది. సాంకేతికంగా మూడు రాష్ట్రాలు అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి నాలుగు రాష్ట్రాలు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు కూడా ఒకేసారి జరగనుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల ప్రజలు అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఫలితాల ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.