నెల్లూరు జిల్లాలో వెరైటి చలి వేంద్రాలు!
వేసవి కాలంలో మండుటెండల్లో ప్రయాణం చేసేవారికి, దాహార్తిని తీర్చేందుకు పలువురు దాతలు, స్వచ్ఛంధ సంస్థలు రహదారుల వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటాయి. సాధారణంగా చలివేంద్రాల్లో మంచి నీరు ఇస్తారు, కొంచెం డబ్బున్న వాళ్లైతే మజ్జిగ ఇస్తుంటారు. కాని నెల్లూరు జిల్లాలో అక్కడి నేతలు ప్రచారానికి, గొప్పలకు పోయి..చలివేంద్రాల రూపు రేఖలు మార్చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, ఆయన భార్య సుజాతరావులు ఓ చలివేంద్రాన్ని ప్రారంభించారు. దానిలో నీళ్లకు బదులు ముంజలు పంపిణీ చేస్తుండటంతో విపరీతమైన ప్రచారం వచ్చి అక్కడ జనాల మధ్య క్యూ చాంతాడంత పెరిగిపోయింది. దీనిని చూసిన ఒకతను ఊళ్లో ఫుల్లు పబ్లిసిటి వస్తుందని చలివేంద్రాన్ని మొదలుపెట్టాడు. అక్కడ తాటి ముంజలతో పాటు, కొబ్బరి బోండాలు, మజ్జిగ పంపిణీ చేశాడు. ఇంకేముంది జనాల క్యూ ఇక్కడకు మారిపోయింది. వీళ్లద్దరి కంటే తానేం తక్కువ తినలేదని మరోకాయన ఫ్రూట్ జ్యూస్, ఐస్క్రీములు అంటూ చలివేంద్రాన్ని ప్రారంభించాడు. తీరా నెల్లూరు మొత్తం తరలివచ్చేటప్పటికి వీళ్లు చేతులేత్తేశారు. దీంతో జనం తిట్ల దండకాన్ని ప్రారంభించారు.