గన్తో బెదిరించి డ్యాన్సర్పై గ్యాంగ్రేప్..
దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్లో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఓ డ్యాన్సర్పై నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజధాని లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని బాంథారాలో తమ కార్యాలయానికి సంబంధించి ఓ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సత్యవీర్ సింగ్, దేవరాజ్ సింగ్, రాష్ట్రీయ భూషణ్ భారతీ, పరేశ్ తోమర్ అనే నలుగురు మేనేజర్ స్థాయి ఉద్యోగులు తమకు పార్టీలో డ్యాన్స్ చేసేందుకు ఓ ట్రూప్ కావాలని కోరడంతో..ఓ బృందం పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చి పాటలు, డ్యాన్స్లతో హోరెత్తించింది. అయితే ఈ నలుగురు మాత్రం పీకల్లోతు తాగి ఇతర డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించారు.
అయితే ఆ ట్రూప్కు నాయకత్వం వహించే ఓ డ్యాన్సర్ వారిని అడ్డుకోబోయింది..అయితే పేమెంట్ గురించి మాట్లాడుకుందామని ఓ గదిలోకి పిలిచాడు. అతడి మాటలు నమ్మి ఆమె గదిలోకి వెళ్లగానే అప్పటికే అందులో మాటువేసి ఉన్న ముగ్గురు వ్యక్తులు తలుపు వేశారు. అనంతరం ఆమె పాయింట్ బ్లాక్లో గన్పెట్టి చంపుతామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నలుగురు కామాంధులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.