సింధూకి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం..
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పి.వి సింధూకి ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. కొద్ది సేపటి క్రితమే ఆమె, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులు దేవినేని ఉమ, ఎంపీ మాగంటి బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, వల్లభనేని వంశీ, బుద్దా వెంకన్నలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు సింధూకు అభినందనలు తెలుపడానికి వేలాది మంది ఆమె అభిమానులు, పలు స్కూళ్ల విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుండి పి.వి సింధూ, పుల్లెల గోపిచంద్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి.. ఇందిరాగాంధీ స్టేడియం వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరిని సన్మానించనున్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం సింధూ, గోపిచంద్ దుర్గాఘాట్ లో పుష్కరస్నానమాచరించి..అనంతరం అమ్మవారిని దర్శించనున్నారు.