అమ్మాయిని 14 సెకన్లు చూస్తే...!
posted on Aug 16, 2016 @ 1:12PM
అమ్మాయిలపై లైగింక వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేరళలోని ఓ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ కొన్ని సూచనలు చేశారు. అయితే ఆయన చేసిన కొన్ని సూచనలు కొంతమంది సమర్ధించినా.. కొంతమంది మాత్రం సెటైర్లు విసురుతున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన అమ్మాయిలపై జరుగుతన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ.. ఎవరైనా అసభ్యంగా తాకినా, అభ్యంతరకర భాష వాడినా.. వెనుకాలే ఫాలో అవుతున్నా వెంటనే అమ్మాయిలు స్పందించాలని, వారికి అక్కడే బుద్ధి చెప్పాలని అన్నారు. అంతేకాదు ఎవరైనా ఒక అబ్బాయి పద్నాలుగు సెకన్లపాటు తదేకంగా ఒకమ్మాయి కళ్లలోకి చూస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని.. బహుశా ఈ విషయం ఎవరికీ తెలియదేమో అన్నారు. అయితే ఆయన చెప్పిన సూచనలు బాగానే ఉన్నా.. ఈ 14 సెకన్ల సూచనపైనే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 14 సెకన్లు అంటే అమ్మాయిలు ఇక అలారం పెట్టుకోవాలని అని కొంతమంది అంటే.. మరీ సన్ గ్లాసెస్ పెట్టుకున్నవాళ్లు అమ్మాయిలను చూస్తున్నారని తెలుసుకునేదలా? అని ప్రశ్నించారు.