English | Telugu

సడన్‌గా ఇండియాలో సమంత.. వచ్చింది అందుకేనా?

‘ఖుషి’ రిలీజ్‌ తర్వాత సడన్‌గా అమెరికా వెళ్ళిపోయిన సమంత అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మధ్య మధ్యలో తాను ఎక్కడ వున్నదీ అభిమానులకు తెలియజేస్తూ అక్కడి ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంది. అయితే ఎలాంటి సమాచారం లేకుండా సడన్‌గా సమంత ముంబయిలో ప్రత్యక్షమైంది. ఎప్పుడు వచ్చిందో తెలీదుగానీ ఆమె ఫోటోలు మళ్లీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత సడన్‌గా మళ్లీ ఇండియా ఎందుకు వచ్చింది అనే చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది. కొత్తగా ఏదైనా సినిమా కమిట్‌ అయ్యిందా? లేక వెబ్‌ సిరీస్‌ ఏదైనా కన్‌ఫర్మ్‌ అయ్యిందా?... ఇలా రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.

అయితే ఇవేవీ కాదని తెలుస్తోంది. తను ‘సిటాడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రచారం కోసం సమంత ఇండియా వచ్చిందనేది తాజా సమాచారం. ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ త్వరలోనే ప్రసారం కాబోతోంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కి రాజ్‌ అండ్‌ డికె దర్శకత్వం వహించారు. ఇది ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌కి ఇండియన్‌ వెర్షన్‌. ప్రియాంక చోప్రా నటించిన పాత్రను సమంత చేస్తోంది. ఆమె ఇండియా రావడానికి ఈ వెబ్‌ సిరీస్‌ ఒక్కటే కారణం కాదు. కొన్ని బ్రాండ్స్‌కి కూడా సమంత ప్రచారం చేసేందుకు ఇక్కడికి వచ్చింది. అందులో తాను సొంతంగా నడుపుడుతున్న ‘సాకి’ ఒకటి ఉంది. దానికి కూడా సమంత ఫోటో షూట్‌ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పట్లో సమంత సినిమాలు ఒప్పుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతోందని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.