English | Telugu

రెండో పెళ్ళికి రెడీ అయిన స్టార్ డాటర్!

కోలీవుడ్ స్టార్ ధనుష్, అతని భార్య ఐశ్వర్య రజినీకాంత్ గతేడాది జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్యతో ధనుష్ వివాహం 2004లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇప్పుడు అంతకంటే ఆశ్చర్యకరమైన న్యూస్ వినిపిస్తోంది. కోలీవుడ్ కి చెందిన ఓ హీరోని ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

స్టార్ డాటర్ గా, స్టార్ వైఫ్ గానే కాకుండా దర్శకురాలిగానూ ఐశ్వర్య తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. '3' సినిమాతో దర్శకురాలిగా మారి ఆకట్టుకున్నారు ఐశ్వర్య. ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో 'లాల్ సలామ్' చిత్రం రూపొందుతోంది. ఇలా ఓ వైపు దర్శకత్వం, మరోవైపు పిల్లల బాధ్యత చూసుకుంటున్న ఐశ్వర్య గురించి ఇప్పుడు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆమె తమిళ పరిశ్రమకు చెందిన ఓ హీరోతో సన్నిహితంగా ఉంటుందని, త్వరలోనే అతన్ని రెండో పెళ్లి చేసుకోబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.