English | Telugu

మరో సీక్వెల్ లో నిఖిల్.. మళ్ళీ పాన్ ఇండియా హిట్ కొడతాడా!


కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన హిట్ ఫిల్మ్ 'కార్తికేయ'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'కార్తికేయ 2'తో గతేడాది పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు నిఖిల్ తన మరో హిట్ ఫిల్మ్ సీక్వెల్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.

నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. మేఘన ఆర్ట్స్ బ్యానర్ పై పి. వి. రావు నిర్మించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, నందిత శ్వేత, అవికా గోర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 2016 నవంబరులో విడుదలైన ఈ మూవీ రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. 'కార్తికేయ 2' రాకముందు నిఖిల్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిఖిల్, విఐ ఆనంద్ కలయికలో రానున్న ఈ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా-2' జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందనుందని సమాచారం.

ఇటీవల 'స్పై' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నిఖిల్ చేతిలో 'స్వయంభు', 'ది ఇండియన్ హౌస్' సినిమాలు ఉన్నాయి. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాల తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా-2' పట్టాలెక్కే అవకాశముంది. మరోవైపు దర్శకుడు విఐ ఆనంద్ కూడా సందీప్ కిషన్ హీరోగా 'ఊరుపేరు భైరవకోన' అనే సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక 'ఎక్కడికి పోతావు చిన్నవాడా-2'పై దృష్టి పెట్టనున్నాడని అంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.