English | Telugu

సూర్య కోసం రంగంలోకి లేడీ డైరెక్ట‌ర్‌..!

వైవిధ్యమైన సినిమాలు, పాత్రల‌తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ద‌క్కించుకున్న హీరోల్లో కోలీవుడ్ హీరో సూర్య ఒక‌రు. న‌చ్చిన సినిమాలోనూ త‌న పాత్ర కోసం ఆయ‌న రిస్క్ చేయ‌టానికి వెనుకాడ‌రు. వ‌రుస సినిమాల‌ను ఆయ‌న లైన్‌లో పెడుతున్నారు. ఇప్ప‌టికే సూర్య 42వ చిత్రంగా `కంగువా` సినిమాను చేస్తున్నారు. మ‌రో వైపు వెట్రిమార‌న్‌తో `వాడివాస‌ల్` చిత్రం చేయ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అయితే వెట్రి మార‌న్ మూవీ చేయ‌టం కంటే ముందే లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను కంప్లీట్ చేయ‌టానికి సూర్య రెడీ అయిపోయారు. ఇప్ప‌టికే ఆమె సూర్య ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు ఓ క‌థ‌ను సిద్ధం చేసేస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. సూర్య 43వ మూవీగా ఇది రూపొంద‌నుంది.  

ధ‌నుష్ డ‌బుల్ ధ‌మాకా

వెర్స‌టైల్ యాక్ట‌ర్ ధ‌నుష్.. వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు కెప్టెన్ మిల్ల‌ర్ సినిమాతో పాటు త‌న 50 సినిమాను కూడా చేయ‌టానికి రెడీ అయ్యారు. కెప్టెన్ మిల్ల‌ర్ సినిమాను చూస్తే పీరియాడిక్ మూవీలా అనిపిస్తుంది. ఇక త‌న 50వ మూవీని ధ‌నుష్ ఇంకా షురూ చేయ‌లేదు. అయితే ఆ సినిమాలో న‌టిస్తోన్న ఎస్‌.జె.సూర్య‌, సందీప్ కిష‌న్‌ల‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ధ‌నుష్ కూడా సెట్స్‌లోకి అడుగు పెట్ట‌బోతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సాలిడ్ అప్‌డేట్స్ రాలేదు. మ‌రో వైపు ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ధ‌నుష్ సినిమాలకు సంబంధించిన వివ‌రాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు... ధ‌నుష్ ఏకంగా డ‌బుల్ ధ‌మాకాను సిద్ధం చేస్తున్నారు.

'హత్య' మూవీ రివ్యూ.. 'బిచ్చగాడు' హీరోకి కలిసిరాలేదు!

తమిళ హీరో విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బిచ్చగాడు' ఇచ్చిన ఉత్సాహంతో అప్పటినుంచి తమిళ్ తో పాటు తెలుగులోనూ తన సినిమాలను విడుదల చేస్తూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అయితే 'బిచ్చగాడు' తర్వాత అతనికి ఆస్థాయి విజయం దక్కలేదు. ఈ ఏడాది మేలో విడుదలైన 'బిచ్చగాడు-2'నే అతనికి కాస్త ఊరటనిచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలవడమే కాకుండా, తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. 'బిచ్చగాడు-2' వచ్చిన రెండు నెలలకే 'హత్య'(తమిళ్ లో 'కొలై') అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్.

తెలుగు సినిమా తగ్గేదేలే... తెలుగమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీకి రండి!

ఇప్పుడు ఎక్కడ చూసినా "బేబీ" మూవీ గురించే టాక్. ఆ మూవీకి సంబందించిన ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు రీసెంట్ గా "బేబీ" మూవీ అప్రిసియేషన్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంది. తెలుగమ్మాయిలను ఉద్దేశించి ఎన్నో ఇన్స్పైరింగ్ మాటలు చెప్పారు అల్లు అర్జున్. అసలు ఈ ఫంక్షన్ కి రావడానికి కారణం హీరోయిన్ వైష్ణవి అన్నారు. తెలుగమ్మాయిలు ఎందుకు మూవీస్ లోకి రావడం లేదో అర్ధం కావడం లేదన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అవార్డు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ తమిళ్, కన్నడ, మలయాళం అమ్మాయిలు వచ్చి అవార్డ్స్ తీసుకుని వాళ్ళ వాళ్ళ భాషల్లో థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతున్నారు.

విక్ర‌మ్ మూవీ నుంచి ఐశ్వ‌ర్య ఔట్‌!

విక్ర‌మ్ సినిమా ధ్రువ న‌క్ష‌త్రం గురించి రోజుకో అప్‌డేట్ ఇస్తున్నారు మేక‌ర్స్. రీసెంట్‌గా ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్‌ని విడుద‌ల చేశారు. ఆ పాట‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలో ఐశ్వ‌ర్య రాజేష్ పార్ట్ ని తొలగిస్తున్నారంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నుంచి గ‌తంలో ఒరు మ‌నం అనే పాట‌ను విడుద‌ల చేశారు. దాదాపు మూడేళ్ల ముందు ఈ పాట‌ను విడుదల చేశారు మేక‌ర్స్. ఇప్పుడు ఈ పాట‌ను మేక‌ర్స్ త‌మ యూట్యూబ్ చానెల్‌లో ప్రైవేట్‌లో పెట్టారు. టీజ‌ర్‌లో ఐశ్వ‌ర్య పేరును కాస్ట్ అండ్ క్రూ లిస్టులో అలాగే ఉంచారు. అయితే, ఇప్పుడు సెకండ్ సింగిల్‌లో హిస్ నేమ్ ఈజ్ జాన్‌లో... క్రెడిట్స్ లిస్టులో ఐశ్వ‌ర్య పేరు క‌నిపించ‌డం లేదు.

త్రివిక్రమ్ తో 'హిరణ్యకశ్యప' ప్రకటించిన రానా.. గుణశేఖర్ ఫైర్!

'హిరణ్యకశ్యప' చిత్రం అనేది దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ సినిమాని రానా దగ్గుబాటితో చేయాలని గుణశేఖర్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. రానా కూడా ఆసక్తి చూపడంతో చాలాకాలం స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు గుణశేఖర్. అయితే దర్శకుడిగా ఇప్పుడాయన ట్రాక్ రికార్డు బాగాలేదు. ఆయన గత చిత్రం 'శాకుంతలం' దారుణంగా నిరాశపరిచింది. వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉందంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో గుణశేఖర్ గ్రాఫిక్స్ ఉండే ఇలాంటి భారీ చిత్రాల జోలికి పోకుండా 'ఒక్కడు' తరహా కమర్షియల్ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

'హిడింబ' మూవీ రివ్యూ.. కాన్సెప్ట్ అదిరింది, స్క్రీన్ ప్లే తేడా కొట్టింది!

కొంతకాలంగా విభిన్న చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ఇటీవల విభిన్న చిత్రంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'హిడింబ'. అశ్విన్ బాబు, నందితా శ్వేత ప్రధానపాత్రధారులుగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు(జూలై 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'విరూపాక్ష' తరహాలో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది అనిపించిన ఈ సినిమా అనూహ్యంగా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా, స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా తేలిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.