English | Telugu

రష్మికకు బాలీవుడ్ షాక్... శ్రీలీలకు ఇక తిరుగులేదు!

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అమ్మడు రష్మిక మందన్న. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోందీ అమ్మడు. కేవలం స్టార్ హీరోలపైనే ఆమె ఫోకస్ పెట్టింది. అలాగే బాలీవుడ్ లోనూ పాగా వేయాలని తన వంతు ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవీ సక్సెస్ కాలేదు. కానీ రష్మిక మాత్రం తన నార్త్  ప్రయత్నాలను మాత్రం మానుకోలేదు. తాజాగా ఆమె షాహిద్ కపూర్ సినిమాలో నటించటానికి రెడీ అయ్యింది. షాహిద్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆమె నితిన్, వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ను కూడా పక్కకు పెట్టేసింది. షాహిద్ ప్రాజెక్ట్ కోసం డేట్స్ ను కేటాయించినట్లు సినీ సర్కిల్స్ సమాచారం.

నైజాం కింగ్‌ ప్ర‌భాస్‌.. షేక్ చేసిన ‘స‌లార్‌’

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘స‌లార్‌’. KGF 2 వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌శాంత్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌టంతో పాటు , ప్ర‌భాస్ చాలా కాలం త‌ర్వాత న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ ఇది. దీంతో సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 28న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో స‌లార్ రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్ నైజాం ఏరియాలో ఈ సినిమా విష‌యంలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన‌ట్లు టాక్‌.